Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశుల వారు వివాహా ప్రయత్నాలు చేస్తారు.. 12 రాశులు ఫలితాలు ఏవిధంగా...

Rashi Phalalu: ఈ రాశుల వారు వివాహా ప్రయత్నాలు చేస్తారు.. 12 రాశులు ఫలితాలు ఏవిధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 10న ఆదివారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఈ రాశి వారు ఇతరుల పనులపై ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కానీ ఇది నష్టాన్ని చూపుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి పెడుతారు. ఇతరులతో సంయమనం పాటించాలి.

వృషభం:
ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కొన్ని పనులు మీ నియంత్రణలోకి వస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేవారికి అనుకూలం.

మిథునం:
విహారయాత్రలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఇతరులకు ఇచ్చే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసం అనవసర ఖర్చులు పెడుతారు. కొంత ఆందోళన వాతావరణం ఉంటుంది.

కర్కాటకం:
రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో వాళ్ల వివాహానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

సింహం:
కొన్ని బాధ్యతలు నెరవేరుస్తారు. దీంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది. అపూర్వమైన విజయాలు మీ సొంతమవుతాయి. ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి.

కన్య:
భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరుడి వివాహానికి ప్రయత్నాలు చేస్తారు.ఓ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఇతరులతో వాదనలకు దిగొద్దు.

తుల:
అనారోగ్య సమస్యల బారిన పడొచ్చు. వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. పోటీ పరీక్షకల్లోని వారు విజయం సాధిస్తారు. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు.

వృశ్చికం:
ఇతరుతలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వివాదాల జోలికి పోకూడదు. స్నేహితులను కలుస్తారు. ఎవరైనా మీ వ్యాఖ్యలను చెడుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.

ధనస్సు:
ఆర్థిక నష్టాలను చూస్తారు. కోర్టు వివాదాలు చుట్టుముడుతాయి. సహోద్యోగులతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ప్రణాళికలు వేస్తారు.

మకర:
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు ఇంట్లో వాళ్ల సలహా తీసుకోవడం మంచిది. ఎవరి ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

కుంభం:
ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్వికుల ఆస్తుల విషయంలో వివాదాలు ఏర్పడుతాయి.

మీనం:
పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువుల సాయంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఇంట్లో వాళ్లను సంప్రదించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version