స్థానిక ఎన్నికలలో ఊహించని పరిణామాలు!

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఎన్నికల నియమావళిని ఎత్తివేయడంతో ఎన్నికల నిర్వహణ ప్రశ్నర్ధకంగా మారింది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయంపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిందని న్యాయనిపుణులు అంటున్నారు. ఎన్నికల సంఘం తీసుకున్న వాయిదా నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు […]

Written By: Neelambaram, Updated On : March 19, 2020 3:00 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఎన్నికల నియమావళిని ఎత్తివేయడంతో ఎన్నికల నిర్వహణ ప్రశ్నర్ధకంగా మారింది.

అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయంపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిందని న్యాయనిపుణులు అంటున్నారు. ఎన్నికల సంఘం తీసుకున్న వాయిదా నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఎన్నికల నియమావళి అమలును రద్దు చేసిందని వారంటున్నారు. అంతేగాక ఎన్నికల నిర్వహణకు ముందు నాలుగు వారాలు ఎన్నికల నియమావళి అమలులో ఉండేలా చూడాలని సూచించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ దీనికి బలం చేకూరుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర బలగాలు అవసరమని, లేదంటే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎన్నికల కమిషనర్ రమేష్‌ కుమార్ ఆ లేఖలో స్పష్టం చేసిన విషయాన్ని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంతేగాక రాష్ట్రంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికల విషయం కూడా ఆయన ప్రస్తావిస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలను కేంద్రానికి గుర్తుచేయడం గమనార్హం. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆయన కోరడం పరిశీలించాల్సిన అంశమని వారంటున్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఘర్షణలు, ఏకగ్రీవ ఎన్నికలు, నామినేషన్లు దాఖలు చేయకుండా ఆటంకం కల్పించారని కమిషన్‌ కు పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ పలువురు మంత్రులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో న్యాయస్థానాలు కూడా కమిషనర్ రమేష్‌ కుమార్‌ కు అనుకూలంగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.