కస్టమర్లకు వొడాఫోన్ ఐడియా బంపర్ ఆఫర్.. రాత్రంతా ఫ్రీ డేటా..?

వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎయిర్ టెల్, జియో నుంచి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు రాత్రి సమయంలో ఉచితంగా డేటా ఇవ్వడానికి సిద్ధమైంది. వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలనే ఉద్దేశంతో వొడాఫోన్ ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆఫర్ ను పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. Also Read: భారీగా తగ్గిన పసిడి ధర.. ఎంత తగ్గిందంటే..? వొడాఫోన్ ఐడియా కస్టమర్లలో ఎవరైతే […]

Written By: Kusuma Aggunna, Updated On : February 18, 2021 1:32 pm
Follow us on

వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎయిర్ టెల్, జియో నుంచి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు రాత్రి సమయంలో ఉచితంగా డేటా ఇవ్వడానికి సిద్ధమైంది. వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలనే ఉద్దేశంతో వొడాఫోన్ ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆఫర్ ను పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.

Also Read: భారీగా తగ్గిన పసిడి ధర.. ఎంత తగ్గిందంటే..?

వొడాఫోన్ ఐడియా కస్టమర్లలో ఎవరైతే రూ.249 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రీచార్జ్‌ చేసుకుంటారో వాళ్లు మాత్రమే ఫ్రీ డేటా పొందడానికి అర్హులు. 249 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్న వాళ్లు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్రీ డేటాను పొందవచ్చు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు రోజువారీ మిగిలిన డేటాను వారాంతంలో వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ ఉండటం గమనార్హం.

Also Read: పీఎఫ్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. వడ్డీరేటులో కోత..?

వొడాఫోన్ ఐడియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రీపెయిడ్ కస్టమర్ల సంఖ్య భారీగా పెరుగుతుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు ఏప్రిల్ నెల నుంచి టెలీకాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. టెలీకాం ధరలు పెరిగితే మాత్రం మొబైల్ ఫోన్ యూజర్లపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఇప్పటికే టారిఫ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో టారిఫ్ ధరలు పెంచితే ప్రజలపై అదనపు భారం పడుతుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో టారిఫ్ ధరలు కూడా పెరుగుతాయో లేదో చూడాల్సి ఉంది.