Annamalai Padayatra : దక్షిణ తమిళనాడులో అన్నామలై పాదయాత్రకు అనూహ్య స్పందన

డీఎంకే పాలనలో ద్రవిడ పాలన కాబట్టి మతం అంటే నమ్మకం లేదన్నది కాదని అవాస్తవం అని చెబుతున్నాడు. ద్రవిడ వాదంతో విచ్ఛిన్నకరమైన వాదనను అన్నామలై బద్దలు కొడుతున్నాడు. తమిళనాడును దేశంతో కలుపుతూ జాతీయ భావాలు పెంపొందిస్తున్నాడు.

Written By: NARESH, Updated On : August 5, 2023 4:16 pm
Follow us on

Annamalai Padayatra : అన్నామలై పాదయాత్ర మొదలై ఇప్పటికీ వారం రోజులు అయ్యింది. ఏమీ జనం.. ఏమీ యాత్ర.. ఏమీ స్పందన.. ఏం అనుభూతి. రామేశ్వరంలో మొదలై రామనాథపురం జిల్లా నుంచి ఇప్పుడు మదురైకి వచ్చింది. మూడు జిల్లాల్లో అనూహ్య స్పందన. జనాలు అక్కున చేర్చుకుంటున్నారు. సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. జనాలు తెగ ఆదరిస్తున్నారు. దక్షిణ తమిళనాడులో జాతీయ భావాలు నిండుగా ఉన్న ప్రాంతం. ఇవన్నింటిని అన్నామలై సృశిస్తున్నాడు.

అక్కడ ప్రాంత చరిత్ర.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన రాజకీయ నేతల తీరును అన్నామలై కొనియాడుతున్నారు. స్టాలిన్ అవినీతి, పార్టీల దమనకాండను అన్నామలై లేవనెత్తి ప్రజల్లోకి వెళుతున్నారు. గ్రామాల్లోని పథకాలు కేంద్రం నిధులతోనే ఇస్తున్నాడని అన్నామలై సవివరంగా చెబుతున్నాడు.

డీఎంకే పాలనలో ద్రవిడ పాలన కాబట్టి మతం అంటే నమ్మకం లేదన్నది కాదని అవాస్తవం అని చెబుతున్నాడు. ద్రవిడ వాదంతో విచ్ఛిన్నకరమైన వాదనను అన్నామలై బద్దలు కొడుతున్నాడు. తమిళనాడును దేశంతో కలుపుతూ జాతీయ భావాలు పెంపొందిస్తున్నాడు.

యూపీకి యోగి ఎలానో.. అస్సాంకు భిశ్వంత్ శర్మ ఎలానో.. అన్నామలై తమిళనాడుకు అలాగే గ్రేట్ లీడర్ గా ఎదుగుతున్నాడు.

అన్నామలై దక్షిణ తమిళనాడు పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.