Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Varahi: వారాహి పర్మిషన్ పై సస్పెన్స్.. జనసేన సంచలన నిర్ణయం

Pawan Kalyan Varahi: వారాహి పర్మిషన్ పై సస్పెన్స్.. జనసేన సంచలన నిర్ణయం

Pawan Kalyan Varahi: పవన్ వారాహి యాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందా? నిబంధనల పేరిట కట్టడి చేయాలన్న ప్రయత్నంలో ఉందా? యాత్రలో మినిట్ టు మినిట్ ప్రొగ్రాం ఇవ్వాలని కోరడం అందులో భాగమేనా? అంటే జనసేన వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆది నుంచి వారాహి వాహనంపై వైసీపీ శ్రేణులు అక్కసును వెళ్లగక్కుతున్నారు. వాహనం ఎలా రోడ్డుపైకి వస్తుందో చూస్తామని సవాల్ చేశారు. ఏపీ రహదారులపై అడ్డుకుంటామని కూడా ప్రకటించారు. దీని పవన్ సైతం అదే స్థాయిలో రిప్లయ్ ఇచ్చారు. ఎలా అడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు. దీంతో వైసీపీ బ్యాచ్ తోక ముడిచిన సందర్భాలున్నాయి.

రేపటి నుంచి పవన్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజల అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వహణ కోసం బాధ్యులను సైతం నియమించారు. అయితే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న జనసేన నాయకులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ముందస్తుగానే జన సేన నాయకులు పోలీసులకు లేఖలు ఇచ్చారు. కానీ నిబంధనల ప్రకారం ఇవ్వాలని పోలీసులు మడత పేచీ పెడుతున్నారు. దీంతో అనుమతులు కోసం కోర్టును ఆశ్రయించడానికి సిద్ధపడుతున్నారు.

గతంలో కూడా పవన్ పర్యటలను జగన్ సర్కారు అడుగడుగునా అడ్డు తగిలిన సందర్భాలున్నాయి. అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేశారు. విశాఖలో అయితే భద్రతా కారణాలు చెప్పి హోటల్ రూమ్ కే పరిమితం చేశారు. ఇప్పటం బాధితుల పరామర్శ సమయంలో సైతం అడుగడుగునా అడ్డు తగిలారు. ఒక్క విషయం గుర్తించుకోవాలని పవన్ కల్యాణ్ ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు మాత్రమే కాదు. ప్రజల్లో చాలా క్రేజ్ ఉన్న సినిమా నటుడు కూడా. అటువంటి వ్యక్తి భద్రత విషయంలో జగన్ సర్కారు అతి చేస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

వారాహి యాత్ర విషయంలో వైసీపీ అల్లరిమూకల హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం కూడా అతిగా ఉంది. ఇప్పుడు పోలీసుల ద్వారా జగన్ సర్కారు నియంత్రించేందుకు ప్రయత్నిస్తుండడంతో జనసేన నాయకత్వం కోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేశారు. ఆ సమయంలో నాటి ప్రభుత్వం భద్రత కల్పించడంతో పాటు ఇబ్బందులు లేకుండా చూడడం వల్లే పాదయాత్ర సాఫీగా పూర్తయ్యింది. వైసీపీ సర్కారు మాదిరిగా వ్యవహరించి ఉంటే పాదయాత్ర చేసి ఉండేవారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టినా వారాహి యాత్ర సక్సెస్ ఫుల్ గా రన్నవుతుందని జన సైనికులు బళ్లగుద్ది మరీ చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version