Homeప్రత్యేకంకస్టమర్లకు ఎస్బీఐ బ్యాంక్ వార్నింగ్.. ఆ తప్పు చేయొద్దంటూ..?

కస్టమర్లకు ఎస్బీఐ బ్యాంక్ వార్నింగ్.. ఆ తప్పు చేయొద్దంటూ..?


భారతదేశంలో సైబర్ మోసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చదువుకున్నవాళ్లు, చదువుకోనివాళ్లు అనే తేడాల్లేకుండా అందరూ సైబర్ మోసాల బారిన పడుతున్నారు. ఖాతాదారులకు తెలియకుండానే బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు మాయమవుతోంది. దీంతో దేశంలోనే కోట్ల సంఖ్యలో కస్టమర్లు ఉన్న దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను మరోసారి అలర్ట్ చేసింది.

రోజురోజుకు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారులు కొన్ని తప్పులు చేయొద్దంటూ సూచనలు చేసింది. ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. మోసపూరిత ఈమెయిల్స్ ను నమ్మవద్దని ఫేక్ ఈమెయిల్స్ వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఖాతాదారులు చేస్తున్న చిన్నచిన్న తప్పుల వల్ల బ్యాంకింగ్ రంగంలో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్బీఐ ఎప్పటికప్పుడు కస్టమర్లను అలర్ట్ చేస్తోంది.

చాలామంది సైబర్ మోసగాళ్లు బ్యాంక్ ఖాతాదారులకు ఫేక్ ఈమెయిల్స్ ను పంపిస్తున్నారని అలాంటి ఈమెయిల్స్ పట్ల అవగాహనతో పాటు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ సూచనలు చేసింది. మోసపూరిత ఈమెయిల్స్ ను ఓపెన్ చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది. సోషల్ మీడియా ఖాతాలలో వైరల్ అవుతున్న ఫేక్ లింక్స్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ సూచనలు చేసింది.

ఫేక్ మెసేజ్ ల ఉచ్చులో పడవద్దంటూ 20 సెకన్ల వీడియోను కస్టమర్లకు ఎస్బీఐ అందుబాటులో ఉంచింది. ఆన్ లైన్ లో అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం షేర్ చేయవద్దని ఎస్బీఐ సూచించింది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular