Homeజనరల్ఆ రాష్ట్ర రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాల్లోకి రూ.18 వేలు..!

ఆ రాష్ట్ర రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాల్లోకి రూ.18 వేలు..!

PM Kisan Samman Nidhi Yojana

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల సంక్షేమం కొరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం రైతుల ఖాతాలలో ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ చేస్తోంది. రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం ఈ డబ్బులు ఉపయోగపడతాయి. గత రెండు సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా అమలవుతుండగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం ఈ స్కీమ్ అమలు కాలేదు.

Also Read: పెన్షన్ తీసుకునే వారికి మోదీ సర్కార్ శుభవార్త.. వారికి బెనిఫిట్..?

పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఈ స్కీమ్ ను ఆ రాష్ట్రంలో గతంలో అమలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు మాత్రం మమతా బెనర్జీ ఈ స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో రైతుల ఖాతాలలో దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ కు సంబంధించిన 8వ విడత నగదు కూడా జమ కానుంది. మమతా బెనర్జీ ఈ స్కీమ్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అమిత్ షా మాత్రం ఈ స్కీమ్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఈ ఏడాది రాబోయే కొత్త ఫీచర్లివే..?

కేంద్ర మంత్రి అమిత్ షా రైతుల ఖాతాలలో త్వరలో నగదును జమ చేస్తామని కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నగదును జమ చేస్తామని అమిత్ షా అన్నారు. గడిచిన రెండు సంవత్సరాల డబ్బులు 12 వేల రూపాయలు, ఈ ఏడాదికి సంబంధించిన ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తామని అమిత్ షా ప్రకటించారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఒకేసారి రూ.18,000 జమైతే మాత్రం రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. మమతా సర్కార్ ఇప్పుడు స్కీమ్ ను అమలు చేస్తామని చెప్పినా కేంద్రం మాత్రం ఈ స్కీమ్ ను బీజేపీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పడం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version