Narendra Modi : మోడీ సాధించిన మరో మైలురాయి సెమీకండక్టర్ ఫౌండ్రీ స్థాపన

మోడీ సాధించిన మరో మైలురాయి సెమీకండక్టర్ ఫౌండ్రీ స్థాపన గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : March 1, 2024 2:15 pm

Narendra Modi : నిన్న కేంద్ర కేబినెట్ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇది చరిత్రాత్మక నిర్ణయంగా చెప్పొచ్చు. భారత ఆర్థిక విజయంలో ఒక పెద్ద సాహసం ఏదైనా ఉందంటే.. ‘సెమీ కండక్టర్ ఫౌండ్రీ’ని స్థాపించడం.. ఇంతవరకూ భారత్ కు ఇది లేదు. మనం ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా ఏ ప్రభుత్వం ఈ పనిచేయలేదు. మోడీ ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.

ఆ సాంకేతిక సాధించడానికి చాలా కష్టపడాలి.. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ లేకుండా లైఫ్ గడవదు. ఇంట్లో నుంచి వెళ్లడానికి కారులో, ఫ్యాన్ లో.. మొబైల్ సహా అన్నింట్లోనూ ‘చిప్ ’ ఉండాల్సిందే.. ఏఐలో అడ్వాన్స్ డ్ చిప్స్ వాడుతున్నారు.

సెమీ కండక్టర్ పరిశ్రమ ఆధిపత్యాన్ని చాటుతోంది. అమెరికా పట్టు ప్రపంచానికి ఉండడానికి ‘సెమీ కండక్టర్’ పరిశ్రమనే కారణం.. చైనా కూడా బాగా పుంజుకుంది. అమెరికా, చైనా ఇందులో చాలా ముందుకెళుతున్నాయి..

సెమీ కండక్టర్ పరిశ్రమ ఎంతో కీలకం.. ఈ రంగంలో రీసెర్చ్, డిజైనింగ్, భారత్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నా ఆ మొత్తం పార్ట్ అమెరికా నుంచే సాగుతోంది. డిజైన్ తర్వాత దాని తయారు చేయడానికి ‘ఫౌండ్రీ’ అంటారు. వ్యాపర్ తయారు చేయాలి.. వ్యాపర్ లో చాలా భాగాలుంటాయి.

మోడీ సాధించిన మరో మైలురాయి సెమీకండక్టర్ ఫౌండ్రీ స్థాపన గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.