Homeజనరల్జీవించి ఉండగానే అంత్య‌క్రియ‌లు చేసుకున్న వృద్ధుడు.. ఎందుకంటే..?

జీవించి ఉండగానే అంత్య‌క్రియ‌లు చేసుకున్న వృద్ధుడు.. ఎందుకంటే..?

Old Man

సాధారణంగా ఎవరికైనా చనిపోయిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి. అయితే ఒక వృద్ధుడు మాత్రం అతను బ్రతికి ఉన్న సమయంలోనే అంత్యక్రియలు చేసుకున్నాడు. వృద్ధుడు అంత్యక్రియలు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులు, ఆ గ్రామ పూజారి సహకరించడం గమనార్హం. చనిపోక ముందే అంత్యక్రియలు చేసుకున్న ఆ వృద్ధుడి పేరు రూప్‌ రామ్ కాగా ఆ వృద్దుడి వయస్సు 103 సంవత్సరాలు.

Also Read: మీ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా ఉందా.. ఎలా డిలేట్ చేయాలంటే..?

వృద్ధుడు అంత్యక్రియలు జరుపుకోవడంతో పాటు అంత్యక్రియలకు హాజరైన వారికి రుచికరమైన భోజనాలను కూడా పెట్టాడు. ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని రాంపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా ఒంటరి జీవితం గడుపుతున్న రూప్ రామ్ వయస్సు 103 ఏళ్లు కావడంతో వృద్ధుడు ఎక్కువ సంవత్సరాలు బ్రతకనని భావించాడు.

Also Read: ఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా.. తస్మాత్ జాగ్రత్త..!

రూప్ రామ్ కు ఇద్దరు పిల్లలు కాగా ఆ ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉన్నారనే విషయం కూడా అతనికి తెలియదు. మరణం తర్వాత అతని అంత్యక్రియలు ఎవరూ నిర్వహించరని భావించిన వృద్ధుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను తనకు తానుగా నిర్వహించుకున్నాడు. సాంప్రదాయం ప్రకారం మంత్రోచ్ఛరణలు, బ్యాండ్ మేళం చప్పుళ్లతో అంత్యక్రియలు నిర్వహించుకుని ఆ తరువాత గ్రామస్తులకు రుచికరమైన విందును ఇచ్చాడు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఇద్దరు బిడ్డలు పుట్టిన కొన్ని సంవత్సరాలకే తన భార్య చనిపోయిందని.. జీవనం సాగించడానికి బిడ్డలు ఎవరి దారి వాళ్లు వెతుక్కుంటూ వెళ్లారని ఆ వ్యక్తి అన్నారు. తనకు ఎవరూ లేకపోవడం వల్లే బ్రతికి ఉండగానే క‌ర్మకాండ‌లు చేసుకున్నానని చెప్పడంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version