జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ మూవీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ రిలీవ్ కావడానికి ఇంకా నెలలు సమయం పట్టేలా ఉంది. దీని తర్వాత ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం. ఇటీవలే వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘అసూరన్’ మూవీ తమిళంలో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. దీంతో ఈ మూవీ డైరెక్టర్ తో కలిసి నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ కోసం దర్శకుడు వెట్రిమారన్ ఓ మాస్ ఎమోషన్ కథను సిద్ధం చేశాడు. ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని తెల్సింది. వెట్రిమారన్ తమిళంలో తెరకెక్కించిన ‘పొల్లాదవన్’, ‘ఆడుకాలమ్’, ‘విశారణై’, ‘వడ చెన్నై మూవీలు భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాలతో ఉత్తమ దర్శకుడిగా పేరుతెచ్చుకోవడంతోపాటు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను గెలుపొందారు. ఇటీవలే ధనుష్ తో తెరక్కెక్కించిన ‘అసూరన్’ మూవీతో తమిళనాట సంచనలం సృష్టించింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వెట్రిమారన్ తో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏ మూవీ చేయాలో సందిగ్ధం ఉన్నాడు. కాగా వెట్రిమాన్ కథ ఎన్టీఆర్ కు నచ్చడంతో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తుంగానే దర్శకుడు త్రివిక్రమ్ ను లైన్లో పెట్టాడు. గతంలో వీరి కాంబినేషన్లలో వచ్చిన ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇటీవల త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ మూవీ ఉంటుందని అనుకున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనపించడం లేదు. అయితే ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రిలీవ్ కాకుండా ఇంకా నాలుగునెలలు సమయం పడుతుందని సమాచారం. ఈమేరకు వెట్రిమారన్ కథ నచ్చడంతో త్రివిక్రమ్ కంటే ముందుగానే ఈ మూవీ స్టార్ కానుందని తెలుస్తోంది.


దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్న రాజమౌళి, తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేశాడని, ‘బాహుబలి’ని మించేలా ఉండే ఈ భారీ పీరియాడికల్ చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటిస్తారని ఇండస్ట్రీ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, వీరి ముగ్గురి పేర్లూ వినగానే, ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రాన్ని రాజమౌళి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే వేచి చూడాలి.
శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా నిర్మాత హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏమైపోయావే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం మోషన్ పొస్టర్ ను ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.


బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ కాబోతుంది. తెలుగు నేటివిటీగా అనుగుణంగా కథలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మూవీలో నితిన్ హీరోగా నటించనున్నాడు. నితిన్ సరసన హేబ్బాపటేల్ ఎంపికైందని తెలుస్తోంది. బాలీవుడ్లో విమర్శకుల ‘అంధాదున్’ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా జాతీయ అవార్డులను గెలుచుకొంది. ప్రస్తుతం తెలుగులో క్రైమ్ థిల్లర్స్ స్టోరీలకు ఆదరణ లభిస్తుంది. దీంతో ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీ రీమేక్ హక్కులను నితిన్ తండ్రి సుధాకర్ గతంలోనే దక్కించుకున్నాడు.
“చీమ – ప్రేమ మధ్యలో భామ! ” సినిమా దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు మాట్లాడుతూ “మనుషులలో మంచి మనుషులు వేరు – చిన్న సిమిమాలలో ‘చీమ’ సినిమా వేరు. అంటే ఒక వెరైటీ, ఒక నావేల్టీ – అదేంటో తెలియాలంటే మా ‘ చీమ ప్రేమ మధ్యలో భామ! ‘ సినిమాను దగ్గరున్న థియేటర్లో చూడాలి – ఫిబ్రవరి 21విడుదల” అన్నారు.






ఆడపిల్ల పుడితే చాలు అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏంసాధించింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్ రోల్ ను పోషించింది. అన్ని పనులనూ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెపీఎన్. చౌహన్ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్స్ పతాకంపై ఆంగోత్ రాజునాయక్ దీన్ని నిర్మించారు.

ఇస్మార్ట్ శంకర్ మూవీతో హీరో రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ ఇచ్చిన జోష్ తో రామ్ ‘రెడ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన నివేది పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ‘రెడ్’ చిత్రం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఇటలోని టస్క్, ప్లారెన్స్, డోలోమైట్స్ వంటి అందమైన లోకేషన్లలో పాటలను చిత్రీకరించేందుకు సన్నహాలు చేసినట్లు తెలుస్తోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో మంచి సక్సెస్ లో ఉన్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్ హిట్ మూవీస్ లో రేస్ గుర్రం ఒకటి, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చింది. అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో మరో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారని ఫిలిం ఇండస్ట్రీ లో టాక్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల చిత్రీకరణ తరువాత సురేందర్రెడ్డి తో సినిమా ఉంటుందని సమాచారం.

కేటిఆర్ ఈ పేరు తెలియనివాళ్ళు ఎవరూ వుండరు. కొద్దికాలంలోనే యువత లో , పట్టణ ప్రజానీకంలో మంచి అభిప్రాయం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. రావటం వారసత్వం నుంచి వచ్చినా తనలో ప్రతిభ ఉందని నిరూపించుకున్నాడు. ఈ అభిప్రాయం ప్రజల్లో వుంది. ఇంగ్లీషులో, తెలుగులో, ఉర్దూ లో అనర్గళంగా మాట్లాడగలడు, వాళ్ళ నాన్నలాగా. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలతో, విద్యావంతులతో ప్రభుత్వం తరఫున మాట్లాడాలంటే కేటీఆర్ నే ఎంచుకుంటారు. కొన్నాళ్ళు అమెరికాలో పనిచేసివచ్చిన అనుభవం కూడా తనకి కలిసొచ్చింది. ఇంతవరకూ బాగానేవుంది. కానీ నిన్న టైమ్స్ నౌ సమ్మిట్ లో మాట్లాడిన ధోరణి ఏమీ బాగాలేదు.

కత్తి గుండు పగలగోట్టిన పవన్ ఫ్యాన్స్?
గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన కత్తి మహేష్ ఈ మధ్య ట్రెండ్ మార్చారు. ఆయన చూపు హిందువుల దేవుడైన శ్రీ రాముడుపై పడ్డది. ఇటీవల రాముడు పై చేసిన కామెంట్స్ కత్తి మహేష్ మెడకు చుట్టుకుంటున్నాయి. “రాముడి మాంస ప్రియుడని, ఆయన జింక మాంసం బాగా తినేవాడని కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. మరో అడుగు ముందుకేసి “రాముని తన రాజ్యంలో చెలికత్తెలతో డాన్స్ వేసేవాడని” కూడా తీవ్ర పదజాలం వాడటంతో ఆయనపై పొలిసు కేసులు నమోదయ్యాయి.
గతంలో ఇలాగే తింగర కామెంట్స్ చేసి హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన ఆయన మళ్ళీ తన పాత అవతారం ఎత్తాడు. ఈ మధ్య హైదరాబాద్ కి వచ్చిన కొద్ది రోజుల దాకా సైలెంట్ గానే ఉన్నా.. ఇప్పుడు మరోసారి వివాదాలకు తేరలేపారు.
విజయ్ దేవరకొండ “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా చూసేందుకు ఐమాక్స్ కు వచ్చిన కత్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. సినిమా ముగించుకుని వెళ్తున్న ఆయన కారుపై దుండగులు దాడి చేశారు. దాంతో కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి నుంచి కత్తి మహేష్ తృటిలో తప్పించుకున్నాడు.
అయితే ఈ దాడి చేసింది పవన్ అభిమానులా..లేక శ్రీ రాముని భక్తులా.. అనేది తెలియాల్సి ఉంది.