
సైకిల్ కింద పడి కమలం నలిగిపోతోంది. బీజేపీలోనే ఉంటూ అదే పార్టీని దెబ్బతీస్తున్నారు చంద్రబాబు కోవర్టులు. స్వయంగా అడ్డంగా దొరికేశారు కూడా. ఏపీలో బలపడాలని అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఆ పార్టీలో చేరిన టీడీపీ నాయకులే ఎసరు పెడుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తూ బీజేపీని చావుదెబ్బతీస్తున్నారు. పేరుకు బీజేపీ నేతలు.. పనిచేసేది మాత్రం టీడీపీ కోసం. ఈ రాజకీయం అర్థం చేసుకోకపోతే.. మేల్కోకపోతే ఏపీపై బీజేపీ ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏదో ఒకరోజు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
*బీజేపీలో టీడీపీ కోవర్టులు?
టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచినా.. ఓడినా.. ఆయన కోటరీ మాత్రం చెక్కు చెదరకుండా కొనసాగుతోందని.. అందుకే అధికార వైసీపీని అన్ని వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. బీజేపీతో ఎన్నికలకు ముందు తొడగొట్టినా.. బాబు ఇప్పుడు అదే బీజేపీని శరణు వేడుతున్నారు. బీజేపీని శాంతపరచడానికి తన అనుంగ అనుచరులు అయిన టీడీపీకి బ్యాక్ బోన్ గా ఉన్న నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను పల్లెంలో పెట్టి మరీ బీజేపీలోకి సాగనంపారు. వారు బీజేపీలోనే ఉన్న చంద్రబాబు, టీడీపీ కోసమే పనిచేస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో టీడీపీ ఫైట్ చేస్తున్న ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మరో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ భేటి కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ అధికారంలో లేనప్పటికీ.. త్వరలో తిరిగి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ బీజేపీలోని ఒక విభాగం టీడీపీ కోసం పనిచేస్తూనే ఉందనే ఈ ఘటనతో తేటతెల్లమైంది. అయితే నిమ్మగడ్డతో భేటి అయ్యింది బీజేపీ నేతలు.. పనిచేస్తుంది టీడీపీ కోసం.. ఇక్కడే బాద్నం అవుతున్నది బీజేపీ కాగా.. లాభపడుతున్నది మాత్రం టీడీపీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తూ ఉన్నంత కాలం ఏపీలో బీజేపీకి అవకాశాలుండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై కోర్టుల్లో పిటీషన్లు దాఖలు వేళ బీజేపీ లో ఉన్న చంద్రబాబు కోవర్టుల ప్రేమ బయటపడింది. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై హైకోర్టుకు ఎక్కింది ఎవరో కాదు.. మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని పరిరక్షించాలనే నెపంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనుమతి ఉందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాకు ఈ విషయం తెలుసనని పేర్కొన్నాడు.
ఇక ఇప్పుడు సుజనా చౌదరి సంగతి. సుజనా బీజేపీలో చేరినా మనసంతా చంద్రబాబు చుట్టూనే తిరుగుతుంటుంది. బీజేపీలో చేరాక కూడా చంద్రబాబుపై ఈగ వాలనీయకుండా కాపుకాస్తుంటాడనే పేరు సుజనా చౌదరికి ఉందంటారు. టీడీపీకి మొదట ఆర్థిక అండగా ఉన్న ఆయన బాబు ఓడిపోగానే మోడీ పంచన చేరాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయినా ఇప్పటికీ సుజనా మనసు టీడీపీపైనే ఉంటుందంటారు. బాబుకు, టీడీపీకి ఏమైనా జరిగితే తను బీజేపీలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీడియా ముందు రచ్చ చేస్తుంటాడు సుజనా అనే అపవాదు ఉంది.
అయితే తాజాగా ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జగన్ ప్రభుత్వం చేత తొలగించబడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సెగలు కక్కుతోంది. ఆయన ఇష్యూ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. తిరిగి నియమించాలని జగన్ ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రస్తుతం విచారణ సాగుతోంది. కానీ సీఎం జగన్ మాత్రం ఆయన నియామకాన్ని సహించడం లేదు. టీడీపీకి ఫేవర్ గా నిమ్మగడ్డ పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
నిమ్మగడ్డ వ్యవహారం పీక్ స్టేజీలో ఉండగానే తాజాగా హైదరాబాద్ లో జరిగిన మంత్రాంగం చర్చనీయాంశమైంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ పార్క్ హయాత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేశ్ తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ తో గంటన్నర సేపు జరిపిన రహస్య భేటి. సుజనా, కామినేనిలు ఇద్దరూ చౌదరీలే.. ఒకే సామాజికవర్గం. అదీ చంద్రబాబుకు రైట్ హ్యాండ్స్. సో బీజేపీలో ఉన్న ఈ ఇద్దరు నిమ్మగడ్డను కాపాడడానికి మంత్రాంగం నడిపారు. నిమ్మగడ్డ వైసీపీని ఎదురిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాగా..మిగిలిన ఇద్దరూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులు. కానీ టీడీపీ కోసం పనిచేస్తున్నారు.
* బీజేపీ కళ్లు తెరవాల్సిన టైం వచ్చిందా?
ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీని ఇప్పుడు టీడీపీనే దెబ్బతీస్తోందని అర్థమవుతోంది. బీజేపీలోని చంద్రబాబు కోవర్టులు ఆ పార్టీలోనే ఉంటూ టీడీపీ కోసం చేస్తున్నారని తేటతెల్లమైంది. ఇలాంటి నేతలతో రాజకీయం చేస్తున్న బీజేపీ ఏపీలో ఎలా ఎదుగుతుందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఏపీలో అధికారం రాకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే శాపంగా మారింది. సరైన నడిపించే నాయకుడు, దిశానిర్ధేశకుడు లేక బీజేపీ ఏపీలో నిలబడలేకపోతోంది. ఇప్పుడు కమ్మ నాయకుల చేతిలో మరోసారి బలిపశువు అవుతుందన్న చర్చ సాగుతోంది. బీజేపీ ఇలా కోవర్టులను తరిమికొట్టి అనాదిగా బీజేపీ వెంట ఉంటున్న కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులను దరికి చేర్చుకొని వారికి పార్టీలో మంచి పదవులు ఇస్తే ఖచ్చితంగా బీజేపీ ఏపీలో నిలబడుతుందని అంటున్నారు. కానీ అవేవీ చేయకుండా కమ్మలనే నెత్తిన పెట్టుకుంటే బీజేపీని… టీడీపీ 2గా పిలుస్తారు తప్పితే సొంత గుర్తింపు అస్సలు దక్కదంటున్నారు.
* బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకోవలి..
బీజేపీ ఖచ్చితంగా ఏపీలో ఓటు బ్యాంకును పెంచుకోవాలి.. నమ్ముకున్న కాపు, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీకి రెడ్లు, టీడీపీకి కమ్మలు ఎలా అయితే బలంగా సపోర్టు చేస్తున్నారో అలానే.. బీజేపీ కాపు, బ్రహ్మ, వైశ్యలను అక్కున చేర్చుకోవాలి. అప్పుడే ధీటుగా నిలబడగలం.. ఇక బీజేపీ రాష్ట్ర రాజకీయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వెనుకుండి నడిపిస్తున్నారన్న అనుమానాలను ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఆయన వర్గాల వారికే లబ్ధి చేకూరుస్తుందని.. టీడీపీకి ఫేవర్ గా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా అందరూ కలిసి బీజేపీ పుట్టిని ఏపీలో ముంచుతున్నారని అర్థమవుతోంది. బీజేపీ కళ్లు తెరవకపోతే పుట్టిమునగడం ఖాయమంటున్నారు. ఎవరు తమ వారు.? ఎవరు కాదన్నది ముందు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
-ఎన్నం







నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదం రోజు రోజుకీ చిలికి చిలికి గాలివాన లాగా తయారవుతుంది. ఇప్పటికే తను రాసినట్లు చెబుతున్న లేఖపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఇందులో కోర్టులు ఏం చెప్పాయనేదాన్ని ఒక్క నిముషం పక్కనపెట్టి ప్రజలేమనుకుంటున్నారు అని చూస్తే మాత్రం ఆ లేఖ చదివిన వాళ్లకు నిమ్మగడ్డ నిజాయితీపై సందేహాలు కలిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కులం పేరుతో అభియోగం చేయటం మొరటుగా వున్నా పరిస్థితులు చూస్తే ఒక సాధారణ పౌరుడికి దానిని నమ్మే పరిస్థితి వుంది. అయినా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆమాట మాట్లాడకూడదు. నిమ్మగడ్డ చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడని మాట్లాడటం వరకు ఒకే గానీ ముఖ్యమంత్రి గా అలా మాట్లాడటం సభ్యతకాదు. ఎందుకు కుమ్మక్కయ్యాడనేది ప్రజలకు వదిలిపెట్టాలి. అది కులం కోసమా, డబ్బు కోసమా, తనని నియమించాడని విశ్వాసమా అనేది ప్రజల ఆలోచనలకు వదిలివేయాలి. ఒక్కోసారి తను కులం కోసమే కుమ్మక్కయ్యాడని అనుకున్నా ముఖ్యమంత్రి సామాజిక బాధ్యతాపరంగా అలా మాట్లాడి వుండాల్సింది కాదు. అటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి మీదకూడా అవతలివాళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా కులం ప్రస్తావన ప్రత్యక్షంగా తీసుకురావటం ఎవరుచేసినా తప్పే (అది వాస్తవమైనా). ఇక అసలు విషయానికి వద్దాం.





















ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సారి రాజమౌళి పై.. !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో ఒకటిగా కనిపించబోతుండే సరికి ఈ సినిమా పై మొదటి నుండి నేషనల్ వైడ్ గా భారీ ఆసక్తి నెలకొంది. అయితే తెలుగులో మాత్రం రాజమౌళి పై కోపంగా ఉన్నారట ఇక్కడ ప్రేక్షకులు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ పాత్ర మీద రాజమౌళి ఎలాంటి వీడియోను రిలీజ్ చేయకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నిరుత్సాహ పడ్డారు.
కరోనా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం
కనీసం ఇప్పుడైనా షూట్ చేసి తమ కోసం ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన పోస్టర్ అయినా రిలీజ్ చెయ్యొచ్చు కదా, ఫ్యాన్స్ ను వారి మనోభావాలను రాజమౌళి పట్టించుకోవడం లేదని, తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాజమౌళి పై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి కరోనా కారణంగా ఎన్టీఆర్ పార్ట్ కి సంబంధించి వర్క్ మొత్తం ఆగిపోయింది. దాంతో ఫ్యాన్స్ కోసం ఏదో రిలీజ్ చేయాలి కదా అని ఏదొకటి రిలీజ్ చేయడం ఇష్టం లేకే రాజమౌళి తారక్ వీడియోను రిలీజ్ చేయలేదు.
వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?
అయితే ఎన్టీఆర్ వీడియో అద్భుతమైన అవుట్ ఫుట్ తోనే రిలీజ్ చేయాలనేది జక్కన్న ప్లాన్. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మెప్పించటానికి రాజమౌళి ఏం చేస్తాడో చూద్దాం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.