Home Blog Page 8433

వెబ్‌ బాటలోకి మరో స్టార్ డైరెక్టర్?


కళ్యాణ్ రామ్‌ హీరోగా నటించిన ‘పటాస్‌’ మూవీతో అరంగేట్రం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్లో బిగ్గెస్ట్‌ హిట్‌ అందివ్వడంతో పాటు ఫస్ట్‌ సినిమాతో తన రైటింగ్‌, టేకింగ్‌, మేకింగ్‌ స్కిల్స్‌తో ఇండస్ట్రీని ఇంప్రెస్‌ చేశాడు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో ‘సుప్రీమ్‌’, రవితేజతో ‘రాజా ది గ్రేట్’, వెంకటేశ్‌- వరుణ్‌ తేజ్‌తో ‘ఎఫ్‌ 2’తో హిట్స్‌ అందుకొని మరింత పేరు తెచ్చుకున్నాడు. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబును డైరెక్ట్‌ చేసే చాన్స్‌ కొట్టేశాడు. ఆ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకొని ‘సరిలేరు నీకెవ్వరూ’ అనిపించాడు. ప్రస్తుతం ‘ఎఫ్‌2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్‌3’ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. క‌రోనా ప్రభావం త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు అనిల్‌తో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు పోటీ పడుతున్నారు.

చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!

ఇంత క్రేజ్‌ ఉన్న టైమ్‌లో అనిల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అతను డిజిటల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ ప్రారంభించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం అనిల్ రావిపూడి ఓ కామెడీ వెబ్ సిరీస్‌ను ప్లాన్‌ చేస్తున్నాడట. కొత్త న‌టీన‌టులుతో దీన్ని రూపొందిస్తారని సమాచారం. ‘ఆహా’తో ఇప్పటికే క్రిష్‌ జాగర్లమూడి అసోసియేట్‌ అయ్యాడు. అయితే, డిడికేటెడ్‌ తెలుగు ఓటీటీ కావడం, ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌ ఇప్పటికే పాపులర్ అయిన నేపథ్యంలో ‘ఆహా’కు అంతగా ఆదరణ లభించడం లేదు. ఎంతో ముందుచూపుతో, భారీ పెట్టుబడితో ఈ ఫ్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేసిన అరవింద్‌ దాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలన్ని చూస్తున్నాడు. పలువురు యువ దర్శకులతో సిరీస్‌లు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనిల్‌ను లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. మరి, మెయిన్‌ స్ట్రీమ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ డైరెక్టర్గా మారుతున్న రావిపూడి.. వెబ్‌ మీడియాలోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి.

రాపాక..ఎందుకు ముసుగులో గుద్దులాటలు!

Rapaka Varprasad
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని ఏపీ సీఎం జగన్ పలకరించారు. సాధారణంగా సీఎం జగన్ పై రాపాక కి ఒక పాజిటివ్ కార్నర్ ఉంది. ఈ పలకరింపుతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేలా ప్రజల్లో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఇప్పటికే జగన్ నెంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా ముఖ్యమంత్రి జగన్ విశేషంగా కృషి చేస్తున్నారని.. ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా, సుభిక్షంగా ఉన్నారన్నారు.

రాపాక ని జగన్ ఇలా పలకరించారు..

ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా కాపు నేస్తం నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడివారితో మాట్లాడారు. ఈ క్రమంలో జగన్, “రాపాక అన్న బావున్నారా..” అంటూ పలకరించారు. తర్వాత మిగిలిన వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.

అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు ఉన్నా.. జగన్ తనను ‘అన్న’ అని పిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాపాక వ్యాఖ్యానించారట. పవన్ ఇప్పటి వరకు తనను అంత ప్రేమతో, ఆప్యాయతతో పిలవలేదని తన అభిమానులు, కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలతో చెప్పి రాపాక భావోద్వేగానికి గురయ్యారట. అంత ప్రేమగా పిలిచే ముఖ్యమంత్రులు కూడా దేశంలో ఉండరని రాపాక చెప్పుకొచ్చారట. అంతేకాదు గతంలో కూడా తనను “ప్రసాద్ అన్న” అని పిలిచారని గుర్తు చేసుకున్నారట.. ఏది ఏమైనా రాపాక “అన్నా..” అనే పిలుపులో మాధుర్యాన్ని అనుభవిస్తున్నారన్న మాట..!

చేస్తే నయనతారతోనే అంటున్న డైరెక్టర్


విజయ శాంతి తర్వాత సౌతిండియాలో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ సొంతం చేసున్న నాయిక నయనతార. దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ ఆమెకు విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం షూటింగ్స్‌ మాత్రమే డేట్స్‌ ఇస్తుందామె. ఆడియో, ప్రి రిలీజ్‌ సహా ఎలాంటి ప్రమోషన్‌ ఈవెంట్లకు అస్సలు రాదు. అయినా సరే ఆమెకున్న స్టార్డమ్‌ దృష్ట్యా నయనతారతో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తుంటారు. ఆమె డేట్స్‌ సంపాదించడం కోసం పోటీ పడుతారు. ఎంత ఖర్చైనా.. ఎంతకాలం వేచి చూసినా కొన్ని చిత్రాలు, క్యారెక్టర్లు ఆమెతోనే చేయించుకుంటారు. ఆ లిస్ట్‌లో తమిళ దర్శకుడు గోపీ నైనర్ కూడా ఉన్నాడు. ఓ సీక్వెల్‌ మూవీలో నయనతారను తప్ప మరో హీరోయిన్‌ను ఊహించుకోలేనని స్పష్టం చేశాడు.

పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

గోపీ నైనర్- నయన్‌ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఆరమ్‌’ (తెలుగులో కర్తవ్యం). కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిందీ. బోరు బావిలో పడ్డ ఓ చిన్నారిని కాపాడం, ఓ ఊరి సమస్యను తీర్చే కలెక్టర్ పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది. ఈ మూవీకి గోపీ సీక్వెల్‌ ప్లాన్‌ చేశాడట. అయితే, ఇందులో హీరోయిన్‌గా నయన్‌ నటించడం లేదని, ఆమె స్థానంలో కీర్తి సురేశ్‌కు ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఫుల్‌ బిజీగా ఉన్న నయనతార డేల్స్‌ అడ్జట్స్‌ చేయలేకపోవడంతో కీర్తిని సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు కోలీవుడ్‌ వర్గాలు చెప్పాయి. కానీ, ఇవన్నీ ఒట్టి పుకార్లే అని దర్శకుడు గోపీ నైనన్ స్పష్టం చేశాడు. నయన్‌ డేట్స్‌ ఇవ్వలేదన్న వార్తల్లో నిజం లేదన్నాడు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దన్నాడు. ‘ఆరమ్’కు సీక్వెల్‌ తీస్తే నయనతారతోనే తీస్తానని తేల్చి చెప్పాడు.

‘లవ్ స్టోరీ’ కోసం మరీ ఇంత పోటీనా ?


సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా చూడొచ్చు అనే నమ్మకం ఉంది జనానికి. పైగా కరోనా పుణ్యమా అంటా థియేటర్ లో సినిమా చూసే పరిస్థితి కూడా లేదాయే. అందుకే ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు డిమాండ్ పెరిగింది. కాగా తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వస్తోన్న ‘లవ్ స్టోరీ’ కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ సై అంటే సై అంటున్నాయి.

కాగా తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలుకుతుంది. మొన్నటి వరకూ జీ5 పోటీలో ముందు ఉంది. ఇప్పుడు అమెజాన్ రేసులోకి వచ్చింది. అలాగే మరో ప్రముఖ యాప్ కూడా ఆసక్తి చూపుతుందని లవ్ స్టోరీలో భాగం అయిన ఓ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి చెబుతున్న మాట. సినిమా కాంబినేషన్ తో పాటు శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా లవ్ స్టోరికి బాగా కలిసి వచ్చాయి. దానికి తోడు క్రేజీ బ్యూటీ సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం కావడం, వీరి జోడీ పై ప్రేక్షకుల్లో బీభత్సమైన ఇంట్రస్ట్ ఉండటం సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ లవ్ స్టోరీతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోందనే సరికి ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా పై ఆసక్తి వచ్చింది. మరి నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావులకు నిర్మాతలుగా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను ఇస్తోందో చూడాలి.

పెళ్లికంటే ప్రజా అవసరాలే ముఖ్యమంటున్న ప్రధాని..!


ప్రపంచ దేశాలను కరోనా మహమ్మరి పట్టిపీడిస్తోంది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. రోజురోజుకు కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు కోటికి చేరువలో ఉన్నాయి. అమెరికా, ఇటలీ, బ్రిటన్, యూకే లాంటి దేశాలు సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతున్నాయి. ఇక చిన్నచితక దేశాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కరోనా కట్టడికి చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఇంటికి పరిమితమవుతున్నారు.

కరోనా కారణంగా డెన్మార్క్ లోనూ లాక్డౌన్ విధించారు. దీంతో అక్కడ ప్రజారవాణ స్తంభించిపోయింది. వైరస్ ప్రభావంతో ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావాలంటే జంకుతున్నారు. లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇచ్చిన ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావడం లేదు. ఇక పెళ్లిళ్లు, వేడుకలను వాయిదా వేసుకుంటున్నారు. ఒకవేళ పెళ్లి వేడుకలను జరుపుకోవాల్సి వస్తే మాత్రం కొద్దిమంది సన్నిహితుల మధ్య తుతూమంత్రంగా కానిచ్చేస్తున్నారు.

పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

ఇక రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు సైతం కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. సామాన్యులైన, ధనికులైన ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారిన పడక తప్పదు. దీంతో ప్రతీఒక్కరు ముందుజాగ్రత్తలు పాటిస్తున్నారు. కరోనా, లాక్డౌన్ కారణంగా డెన్మార్క్ ప్రధాని మిట్టె ఫెడ్రిక్ సన్ వివాహం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. తాజాగా ఈ శనివారం వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ మరోసారి వివాహాన్ని ఆమె వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు.

ఈ శనివారం నుంచే ఐరోపా సమాఖ్య సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో మిట్టె ఫెడ్రిక్ సన్ మూడోసారి కూడా తన వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. వివాహం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ సమావేశాల తరువాత వివాహం చేసుకుంటామని ప్రధాని మిట్టె ఫెడ్రిక్ సన్ పేర్కొన్నారు. అయితే అద్భుతమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు తాను ఎంతగానో వేచి చూస్తున్నానంటూ ప్రధాని మిట్టె ఫెడ్రిక్ సన్ ఫేస్ బుక్లో పోస్టు చేసింది. తనకు కాబోయే భర్త ‘బో’తో కలిసున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రధాని నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఆర్ఆర్ఆర్​లో అజయ్‌ దేవగణ్ పాత్ర రివీల్?


బాహుబలితో తెలుగు సినిమా పరిధిని విస్తృతం చేసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. (రౌద్రం, రణం, రుధిరం). తెలుగుతో పాటు తమిళ్, హిందీలో నేరుగా విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో, మోషన్‌ పోస్టర్.. రామ్‌ చరణ్‌ ఫస్ట్‌ లుక్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. మన్యం అడవుల్లోని అల్లూరి సీతారామరాజు, ఆదిలాబాద్‌‌ అడవుల్లోని కొమురం భీమ్ విప్లవ వీరులుగా మారకముందు కలుసుకుంటే ఎలా ఉండబోతోందనే ఫిక్షన్‌‌ స్టోరీని తెరపై ఆవిష్కరించబోతున్నాడు జక్కన్న. ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ కూడా చిన్న పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర గురించి తాజాగా ఆసక్తికర విషయం బయటికొచ్చింది.

పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

ఈ మూవీలో ఈ ఇద్దరు దక్షిణాది విప్లవ వీరులతో పాటు ఒక ఉత్తరాది విప్లవ వీరుడు కూడా కనిపించబోతున్నాడట. ఆ పాత్రనే అజయ్‌‌ దేవగణ్‌ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అది మరెవరిదో కాదు భగత్‌‌ సింగ్ అని సమాచారం. ఈ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ హీరోలపై దాని ప్రభావం ఎక్కువ ఉంటుందట. రామరాజు, భీమ్‌లకు మార్గనిర్ధేశం చేసి వాళ్లను సతంత్ర్య సమరం వైపు మళ్లించే గురువు పాత్రనే అజయ్‌ పోషించబోతున్నాడని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇటీవల తాను అజయ్ దేవగన్‌‌కి జంటగా నటించబోతున్నట్టు శ్రియ చెప్పింది. అవి అజయ్ పోషిస్తున్న భగత్‌‌ సింగ్‌‌ పాత్ర ప్లాష్ బ్యాక్ సీన్స్‌‌ అని సమాచారం. కాగా, భగత్ పాత్ర పోషించడం అజయ్‌‌కి కొత్తేమీ కాదు. గతంలో ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’లోనటించి జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. అందుకే ఈ పాత్రకు దేవగణ్‌ను రాజమౌళి ఒప్పించాడట.

బుల్లెట్‌ నడపబోయి.. బోల్తా పడ్డ నాని హీరోయిన్‌


మనకు వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు. రాని పని ట్రై చేయకూడదు. ఓ తెలుగు సినిమా డైలగ్‌ ఇది. నాని సూపర్ హిట్‌ మూవీ ‘జెర్సీ’లో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌ ఇప్పుడు ఇదే డైలాగ్‌ చెబుతోంది. ఎందుకంటే రాని పని ట్రై చేస్తే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఆమెకు అర్థమైంది. శ్రద్ధా తాజా మూవీ ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ గురువారమే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. సురేశ్ ప్రొడక్షన్స్‌ పతాకంలో దగ్గుబాటి రానా సమర్పించిన ఈ మూవీకి రవికాంత్ పేరూరు దర్శకత్వం వహించారు. సిద్దూ జొన్నలగడ్డ హీరో. శ్రద్ధతో పాటు సీరత్ కపూర్, శాలినీ కూడా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర చిత్రీకరణ జరుగుతున్నప్పుడే శ్రద్ధకు పై డైలాగ్‌ అర్థం తెలిసింది. తాను రాకపోయినా బుల్లెట్‌ నడిపే ప్రయత్నం చేసిన శ్రద్ధ కిందపడిపోయింది. అదృష్టవశాత్తు ఆమెకు దెబ్బలేమీ తగల్లేదు. కానీ, ఈ ఘటన వల్ల తనకు ఓ విషయం బోధపడిందని శ్రద్ధ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. బైక్‌ నుంచి కింద పడిన వీడియోను షేర్ చేసింది.

పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

‘ఇండియన్‌ ఫిల్మ్‌ లో బోల్డ్‌ ఫీమేల్‌ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆమె బైక్‌ నడిపే సీన్‌ లేని సినిమాను ఊహించుకోగలమా. జూన్ 2017లో హైదరాబాద్ లోని నంది హిల్స్ లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. రాత్రి వర్షం పడడంతో ఆ రోజు రోడ్డు తడిగా ఉన్నాయి. షూటింగ్ లో భాగంగా నేను బైక్ నడిపే సన్నివేశం ఉంది. అందుకోసం డైరక్టర్ రవికాంత్.. నా దగ్గరికి వచ్చి బైక్ నడపగలవా అని అడిగారు. దానికి నేను.. రాదు కానీ.. ట్రై చేస్తా అన్నాను. ఎందుకంటే నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు బైక్ నడిపిన అనుభవం ఉంది. గెర్లు ఎలా వేయాలి, ఎలా ముందుకెళ్లాలి అని కొంచె అవగాహన ఉంది. అయినా చాన్నాళ్ల తర్వాత నేను మళ్లీ బైక్‌ ఎక్కా. అయినా నాకు భయం వేయలేదు. నేను రైడ్‌ చేయగలనని అనుకున్నా. పైగా, నా వల్ల షూటింగ్‌ కాంప్రమైజ్‌ కాకూదని భావించా. కానీ, రాయల్ ఎన్ ఫీల్డ్ ఎక్కి అలా టర్న్ చేశానో లేదో.. బ్యాలన్స్ తప్పి కిందపడిపోయా. ఆ ఘటనను మొత్తం నా అసిస్టెంట్ ప్రశాంత్ సరదాగా వీడియో తీశాడు. నేను కిందపడగానే సెట్ లో ఉన్నవాళ్లంతా తెగ భయపడ్డారు. నా దగ్గరికి వచ్చి హెల్ప్‌ చేశారు. కానీ, బైక్‌కు ఏవైనా స్క్రేచ్స్ పడ్డాయా అనే ఎక్కువగా కంగారు పడ్డారు. అయినా ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌ ఎందుకంత బరువుగా ఉంటుందబ్బా..?’ అని ప్రశ్నిస్తూ శ్రద్ధా తన అనుభవాన్ని షేర్ చేసింది.

https://www.instagram.com/p/CBz2l4hljVU/

పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?


పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టారు. ఆయన ఓ దేశానికి ప్రధాని అన్న విషయం కూడా మర్చిపోయినట్లుగా కన్పిస్తుంది. ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన బిన్ లాడెన్ ను పార్లమెంట్ సాక్షిగా ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడు అంటూ కొనియాడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన వ్యాఖ్యలపై పాకిస్థాన్లోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఒక ఉగ్రవాదిని అమరుడు అని కొనియాడటం ద్వారా ప్రపంచ దేశాల ముందట పాకిస్థాన్ ను తలదించుకోనులా చేశారని ఆయనపై ప్రతిపక్షాలు మండిపడిపోతున్నాయి.

చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!

పాకిస్థాన్ కు చెందిన బిన్ లాడెన్ అల్ ఖైదా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రపంచ దేశాలకు సవాల్ విసిరాడు. భారత్, అమెరికా సహా అనేక దేశాల్లో అనేక మరణహోమాలను సృష్టించిన సంగతి తెల్సిందే. ఆల్ ఖైదా 2001 సెప్టెంబర్ 9న అమెరికా ఎయిర్ లైన్స్ ను హైజక్ చేసి పెంటగాన్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడిచేసింది. ఈ సంఘటనలో 25వేలమంది గాయపడగా 2,996మంది మృత్యువాతపడ్డారు. ఈ వార్త తెలిసి ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆల్ ఖైదాను అన్నిదేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.

సెప్టెంబర్ 11దాడులకు ముందువరకు అమెరికాకు పాకిస్థాన్ మిత్రదేశంగానే ఉండేది. ఈ సంఘటన తర్వాత ఇరుదేశాల మధ్య దూరం పెరిగింది. పాకిస్థాన్ అసలు స్వరూపం గ్రహించిన అమెరికాకు మెల్లిమెల్లిగా ఆ దేశాన్ని దూరం పెడుతూ వచ్చింది. అదేవిధంగా తమ దేశంలో దాడులకు పాల్పడిన బిన్ లాడెన్ పట్టుకుకొని హతమారుస్తామని అమెరికా ప్రకటించింది. ఆ తర్వాత బిన్ లాడెన్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ అమెరికాను నమ్మించే యత్నం చేసింది.

వైసీపీకి కొత్త చిక్కులు తెచ్చిన షోకాజ్ నోటీస్..!

బిన్ లాడెన్ పాకిస్థాన్లో ఆశ్రయం పొందుతున్న విషయాన్ని అమెరికా నిఘా సంస్థలు పసిగట్టాయి. పక్కా ప్రణాళికతో 2011లో పాకిస్థాన్‌కు ఏమాత్రం సమాచారమివ్వకుండా సొంత ఆపరేషన్‌ తో అబోటాబాద్‌లో లాడెన్‌ను అమెరికా బలగాలు హతమార్చాయి. బిన్ లాడెన్ మృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరు కూడా సానుభూతి వ్యక్తం చేయలేదు.

తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టాడు. పాకిస్థాన్ పార్లమెంట్లో లాడెన్‌ను అమెరికా హతమార్చిన విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2011 తర్వాత అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు ఎంతలా దిగజారాయో చెబుతూ లాడెన్‌ను అమరవీరుడిగా ఇమ్రాన్ ఖాన్ సంబోధించాడు. అమెరికన్లు అబోటాబాద్ వచ్చి లాడెన్‌ను చంపేసి అతడిని అమరవీరుడిని చేశారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడం తీవ్ర దూమారాన్ని రేపుతోంది. ఆయన వ్యాఖ్యల పై పాకిస్థాన్‌ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద ఘటనలతో ముస్లింలపై ఓవైపు వివక్ష కొనసాగుతుండగా ఓ ఉగ్రవాదిని అమరుడిగా కీర్తించడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పు పడుతున్నారు. ఆయన ప్రధాని అన్న విషయం మరిచిపోయి మాట్లాడుతున్నారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలతో మరోసారి పాకిస్థాన్ ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందనే అభిప్రాయం పాకిస్థానీయుల్లో వ్యక్తమవుతోంది.

వైసీపీకి కొత్త చిక్కులు తెచ్చిన షోకాజ్ నోటీస్..!


వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కొరివితో తల గోక్కునట్లు తయారైంది. ప్రతి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం, సీఎం జగన్ ను కలిసే అవకాశం లేదని, ఆయన చుట్టూ కోటరీ ఉందని విమర్శలు చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ షోకాజ్ నోటీసుకు ఎంపీ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలో ఎంపీ లేవనెత్తిన విషయాలు వైసీపీకి కొత్త సమస్యలు తెచ్చి పెట్టాయి.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత వ్యవహారాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించారు. పార్టీ ఏర్పాటు చేసి తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా నేటికి పార్టీ క్రమశిక్షణ సంఘం లేకపోవడం, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పార్టీ నిర్వహణ, సమావేశాలు నిర్వహించడం లేదనే విషయం వెల్లడైంది. ఇది ఆ పార్టీ విషయంలో ప్రతిపక్ష పార్టీలకు మరో అస్త్రం దొరికినట్లయ్యింది.

టీడీపీ ఎమ్మెల్యేలను అనధికారికంగా పార్టీలోకి తీసుకుని వారిచేతే టీడీపీ పార్టీని, అధినేత చంద్రబాబు, లోకేషలను తిట్టిస్తున్నారని వాపోతున్న ప్రతిపక్షం, ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంతో ఆ పార్టీకి తగిన శాస్తి జరిగిందని భావిస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి.

మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!

మరోవైపు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలైన వైఎస్సార్ సీపీ తమదేనని, సీఎం జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు పార్టీ మా పార్టీ పేరును వాడుకొంటున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా పేర్కొన్నారు. 2015లో ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆ పేరును వాడుకోవద్దని అప్పుడే ఎన్నికల సంఘం ఆదేశించిందని చెప్పారు. ఇది ఇలా ఉంటే వైసీపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇంతటితో సర్దుకుంటుందో… లేక కొత్త రంగు పులుముకుంటుందా అనే అంశం తెలియాలంటే వేచి చూడాల్సిందే.

బాలయ్య ఆర్డర్స్ ను అందుకునే స్టార్స్ ఉన్నారా !


నట సింహం నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం అని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెబుతారు. దానికి తగ్గట్లుగానే బాలయ్య బాబు కూడా ఎప్పటికప్పుడు తన చిన్న పిల్లాడి మనసును చాటుకుంటునే ఉంటారు. తాజాగా దర్శకులకి కూడా లేటెస్ట్ గా ఒక మెసేజ్ పాస్ చేశాడు బాలయ్య. ఇక పై తను చేయబోయే చిత్రాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య దర్శకులకు క్లారిటీగా చెప్తూ.. తనకు కథ చెప్పాలనుకుంటే కొత్తదనం ఉండాలని, అప్పుడే కథ చెప్పడానికి రండని తనకు టచ్ లో ఉన్న డైరెక్టర్స్ కి బాలయ్య తన స్టైల్ లో ఆర్డర్స్ పాస్ చేశాడట.

చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!

కానీ బాలయ్య ఆర్డర్స్ ను అందుకునే స్టార్ డైరెక్టర్ లు ఎవరు ఉన్నారన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అసలు స్టార్ డైరెక్టర్ లు బాలయ్య బాబు అంటేనే అడ్రస్ లేకుండా పోతారని కొంతమంది సినిమా మిత్రులు చెప్పే రెగ్యులర్ మాట. కారణం.. బాలయ్యను డీల్ చేయడం కత్తి మీద సాము లాంటిది అనేది వారి అభిప్రాయం. ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే.. బాలయ్య స్టార్ హీరో.. ఆయన పై వచ్చే రూమర్స్ నిజం కూడా కావొచ్చు.. కానీ బాలయ్యకి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

కాకపోతే ఆ స్టార్ డమ్ ఇప్పుడు కూడా ఉందా అన్నదే అనుమానం. నిజంగా బాలయ్యకు మునపటి స్టార్ వాల్యూ ఉంటే.. ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్స్ అంతా బాలయ్యతో సినిమా చెయ్యడానికి తమ వంతు ప్రయత్నాలు తప్పకుండా చేసుకునేవారు కాదా… మరెందుకు ఒక్క బోయపాటి తప్ప.. మిగిలిన వాళ్ళు అంతా బాలయ్యకు దూరం జరిగారు. ఏ.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు బాలయ్యతో సినిమా చేస్తే.. బాలయ్య మీద వంద కోట్లు రావంటారా.. ఖచ్చితత్వంతో చెప్పొచ్చు. సినిమా హిట్ అయితే బాలయ్య మీద కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉందని. కానీ బాలయ్యతో స్టార్ డైరెక్టర్ లు సినిమాలు చెయ్యరు. ఎందుకో బాలయ్య ఆలోచించుకోవాలి.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే కాకుండా ఇంకాస్త కొత్తగా కనిపించాలనేది బాలయ్య తాపత్రయం. అందుకే గుండు కూడా కొట్టించుకున్నాడు. మరి గుండుతో బాలయ్య కొత్తదనం ఎలా ఉంటుందో చూడాలి.

సీఎం సార్.. పాల కంటే నీళ్ళే మేలుగా..!

Jagan

“పరుగెత్తి పాలు తాగే కంటే.. నిలబడి నీళ్ళు తాగడం మేలు” అనే విషయాన్ని ఏపీ సీఎం జగన్ కొంచం ఆలస్యంగా గ్రహించారు. శాసన మండలి రద్దు విషయంలో ఒక సత్యాన్ని గ్రహించిన జగన్, ఇప్పుడు మండలి రద్దు అంశంపై వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీ శాసన మండలి రద్దు చేయాలని భావించి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే శాసన మండలి రద్దు అనే కీలక విషయంలో జగన్ వెనక్కి తగ్గినట్లు అర్థమవుతుంది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన గాని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు మెజార్టీ లో ఉండటంతో చాలా బిల్లులు అడ్డుకోవడం జరిగింది. దీంతో పెద్దల సభ అంటూ సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్న శాసన మండలి రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష టీడీపీ కి మరియు అధికార పార్టీ వైసిపికి తీవ్ర వాదోపవాదాలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే వచ్చే ఏడాదిలో శాసన మండలిలో వైసిపి పార్టీకి పూర్తి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉండటంతో… ఆఖరి నిమిషంలో ఇటీవల శాసన మండలి రద్దు విషయంలో వైఎస్ జగన్ పునరాలోచనలో పడినట్లు టాక్ నడుస్తోంది. ఈ ఒక్క సంవత్సరం కొన్ని కీలక బిల్లులను వాయిదా వేసి, శాసన మండలిలో కూడా వైసీపీ మెజారిటీ సభ్యలు చేరిన తర్వాత ఆ బిల్లులను ప్రవేశపెట్టె ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. కొన్ని నిర్ణయాలు తొదరపాటుతో తీసుకొని మళ్ళీ వాస్తవాలను గ్రహించడం వైసీపీ కి అనుకూల పరిణామమే..!

ఓటీటీలో ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం..?


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెరపైకి వచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ మూవీతో ఉదయ్ కిరణ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ఉదయ్ కిరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తర్వాత వచ్చిన ‘నువ్వు..నేను’, ‘మనంత నువ్వే’ సినిమాలు కూడా భారీ విజయం సాధించాయి. దీంతో ఉదయ్ కిరణ్ తొలి హ్యట్రిక్ హీరోగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

వరుస విజయాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వరుస ప్లాపులతో వెనుకబడ్డాడు. 2003లో చిరంజీవి కూతురు సుస్మితతో నిశ్చితార్థం జరిగినా కొన్ని కారణాల వల్ల పెళ్ళివరకు వెళ్లలేదు. ఆతర్వాత 2012లో అక్టోబరు 24న విషితను ఉదయ్ కిరణ్ వివాహమాడాడు. అయితే ఉన్నట్టుండి ఉదయ్ కిరణ్ 2014 జనవరి 6న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం శోచనీయంగా మారింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య టాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి.

ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం మరోసారి తెరపైకి వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా దిల్ బెచారాను హాట్ స్టార్ ప్లస్ డిస్నీ కొనేసింది. ఈ చిత్రం జులై 24న ఈ సినిమా ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. దీంతో ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం ‘చిత్రం చెప్పిన కథ’ ఓటీటీ విడుదల చేయాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. 2015 మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అప్పట్లో ప్రకటించింది. ఉదయ్ కిరణ్ చనిపోయి ఆరేళ్లు గడిచినా ఈ చిత్రం రిలీజ్ కాలేదు.

చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!

లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం ‘చిత్రం చెప్పిన కథ’ సినిమా కూడా ఓటీటీలో త్వరలో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు మోహన్ ఎఎల్ఆర్ కె ‘చిత్రం చెప్పిన కథ’ను యాక్షన్ థిల్లర్ గా తెరకెక్కించారు. ఉదయ్ కిరణ్ కు జోడీగా మదలస శర్మ నటించింది. ఈ చిత్రానికి మున్నా నిర్మించగా సంగీతాన్ని మన్నా కాశి అందించాడు.

ఉదయ్ కిరణ్ ఆఖరి సినిమా కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చూస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం త్వరలో రిలీజ్ కానుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!


విస్తరణ వాదంతో చెలరేగిపోతున్న చైనా దేశానికి గట్టి బుద్ది చెప్పేందుకు అమెరికా రెడీ కావడం ప్రపంచ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ పరిణామం భారత్ కు కొండంత బలాన్ని ఇచ్చినట్టైంది. అంతేకాదు.. దక్షిణాసియా దేశాలకు అమెరికా సాయం చేస్తానని చేసిన ప్రకటన చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

చైనా మన సరిహద్దుల్లో భారీగా బలగాలను, యుద్ధ సామగ్రిని మోహరిస్తోంది. దీంతో భారత్ కూడా 10వేల మంది సైనాన్యి సరిహద్దులకు తరలించింది. మనకు అత్యవసర యుద్ధ సామగ్రిని పంపిణీ చేయాల్సిందిగా ఇప్పటికే భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా వెళ్లి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అనూహ్యమైన నిర్ణయం భారత్ కు కొండంత బలాన్ని ఇచ్చినట్టైంది.

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

తాజాగా చైనా భారత్ తోనేకాదు.. దాని పక్కనున్న వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పిన్స్ దేశాలను బెదిరిస్తోంది. వాటికి ముప్పుగా మారింది. నదులు మళ్లిస్తూ ఆర్థికంగా దెబ్బతీస్తూ దక్షిణ చైనా మహాసముద్రంలో సవాళ్లు విసురుతోంది. తాజాగా భారత్ తోనూ కయ్యానికి కాలుదువ్వుతోంది.

ఈ టైంలోనే తాజాగా అమెరికా సంచలన ప్రకటన చేసింది. భారత్ తోపాటు దక్షిణాసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. చైనాను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ మేరకు జర్మనీలో ఉన్న 52వేల అమెరికన్ సైన్యాన్ని 25వేలకు తగ్గిస్తున్నారు. ఏ ప్రాంతానికైనా ముప్పు ఎదురైతే ఆ దేశాల బాధ్యత తీసుకొని రక్షిస్తామని తెలిపారు.

చైనా ఎత్తులను చిత్తు చేసేదేలా?

ఈ నేపథ్యంలో అమెరికా ప్రకటన భారత్ కు ఊరటనిచ్చింది. కయ్యంతో కాలుదువ్వుతున్న చైనా దురాక్రమణకు అమెరికా ప్రకటన షాకింగ్ లా మారింది. చైనాను ఎదుర్కొనేందుకు భారత్ కు బలగాలు పంపేందుకు అమెరికా రెడీ కావడం డ్రాగన్ దేశానికి గుబులు పుట్టిస్తోంది. ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యాన్ని కలిగిన అమెరికా.. భారత్ తో చేతులు కలిపితే చైనా పని ఖతమే. ఈ మారిన అంతర్జాతీయ పరిణామాలతో చైనా ఏ నిర్ణయం తీసుకుంటదనేది ప్రాధాన్యత సంతరించుకుంది..

-ఎన్నం

జగన్ సొంత సామాజిక వర్గంలో మొదలైన అసహనం


మనకు దక్కకపోయినా పర్లేదు…ఎదుటివాడికి ప్రయోజనం కలిగితే మనం ఓర్చుకోలేం…ఇది మనిషి సహజ లక్షణం. ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని వర్గాల ప్రజల తీరు ఇలానే ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి కేవలం ఏడాది మాత్రమే పూర్తి అయ్యింది. ఈ ఏడాది పాలనలో ఆయన అనేక విప్లవాత్మక పథకాల అమలు పూర్తి చేశారు. అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీల నెరవేర్చడంపై దృష్టిపెట్టాడు. దీనిలో భాగం ఆయన విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశారు. ఇంగ్లీష్ మీడియం అమలు వంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నవరత్నాలలో ముఖ్యమైన అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలలో రూ. 15వేలు జమచేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

వాహన మిత్ర, మత్యకార భరోసా, నేతన్న హస్తం, విద్యా దీవెన వంటి అనేక పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చడం జరిగింది. తాజాగా జూన్24న కాపు నేస్తం పథకం క్రింద ఆర్థికంగా వెనుకబడిన కాపు, తెలగ, బలిజ కులాలకు చెందిన మహిళల ఖాతాలలో రూ. 15 వేలు జమచేయడం జరిగింది. రోజుల వ్యవధిలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థిక మద్దతు ప్రభుత్వం ప్రకటించింది. లబ్దిదారులకు ఆనందం పంచుతున్న ఈ పథకాలు, అనర్హులైన వారిలో అసహనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన రెడ్డి, కమ్మ, వైశ్య మరియు బ్రాహ్మణ కులాలవారు జగన్ వైఖరి పట్ల మండిపడుతున్నారు.

మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!

ఉన్నత సామజిక వర్గాలకు చెందిన యువత సోషల్ మీడియా వేదికగా జగన్ పై ప్రశ్నలు సంధిస్తున్నారు. మిగతా కులాల సంగతి అటుంచితే జగన్ సొంత సామాజిక వర్గం అయిన రెడ్లలో దీనిపైన తీవ్ర అసంతృప్తి రేగుతుంది. ఆర్ధికంగా వెనుక బడిన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు వారికి కూడా ఎంతో కొంత ఆర్థిక తోడ్పాటు కల్పించాలని కోరుకుంటున్నారు. మరి గత ప్రభుత్వాలు ఇన్నేళ్ళలో ఓసీ వర్గానికి ప్రత్యేకంగా చేసింది ఏమి లేదు. అయినప్పటికీ ఈ సామాజిక వర్గాలు, ఈ విషయంపై ప్రభుత్వాలను ప్రశ్నించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు వీరిలో అసహనం కలగడానికి కారణం మిగతా సామాజిక వర్గాలకు సాయం చేస్తూ ఉండడమే. ఐతే వీరి కోరికలో కూడా న్యాయం లేకపోలేదు. ఉన్నత సామాజిక వర్గాలలో కూడా అనేక మంది దారిద్య్ర రేఖకు దిగువున్న వారు ఉన్నారు. మరి అలాంటి వారిని గుర్తించి జగన్ ఆర్థిక తోడ్పాటు కల్పిస్తే తప్ప, వీరు శాంతిచే పరిస్థితి లేదు.

నవ్వులాటలు కాదు..ఇక మరణమృదంగమే!

Corona death

 

Corona death

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎంతగా పెరుగుతున్నాయంటే మరికొన్ని రోజుల్లో ప్రపంచంలో కరోనా కేసుల విషయంలో మన దేశం మొదటి స్థానానికి చేరుకోబోతుంది. ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పటికిప్పుడు దేశంలో అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. ఈ రోజే అమెరికాను దాటి పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కోవిద్ విలయతాండవం దేశంలో కొనసాగుతున్న వేళ ప్రతి ఒక్కరం వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రముఖులను వదలని కరోనా మహమ్మారి

  • డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత!
  • ముంబయి మున్సిపల్ కమిషనర్ కన్నుమూత!
  • ముంబయిలో దాదాపుగా 30 మంది పోలీసులు కూడా కన్నుమూత!
  • గుజరాత్ , ఢిల్లీ ముఖ్యమంత్రులు హోం ఐసొలేషన్!
  • జూనియర్ సింధియా , ఆమె తల్లీ ఇద్దరూ ఆసుపత్రిలో…!

ఒక్క ఢిల్లీలోనే జూలై 30 నాటికి 5 లక్షల పైచిలుకు కేసులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మనదేశంలో టెస్టులు అందరికీ చేస్తే ఈపాటికే అమెరికాని దాటిపోయేవాళ్ళమంటే అతిసియోక్తి కాదు. దేశం మొత్తంలో 30 జిల్లాలలో పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరుకుంది.

అపోహలకు తావు ఇవ్వొద్దు

వయస్సులో ఉన్న వాళ్లకి ఏమీ కాదు అనుకోవటం తప్పు. ఇటీవల హైదరాబాద్ లో చనిపోయిన జర్నలిస్ట్ వయస్సు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే.. అలాగే… 23 సంవత్సరాలు ఫైనల్ ఇయర్ మెడిసిన్ విద్యార్థి కూడా కరోనాతో చనిపోయింది.

ప్రభుత్వాలు చేతులైతేశాయి…

ప్రభుత్వాలు చేయగలిగినదంతా చేసి చివరికి ఏమి చేయలేక చేతులెత్తసాయి. ఇక ప్రజల చేతుల్లోనే కరోనా కట్టడి ఉంది. జాగ్రత్తలు పాటించండి.

  • మనిషికి మనిషికి దూరం పాటించండి!
  • మాస్కులు వాడండి!
  • ఎంతో అవసరమైతేనే బయటకి వెళ్ళండి!
  • సానిటైజర్ బాటిల్స్ జేబులో పెట్టుకోండి!

ఇక ఎంతమాత్రం నవ్వులాట పనికిరాదు , ఆ స్థాయి దాటిపోయిందనేది గ్రహిస్తే మంచిది. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి ప్రతి ఇంటిలో విషాదం నెలకొన్నది ,కనీసంలో కనీసం ఇంటికొకరు చనిపోయారట అలాంటి విపత్తు మళ్ళీ దేశంలో వచ్చినా ఆశ్చర్యం లేదేమో! కాబట్టి అధికారులు బాధ్యతలు విధిగా నిర్వర్తించండి. వాస్తవాలు బయటకు చెప్పండి. ఏమి చేస్తే మంచిదో ప్రజలకు తెలపండి. దేశ ప్రజలను కరోనా పై యుద్ధానికి సిద్ధం చేయండి. దేశాన్ని కాపాడండి.

ఎక్స్ పోజింగ్ కి హద్దు అదుపు లేదట !


చిన్న సినిమాతో పెద్ద హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ ‘హెబ్బా పటేల్’. నిజానికి మూడు సంవత్సరాల క్రితం వరకూ హెబ్బాకి ఉన్న డిమాండ్, తోటి హీరోయిన్స్ అబ్బా అనుకునేలా సాగింది. కానీ వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో హెబ్బా తొందర పడింది. వచ్చిన సినిమా వచ్చినట్లుగా రెచ్చిపోయి మరీ చేసేసింది. ప్లాప్ ల వలయంలో చివరికి విలువే కోల్పోయింది. అయితే ఎన్ని కోల్పోయినా హెబ్బా అసలు తగ్గడం లేదు. ఏది దొరికితే అది చేసేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

ఆ క్రమంలోనే వెబ్ సిరీస్ లు, భీష్మలో ఐటమ్ రోల్.. ఇలా ఈ గ్లామర్ ప్రపంచంలో నాలుగు రాళ్లు సంపాధించుకోవడానికి హెబ్బా ఏ మాత్రం మోహమాటపడకుండా తనకు ఉన్న ఆ కొద్ది అందచందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో చేసిన సినిమానే ‘రెడ్’. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా వస్తోన్న ఈ సినిమాలో హెబ్బా ఓ ఐటమ్ సాంగ్ చేసింది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ లో హెబ్బా ఎక్స్ పోజింగ్ కి హద్దు అదుపు లేకుండా ఉంటుందట.

అంటే… గతంలో ఎన్నడూ లేని విధంగా హెబ్బా ఈ సాంగ్ కోసం హద్దు మీరి మరి ఎక్స్ పోజ్ చేసింది అన్నమాట. ఇక ఈ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ అండ్ హెబ్బా మీద లాక్ డౌన్ కి ముందే షూట్ చేశారు. సాంగ్ అవుట్ ఫుట్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా హెబ్బా స్టెప్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్, తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటించారు.

హైదరాబాద్ లో స్వచ్ఛంద లాక్ డౌన్..!


తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేసినప్పుడు కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యేవి. దీంతో కరోనా కట్టడిలోనే ఉందని అంతా భావించారు. అయితే ఇటీవల లాక్డౌన్ సడలింపులు భారీగా ఇవ్వడంతో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గడిచిన వారం పదిరోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే వైరస్ ఎంతలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చేయిదాటిపోయిందా? అనేలా కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతోన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

ఇక మహానగరం మహమ్మరి గుప్పిట్లోకి వెళ్లినట్లు కన్పిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 500పైబడి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ కార్యాలయ సిబ్బందే కరోనా బారిన పడుతున్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీ కార్యాలయాలకు ప్రజలెవరూ రావద్దని సూచించింది. ఏవైనా పనులుంటే ఆన్ లైన్లోనే ఫిర్యాదు చేయాలని కోరింది. ఇక జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమ్మోహన్ రెండుసార్లు కరోనా బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో ఆయన కూడా బయట తిరగకుండా ఇంటి నుంచే పనులను చక్కబెడుతున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో నిన్న ఒక్కరోజే మొత్తం 920కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 737కొత్త కేసులు నమోదవడం గమానార్హం. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 60 కొత్త కరోనా కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జీహెచ్ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్‌ కిరాణ మర్చంట్‌ అసోసియేషన్‌ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వారంరోజులపాటు బేగంబజార్‌లోని కిరాణా దుకాణాలు స్వచ్చంధంగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 28 నుంచి వచ్చేనెల 5 వరకు బేగంబజార్‌లో దుకాణాలు మూసివేయనున్నారు.

ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు

హైదరాబాద్‌లో కరోనా విజృంభణతో వ్యాపారులు బెంబెలెత్తిపోతున్నారు. దీంతో ఎవరికీవారు స్వచ్ఛంధంగా లాక్డౌన్ విధించుకున్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్చించుకొని లాక్డౌన్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నుంచే వచ్చే నెల 5తేదీ వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్, సూర్యా టవర్స్, ప్యారడైజ్ ప్రాంతాల్లోని అన్ని దుకాణాలు మూసి వేయనున్నారు. దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఆదివారం నుంచి మరికొన్ని మార్కెట్లు సైతం లాక్డౌన్ విధించుకునేలా కన్పిస్తున్నాయి.

మరోవైపు హైదరాబాద్లో చేస్తున్న కరోనా టెస్టులను అర్ధాంతరం నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలోనే ప్రజలు స్వచ్చంధంగా లాక్డౌన్ సిద్ధపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. తాజాగా ఇది నగరాలకు కూడా పాకింది. వ్యాపారులతోపాటు ప్రజలంతా ఎవరికీ వారు స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తే కరోనా వైరస్ అరికట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.