
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ మూవీతో అరంగేట్రం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందివ్వడంతో పాటు ఫస్ట్ సినిమాతో తన రైటింగ్, టేకింగ్, మేకింగ్ స్కిల్స్తో ఇండస్ట్రీని ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్తో ‘సుప్రీమ్’, రవితేజతో ‘రాజా ది గ్రేట్’, వెంకటేశ్- వరుణ్ తేజ్తో ‘ఎఫ్ 2’తో హిట్స్ అందుకొని మరింత పేరు తెచ్చుకున్నాడు. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబును డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. ఆ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకొని ‘సరిలేరు నీకెవ్వరూ’ అనిపించాడు. ప్రస్తుతం ‘ఎఫ్2’కి సీక్వెల్గా ‘ఎఫ్3’ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్ట్ను సిద్ధం చేసుకున్నాడు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు అనిల్తో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు పోటీ పడుతున్నారు.
చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!
ఇంత క్రేజ్ ఉన్న టైమ్లో అనిల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అతను డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రారంభించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం అనిల్ రావిపూడి ఓ కామెడీ వెబ్ సిరీస్ను ప్లాన్ చేస్తున్నాడట. కొత్త నటీనటులుతో దీన్ని రూపొందిస్తారని సమాచారం. ‘ఆహా’తో ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి అసోసియేట్ అయ్యాడు. అయితే, డిడికేటెడ్ తెలుగు ఓటీటీ కావడం, ఇతర ఫ్లాట్ఫామ్స్ ఇప్పటికే పాపులర్ అయిన నేపథ్యంలో ‘ఆహా’కు అంతగా ఆదరణ లభించడం లేదు. ఎంతో ముందుచూపుతో, భారీ పెట్టుబడితో ఈ ఫ్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన అరవింద్ దాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలన్ని చూస్తున్నాడు. పలువురు యువ దర్శకులతో సిరీస్లు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనిల్ను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. మరి, మెయిన్ స్ట్రీమ్లో ఇప్పుడిప్పుడే స్టార్ డైరెక్టర్గా మారుతున్న రావిపూడి.. వెబ్ మీడియాలోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి.































రాపాక..ఎందుకు ముసుగులో గుద్దులాటలు!
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని ఏపీ సీఎం జగన్ పలకరించారు. సాధారణంగా సీఎం జగన్ పై రాపాక కి ఒక పాజిటివ్ కార్నర్ ఉంది. ఈ పలకరింపుతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేలా ప్రజల్లో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఇప్పటికే జగన్ నెంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా ముఖ్యమంత్రి జగన్ విశేషంగా కృషి చేస్తున్నారని.. ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా, సుభిక్షంగా ఉన్నారన్నారు.
రాపాక ని జగన్ ఇలా పలకరించారు..
ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా కాపు నేస్తం నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడివారితో మాట్లాడారు. ఈ క్రమంలో జగన్, “రాపాక అన్న బావున్నారా..” అంటూ పలకరించారు. తర్వాత మిగిలిన వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు ఉన్నా.. జగన్ తనను ‘అన్న’ అని పిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాపాక వ్యాఖ్యానించారట. పవన్ ఇప్పటి వరకు తనను అంత ప్రేమతో, ఆప్యాయతతో పిలవలేదని తన అభిమానులు, కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలతో చెప్పి రాపాక భావోద్వేగానికి గురయ్యారట. అంత ప్రేమగా పిలిచే ముఖ్యమంత్రులు కూడా దేశంలో ఉండరని రాపాక చెప్పుకొచ్చారట. అంతేకాదు గతంలో కూడా తనను “ప్రసాద్ అన్న” అని పిలిచారని గుర్తు చేసుకున్నారట.. ఏది ఏమైనా రాపాక “అన్నా..” అనే పిలుపులో మాధుర్యాన్ని అనుభవిస్తున్నారన్న మాట..!