Home Blog Page 8397

నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వ వైఖరి మారదా?

Ramesh Kumar

Ramesh Kumar

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వ వైఖరి చూసిన రాజకీయ విశ్లేషకులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి నిమ్మగడ్డ వైఖరిపై మరోమారు విమర్శల వర్షం కురిపించారు. నిమ్మగడ్డకు కేసులు వేసేందుకు, అధిక పారితోషికం పుచ్చుకునే లాయర్లకు చెల్లించేందుకు రూ. కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులతో ప్రముఖ హోటళ్లలో ములాఖత్ గురించి ప్రస్తావించారు.

Also Read: టిడిపి నుంచి మరో వికెట్ డౌన్..!

హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసిన నిమ్మగడ్డ తనను ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని ప్రభుత్వానికి సూచించాలని కోరుతూ వినతి ప్రతాన్ని సమర్పించారు. అదేవిధంగా ఈ అంశంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయనకు స్వయంగా వివరించారు. దీంతో గవర్నర్ నిమ్మగడ్డ విషయంలో హై కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదు. చెప్పాలంటే టేక్ ఇట్ ఈజీ అంటూ పక్కన పెట్టేసినట్లుగా ఉంది.

నిమ్మగడ్డ హై కోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటీషన్ విచారణలో ఉండగా ఈ అంశంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిన విషయం విధితమే. ఈ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని భావించినా అలా జరగలేదు. శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న అంనతరం నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ పిటీషన్ ను సుప్రీం కోర్టు విచారించినా అది కోర్టు దిక్కార పిటీషన్ పై మాత్రమే ఆదేశాలు ఉంటాయని, హై కోర్టు ఆదేశించినట్లుగా నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలనే తీర్పుపై ఎటువంటి ప్రభావం ఉందని సీనియర్ న్యాయవాదులు అంటున్నారు.

Also Read: మంత్రులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్..!

కేసుల పేరుతో నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించుకుండా తాత్సారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిసుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోపైపు హై కోర్టు ధర్మాసనం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిగిరి నియమించకపోవడాన్ని తీవ్రంగానే పరిగణిస్తుంది. గత శుక్రవారం విచారణలో వారం రోజులు గడువు ఇస్తున్నామని ఇలోగా ఈ విషయాన్ని తేల్చాలని విచారణలో ప్రభుత్వ న్యాయవాదులకు స్పష్టం చేసింది. హై కోర్టు తదుపరి విచారణలో ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.

సూర్య ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌..

Soorarai Pottru

Soorarai Pottru

తమిళ్ హీరో అయినా తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. అతను నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్‌ అవుతున్నాయి. సూర్య మూవీస్‌కు టాలీవుడ్‌లో తెలుగు స్టార్ హీరోలను మించిన మార్కెట్‌ ఉంది. ఈ మధ్య తన మూవీస్‌కు తెలుగులో డబ్బింగ్‌ తానే చెప్పుకుంటున్నాడు సూర్య. ప్రస్తుతం ‘గురు’ ఫేమ్‌ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరరై పోట్రు’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో తెలుగులో కూడా నేరుగా రిలీజ్‌ కానుంది ఈ మూవీ. సూర్య సరసన అపర్ణా బాలుమురళి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్‌, ప్రోమోలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. గురువారం (జులై 23) సూర్య పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ మూవీ నుంచి మరో వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి.. మాటలన్నీ మరిచిపోయా నీళ్లే నమిలేసి..’ అంటూ సాగే రొమాంటింగ్‌ సాంగ్‌లో ఆహ్లాదరకంగా ఉంది. భార్యాభర్తలుగా నటిస్తున్న సూర్య, అపర్ణ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ఈ పాటను భాస్కరబట్ల రాయగా.. యుంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌ కుమార్ మంచి బాణీలు అందించారు.

Also Read: వెబ్‌ బాటలో సుక్కూ.. మరి ‘పుష్ప’ పరిస్థితేంటి?

ఇదొక్కటే కాదు సూర్య ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్‌ కూడా లభించింది. సహజత్వానికి దగ్గర ఉండే కథలతో సినిమాలు చేసే సంచలన దర్శకుడు వెట్రిమారన్‌తో సూర్య చేయబోయే కొత్త మూవీకి సంబంధించి ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ కూడా వచ్చింది. ‘అసురన్‌’ తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్‌.. జల్లికట్టు నేపథ్యంలో సూర్యతో ఈ సినిమా తీస్తున్నాడు. అసురన్‌ నిర్మాత కలైపులి థాను ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వాడి వాసల్‌’ అనే టైటిల్‌ను ఖాయం చేశారు. టైటిల్‌తో పాటు మూవీలో సూర్య లుక్‌ను రిలీజ్‌ చేశారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా సూర్య యాంగ్రీ లూక్‌తో కనిపిస్తున్నాడు. ‘వాడి వాసల్‌’ అనే నవల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో సూర్య తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. జల్లికట్టు ఆటలో తన తండ్రిని చంపిన ఎద్దును మచ్చిచేసుకోవడమే నవలలో ప్రధానాంశం.

Also Read: జపాన్ లో నెం.1 హీరో.. మన తెలుగు స్టారే !

టిడిపి నుంచి మరో వికెట్ డౌన్..!

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడనుంది. ఆ పార్టీలో ఉత్తరాంధ్ర నుంచి కీలకంగా ఉన్న నేత ఒకరు వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ నేత ఎవరో కాదు భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయనకు పార్టీ మారడం అనేది పెద్ద విషయమేమీ కాదని గతంలోని పరిణామలను బట్టీ చెప్పొచ్చు. ప్రజారాజ్యంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనంతరం కాంగ్రెస్, టిడిపిలో పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసిన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన ఆయన తరువాతి కాలంలో టిడిపిలో చేరి మంత్రి పదవి సైతం పొందారు.

ప్రస్తుతం టిడిపి కార్యక్రమాల్లో పెద్దగా కనిపించక పోవడానికి, శాసనసభలోను అధికారపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం టిడిపిని వీడి అధికార పార్టీలో చేరుతుండటమేనని తెలుస్తోంది. అయితే గంటా వైసీపీలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డిని ఆశ్రయించకుండా రాయలసీమ ప్రాంత వ్యవహారాలు చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దీనికి తోడు కరోనా వైరస్ బారిన పడిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో పదిహేను రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. దీంతో ఆయన వచ్చేలోగా గంటా వైసీపీ తీర్ధం పుచ్చకునే అవకాశం ఉందని గంటా సన్నిహితులు చెబుతున్నారు.

Also Read: ఆపరేషన్ ‘కుప్పం’ మొదలైందిగా?

వాస్తవానికి గంటా శ్రీనివాసరావు గతంలోనే వైసీపీ చేరతారనే వార్తలు వచ్చాయి. కొన్ని అడ్డంకులు వల్ల ఆయన చేరలేకపోయారు. విశాఖపట్టణంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటా చేరికకు అడ్డుపడుతున్నారనే వాదనలు ఉన్నాయి. గంటా చేరితే జిల్లాలో తన పట్టు తగ్గుతుందని అవంతి భావిస్తుండటంతో విజయసాయిని అడ్డుపెట్టి గంటాను దూరంగా ఉంచుతున్నారు. ఇటీవల విజయసాయి గంటా సైకిళ్ల కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడ్డారని ట్విట్ చేయగా మంత్రి అవంతి గంటా అరెస్టు అవుతారని వ్యాఖ్యానించారు. ఇది గంటా వైసీపీలోకి చేరకుండా ముందస్తుగా అడ్డంకులు సృష్టించేందుకే అంటున్నారు. ఈ ఆరోపణలు చేయడం వల్ల కేసులతో భయపెట్టి గంటాను వైసీపీలో చేర్చుకున్నారనే భావన ప్రజల్లోకి వెళుతుందని.. తద్వారా పార్టీ అధినేత జగన్ వెనక్కి తగ్గుతారని వ్యూహాత్మకంగా ఇలా చేశారని సమాచారం.

Also Read: మంత్రులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్..!

గంటా వ్యవహారంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్ తో సంప్రదించి పార్టీలో చేరేందుకు లయన్ క్లియర్ చేసినట్లుగా తెలిసింది. గంటా వ్యవహారం మొత్తం ఆయన చూసుకుంటున్నారని గంటా అనుచరులంటున్నారు. దీంతో త్వరలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టిడిపిని వీడి అధికార పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. టిడిపికి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. చట్ట పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వీరంతా వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరామ్ లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో గంటా శ్రీనివాసరావు పేరు కూడా చేరనుందనేది స్పష్టంగా తెలుస్తోంది.

వెబ్‌ బాటలో సుక్కూ.. మరి ‘పుష్ప’ పరిస్థితేంటి?

Sukumar

Sukumar

‘అలవైకుంఠపురములో’ మూవీతో ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్‌ స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ కాకుండా అద్భుత కథనంతో అన్ని రకాల ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్. ఈ ముఖ్యంగా తమన్‌ అందించిన మ్యూజిక్‌ ఈ మూవీకి బాగా ప్లస్‌ అయింది. చిత్రంలో ప్రతీ పాట సూపర్ హిట్‌ అయింది. ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసిన తర్వాత తన క్లోజ్‌ ఫ్రెండ్‌, సెన్సిబుల్‌ డైరెక్టర్ సుకుమార్తో ‘పుష్ప’ అనే మూవీకి కమిటయ్యాడు. పాన్‌ ఇండియా మూవీగా ఐదు భాషల్లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను బన్నీ బర్త్‌డే సందర్బంగా రివీల్‌ చేశారు. గంధం చెక్కల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే మూవీలో బన్నీ.. రఫ్‌ లుక్‌లో వైవిధ్యంగా కనిపించాడు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో బన్నీ ‘పుష్పరాజ్‌’ అనే పాత్రలో కనిపించనుండగా.. రష్మిక.. పోలీస్‌ ఆఫీసర్గా నటిస్తోందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్.

Also Read: జపాన్ లో నెం.1 హీరో.. మన తెలుగు స్టారే !

కరోనా ప్రభావం మొదలయ్యే వరకూ కేరళలోని అడవుల్లో షూటింగ్‌ నిర్మహించారు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన తర్వాత చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. చిత్ర బృందం మొత్తం ఇప్పుడు తమ ఇళ్లకే పరిమితమైంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఫారెస్ట్‌ సెట్‌ వేసి షూటింగ్‌ రీస్టార్ట్‌ చేయాలని సుక్కూ భావించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తేలింది. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో షూటింగ్‌ తిరిగి ఎప్పుడు మొదలువుతుందో తెలియడం లేదు. అయితే, ఈ ఖాళీ టైమ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మించాలని ‘పుష్ప’ మూవీ మేకర్స్‌ భావిస్తున్నారట. మరోవైపు సుకుమార్ కూడా ఓ వెబ్‌ సిరీస్‌ డైరెక్షన్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు అది నిజమే అని తెలుస్తోంది. అదే జరిగితే మరి ‘పుష్ప’ పరిస్థితి ఏంటి? అని ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. అయితే లెక్కల మాస్టారు అయిన సుక్కూ దగ్గర ప్రతి విషయానికీ ఓ స్పష్టమైన లెక్క ఉంటుంది. ‘పుష్ప’ విషయంలో కూడా అతను పక్కా క్యాలిక్యులేషన్ ప్రకారమే వెళ్తున్నాడని.. కేవలం లాక్‌డౌన్‌ ఖాళీ టైమ్‌లో మాత్రమే వెబ్‌ సిరీస్‌కు పని చేస్తాడని, అంతేకాని పుష్పను వదిలిపెట్టే ప్రసక్తే లేదని టాలీవుడ్‌ వర్గాలు అందున్నాయి.

Also Read: ‘రైడ్‌’కు రెడీ అవుతున్న నాగార్జున!

జపాన్ లో నెం.1 హీరో.. మన తెలుగు స్టారే !

Craze for Prabhas in Japan

Craze for Prabhas in Japan
బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడని ఇన్నాళ్లు ఫిల్మ్ గ్రూప్స్ తరుచూ ప్రోజెట్ చేస్తూ వచ్చాయి. కానీ ప్రభాస్ అందరూ అనుకున్నట్లు పాన్ ఇండియా స్టార్ కాదు, యూనివర్సల్ స్టార్. అవును ప్రభాస్ రేంజ్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పాకిపోయింది. ఒక తెలుగు హీరోకి జపాన్ మరియు రష్యా లాంటి దేశాల్లో కూడా ఫ్యాన్స్ క్రియేట్ అవుతారని బహుశా ఎవ్వరూ ఉహించి ఉండరు. ప్రత్యేకంగా జపాన్ లో ప్రభాస్ అంటే.. ఓ స్టార్ హీరో. ఎప్పుడో రజినీకాంత్ గురించి ఇలా చెప్పుకుంటుంటాం.. కానీ ప్రభాస్, రజినిని కూడా మించిపోయాడు. జపాన్ విధుల్లోని దుకాణాలలో ప్రభాస్ ఫొటోలతో తయారుచేసిన టాయ్స్ ను అమ్ముతున్నారంటే.. అక్కడ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ఇక ప్రత్యేక కథనాలు ఆక్కర్లేదు. ప్రభాస్ గ్లోబల్ స్టార్ అని తీర్మాణం చేసేయచ్చు. పైగా ఇప్పుడు ప్రభాస్ సాహో క్రియేట్ చేసిన రికార్డ్స్ కూడా అందుకు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Also Read: నయనతార- ప్రభుదేవా సహజీవనంపై ప్రశ్నించలేదేం..

తాజాగా సాహో జపనీస్ వర్షన్ అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా నిలవడం టాలీవుడ్ కే గర్వకారణం. ఇంతకుముందు వరకూ ఈ రికార్డ్ అమీర్ ఖాన్ దంగల్ పేరు మీద ఉండేది. కానీ సాహో దానిని అధిగమించి.. జపాన్ ప్రేక్షకులకు ప్రభాస్ ను మరింతగా దగ్గరచేసింది. ఇప్పుడు ప్రభాస్ కి యూనివర్సల్ వైడ్ గా మార్కెట్ క్రియేట్ అయింది. పైగా జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఐదు ఇండియన్ సినిమాలలో ప్రభాస్ సినిమాలు రెండు ఉండటం నిజంగా గొప్పే. టాప్ ఐదు సినిమాలు చూసుకుంటే… సాహో, దంగల్, ఇంగ్లీష్ వింగ్లీష్, 3 ఇడియట్స్, ముత్తు మరియు బాహుబలి 2 సినిమాలు ఉన్నాయి. ఏమైనా టాప్ ఫైవ్ లో ఇంకా రజిని ముత్తు సినిమా నిలవడం విషయమే. కానీ జపాన్ లో ప్రస్తుతం నెం.1 ఇండియన్ హీరో మాత్రం ప్రభాసే.

Also Read: ‘రైడ్‌’కు రెడీ అవుతున్న నాగార్జున!

ప్రస్తుతం ప్రభాస్, ‘జిల్’ చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ దర్సకత్వంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో.. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ఓ భారీ సినిమాని కూడా చేయబోతున్నాడు. ఇక వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకున్నే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తోంది.

నయనతార- ప్రభుదేవా సహజీవనంపై ప్రశ్నించలేదేం..

Vanitha Vijayakumar

Vanitha Vijayakumar marriage issue
ప్రముఖ నటుడు విజయ్‌ కుమార్ కుమార్తె పెద్ద కూతురు.. నటి వనితా విజయ్‌ కుమార్ ఈ మధ్య తరచూ వార్తల్లో నానుతోంది. ఇటీవలే ఆమె మూడో పెళ్లి చేసుకుంది. ప్రేమించిన పీటర్ పాల్‌ను తన పిల్లల సమక్షంలోనే పెళ్లాడింది. దాంతో, ఆమెపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏజ్‌లో మూడో పెళ్లి ఏంటి? అంటూ లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరి వంటి సినీ ప్రముఖులు కూడా వనితపై దుమ్మెత్తిపోశారు. సోషల్‌ మీడియాలో తనపై ఘాటు వ్యాఖ్యలు, ట్రోలింగ్‌ ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. అదే సమయంలో సోషల్‌ మీడియా వేదికగా విమర్శకులకు గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది వనిత.

అంతవరకు బాగానే ఉన్నా తన పెళ్లి వ్యవహారంలోకి నయనతారను కూడా లాగిందామె. సౌత్‌లో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న నయన్‌ వ్యక్తిగత జీవితంపై అనవసర కామెంట్లు చేసి మరిన్ని చిక్కులు కొనితెచ్చుకుంది.

Also Read:బాలీవుడా అండర్ వరల్డా?

తన మూడో పెళ్లి గురించి ప్రశ్నించే వారికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా- నయన్‌లా ప్రేమ వ్యవహారాన్ని ఎత్తి చూపిందామె. ప్రభుదేవా కూడా గతంలో తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నయన తారతో సహజీవనం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ కారణంగా ప్రభుదేవా భార్య రమాలత, ముగ్గురు పిల్లలు ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పింది. కానీ, అప్పట్లో ఈ విషయంపై ఒక్క మాట మాట్లాడని వారు, తన మూడో పెళ్లి గురించి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వనితా చెప్పినదానిలో లాజిక్‌ ఉన్నా… అనవసర టైమ్‌లో, అనవసర విషయంలోకి నయన్‌ను లాగి తేనెతుట్టిని కుదిపిందామె. అంతే.. నయన్‌ ఫ్యాన్స్‌ అంతెత్తున లేశారు. మీ వ్యక్తిగత విషయంలోకి నయన్‌ను ఎందుకు తీసుకొస్తారని వనితపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమెపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌ చేస్తున్నారు. కొంత వరకూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసిన వనిత.. నయన్‌ ఫ్యాన్స్‌ ధాటిని తట్టుకోలేకపోయింది. చివరకు నయన్‌- ప్రభుదేవ గురించి చేసిన ట్వీట్లను డిలీట్‌ చేసింది. అయినా.. వాళ్ల ఫ్యాన్స్‌ శాంతిచలేదు. చివరకు తన ట్విట్టర్ఖాతానే డీయాక్టివేట్‌ చేసింది వనిత.

Also Read: హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో కాజల్‌!

మీ కృషికి చేతులెత్తి నమస్కరిస్తున్నా: చిరంజీవి

World Telugu Cultural Festival

World Telugu Cultural Festival
ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా తానా ఆధ్వర్యంలో ఈ మహోత్సవం నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీ నుంచి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ భారీ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో ఇప్పటికే 12వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 300 జూమ్‌ యాప్‌ సెంటర్ల ద్వారా ఈ లైవ్‌ ఈవెంట్‌ను నిర్విహిస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కరోనా టైమ్‌లో కూడా ఆగకుండా కృషి చేస్తోంది తానా.

Also Read: ‘రైడ్‌’కు రెడీ అవుతున్న నాగార్జున!

ఈ మహోత్సవం విజయవంతం కావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రవాస తెలుగువారు చేస్తున్న కృషిని ఆయన కొనియాడుతూ చిరు ఓ వీడియో సందేశం ఇచ్చారు. ‘ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన, బలపడిన తెలుగువారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా మీరందరూ ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ తెలుగు భాష, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ఔన్నిత్యం పట్ల మీకున్న చెక్కుచెదరని అభిమానానికి నా అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికులు మాట్లాడే భాషల్లో 15వ స్థానంలో… మన భారత దేశంలో హిందీ, బెంగాలీ తర్వాత మూడో స్థానంలో.. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమెరికాలో హిందీ, గుజరాతీ తర్వాత మూడో స్థానంలో ఉంది మన తెలుగు. అలాంటి తెలుగు భాష, తెలుగు సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణ కోసం తానా ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల్లోని తెలుగు సంస్థలు ఒకే తాటిపైకి తెచ్చి జూలై 24 నుంచి 26వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరం.

Also Read: హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో కాజల్‌!

కొందరు తెలుగు భాషా ప్రేమికుల పోరాట ఫలితంగా ప్రాచీన హోదాను సాధించినటువంటి తెలుగు భాషయొక్క సాధికరికతను, విశిష్ఠతను కొనసాగించాలంటే ఇలాంటి భాషా సాంస్కృతిక సమ్మేళనాలు చాలా అవసరం. స్వదేశంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని… ప్రపంచ దేశాలలో ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రశంసలు అందుకున్న భాష సౌందర్యానికి ప్రణమిల్లుతూ ఈ కరోనా కష్ట కాలంలో కూడా తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయ విలువలను ముందు తరాల వారికి అందించేందుకు చేస్తున్న మీ కృషికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ మూడు రోజుల కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆశిస్తున్నా’ అని చిరంజీవి ఆకాంక్షించారు.

https://twitter.com/MegaPowerSena/status/1286193680701771776

 

కాంగ్రెస్ కు షాకిచ్చిన పెద్దాయన..!

HD Devegowda

HD Devegowda

మాజీ ప్రధాని దేవగౌడ వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇటీవల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ ప్రకటించారు. ఇందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధం కావాలని సూచించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దేవగౌడతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు విషయంలో మద్దతు ఇచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జెడీఎస్-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించారు. అయితే తాజాగా ఆయన కాంగ్రెస్ కు షాకిచ్చేలా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఆపరేషన్ ‘కుప్పం’ మొదలైందిగా?

కర్ణాటక రాజకీయాల్లో జేడీఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కన్పిస్తుంది. కర్ణాటకలో ఎప్పుడు హంగ్ వచ్చిన జేడీఎస్ పార్టీదే హవా నడుస్తుంది. ప్రతీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేసి కింగ్ మేకర్ గా మారడం జేడీఎస్ ప్రత్యేకత. హంగ్ ఏర్పడిన ప్రతీసారి దేవగౌడ తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలను రచిస్తూ ముందుకెళుతుంటారు. కిందటి ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కంటే అతితక్కువ సీట్లు దక్కించుకున్న జేడీఎస్ పార్టీ ముఖ్యమంత్రి సీటు దక్కించుకుంది. దేవగౌడ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని తన కుమారుడు కుమారస్వామిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అయితే కాంగ్రెస్ అనైక్యత, బీజేపీ వ్యూహంతో కొద్దిరోజుల్లోనే కుమారస్వామి ప్రభుత్వం పడిపోయింది.

ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు కుదుర్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం దేవెగౌడ కుటుంబంపై పడింది. కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల్లో సహకరించక పోవడంతో దేవగౌడతోపాటు ఆయన మనవడు నిఖిల్ గౌడ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పొత్తు కారణంగా సొంత పార్టీ క్యాడర్ కూడా హ్యాండిచ్చిందని దేవగౌడ లెక్కలు వేసుకున్నారు. అనంతరం కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదంటూ స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు.

Also Read: మంత్రులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్..!

అయితే ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో దేవెగౌడకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో మళ్లీ కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం కార్యకర్తలకు అలాంటిదేమీ లేదనే సంకేతాలను పంపుతున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వల్లే జేడీఎస్ భారీగా నష్టపోయిందని గుర్తు చేసుకుంటున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తేల్చి చెబుతున్నారట. ఈమేరకు పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇస్తున్నారట. వచ్చే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు పెద్దాయన షాకివ్వడంతో ఆపార్టీ ఏం చేస్తుందనే ఆసక్తికరంగా మారింది.

‘రైడ్‌’కు రెడీ అవుతున్న నాగార్జున!

IT Raid remake

IT Raid remake

వయసు మీద పడుతున్నా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున జోరు తగ్గడం లేదు. కుర్రాళ్లతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఎప్పట్లాగే కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ వెరైటీ కథలతో ముందుకెళ్తున్నాడు. రీసెంట్‌గా తన పంథా మార్చుకున్నాడు నాగ్. రెగ్యులర్ స్టోరీస్‌కు భిన్నంగా వైవిధ్యం ఉన్న సినిమాలకే మొగ్గు చూపుతున్నాడు. రాజుగారి గది 2, ఆఫీసర్, దేవదాస్‌ ఆ కోవకు చెందినవే. రీసెంట్‌గా మన్మధుడు 2తో బోల్డ్‌ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అది మరీ బోల్డ్‌గా ఉండడంతో ఆడియన్స్‌ మెప్పు పొందలేకపోయింది. ఇప్పుడు కరణ్‌ జోహార్ ప్రొడ్యూస్‌ చేస్తున్న హిందీ యాక్షన్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ‘బ్రహ్మాస్త్ర’లో అమితాబ్‌ బబ్చన్‌, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి నాగ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే, తెలుగులో ‘వైల్డ్‌ డాగ్‌’ అనే మూవీ చేస్తున్నాడు. సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్‌ కింగ్‌… ఎన్‌ఐఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేయాల్సివుంది. దీని తర్వాత ఓ వెరైటీ మూవీలో నటించాలని నాగ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. తాను మనసుపడ్డ హిందీ మూవీ ‘రైడ్‌’ను తెలుగులో రీమేక్‌ చేయాలని అనుకుంటున్నాడు.

Also Read: హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో కాజల్‌!

అజయ్‌ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన రైడ్‌ 2018లో రిలీజై సూపర్ హిట్‌ అయింది. 1980ల్లో ఇండియాలో జరిగిన ఐటీ రైడ్స్‌ ఆధారంగా 45 కోట్లతో తీసిన ఈ మూవీ ఏకంగా 150 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ మూవీ తెలుగు రీమేక్‌లో అజయ్‌ దేవగణ్‌ పాత్రను చేయాలని నాగ్‌ భావిస్తున్నాడు. ఈ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీర్చిదిద్ది తెరకెక్కించే దర్శకుడి కోసం వెతుకుతున్నాడు నాగ్. లాక్‌డౌన్‌ టైమ్‌లో వచ్చిన బ్రేక్‌ లో ఈ మూవీని పట్టాలెక్కించేందుకు బ్యాగ్రౌండ్‌ వర్క్‌ చేశాడట‌. అలాగే, సీనియర్ దర్శకులు కాకుండా ఓ యంగ్ డైరెక్టర్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్‌లో ఈ మధ్య యువ దర్శకుల హవా నడుస్తోంది. చాలా మంది కొత్త డైరెక్టర్స్‌ తమ టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకున్నారు. మరి, నాగ్‌ను డైరెక్ట్‌ చేసే చాన్స్‌ వారిలో ఎవరికి దక్కుతుందో చూడాలి.

హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో కాజల్‌!

Kajal Agarwal Web series

Kajal Agarwal Web series
ఇండియాలో ఈ మధ్య వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. రెగ్యులర్ సినిమాలను తలదన్నే రీతిలో పలు భాషల్లో సిరీస్‌లు వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది స్టార్లు వెబ్‌కు జై కొట్టారు. సైఫ్ అలీఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ డిజిటల్‌ స్పేస్‌లో సక్సెస్‌ సాధించారు. అమెజాన్‌లో ఓ ఊపు ఊపిన ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో మనోజ్‌ బాజ్‌పాయ్‌ అయితే విపరీతమైన క్రేజ్‌ సంపాదించాడు. కియారా ఆడ్వాణీ, రిచా చద్దా వంటి హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌లతోనే దర్శకుల దృష్టిలో పడ్డారు. బాలీవుడ్‌ బాటలోనే రీసెంట్‌గా సౌత్‌ స్టార్లు కూడా వెబ్‌ బాట పడుతున్నారు. సౌత్‌ స్టార్ హీరోయిన్‌ సమంత అక్కినేని.. ఫ్యామిలీ మ్యాన్‌ సెకండ్‌ పార్ట్‌లో నటించింది. అందులో ఆమె ఏకంగా టెర్రిరస్ట్‌ పాత్ర చేసినట్టు సమాచారం. దిగ్గజ దర్శకుడు మణిరత్నం ప్లాన్‌ చేసిన ‘నవరస’ అనే వెబ్‌ సిరీస్‌లో సూర్య, అరవింద్‌ స్వామి, సిద్దార్థ్‌ వంటి స్టార్లు నటించబోతున్నారు.

Also Read: బాలీవుడా అండర్ వరల్డా?

ఇప్పుడు స్టార్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కూడా డిజిటల్‌ రంగంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిందట. ఇప్పటికే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘లైవ్‌ టెలీకాస్ట్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో కాజల్‌ నటిస్తోందని సమాచారం. ఇప్పుడు మరో పాపులర్ వెబ్‌ షోలో నటించేందుకు ఆమె పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. అది ఓ హాలీవుడ్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌కు రీమేక్‌ అని సమాచారం. ఆ సిరీస్‌ మరేదో కాదు. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌లో అడుగు పెట్టిన ప్రియాంక చోప్రా చేసిన సిరీస్‌. ఆమె కీలక పాత్ర పోషించిన ‘క్వాంటికో’ అనే ఇంగ్లిష్‌ సిరీస్‌ మంచి సక్సెస్‌ సాధించింది. దాన్ని హిందీలో రీమేక్‌ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మేకర్స్‌ కాజల్‌ అగర్వాల్‌ను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ప్రొడ్యూస్‌ చేస్తుందని సమాచారం.

మంత్రులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్..!

MLA Roja

MLA Roja

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా సొంతపార్టీ నేతలకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటలుపేల్చే రోజా ఇప్పుడు వైసీపీ నేతలకే వార్నింగ్ ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. 2019లో నగరిలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు జగన్ క్యాబినెట్లో మంత్రి పదవీ ఖాయమని ప్రచారం జరిగింది. అయితే క్యాస్ట్ ఈక్వేషన్లలో భాగంగా రోజాకు మంత్రి పదవీ దూరమైంది. దీంతో సీఎం జగన్ పై రోజా అలక చెందడంతో ఆమెకు క్యాబినెట్ హోదా కలిగిన ఏపీఐఐసీ పదవీని కట్టబెట్టారు.

Also Read: పోయేకాలం వచ్చిదంటే ఇదే కాబోలు..!

దీంతో రోజా తనకు కేటాయించిన పదవీ కొనసాగుతూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారు. సీఎం జగన్ సపోర్టు ఆమె పూర్తిగా ఉండటంతో నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో ఆమె ఉనికిని చాటుకుంటున్నారు. అయితే ఇద్దరు మంత్రులు నగరిలో కొద్దిరోజులుగా తనకు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు తనదైన శైలిలో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు.

Also Read: రాయలసీమపై జగన్ ప్రేమకు మరో తార్కాణం!

తనకు సమాచారం లేకుండా మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నగరిలో పర్యటిస్తుండటంపై రోజా ఫైరవుతున్నారు. తనకు తెలియకుండా మంత్రులు నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులైనా సరే తన నియోజకవర్గంలో వేలుపెడితే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. ముఖ్యంగా మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. రోజా వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ మంత్రులను పిలిచి మాట్లాతారా? లేదా రోజాకే సర్దిచెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

బోగాపురం పరిసరాల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..!

Executive Capital of AP

Executive Capital of AP
మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలను వేగవంతం చేసింది. విశాఖ నగరంలో భూముల లభ్యత సమస్య ఉండటంతో విశాఖ-విజయనగరం జిల్లాల మధ్య ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించేందుకు జనగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తుంది. చట్టపరంగా ఉన్న అడ్డంకులు ఎట్టిపరిస్థితిలో తొలగిపోతాయని గట్టినమ్మకంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. బోగాపురం విమానాశ్రయం కోసం టిడిపి ప్రభుత్వం జిఎంఆర్ సంస్థకు 2,700 ఎకరాలను కేటాయించింది. ఈ భూముల్లో 500 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుని మిగిలిన భూముల్లో విమానాశ్రయం నిర్మాణానికి జిఎంఆర్ కు అనుమతి ఇచ్చింది.

Also Read: రాయలసీమపై జగన్ ప్రేమకు మరో తార్కాణం!

విమానాశ్రయం భూముల నుంచి తీసుకున్న 500 ఎకరాల భూమిలో రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే రహదారి సౌకర్యం కోసం పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి ప్రణాళికలు రూపకల్పన, అమలు బాధ్యతను గుజరాత్ కు చెందిన హెచ్.సీ.పీ సంస్థకు అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం అంతా సాగుతుంది. హెచ్.సీ.పీ డైరెక్టర్ బిమల్ పటేల్ తో కలిసి ప్రవీణ్ ప్రకాష్ పలుమార్లు ఎంపిక చేసిన భూముల్లో పర్యటించి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా అక్కడి భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టనున్నారు.

అమరావతిలో రైతుల నుంచి అంత పెద్దమొత్తంలో భూములను రాజధాని కోసం సమీకరించడాన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తప్పబట్టారు. రాజధానికి 1,000 నుంచి 1,500 ఎకరాలు సరిపోతుందని అసెంబ్లీలో చర్చ సందర్భంగా వాఖ్యానించారు. ప్రస్తుతం భోగాపురం సమీపంలో ఏర్పాటు చేసే కార్యనిర్వాహక రాజధానిని 1,000 నుంచి 1,500 ఎకరాల్లోనే ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సద్ధం చేసినట్లు తెలుస్తోంది. భోగాపురం విమానాశ్రయ భూములు 500 ఎకరాలు వెనక్కి తీసుకోగా మిగిలిన భూములు రైతుల నుంచి, సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను వినియోగించుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారు.

Also Read: జగన్ మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమా?

రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో మౌలిక సదుపాయాల పనులను విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ చేపట్టింది. భోగాపురంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్టు చుట్టు ఉన్న 350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజధానిని దృష్టిలో ఉంచుకునే, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టారు. మరోవైపు 140 కిలో మీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టు అక్కడ ఏర్పాటు చేయడానికి కారణం రాజధానిని దృష్టిలో ఉంచుకునే అనేది స్సష్టం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ దూకుడు చూస్తుంటే చట్టపరంగా సమస్యలు తొలగేలోపే రాజధానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా ఉంది.

 

ఆపరేషన్ ‘కుప్పం’ మొదలైందిగా?

Operation Kuppam

Operation Kuppam

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు తిప్పలు తప్పడంలేదు. కిందటి ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఢీలాపడిపోయారు. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నడూ ఎరగని దారుణ పరాభవాన్ని చవిచూసింది. టీడీపీకి కేవలం 23సీట్లురాగా ఇప్పటికే కొందరు సీఎం జగన్ కు జై కొడుతున్నారు. దీంతో ఏపీలో చంద్రబాబునాయుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దూరమవుతుందనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది.

Also Read: బోగాపురం పరిసరాల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..!

ఇప్పటికైతే చంద్రబాబు నాయుడి ప్రతిపక్ష హోదాకు ఢోకాలేకపోయినప్పటికీ మున్ముందు కష్టమేననే మాటలు విన్పిస్తున్నాయి. జగన్మోహన్ సీఎం అయ్యినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ జనాల్లోకి దూసుకెళుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 14నెలల తర్వాత చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పంపై సీఎం జగన్ దృష్టిసారించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఏడుసార్లు గెలిచారు. 1989నుంచి 2019వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో చంద్రబాబుదే విజయం. వైసీపీ అధికారంలోకి రావడంతో కుప్పంపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

2024 ఎన్నికల్లో టార్గెట్ సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. దీనిలో భాగంగానే కుప్పంలో చంద్రబాబుకు సీటుకు ఎసరు పెట్టేందుకు జగన్ స్కెచ్ వేస్తున్నారు. కుప్పంలో ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. గత ఎన్నికల్లో చంద్రబాబుపై వైఎస్సార్సీపీ తరుపున రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి రంగంలో దిగారు. చంద్రబాబు ఇక్కడ ఘనవిజయం సాధించినప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం చంద్రమౌళి కుమారుడు భరత్ కుప్పంలో యాక్టివ్ గా పని చేస్తూ టీడీపీకి చెందిన కిందిస్థాయి నేతలను ఆకర్షిస్తున్నారు.

Also Read: మంత్రులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్..!

ఇప్పటికే చాలామంది టీడీపీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో ఏడాదిలోగా టీడీపీకి చెందిన ముఖ్యనేతలందరినీ వైసీపీలో చేర్చుకునేలా ఆపరేషన్ కుప్పం మొదలైనట్లు సమాచారం. రాబోయే స్థానిక ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ సత్తాచాటడం ద్వారా చంద్రబాబుకు షాకివ్వాలని జగన్ భావిస్తున్నారు. 2024ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి సీటుకు ఎసరుపెట్టి వైసీపీ పాగా వేసేలా సీఎం జగన్ ముందుకెళుతున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందో లేదో వేచి చూడాల్సిందే..!

రాయలసీమపై జగన్ ప్రేమకు మరో తార్కాణం!

Mega Renewable Energy Park

Mega Renewable Energy Park
రాయలసీమకు జగన్ మరో వరం ఇచ్చారు. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ను ప్రకటించిన జగన్ ఇప్పుడు అదే సీమకు విద్యుత్ వెలుగులు పంచడానికి రెడీ అయ్యారు. సీమలో ఉపాధి, పరిశ్రమలను తెచ్చేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వెనుకబడిన కరువు జిల్లాల కరువు తీర్చేలా జగన్ వేసిన ఈ ప్లాన్ చూసి సీమ బిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం-2020’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి ప్రతిపాదనగా రాయలసీమ జిల్లాల్లో 3-5 గిగావాట్ల (జిడబ్ల్యు) సామర్థ్యం గల అల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్స్ (యుఎంఆర్‌పిపి) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Also Read: బాబు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం

పాలసీ ప్రకారం.. ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించే నోడల్ ఏజెన్సీగా ఉండే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఆర్‌ఇడిఎసిపి), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇసిఐ) లిమిటెడ్, ఎన్‌టిపిసి లిమిటెడ్ ఇప్పటికే ఓకే చెప్పారు. ఈ పునరుత్పాతక విద్యుత్ ప్లాంట్లను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండటానికి ఈ సంస్థలన్నీ ఆసక్తి చూపుతున్నాయి..

“పునరుత్పాదక అభివృద్ధి పథకంలో భాగంగా కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) గుర్తించిన రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో అల్ట్రా మెగా పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. ఈ విద్యుత్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన అనంతపూర్, కర్నూలు, కడప జిల్లాల్లో 3-5 గిగా వాట్స్ సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఎన్ఆర్ఈడీసీఏపీ వైస్ చైర్మన్.. మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రమణారెడ్డి వివరించారు.

ఈ పథకం కింద.. ఎంఎన్‌ఆర్‌ఇ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (సిఎఫ్‌ఎఏ) మెగావాట్ కు 20 లక్షలు లేదా అంతర్గత విద్యుత్ తరలింపు మౌలిక సదుపాయాల అభివృద్ధికి యుఎంఆర్‌ఇపిపిల అభివృద్ధి ఖర్చులో 30 శాతం భరిస్తుంది.

Also Read: జగన్ వ్యూహం.. టీడీపీ అధినేతకు షాక్

ఈ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. లీజు అద్దెలు మరియు గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఛార్జీలు, పన్ను ఆదాయాలు.. గ్రామాల్లో స్థానిక ఉపాధి వైపు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి సహాయపడతాయని జగన్ ప్రభుత్వం ఆశిస్తోంది.

ఏ ప్రాంతంలోనైనా పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని ఆయా రాష్ట్రాలకే కేటాయించడం ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ ప్రాతిపదికన జరుగుతుందని రమణ గుర్తించారు.తద్వారా ఏపీలో విద్యుత్ లోటు కూడా తొలగిపోయి నిరంతర విద్యుత్ ఏపీ పొందడానికి కూడా వీలు కలుగుతుంది. ఇలా రాయలసీమకు ఉద్యోగ, ఉపాధియే కాదు.. ఏకంగా విద్యుత్ కూడా ఏపీకి అందుబాటులోకి వచ్చేలా సీఎం జగన్ ప్లాన్ చేశారు.

-నరేశ్ ఎన్నం

బాబు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం.

Chandrababu

Chandrababu
నాన్నకు ప్రేమతో సినిమాలో జగపతి బాబు చెప్పిన ఫేమస్ డైలాగ్.. ‘ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడకుందాం..’ ప్రస్తుతం చంద్రబాబు మాటలు విన్న వైసీపీ నేతల మసులో డైలాగ్ కూడా బహుశా ఇదే కావచ్చు. దానికి కారణం ఏపీ ప్రతి పక్ష నేత చంద్రబాబు నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని పొగడ్తలతో ముంచెత్తారు. కోర్ట్ తీర్పును గౌరవిస్తూ నిమ్మగడ్డ రమేష్ చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఆ విధంగా రాజ్యాంగ గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని గవర్నర్ కాపాడాడని కొనియాడారు. కాగా గవర్నర్ పై బాబుకు ఇదే అభిప్రాయం ఎల్లకాలం, అన్ని సంధర్భాలలో ఉంటుందా అనేది ఇక్కడ అసలు ప్రశ్న.

Also Read: జగన్ మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమా?

నిమ్మగడ్డ వ్యవహారం కేవలం ఒక వ్యక్తికి మరియు రాజ్యాంగంబద్ద పదవికి సంబందించిన వ్యవహారం మాత్రమే. ఆయన పదవీ కాలం ముగియగానే పక్కకు తొలగాల్సిందే. కానీ అంతకంటే కీలకమైన రెండు బిల్లులు, టీడీపీ ప్రాణపదమైన అంశాలు గవర్నర్ పరిధిలో ఉన్నాయి. మూడు రాజధానుల అంశంతో పాటు, సి ఆర్ డి ఏ చట్టం రద్దు బిల్లులను వైసీపీ ప్రభుత్వం శాసన సభలో ఆమోదించి, మండలికి పంపడం జరిగింది. శాసన మండలి చైర్మన్ టీడీపీ నేత కావడంతో పాటు, అక్కడ ఆ పార్టీకి బలం ఉన్న కారణంగా బిల్లులను ఆమోదించకుండా…వాయిదా వేశారు. కాల పరిమితి ముగియడంతో, పరోక్షంగా మండలి అనుమతించినట్లే భావించి, గవర్నర్ ఆమోదానికి పంపడం జరిగింది. ఐతే గవర్నర్ ఈ బిల్లులపై న్యాయ సలహా అడిగారు. టీడీపీ మరియు బీజేపీ పార్టీలు గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించ కూడదని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఒక వేళ ఈ రెండు బిల్లులకు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో బాబు ఇన్నాళ్ల ప్రయత్నం వృధా అయినట్లే. వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా బిల్లులను ఆమోదించినందుకు గవర్నర్ పై ఆయన ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉండడం ఖాయం. రాజ్యాగం బద్ద పదవిలో ఉండి వైసీపీ చేతిలో కీలు బొమ్మగా మారారని ఆరోపణలు చేసే అవకాశం కలదు. కాబట్టి నేడు పొగిడిన బాబు… రేపు ఆయన ఆ రెండు బిల్లులకు ఆమోదం తెలిపితే గవర్నర్ పై ఆయన వెర్షన్.. చాలా హార్ష్ గా ఉండనుంది. గతంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఉన్న ఈ ఎస్ ఎల్ నరసింహన్ పై బాబు ఏ స్థాయిలో ఆరోపణలు చేశారో ఇంకా ఎవరూ మరచిపోలేదు. పాదయాత్ర సమయంలో జగన్ పై జరిగిన దాడి గురించి నరసింహన్ డీజీపీ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగా…ఆయన ఏ అధికారంతో నేరుగా డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడుగుతారు అని ప్రశ్నించారు.మోడీతో విభేదించాక గవర్నర్ బీజేపీ కోసం పనిచేస్తున్నారంటూ..బాబు మరియు ఆయన బ్యాచ్ ఎన్ని విమర్శలు చేశారో తెలిసిందే.

Also Read: జగన్ వ్యూహం.. టీడీపీ అధినేతకు షాక్

బాలీవుడా అండర్ వరల్డా?

సుశాంత్ సింగ్ రాజ్ పుట్ మరణంతో బాలీవుడ్ మరొక్కసారి తెరపైకి వచ్చింది. కంగనా రౌత్ రిపబ్లిక్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ బాలీవుడ్ ని ఒక కుదుపు కుదిపింది. చివరకు భారత ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాల్సి వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీలు పాకిస్తాన్ గూడచారి సంస్థ  ఐఎస్ ఐ తో , అలాగే కాశ్మీర్ ప్రత్యెక వాదులు, మిలిటెంట్ల తో సంబంధాలు వున్న వాళ్ళతో దూరంగా వుండాలని హెచ్చరించింది. ఇది చాలా తీవ్రమైన విషయం. మొదట్నుంచీ బాలీవుడ్ తో మాఫియా ముఠాల సంబంధాలు తెలిసిన విషయమే. ఇది ఈ రోజుది కాదు. పేరుమోసిన దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళ దగ్గరనుంచి చిన్న చిన్న చోట మోటా ముఠాల వరకు బాలీవుడ్ పరిశ్రమ తో సంబంధాలు వున్నాయి. అయినా ప్రభుత్వం ఏమీ చేయలేక పోతుంది. ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకున్నా వెంటనే అది పెను దుమారం గా మారుతుందని అందరూ భయపడి దాని జోలికి వెళ్ళటం లేదు. మొట్టమొదటసారి మోడీ ప్రభుత్వం శివ సేన ఎంపి రాసిన లేఖపై స్పందిస్తూ ఈ దేశ వ్యతిరేక శక్తులతో సెలబ్రిటీలు దూరంగా వుండాలని చెప్పింది. ఇదేమీ చిన్న విషయం కాదు.

ఉదాహరణకు షా రుఖ్ ఖాన్ కి టోనీ ఆషే తో వ్యాపార లావాదేవీలు వున్నాయి. దుబాయ్ లో వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పెట్టుబడులు వున్న సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ కాశ్మీర్ లో భారత సైన్యం పై ఎన్నో ఆరోపణలు చేయటమే కాకుండా హింసను కూడా ప్రోత్సహించాడు. ఇతను బ్రిటిష్ పౌర సత్వం వున్న పాకిస్తానీ. ఎప్పుడూ పాకిస్తాన్ అనుకూల వైఖరినే ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాగే ఇంకో వ్యక్తి ఐ ఎస్ ఐ తో సంబంధాలు వుండి కూడా బాలీవుడ్ లో ప్రముఖలతో సంబంధాలు నేరపుతున్నాడు. అనిల్ కపూర్ తో వ్యాపార భాగస్వామి గా వున్నాడు. అలాగే కరణ్ జోహార్ తో కూడా ఇంకో వ్యక్తి ఇటువంటి సంబంధాలే వున్నాయి. ఇంతకుముందు సంజయ్ దత్ వ్యవహారం మనందరికీ తెలిసిందే. ఇవన్నీ తెలిసికూడా చూసి చూడనట్లు వుండటం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే .

ఇందులో సంబంధాలు నెరుపుతున్న సెలబ్రిటీలు అందరికీ దేశ వ్యతిరేక కార్యక్రమాలతో సంబంధాలు వుండి  ఉండక పోవచ్చు. అదే సమయంలో ఎవరికీ లేవని కూడా ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఇది ఇలాగే కొనసాగటం దేశ భద్రతకు ప్రమాదం. ఇప్పటికైనా భారత ప్రభుత్వ హెచ్చరికతో నైనా ఈ సంబంధాలు తెగతెంపులు చేసుకుంటే మంచిది. అలాగే ముందుగా  పాకిస్తాన్ తో, ఐ ఎస్ ఐ తో సంబంధాలు నేరిపే వారు, మన భారత సైన్యం పై అవాకులు చెవాకులు పేలే వాళ్ళతో సంబంధాలు ముఖ్యంగా వ్యాపార సంబంధాలు ఉండటంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా వుంది. లేకపోతే ప్రభుత్వమే వీళ్ళను వివరణ కోరాల్సిన అవసరం వుంది. ఇదేదో మీడియా లో పెద్ద వివాదమవుతుందని వెనకాడితే దేశ భద్రతను ఫణంగా పెట్టినవాల్లవుతారని మరిచిపోవద్దు. బాలీవుడ్ ని ప్రక్షాళన చేయాల్సిన తరుణం ఆసన్నమయింది. ఆ సాహసం మోడీ నే చేయగలడు. ఆ పని మొదలు పెడతాడని ఆశిద్దాం.

వేశ్యగా మారనున్న యాంకర్ అనసూయ !


హాట్ యాంకర్ అనసూయకు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ అండ్ ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఈ ముదురు హాట్ బ్యూటీకి కాస్త కోపం కూడా ఎక్కువే. నెటిజన్లు కాస్త ఆశతోనే అమాయకత్వంతోనే చేసే కామెంట్స్ ను కూడా సీరియస్ గా తీసుకుని వారి పై తన ఆవేశాన్ని చూపిస్తూ ఉంటుంది. సరే… ఏది ఏమైనా ఈ జనరేషన్ కుర్రాళ్ళకు అనసూయ ఒక డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతూ బాగానే అలరిస్తుంది.

Also Read: మహిళా టెర్రరిస్ట్‌గా సమంత!

పైగా ‘రంగస్థలం’ ‘యాత్ర’ లాంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. నటిగా కూడా మంచి డిమాండ్ క్రియేట్ చేసుకుంది. ఆ సినిమాల తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు వచ్చినా ఈ ముదురు బ్యూటీ మాత్రం ఆచితూచి ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని, ప్రత్యేకత మరియు కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని చూజ్ చేసుకుంటూ కెరీర్ ను హీరోయిన్ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటుంది. అయితే కృష్ణవంశీ చేస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా కృష్ణవంశీ నుండి ఆఫర్ రావడం, పైగా కథలో కీలకమైన పాత్ర కావడంతో వెంటనే ఓకే చెప్పేసింది.

అయితే అనసూయది ఓ వేశ్య పాత్ర అట. కాస్త ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్న పాత్ర కావడం, వేశ్య జీవితంలోని బాధలు, అవమానాలు ఎలా ఉంటాయి అనే కోణంలో పాత్ర సాగడంతో అనసూయ ఈ సినిమా పై బాగానే హోప్స్ పెట్టుకుంది. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా అనసూయ నటించాల్సి ఉంటుందని.. ఆ సీన్స్ ను ఇప్పటికే షూట్ చేశారని తెలుస్తోంది. కాస్త హాట్ నెస్ ఎక్కువ ఉన్న ఆ సీన్స్ తోనే సినిమాని మార్కెట్ చేసుకోవటానికి కృష్ణవంశీ ప్లాన్ చేసుకుంటున్నాడట.

Also Read: ప్రభాస్‌ మూవీలో దీపిక పాత్ర రివీల్‌!

కాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలుగా ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ కి సెకెండ్ లీడ్ గా అనసూయ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. మరి కృష్ణవంశీకి ఈ సినిమాతోనైనా దశ మారుతుందేమో చూడాలి.