
‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పంజాబీ బ్యూటీ కాజల్ అగర్వాల్. ఆ సినిమా ఓ మొస్తరుగా ఆడినా.. ‘చందమామ’తో టాలీవుడ్లో సెటిలైపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తెలుగులో టాప్ హీరోయిన్గా ఎదిగింది. తమిళ్, హిందీలో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. కుర్ర హీరోలతో పాటు పెద్ద హీరోల సరసన కూడా సెట్ అవడం ఆమె ప్లస్ పాయింట్. రామ్చరణ్తో పాటు మెగాస్టార్ సరసన హీరోయిన్గా నటించిన రేర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుందామె. ‘ఆచార్య’లో కూడా ఆమెనే హీరోయిన్.
Also Read: కరోనా జయించిన బిగ్బీ కుటుంబం..
అటు కమల్ హాసన్ సరసన కూడా నటిస్తుందామె. తెలుగు, తమిళ్లో ఇప్పటికీ కాజల్ హవా నడుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా.. అందం, అభినయం అంతకంతకూ పెంచుకుంటూ పోతోందామె. ట్రెండ్కు తగ్గట్టు వైవిధ్య చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందించే ‘లైవ్ టెలీకాస్ట్’ అనే వెబ్ సిరీస్కు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని ప్రభు ఇటీవలే ప్రకటించాడు.
ఇది ఓ హారర్ వెబ్ సిరీస్ కావడం మరో విశేషం. వెండితెరపై ఈ హాట్ బ్యూటీ ఈ తరహా జోనర్లో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. అది వెబ్ సిరీస్ కావడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సిరీస్లో కాజల్తో పాటు వైభవ్, ఆనంది ఇతర ముఖ్య పాత్రాలు పోషించనున్నారు. మొత్తం ఏడు ఎపిసోడ్స్గా ఈ సిరీస్ను రూపొందించనున్నారు. ఇది హాట్స్టార్లో ప్రసారం కానుంది. తొందర్లోనే షూటింగ్ మొదలు పెట్టేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘క్వాంటికో’ హిందీ రీమేక్కు కూడా కాజల్ ఒప్పుకుందున్న వార్తలు వస్తున్నాయి. ఇంగ్లిష్లో ప్రియాంక చేసిన బోల్డ్ క్యారెక్టర్ను కాజల్ పోషించనుందని సమాచారం.
Also Read: జోనర్ సరే.. పోస్టర్ కూడా కాపీ కొట్టేస్తావా ప్రశాంత్!
ప్రస్తుతానికి ఆచార్య, ఇండియన్2, మోసగాళ్లు, హే సినామికా మూవీస్తో కాజల్ ఫుల్ బిజీగా ఉంది. అలాగే, రానా హీరోగా నటించిన ‘అరణ్య’లో కాజల్ ఓ కీలక పాత్ర పోషించిట్టు సమాచారం. ఇందులో ఆమె గిరిజన యువతిగా నటించిందట. గిరిజన సంప్రదాయం ప్రకారం ఆమె బ్లౌజ్ లేని శారీలో కనిపిస్తుందని, దాదాపు 30 నిమిషాల నిడివి పాటు ఉంటే కాజల్ పాత్ర మూవీలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. షూటింగ్ పూర్తయి, రిలీజ్ రెడీ ఉన్నప్పటికీ ‘అరణ్య’లో కాజల్ పాత్రను కావాలనే రివీల్ చేయలేదట.




























నూతన విద్యావిధానం ప్రకటించినప్పటి నుంచి బోధనా మాధ్యమం పై గందరగోళం కొనసాగుతూనే వుంది. ముందుగా విద్యావిధానం ప్రకటించిన రోజు అందరూ 5వ తరగతి వరకూ మాతృ భాషలో విద్యాబోధన తప్పనిసరి అని అనుకున్నారు. అదికూడా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు అన్నింటి లో కూడా 5వ తరగతివరకు ఖచ్చితంగా మాతృ భాషలోనే విద్య బోధన జరగాలని కొత్త విద్యావిధానం స్పష్టం చేసిందని అన్ని ప్రచార సాధనాలు, పత్రికలు వెల్లడించాయి. దానితో ఆంధ్రాలో జగన్ కి ఇంకో ఎదురు దెబ్బ తగిలిందని కూడా పత్రికలు, చానళ్ళు వ్యాఖ్యానించాయి. దీనిపై అనుకూలంగా , వ్యతిరేకంగా తెలుగు చానళ్లలో , జాతీయ చానళ్లలో కూడా చర్చలు జరిగాయి. దీనిపై కేంద్రీయ స్కూళ్ళలో ఎలా అమలుచేయాలనేది కూడా వివాదానికి దారి తీసింది. ఇంతలో మరుసటి రోజు స్కూళ్ళ విద్యా కార్యదర్శి పత్రికలో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మాతృ భాషలో విద్య బోధన మార్గదర్శకాలు తప్పితే నిర్బంధం కాదని స్కూళ్ళకు, రాష్ట్రాలకు స్వేచ్చ వుందని ప్రకటించింది.
సోము వీర్రాజు ఆంధ్ర బిజెపికి నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన దగ్గర్నుంచి రాజకీయ పరిణామాలు చక చకా జరుగుతున్నాయి. ముందుగా రాజధానిపై బిజెపిలో వున్న వైరుధ్యాలు తొలగిపోయాయి. సోము వీర్రాజు దీనిపై కేంద్రంతో మాట్లాడి స్పష్టమైన లైన్ తీసుకున్నాడు. ముందుగా పార్టీ లో రక రకాల అభిప్రాయాలు వ్యక్తపరచటానికి చెక్ పెట్టాడు. ఇప్పటికే ఒకరిని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. దానితో అంతర్గత వ్యవహారాల పై గ్రిప్ వచ్చింది. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ లో లాగా బిజెపి లో పప్పులుడకవని కొత్తగా వచ్చినవాళ్ళకు అర్ధమవ్వాలనే ఈ వేటు వేసాడని అనుకుంటున్నారు. వచ్చిన వారంలోనే పరిస్థితులు చక్కబరచటంలో దిట్ట అని నిరూపించుకున్నాడు. మొదట్నుంచీ పార్టీలో పనిచేయటంతో పార్టీలో ఆసుపాసులు క్షుణ్ణంగా తెలియటంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్టి నిర్ణయాల వైపు అడుగులు పడుతున్నాయి.
