Home Blog Page 8380

హాట్‌ బ్యూటీ.. హారర్ వెబ్‌ సిరీస్‌

Kajal Agarwal’s web series

Kajal Agarwal’s web series
‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పంజాబీ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. ఆ సినిమా ఓ మొస్తరుగా ఆడినా.. ‘చందమామ’తో టాలీవుడ్‌లో సెటిలైపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తమిళ్‌, హిందీలో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. కుర్ర హీరోలతో పాటు పెద్ద హీరోల సరసన కూడా సెట్‌ అవడం ఆమె ప్లస్‌ పాయింట్‌. రామ్‌చరణ్‌తో పాటు మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నటించిన రేర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందామె. ‘ఆచార్య’లో కూడా ఆమెనే హీరోయిన్‌.

Also Read: కరోనా జయించిన బిగ్‌బీ కుటుంబం..

అటు కమల్ హాసన్‌ సరసన కూడా నటిస్తుందామె. తెలుగు, తమిళ్‌లో ఇప్పటికీ కాజల్‌ హవా నడుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా.. అందం, అభినయం అంతకంతకూ పెంచుకుంటూ పోతోందామె. ట్రెండ్‌కు తగ్గట్టు వైవిధ్య చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతోంది. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు రూపొందించే ‘లైవ్‌ టెలీకాస్ట్‌’ అనే వెబ్‌ సిరీస్‌కు కాజల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ఈ విషయాన్ని ప్రభు ఇటీవలే ప్రకటించాడు.

ఇది ఓ హారర్ వెబ్‌ సిరీస్‌ కావడం మరో విశేషం. వెండితెరపై ఈ హాట్‌ బ్యూటీ ఈ తరహా జోనర్లో నటించడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. అది వెబ్‌ సిరీస్‌ కావడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సిరీస్‌లో కాజల్‌తో పాటు వైభవ్‌, ఆనంది ఇతర ముఖ్య పాత్రాలు పోషించనున్నారు. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇది హాట్‌స్టార్లో ప్రసారం కానుంది. తొందర్లోనే షూటింగ్‌ మొదలు పెట్టేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషించిన హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ‘క్వాంటికో’ హిందీ రీమేక్‌కు కూడా కాజల్‌ ఒప్పుకుందున్న వార్తలు వస్తున్నాయి. ఇంగ్లిష్‌లో ప్రియాంక చేసిన బోల్డ్‌ క్యారెక్టర్ను కాజల్‌ పోషించనుందని సమాచారం.

Also Read: జోనర్ సరే.. పోస్టర్ కూడా కాపీ కొట్టేస్తావా ప్రశాంత్‌!

ప్రస్తుతానికి ఆచార్య, ఇండియన్‌2, మోసగాళ్లు, హే సినామికా మూవీస్‌తో కాజల్‌ ఫుల్‌ బిజీగా ఉంది. అలాగే, రానా హీరోగా నటించిన ‘అరణ్య’లో కాజల్‌ ఓ కీలక పాత్ర పోషించిట్టు సమాచారం. ఇందులో ఆమె గిరిజన యువతిగా నటించిందట. గిరిజన సంప్రదాయం ప్రకారం ఆమె బ్లౌజ్‌ లేని శారీలో కనిపిస్తుందని, దాదాపు 30 నిమిషాల నిడివి పాటు ఉంటే కాజల్‌ పాత్ర మూవీలో సర్ప్రైజింగ్‌ ఎలిమెంట్‌గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. షూటింగ్‌ పూర్తయి, రిలీజ్‌ రెడీ ఉన్నప్పటికీ ‘అరణ్య’లో కాజల్‌ పాత్రను కావాలనే రివీల్‌ చేయలేదట.

రాజకీయాల్లో రేణుక ప్రస్థానం ముగిసినట్లేనా?

Renuka Chowdhury

Renuka Chowdhury
తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో ఫైర్ బ్రాండ్ గా రేణుక చౌదరి గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ మాజీ ఎంపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తాచాటారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆమె మాటకు తిరుగులేకుండా పోయింది. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేకపోవడం.. కిందటి లోక్ సభ ఎన్నికల్లో రేణుక అత్యంత దారుణంగా ఓటమి పాలవడంతో ఆమె ఒక్కసారిగా సైలంటైపోయారు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రేణుక ఏడాదిగా మౌనవ్రతంలో ఉండటంతో రాజకీయాల్లో ఆమె ప్రస్థానం ముగిసినట్లేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఏకగ్రీవం కానుందా?

రేణుక చౌదరి తొలి నుంచి రాజకీయాల్లో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. 1999, 2004లో ఖ‌మ్మం నుంచి వ‌రుస‌గా లోక్‌స‌భ‌కు ఎంపికైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కారణంగానే 2009 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైన కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుంటుందని భావించినప్పటికీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో కలిసి పోటీచేయడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

రేణుక చౌదరి కాంగ్రెస్-టీడీపీ కూటమిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు అయిష్టంగానే ఆమె ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో రేణుక చౌదరి టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుపై దారుణంగా ఓటమి చెందారు. 1.65లక్షల ఓట్ల తేడాతో ఆమె పరాజయం పాలవడంతో నాటి నుంచి ఆమె సైలంటయ్యారు. అయితే రేణుక చౌదరిని ఎన్నిసార్లు గెలిపించిన ఆమె ఖమ్మం ప్రజలను పట్టించుకోకపోవడం.. జిల్లాలో ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తూ మిగిలిన వారిని వ్యతిరేకించడమే ఆమె ఓటమి ప్రధాన కారణమనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు ఆమె భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలతో ఎప్పుడు ఆధిపత్య పోరుకు తెరతీసేదంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇక సొంత పార్టీ నేతలపై ఆరోపణలు గుప్పించడం రేణుకకు అలవాటు మారిందనే టాక్ ఉంది.

కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మంలో నేడు చెప్పుకోవడానికి క‌నీసం నియోజ‌క‌వ‌ర్గ నేతలు కూడా లేని దుస్థితిలోకి వెళ్లింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. గత ఎంపీ ఎన్నికల్లో రేణుక ఓటమి చెందినప్పటి నుంచి కాంగ్రెస్ లో ఎక్కడా యాక్టివ్ గా కన్పించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆమె రాజ్యస‌భ స‌భ్యత్వం కూడా పూర్తయింది.

Also Read: కమలంలో ఆధిపత్య పోరు మొదలైందా?

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పరిస్థితి బాగోలేకపోవడంతో ఆమెకు మరోసారి రెన్యూవల్ చేసే పరిస్థితులు కన్పించడం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్-టీడీపీ రాజకీయాల్లో పైచేయి సాధించిన రేణుక ప్రస్తుతం సైలంటడంతో ఆమె రాజకీయాలకు దూరం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కనీసం సొంత పార్టీ నేతలపై రేణుక చౌదరి క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే..!

కమలంలో ఆధిపత్య పోరు మొదలైందా?

Adilabad BJP

Adilabad BJP
తెలంగాణలో బీజేపీ బలపడేందుకు శతవిధలా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని వినియోగించుకుంటూ తెలంగాణలో మరింత బలపడేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ను పార్టీ అధిష్టానం నియమించింది. సంజయ్ నియామకం తర్వాత బీజేపీలో మరింత జోష్ పెరిగింది. అధికార పార్టీలో బీజేపీ నేతలు దూకుడుగా వెళుతూ టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నయం అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?

ఇదిలా ఉంటే కొన్ని జిల్లాలో బీజేపీలో ఆధిపత్య పోరు మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ అధిష్టానం వాటిపై దృష్టాసారించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆధిపత్య పోరు తెరపైకి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ కారణంగానే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం, దాని అనుబంధ కమిటీల్లో ఆదిలాబాద్ కు పెద్దగా చోటు కల్పించలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆదిలాబాద్ నేతలు బీజేపీ అధిష్టానం దగ్గరే పంచాయితీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ కిందిస్థాయి నాయకత్వంలోనూ ఎవరికీవారు గ్రూపు రాజకీయాలకు పెద్దపీఠ వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యనిర్వాహాక సభ్యురాలు చిట్యాల సుహసిన మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా వ్యహరించిన సుహసిని గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారనే టాక్ ఉంది. అయితే ఆ సీటు పాయం శంకర్ కు బీజేపీ కేటాయించింది. అయినప్పటికీ సుహాసిని ఎలాంటి బేషజాలకు పోకుండా పాయం శంకర్ గెలుపు కోసం కృషి చేసింది. అయితే ఆ ఎన్నికల్లో పాయం శంకర్ ఓటమి చెందారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సోయం బాబురావు గెలుపు కోసం ఎంతో పని చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున సోయం బాబురావు గెలిచారు.

Also Read: దేవుడి కోసం టీఆర్ఎస్ లో ఫైట్?

ప్రస్తుతం ఆదిలాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ఉండటంతో పాయం శంకర్, సుహాసిని మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. సుహాసిని తన కంటూ ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమె ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ ను కలిసి జిల్లా సమస్యలపై వివరించారనే ప్రచారం జరుగుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే పార్టీపరంగా దూకుడుగా సుహసిని వ్యవహరిస్తున్నారు. అయితే పాయం శంకర్, సుహసిని మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నప్పటికీ ఎవరు కూడా బయట పడకుండా సొంతంగా తమ వర్గాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో వీరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరిలో ఎవరూ పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే..!

కరోనా జయించిన బిగ్‌బీ కుటుంబం..

Abhishek Bachchan

Abhishek Bachchan

ఇండియన్‌ సూపర్ స్టార్, బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడడం సినీ పరిశ్రమతో పాటు దేశం మొత్తం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కుటుబం మొత్తం ప్రాణాంతక మహమ్మారిని జయించింది. ఆసుపత్రిలో ఉన్న అభిషేక్‌ బచ్చన్‌ కూడా కోలుకొని డిస్చార్జ్ కావడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలా సోకిందో ఏమో గానీ అమితాబ్‌ మొదట వైరస్‌ బారిన పడ్డారు. ఆవెంటనే అభిషేక్‌కు పాజిటివ్ అని తేలింది. అనుమానంతో కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకోగా.. ఐశ్వర్యారాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యా కూడా వైరస్‌ బారిన పడినట్టు తేలింది. అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌ ఇతర ఫ్యామిలీ మెంబర్లకు మాత్రం నెగిటివ్‌ అని తేలింది. తొలుత అమితాబ్‌, అభిషేక్‌ ముంబై నానావతి ఆసుపత్రిలో జాయిన్‌ కాగా.. తర్వాతి రోజు ఐశ్వర్యా రాయ్‌, ఆరాధ్య కూడా హాస్పిటల్‌లో చేరారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత ఐశ్వర్య, ఆరాధ్య కోలుకొని డిస్చార్జ్‌ అయ్యారు.

Also Read: అడిగినంత ఇవ్వలేదని.. చేయనంటుంది !

పెద్ద వయసు, ఇతర సమస్యలు కూడా ఉండడంతో అమితాబ్‌ ఆరోగ్యంపై అందోళన మొదలైంది. ఆసుపత్రిలో తాను ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నానని కూడా సీనియర్ బచ్చన్‌ ట్వీట్‌ చేశాడు. కానీ, అభిమానుల ప్రార్థనలతో ఆయన కూడా కోలుకొని కొన్ని రోజుల కిందటే ఇంటికి చేరుకున్నాడు. అయితే, తండ్రి, భార్య, కూతురు కోలుకున్నప్పటికీ అభిషేక్‌ మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండడం పలు అనుమానాలకు దారి తీసింది. అతని ఆరోగ్యం క్షీణించిందేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, అభిషేక్‌ కూడా కరోనాను జయించాడు. ఈ రోజు నిర్వహించిన టెస్టులో నెగెటివ్‌ రావడంతో ఆసుపత్రి నుంచి డిస్చార్జ్‌ చేశారు. దాంతో అతను ఇంటికి చేరుకున్నాడు. ‘ప్రామిస్‌ అంటే ప్రామిసే. నాకు చేసిన పరీక్షల్లో ఈ రోజు మధ్యాహ్నం నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. నేను ఈ మహమ్మారిని జయిస్తానని మీకు చెప్పాను కాదా. చేసి చూపించా. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు. నానావతి హాస్పిటల్‌ డాక్టర్లు, నర్సింగ్‌ స్టాఫ్‌కు నేనెప్పటికీ రుణపడి ఉంటా. థ్యాంక్యూ’ అని అభిషేక్‌ ట్వీట్‌ చేశాడు. అభిషేక్‌ ట్వీట్‌ను షేర్ అమితాబ్‌… ‘వెల్‌కమ్‌ హోమ్‌ భయ్యూ… గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌’ అని ట్వీట్‌ చేశాడు.

జోనర్ సరే.. పోస్టర్ కూడా కాపీ కొట్టేస్తావా ప్రశాంత్‌!

Zombie Reddy Title

Zombie Reddy Title
టాలీవుడ్‌లో ఈ మధ్య యువ దర్శకుల హవా నడుస్తోంది. వైవిధ్యమైన కథలు, కథనాలతో స్టార్ హీరోలను ఇంప్రెస్‌ చేస్తున్న కుర్రాళ్లు భారీ హిట్లు సొంతం చేసుకుంటున్నారు. అలాంటి డైరెఓర్లలో ఒకడు ప్రశాంత్‌ వర్మ. తన మొదటి సినిమా ‘అ’తోనే టాలెంట్‌ నిరూపించుకున్నాడు. అద్భుతమైన స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. కాజల్‌ అగర్వాల్‌, నిత్యా మీనన్‌, రెజీనా , ఈషా రెబ్బ, ప్రియదర్శి, శ్రీనివాస్‌ అవసరాల, మురళీ శర్మ నటించిన ఈ మూవీ రెండు నేషనల్‌ అవార్డులు సొంతం చేసుకుంది. ఆ వెంటనే రాజశేఖర్తో ‘కల్కి’ మూవీ తీసి ఆకట్టుకున్నాడు. సీనియర్ హీరో రాజశేఖర్ను డిఫరెంట్‌ లుక్‌లో ప్రజెంట్‌ చేశాడు ప్రశాంత్. ఆ పై కరోనా వ్యాక్సిన్‌ ఇతివృత్తంగా మూవీ తీస్తున్నట్టు ప్రకటించాడు. దీనికి అతను హారర్ జోనర్ ఎంచుకున్నాడు. హాలీవుడ్‌ హారర్ జోనర్లో జాంబీ చిత్రాలకు మంచి పేరుంది. ఇండియాలో ఈ తరహా చిత్రాలు ఇప్పటిదాకా వచ్చింది తక్కువే.

Also Read: కరోనా జయించిన బిగ్‌బీ కుటుంబం.. అభిషేక్‌ కూడా ఇంటికి..

అయితే, ఫస్ట్‌ టైమ్‌ తెలుగు జాంబీ ఫిల్మ్‌ను ప్రశాంత్‌ ఈ రోజు (శనివారం) ప్రకటించాడు. దీనికి ‘జాంబీ రెడ్డి’ అనే టైటిల్‌ను ఖరారు చేసి మోషన్‌ పోస్టర్ను రిలీజ్‌ చేశాడు. ఓ స్మశానం, మబ్బులు కమ్మిన వాతావరణం, ఎరుపెక్కిన చంద్రుడిని చూపిస్తూ భూమి నుంచి బయటికొచ్చి ఓ చేయిలో టైటిల్‌కు మ్యూజిక్‌ను జోడించి భయపెట్టేప్రయత్నం చేశాడు. రివెంజ్‌ ఆఫ్‌ ద డెడ్‌ అనేది ఈ మూవీకి ట్యాగ్‌ లైన్‌. ఆపిల్‌ స్టూడియోస్ బ్యానర్పై రాజశేఖర్ వర్మ ఈ మూవీని ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. మార్క్‌ కే రాబిన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

ఈ మూవీ కరోనా బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది. కరోనా కంటే భయంకరంగా ఉంటుందని ప్రశాంత్‌ పేర్కొన్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. తన మూవీ అనౌన్స్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే ప్రశాంత్‌ వర్మపై ట్రోలింగ్‌ మొదలైంది. కాపీ క్యాట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కారణం జాంబీ జానర్ ఎంచుకోవడం కాదు.. అలాంటి చిత్రాల పోస్టర్స్‌ను ‘జాంబీ రెడ్డి’ పోస్టర్ పోలి ఉండడమే. ఈ జానర్లో విడుదలైన ‘ద డెడ్‌ డోంట్‌ డై’తో పాటు ఇంకా రిలీజ్‌ కాని ‘డే ఆఫ్‌ ద డెడ్‌’ ‘ఆర్మీ ఆఫ్‌ ద డెడ్‌’ పోస్టర్స్‌ను కాపీ కొట్టి జాంబీ రెడ్డి పోస్టర్డిజైన్‌ చేశాడని ప్రశాంత్‌పై ట్విట్టర్లో విమర్శలు వస్తున్నాయి. ఆయా చిత్రాల పోస్టర్లను షేర్ చేసి ప్రశాంత్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. దాంతో, కొత్త చిత్రం ప్రకటించిన ఆనందం ఎంతోసేపు లేకుండా పోయిందీ యువ దర్శకుడికి.

దేవుడి కోసం టీఆర్ఎస్ లో ఫైట్?

Bye bye Ganesha .. Immersion of idols without noise
Bye bye Ganesha .. Immersion of idols without noise

 Khairatabad Ganesh

ఒక దేవుడు.. చాలా ప్రసిద్ధికెక్కిన గణేషుడు.. దేశ విదేశాల్లో ఖైరతాబాద్ గణేషుడంటే ఎంతో ఫేమస్. ప్రతీ సంవత్సరం ఈ గణేషుడికి అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. అయితే కరోనా కారణంగా ఈసారి వేడుకలకు ఆటంకం కలుగుతోంది.

Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఏకగ్రీవం కానుందా?

అయితే ఈ ఖైరతాబాద్ గణేషుడు కోసం ఇప్పుడు టీఆర్ఎస్ లో ఫైట్ జరుగుతోంది. ఇద్దరు పెద్ద టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు బలమైన నాయకులు.. కొన్నేళ్లుగా ఒకరితో ఒకరు పోటీపడ్డారు. కానీ ఇప్పుడు ఖర్మ కాలి ఒక పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ పాత పగలతో వారిద్దరు గొడవపడుతున్నారు.

ఖైరతాబాద్ గణేషుడి కోసం ఇప్పుడు ఫైట్ మొదలైంది. కరోనా భయాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఖైరతాబాద్ గణేషుడి ఎత్తును తగ్గించాలని గణేష్ మండపకమిటీ నిర్ణయించింది. విగ్రహం పరిణామాన్ని 3 అడుగులకే పరిమితం చేయాలని పోలీసులు సైతం సూచించారు.

పోలీసుల సూచనతో విభేదించిన ఖైరతాబాద్ గణేష్ మండలి సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సంప్రదించారు. అయితే మంత్రి తలసాని 4 అడుగుల విగ్రహాన్ని ఈసారి ప్రతిష్టించుకోవాలని సూచించి ఒప్పించారు.

అయితే ఇదే ఖైరతాబాద్ స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ జోక్యం చేసుకొని ఎత్తును 9 అడుగులకు పెంచారు. తన నియోజకవర్గంలో మంత్రి తలసాని జోక్యంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తిచేసినట్లు చెబుతున్నారు. తన నియోజకవర్గంలోని వ్యవహారాల్లో తలసాని జోక్యంపై పెద్దల వద్ద దానం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Also Read: ఏపీ మూడు రాజధానులపై తెలంగాణ సీఎం ఫోకస్?

మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఉదంతంలో చివరకు దానం మాటతో 9 అడుగుల పొడవైన గణేషుడితో కమిటీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే తయారీ మొదలైంది. దీంతో దేవుడి పేరిట రాజకీయం ఇద్దరు టీఆర్ఎస్ నేతల మధ్య చిచ్చుపెట్టింది. చివరకు మంత్రి వాదన సైతం పక్కకుపోయి స్థానిక ఎమ్మెల్యేనే గెలిచేశారు. దేవుడి కోసం టీఆర్ఎస్ లో జరిగిన ఈ ఫైట్ చర్చనీయాంశమైంది.

మోదీ క్యాబినెట్లో కొత్తగా ఎంతమంది ఎంట్రీ ఇవ్వనున్నారు?

Modi Cabinet expansion

Modi Cabinet expansion
ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి క్యాబినెట్ విస్తరించాలని భావిస్తున్నారు. ఎన్టీఏ 2.0 ఏర్పడిన తర్వాత క్యాబినెట్ విస్తరణపై ప్రధాని మోదీ ఇప్పటివరకు పెద్దగా దృష్టిసారించలేదు. ప్ర‌స్తుతం మోడీ క్యాబినెల్లో 57మంది మంత్రులు ఉన్నారు. అయితే కేంద్ర క్యాబినెట్‌లో 81మంది వరకు చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ లెక్కన మ‌రో 24మందికి మోదీ క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత క్యాబినెట్లో ఎంతమందికి ఛాన్స్ ఇస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఆగస్టు 15లోపు మోదీ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆశావహులు మోదీ క్యాబినెట్లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: ఇదో పెద్ద జోకు: మోడీకే మళ్లీ కావాలట?

మోదీ క్యాబినెట్లో చోటు ఎవరెవరీకి దక్కుతుందనే విషయంలో అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుత క్యాబినెట్లోకి ఆయా రాష్ట్రాల్లో బీజేపీని బలపర్చేలా, యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. వీరిలో ప్రధానంగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింథియా పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. గతంలో బీజేపీ అధిష్టానం సింథియాకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఇటీవల రాజ్యసభ సీటు కేటాయించింది. తాజాగా మోదీ క్యాబినెట్లో మంత్రి పదవీ ఇవ్వనుందనే టాక్ విన్పిస్తోంది.

అయితే తెలుగు రాష్ట్రాల నుంచి క్యాబినెట్లోకి ఎంతమంది వెళుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్డీఏ తొలిసారి మంత్రివర్గంలోనూ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దగా చోటుదక్కిన దాఖలాల్లేవు. నాడు తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు స్వతంత్ర హోదా కలిగిన మంత్రి ఇచ్చారు. ఇక ఏపీ నుంచి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు, సుజానా చౌదరిలకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత బీజేపీ-టీడీపీ కూటమి బంధానికి బీటలు పడటంతో ఆ ఇద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక రెండోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే ఒక్కరు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి పదవీ దక్కింది. ఏపీ నుంచి ఒక్కరికి కూడా ప్రాధాన్యం దక్కలేదు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడేందుకు యత్నిస్తుండటంతో మోదీ క్యాబినెట్లో పలువురికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర‌రావు, బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా విన్పిస్తోంది. వీరితోపాటు బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, సోయం బాపూరావులలో ఎవరికీ ఛాన్స్ లభిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏపీ నుంచి ఒక్క కేంద్ర మంత్రి కూడా లేకపోవడంతో తప్పకుండా ఒకరిద్దరికి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం బీజేపీకి టీడీపీ నుంచి వెళ్లిన ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్‌, టీజీ వెంక‌టేశ్ ఉన్నారు. వీరిలో సుజ‌నా చౌద‌రికి బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆయనకు మంత్రి పదవీ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.

Also Read: తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఏకగ్రీవం కానుందా?

అలాగే బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్, దివంగత ఎన్టీఆర్ కూతురు పురంధశ్వరీ పేర్లు విన్పిస్తున్నా. క్యాబినెట్లోకి తీసుకుంటే వీరికి తీసుకుంటే మాత్రం మరో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించాల్సి ఉంటుంది. దీంతో వీరిద్దరికి ఛాన్స్ వస్తుందో లేదో చెప్పడం కష్టంగా మారింది. అయితే యూపీఏ హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు పది మంది మంత్రులు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకునేవారు. అయితే ఎన్డీఏ హయంలో మాత్రం తెలుగు రాష్ట్రాలకు ఒకటి రెండు పదవులు మాత్రమే దక్కుతుండటం గమనార్హం. ఈసారి క్యాబినెట్లో విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతుందో లేదో వేచిచూడాల్సిందే..!

ఇదో పెద్ద జోకు: మోడీకే మళ్లీ కావాలట?

MOTN Survey

MOTN Survey

దేశ ప్రధానిగా మళ్లీ మోడీనే కావాలట.. ఇందుకు దేశంలోని 66శాతం మంది ప్రజలు ఓటేశారట.. కేవలం 8శాతం మంది మాత్రమే కాంగ్రెస్ నేత రాహుల్ ప్రధాని కావాలని అభిప్రాయపడ్డారట.. ఇదంతా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ‘ఇండియా టుడే’ జాతీయ మీడియా చానెల్ నిర్వహించిన సర్వే ఫలితాలు. తాజాగా విడుదలైన ఈ సర్వే రిపోర్ట్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Also Read: ఏపీ మూడు రాజధానులపై తెలంగాణ సీఎం ఫోకస్?

ఇంతటి కరోనా కాలంలో పైసా విదిల్చని ప్రధాని మోడీ సార్ పై దేశప్రజల్లో పీకల్లోతూ కోపం ఉంది. అమెరికా, జపాన్, యూరప్ దేశాలన్నీ కరోనా టైంలో ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాయి. కానీ మన మోడీసార్ ‘20లక్షల కోట్ల ప్యాకేజీ’ అంటూ సినిమా చూపించేశారు. అన్ని లక్షల కోట్లు ఎటుపోయాయో.. దేనికి ఖర్చు చేశారో ఇప్పటికీ మిస్టరీనే..మోడీ పాలసీలంతా కార్పొరేట్లకు దోచిపెట్టడమే తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదని ఆర్థికవేత్తలే విమర్శిస్తున్న పరిస్థితి దేశంలో ఉంది.

దేశంలో ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధి కోల్పోయి కోట్ల మంది రోడ్డున పడ్డారు. కరోనా దెబ్బకు వలస కూలీలు.. వీధి వ్యాపారులు, ప్రజలంతా ఆదాయం లేక అరిగోస పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ఏమాత్రం చొరవ చూపని మోడీపై దేశప్రజల్లో పీకలదాకా కోపం ఉంది.

ఇక కరోనా దెబ్బకు నిరుద్యోగం బాగా ప్రబలింది. దేశంలో ఇప్పుడు ఉపాధి కల్పించాల్సిన కేంద్రం చోద్యం చూస్తోంది. దేశంలో ఉన్న ప్రజలను పనుల కోసం అల్లాడి పోతున్నారు. రాష్ట్రాలకు డబ్బులు సరిగా కేంద్రం ఇవ్వడం లేదు. చైనా సరిహద్దుల్లో ఘర్షణలకు కారణాలను కేంద్రం దాచిపెడుతోంది. అయోధ్య రామాలయ భూమి పూజ తన సొంత కార్యక్రమం అనుకొని ఎవరిని పిలవకుండా యోగిలను భోగిలను సన్యాసులను పిలిచి క్రెడిట్ కోసం తన ఖాతాలో వేసుకుంది. కరోనా కరువు వేళ మనోభావాల ఆధ్యాత్మిక రాజకీయం చేస్తోంది.

Also Read: బాబు ప్రెస్ మీటా..? టీడీపీ నేతల పరుగో పరుగు?

2019 ఎన్నికల్లో గెలిచాక మోడీ చేసిన పనుల వల్ల లబ్ధి పొందిన వారు చాలా తక్కువ. కరోనా టైంలో ఫెయిల్యూర్.. చైనాతో ఘర్షణల్లో మతలబులు అన్నింటిలోనూ మోడీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరింత ఇంత ఘోరమైన వైఫల్యం చవిచూపించిన మోడీకి ఏకంగా దేశంలో 66శాతం మద్దతు వచ్చిందంటే నమ్మశక్యంగా లేదని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఇండియా టుడే ముమ్మాటికి ఫేక్ సర్వే అని చదువుకున్న వారు.. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది పడిపోతున్న ప్రతిష్టను కాపాడుకోవడానికి బీజేపీ ప్రభుత్వం చేసిన ఫేక్ సర్వే అంటూ ఆడిపోసుకుంటున్నారు.

తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఏకగ్రీవం కానుందా?

Dubbaka MLA Solipeta Ramalinga Reddy

Dubbaka MLA Solipeta Ramalinga Reddy
తెలంగాణలో మరోసారి ఉప ఎన్నిక జరుగడం ఖాయం. సిద్ధిపేట జిల్లా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో త్వరలోనే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికకు ముందే తొకముడుస్తుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీఆర్ఎస్ అధిష్టానం ఉప ఎన్నిక విషయంలో ఎలాంటి ప్రకటన చేయకముందే.. కాంగ్రెస్ నేతలు చూపిస్తున్న అత్యుత్యాహం చూస్తుంటే ఉప ఎన్నికకు ముందే ఆపార్టీ ఓటమిని అంగీకరించినట్లు కన్పిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

Also Read: ఏపీ మూడు రాజధానులపై తెలంగాణ సీఎం ఫోకస్?

దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపోట రామలింగారెడ్డి మృతితో ఉప ఎన్నిక జరుగడం ఖాయంగా కన్పిస్తుంది. సీఎం కేసీఆర్ ఈ సీటు ఎవరికీ కేటాయిస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా రామలింగారెడ్డి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో అనేక కథనాలు రాసి ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ టీఆర్ఎస్ ఏర్పాటు చేసే క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లినపుడు ఆయన వెంటే నడిచారు. కేసీఆర్ గెలుపు కోసం రామలింగారెడ్డి తనవంతు కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనపై 30కిపైగా పోలీస్ కేసులు నమోదయ్యాయి.

ఇక 2004లో టీఆర్ఎస్ నుంచి దొమ్మాట నియోజకవర్గం నుంచి రామలింగారెడ్డికి టికెట్ దక్కింది. ఈ ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలుపొందడంతో కేసీఆర్ కు మరింత దగ్గరయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలిచినా 2009లో మాత్రం ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2018ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. అయితే ఇటీవల రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగనుంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాత్రం రామలింగారెడ్డి భార్యకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే ఉప ఎన్నిక ఏకగ్రీవానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ తో తాను మాట్లాడుతానని అనడం చర్చనీయాంశంగా మారింది.

దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే తాము పోటీకి రాబోమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటిస్తుండం ఆసక్తిని రేపుతోంది. దుబ్బాకలో కాంగ్రెస్ ఎలాగు ఓటమి పాలవుతుందని ముందుగా ఊహించి జగ్గారెడ్డి ఈ ప్రతిపాదన? చేశారా? లేక టీఆర్ఎస్ నేతలే జగ్గారెడ్డితో ఇలా చెప్పిస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతోన్నాయి. గతంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి ఎంపీగా గెలువడంతో తన ఎమ్మెల్సే సీటుకు రాజీనామాచేసి ఆయన భార్యను పోటీకి దింపారు. అయితే నాడు టీఆర్ఎస్ ఏమైనా మద్దతు ఇచ్చిందా? అంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఎలా రియాక్టవుతారో చూడాలి. జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక ముందే అస్త్ర సన్యాసం చేసినట్లు కన్పిస్తోంది.

Also Read: కారులో రగులుతున్న ‘కార్చిచ్చు’

అయితే ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమే అన్న చర్చ నడుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ ను ఈ ఎన్నికల నుంచి సైడ్ చేస్తే మిగతా పార్టీలు కూడా తమకు సహకరిస్తాయని టీఆర్ఎస్ భావిస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో టీఆర్ఎస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయించిందా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా సీఎం కేసీఆర్ దుబ్బాక స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దుబ్బాక బరిలో కాంగ్రెస్ నిలుస్తుందా? లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. దీనిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

ఏపీ మూడు రాజధానులపై తెలంగాణ సీఎం ఫోకస్?

CMKCR

CMKCR

ఏపీలో మూడు రాజధానులకు దాదాపు అన్ని అడ్డంకులు తొలగినట్లే కన్పిస్తోంది. కేంద్రం ఇటీవల రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని స్పష్టం చేయడంతో జగన్ సర్కార్ కు లైన్ క్లియర్ అయినట్లయింది. దీంతో కొంచెం అటూ ఇటూగా జగన్ సర్కార్ మూడు రాజధానులకు ప్రారంభించడం ఖాయం కన్పిస్తోంది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపీలోని మూడు రాజధానుల అంశంపై నజర్ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: కారులో రగులుతున్న ‘కార్చిచ్చు’

ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణకు కలిసి రానుందని అప్పట్లోనే తెలంగాణ నేతలు, నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే మూడు రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే ఏపీ వెళ్లాల్సిన చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపాయి. ఏపీ మూడు రాజధానుల వల్ల తెలంగాణలోని హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అప్పట్లో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు కూడా చేశారు.

ఏపీలో మూడు రాజధానుల అంశంపై అప్పట్లో మీడియా ప్రతినిధులు కేసీఆర్ వద్ద ప్రస్తావిస్తే అది ఏపీ అంతర్గత విషయమంటూ పెద్దగా స్పందించలేదు. తెలంగాణలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. ఇప్పుడు ఏపీ రాజకీయాల జోలికి వెళ్లడం ఎందుకంటూ కొట్టిపారేశారు. అయితే మూడు రాజధానులు అంశం ఓ కొలిక్కి వచ్చాక చూద్దాం అన్నట్లు కేసీఆర్ అప్పుడలా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలో మూడు రాజధానులకు దాదాపు లైన్ క్లియర్ కావడంతో సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

ఏపీలో మూడు రాజధానులు ఉంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టుబడి పెడుతారు? జగన్ సర్కార్ వారిని ఏ ప్రాంతంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తుంది? ఏపీకి ఎలాంటి అవకాశాలున్నాయనే వాటిపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారట. అలాగే మూడు రాజధానులపై రాజకీయాలు హిటెక్కడంతో ఇప్పట్లో పెట్టుబడులు ఏపీకి వెళ్లే అవకాశం లేదని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ అవకాశాన్ని కేసీఆర్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే హైద‌రాబాద్ తోపాటు క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌ జిల్లాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ జిల్లాల్లోకి పెట్టుబడిదారులను ఆకర్షించేలా మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?

రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ తగ్గాక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పెట్టుబడులను ఆహ్వానించేలా తెలంగాణ ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. దక్షిణాదిలో చైన్నె, బెంగూళూరు ప్రాంతాలు ఉన్నప్పటికీ అక్కడ పలు సమస్యలు ఉండటంతో మల్టి నేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. దీంతో హైదరాబాద్ తో సహా కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి పలు రాయితీలను కల్పించేలా మంత్రి కేటీఆర్ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం. కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న పరిణమాలను సీఎం కేసీఆర్ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

అడిగినంత ఇవ్వలేదని.. చేయనంటుంది !

Anupama Parameswaran

Anupama Parameswaran
దేవుడిని సైన్స్ ను మిక్స్ చేసి సూపర్ హిట్ తో పాటు కొత్త ఫీల్ తెచ్చిన సినిమా ‘కార్తికేయ’. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎప్పటినుండో ప్లాన్ లో ఉన్నా మొత్తానికి అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లబోతుంది. యంగ్ టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ హీరోగా రానున్న ఈ సీక్వెల్ లో ప్రస్తుతం హీరోయిన్ ను ఫైనల్ చేసే సన్నాహాల్లో ఉన్నారు మేకర్స్. నిజానికి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం కోసం మొదట అనుకున్నారు. అనుపమ కూడా చేస్తానని కమిట్ అయింది. అయితే కరోనా ఎఫెక్ట్ దెబ్బకు నిర్మాతలు సినిమాలోని నటీనటులకు రెమ్యునరేషన్ తగ్గించారట. అందరూ కోపరేట్ చేయాలని అడిగినప్పటికీ అనుపమ మాత్రం మొదట ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ ఇస్తేనే యాక్ట్ చేస్తాను లేదంటే లేదు అని తేల్చేసింది.

Also Read: తెలియని దానిలో వేలు పెడుతున్నావన్నారు: అనుపమా

నిర్మాతకు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చే ఇంట్రస్ట్ లేదు. దాంతో అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుండి తప్పుకుందని తెలుస్తోంది. దాంతో చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మను తీసుకోబోతునట్లు తెలుస్తోంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా కేతిక శర్మ అయితేనే ఫ్రెష్ గా ఉంటుందని ఆమెనే ఫైనల్ చేయనున్నారు. చిత్రబృందం హీరోయిన్ కేతిక శర్మతో మాట్లాడారట. అన్నట్లు ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ గా ఉండబోతున్నాయట. ఏమైనా తన మొదటి సినిమా ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్నాడు చందు.

Also Read: అలా లేకుంటే నన్నెవరూ ఆదరించరు: శ్రీదేవి కూతురు

మరి చాలా గ్యాప్ తరువాత మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావాలనే కసితో ఉన్నాడు. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తుండగా.. నిఖిల్ కూడా బిజినెస్ పార్టనర్ గా ఉన్నాడు. కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నా.. మొదట అక్టోబర్ లో సాంగ్స్ షూట్ చేయాలనుకుంటున్నారు.

హై కోర్టు స్టే పై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం..!

Supreme Court

Supreme Court
రాజధాని తరలింపు విషయంలో రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్సెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు, రాజధాని తరలింపునకు సంబంధించి హై కోర్టులో దాఖలైన పలు పిటీషన్ లపై ఈ నెల 4వ తేదీన విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు పది రోజుల సమయం కావాలని న్యాయవాధి కోరారు.

Also Read: బాబు ప్రెస్ మీటా..? టీడీపీ నేతల పరుగో పరుగు?

దీంతో 14వ తేదీ వరకూ గడువు ఇచ్చని హై కోర్టు ధర్మాసనం, రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లుల గెజిట్ ప్రటకన విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం విధితమే.కేసు విచారణ సందర్భంగా హై కోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిర్మాణంలో ఉన్న రాజధానిని మధ్యలో వదిలేసి మరొ ప్రాంతానికి వెళ్లడం వల్ల ప్రజా ధనం వృదా అవుతుందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

హై కోర్టు వాఖ్యలను బట్టీ చూస్తే ఈ వ్యవహారం ఇప్పట్టో తేలేదిగా కనిపించడం లేదు. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకూ ఖర్చు చేసిన నిధుల వివరాలు ఇవ్వాలని సీఆర్డీఏను హై కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, హై పవర్ కమిటీ వంటి అంశాలకు సంబంధించి ఇప్పటి వరకూ మొత్తం 35 పిటీషన్ ల వరకూ హై కోర్టులో దాఖలయ్యాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ సంతకంతో చట్టపరంగా చిక్కులను అదిగమించినా హై కోర్టు స్టే వల్ల రాజధాని తరలింపు విషయంలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

Also Read: ఫలించని బాబు వ్యూహం..!

దీంతో హై కోర్టు స్టే నుంచి విముక్తి పొందాలని భావిస్తున్న ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సోమవారం విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో నిమ్మగడ్డ కేసులో హై కోర్టులో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేయగా, సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. నిమ్మగడ్ద దాఖలు చేసిన కోర్టు దిక్కార కేసుపైన స్టే ఇవ్వాలంటూ సుప్రీంలో ప్రభుత్వం పిటీషన్ వేసింది. అప్పడూ సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించింది. రాజధాని తరలింపు కేసులో హై కోర్టు ఇచ్చిన స్టే విషయంలో సుప్రీం కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

బాబు ప్రెస్ మీటా..? టీడీపీ నేతల పరుగో పరుగు?

CBN Press meet

CBN Press meet
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ప్రజలే కాదు.. ఇప్పుడు సొంత టీడీపీ నాయకులు, కార్యకర్తలు , డైహార్ట్ మద్దతుదారులు కూడా పరుగో పరుగు అని పారిపోతున్నారట.. వెంటనే బాబుతో పాటు ఉండకుండా బయటకు పోవడమో చేస్తున్నారట.. ఇక టీవీలోనూ లైవ్ వస్తే వేరే చానెల్ మార్చేస్తున్నారట.. దీనికంతటికి చంద్రబాబు ఊదరగొట్టే.. నసపెట్టే సుధీర్ఘ ప్రసంగాలే కారణమని వారంతా దూరం జరుగుతున్నారట.. చంద్రబాబు మాటల ప్రవాహం తప్పితే పెద్దగా ఏమీ సాధించేది ఉండదన్నది టీడీపీ వర్గాల వాదన .. చంద్రబాబు ఆవేదన, ఆగ్రహం తప్ప ఏమీ సాధించలేడు అని వారంతా అనుకుంటున్నారు.

Also Read: ఫలించని బాబు వ్యూహం..!

చంద్రబాబు అమరావతి కోసం పోరాడుదామని పిలుపునివ్వగానే పెద్దగా స్పందన రావడం లేదు. అమరావతి కోసం పోరాడలేమని పలువురు టీడీపీ సీనియర్ నాయకులు డిసైడ్ అయ్యారట.. ఇక రోడ్లపైకి రాకుండా ఆందోళనలు చేయకుండా ప్రెస్ మీట్లతోనే నిరసన తెలుపుదామని మరికొందరు భావిస్తున్నారట..

చాలా మంది టీడీపీని నమ్ముకొని విలువలతో బతికే నాయకులు చంద్రబాబు ఆదేశానికి మౌనంగా ఏం చేయాలో పాలుపోక అసహనం వెళ్లగక్కుతున్నారట.. కొందరేమో కక్కలేక మింగలేక ఉంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక అడుగు ముందుకేసి కేవలం మీడియా సమావేశాల ద్వారా ఏమీ సాధించలేరని ఖరాఖండీగా కుండబద్దలు కొట్టారు.చంద్రబాబు, లోకేష్ జూమ్ యాప్ లో కాకుండా వీధుల్లోకి వచ్చి ఫైట్ చేయాలని స్పష్టం చేశాడు. మీడియా సమావేశాలతో ఏమీ సాధించలేరని దెప్పిపొడిచాడు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా కేశినేని ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది.

Also Read: సైకిల్ గాలిపోతుంటే అక్కడేం చేస్తున్నావ్ బాబు..?

కేశినేని నాని గతంలో కూడా తన కంటే తక్కువ వయస్సు ఉన్న.. అనుభవం ఉన్న ఎంపీలకు పార్టీ పార్లమెంటరీ నాయకత్వాన్ని చంద్రబాబు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై ఆయన చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు కూడా లేవనెత్తారు. నాని గత కొన్ని నెలలుగా తక్కువ ప్రొఫైల్‌ను పాటిస్తున్నారు. టిడిపి ఫైట్ మోడ్‌లోకి రావాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జూమ్ లోనే ఉద్యమాలకు పిలుపునివ్వడాన్ని అందరిలా ఆయన సహించక ఓపెన్ గానే బాబుకు సవాల్ చేసేశారు.

ఫలించని బాబు వ్యూహం..!

Chandrababu

Chandrababu
అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా అడ్డుకునేందుకు, వైసీపీ ప్రభుత్వం టిడిపి నాయకులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడితే రక్షణ పొందేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో వ్యూహాలు పన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం తనకు అధికారం లేదు కాబట్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సాయం కోసం తన పార్టీ ఎంపీలను బీజేపీలోకి పంపించడం ఈ వ్యూహాల్లో ఒకటి.

Also Read: సైకిల్ గాలిపోతుంటే అక్కడేం చేస్తున్నావ్ బాబు..?

ఎన్నికల ముందు బీజేపీ, ప్రధాని మోడీపై తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తీవ్రమైన విమర్శలను చేశారు. దీంతో బీజేపీ, ప్రధాని మోడీతో సంబందాలు కోల్పోయిన బాబు బీజేపీలోకి తన ఎంపీలను పంపించడంతో సత్సంబందాలు మళ్లి నెలకొంటాయని భావించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యూహం ప్రకారం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా టిడిపి రాజ్యసభ సభ్యులు సుజన చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి మోహనరావులు టిడిపిలో పదవులు పొంది బిజెపిలో చేరారు. పార్టీని వెళ్లిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని టిడిపి నాయకులు రకరకాల ప్రకటనలు చేసినా చివరికి అవి ఉత్తుత్తి ప్రకటనలుగా మిగిలిపోయాయి.

ఇక్కడి వరకూ చంద్రబాబు అనుకున్న విధంగానే సాగింది. బీజేపీలో చేరిన ఎంపీలు మాత్రం వారి లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయారు. బీజేపీని టిడిపికి దగ్గర చేసే పనిలో, అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా అడ్డుకోవడంలో, టిడిపి నాయకులపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలను అడ్డుకోవడంలో ఆశించిన ఫలితాలు చంద్రబాబుకు దక్కలేదు. దీంతో ఈ విషయంలో చంద్రబాబు వ్యూహం విఫలమయినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: ఆంధ్రలో బిజెపి-జనసేన కూటమికి పవన్ కళ్యాణ్ నాయకత్వం?

బీజేపీలో చేరిన సుజనా చౌదరికి, సిఎం రమేష్, టి.జి వెంకటేష్, గరికపాటి మోహనరావులకు బీజేపీ నాయకులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ తక్కువగా ఉందికాబట్టీ పార్టీలో చేరతామని వచ్చిన వారిని వెంటనే చేర్చుకున్నప్పటికీ ఆ తరువాత జాతీయ నాయకత్వం వీరిని పెద్దగా పట్టించుకోకుండా పక్కన పెట్టింది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు సుజనా చౌదరి అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, ఏదో చేసేస్తుందని రాజధాని రైతులను మభ్యపెడుతూ వచ్చారు. ఇటీవల హై కోర్టులో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్ లో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయడంతో ఇప్పడు ఈ విషయం చర్చనీయంగా మారింది. టిడిపి నుంచి బీజేపీలోకి నలుగురు ఎంపీలను పంపిన చంద్రబాబుకు వ్రతం చెడినా ఫలితం దక్కకుండా పోయింది.

ఇప్పటికీ స్పష్టతరాని బోధనా మాధ్యమం

నూతన విద్యావిధానం ప్రకటించినప్పటి నుంచి బోధనా మాధ్యమం పై గందరగోళం కొనసాగుతూనే వుంది. ముందుగా విద్యావిధానం ప్రకటించిన రోజు అందరూ 5వ తరగతి వరకూ మాతృ భాషలో విద్యాబోధన తప్పనిసరి అని అనుకున్నారు. అదికూడా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు అన్నింటి లో కూడా 5వ తరగతివరకు ఖచ్చితంగా మాతృ భాషలోనే విద్య బోధన జరగాలని కొత్త విద్యావిధానం స్పష్టం చేసిందని అన్ని ప్రచార సాధనాలు, పత్రికలు వెల్లడించాయి. దానితో ఆంధ్రాలో జగన్ కి ఇంకో ఎదురు దెబ్బ తగిలిందని కూడా పత్రికలు, చానళ్ళు వ్యాఖ్యానించాయి. దీనిపై అనుకూలంగా , వ్యతిరేకంగా తెలుగు చానళ్లలో , జాతీయ చానళ్లలో కూడా చర్చలు జరిగాయి. దీనిపై కేంద్రీయ స్కూళ్ళలో ఎలా అమలుచేయాలనేది కూడా వివాదానికి దారి తీసింది. ఇంతలో మరుసటి రోజు స్కూళ్ళ విద్యా కార్యదర్శి పత్రికలో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మాతృ భాషలో విద్య బోధన మార్గదర్శకాలు తప్పితే నిర్బంధం కాదని స్కూళ్ళకు, రాష్ట్రాలకు స్వేచ్చ వుందని ప్రకటించింది.

నిన్న ప్రధానమంత్రి వున్నత విద్య పై జరిగిన సదస్సులో మాట్లాడుతూ 5వ తరగతి వరకు ప్రతి ఒక్కరూ మాతృ భాషలోనే చదవాలని దాదాపు ఇది తప్పదన్న అర్ధంలోనే మాట్లాడటం జరిగింది. అదేసమయం లో రాష్ట్రాలు సహకరించాలని కూడా మాట్లాడాడు. ఇంతకీ అసలు పరిస్థితి ఏమిటి? మాతృ భాషలో విద్య బోధన తప్పనిసరా లేక స్వచ్చందమా? ఒకవేళ నిర్బంధమయితే ప్రైవేటు స్కూళ్ళకు వర్తిస్తుందా? దీనిపై ఈరోజుకీ స్పష్టత రాలేదు.

బోధనా మాధ్యమం ఎప్పుడూ సున్నితమైన అంశమే. తమిళనాడు లో దీని తీవ్రత రాజకీయ ప్రకంపనలు సృష్టించటం చరిత్రలో చూసాం. ఇప్పటికీ అక్కడ త్రి భాషా సూత్రం అమలు లో లేదు. ప్రస్తుత విద్యావిధానం పై కూడా డిఎంకె , అన్నా డిఎంకె కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మూడు భాషలు నేర్చుకోమనేది వాళ్ళ వాదన. కొత్త విధానం లో సంస్కృతాన్ని, హిందీ ని బలవంతంగా రుద్దుతున్నారని వాళ్ళ వాదన. కానీ విద్యా  విధానం లో ఎక్కడా నిర్బంధంగా ఈ భాషల్ని రుద్దుతున్నట్లు చెప్పలేదు. దేశంలోని ఏ భాషనైనా సెలెక్ట్ చేసుకొనే స్వేచ్చ విద్యార్ధి కి వుంది. అలాగే వృత్తి విద్యా కోర్సులు ప్రవేశాపెట్టటాన్ని కూడా డిఎంకె వ్యతిరేకించటం ఆశ్చర్యకరంగా వుంది. అలాగే ప్రభుత్వం కూడా త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రాంతాల్లో ఖచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలి. మారిన పరిస్థితుల్లో 9వ తరగతి నుంచి ఫ్రెంచ్, పోర్చుగీసు, జర్మన్, స్పానిష్, జపనీస్, కొరియన్ భాషలను ఏదో ఒకటి ఎంచుకొనే స్వేచ్చ ఇవ్వటం ఆహ్వానించదగ్గది. అదేసమయం లో ముసాయిదా లో వుంచిన చైనీస్ భాషను తొలగించటం తొందరపాటు చర్య. ఈరోజు చైనా తో గొడవలు వున్నాయని ప్రపంచం లో అధికంగా మాట్లాడే భాషల్లో ఒకటైన చైనీస్ ని తొలగించ కుండా వుండాల్సింది. చైనా తో పాటు హాంగ్ కాంగ్ , తైవాన్ దేశాల్లో కూడా చైనీస్ భాషనే మాట్లాడుతారు. తిరిగి విదేశీ భాషల జాబితాలో చైనీస్ భాషను చేరిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా బోధనా మాధ్యమం ఎప్పుడూ సున్నితమైనదే. దీనిపై ఎంత త్వరగా స్పష్టత వస్తే సందేహాలకు తావులేకుండా వుంటుంది.

ఆంధ్రలో బిజెపి-జనసేన కూటమికి పవన్ కళ్యాణ్ నాయకత్వం?

సోము వీర్రాజు ఆంధ్ర బిజెపికి నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన దగ్గర్నుంచి రాజకీయ పరిణామాలు చక చకా జరుగుతున్నాయి. ముందుగా రాజధానిపై బిజెపిలో వున్న వైరుధ్యాలు తొలగిపోయాయి. సోము వీర్రాజు దీనిపై కేంద్రంతో మాట్లాడి స్పష్టమైన లైన్ తీసుకున్నాడు. ముందుగా పార్టీ లో రక రకాల అభిప్రాయాలు వ్యక్తపరచటానికి    చెక్ పెట్టాడు. ఇప్పటికే ఒకరిని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. దానితో అంతర్గత వ్యవహారాల పై గ్రిప్ వచ్చింది. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ లో లాగా బిజెపి లో పప్పులుడకవని కొత్తగా వచ్చినవాళ్ళకు అర్ధమవ్వాలనే ఈ వేటు వేసాడని అనుకుంటున్నారు. వచ్చిన వారంలోనే పరిస్థితులు చక్కబరచటంలో దిట్ట అని నిరూపించుకున్నాడు. మొదట్నుంచీ పార్టీలో పనిచేయటంతో పార్టీలో ఆసుపాసులు క్షుణ్ణంగా తెలియటంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్టి నిర్ణయాల వైపు అడుగులు పడుతున్నాయి.

దానితోపాటు రాజకీయ కార్యకలాపాలు కూడా వెంటనే మొదలుపెట్టాడు. ముందుగా మెగా స్టార్ చిరంజీవి ని కలవటం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని అర్ధమవుతుంది. సామాజిక సమీకరణల్లో భాగంగా ముందుగా కాపు సామాజిక వర్గాన్ని కోర్ బేస్ గా చేసుకొనే వ్యూహం లో భాగమే ఈ కలయిక అని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశానికి కమ్మ సామాజిక వర్గం , వై ఎస్ ఆర్ సి పి కి రెడ్డి, దళిత సామాజిక వర్గాలు కోర్ బేస్ గా ఉండటంతో బిజెపి లోతుగా ఆలోచించి కాపు సామాజిక వర్గాన్ని తమ కోర్ బేస్ గా ఆంధ్రలో చేసుకోవాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. అందుకే బిజెపి కి సోము వీర్రాజు ని అధ్యక్షుడిగా చేయటం, చేసిన వెంటనే కొత్త అధ్యక్షుడు మొదటిగా చిరంజీవిని కలవటం చూస్తే ఈ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ ప్రయత్నం విజయవంతమయితేనే బిజెపి కి ముందు పునాది ఏర్పడుతుంది. ఆంధ్రా రాజకీయాల్లో ఇష్టమున్నా లేకపోయినా కుల సమీకరణలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నం విజయవంతమవుతుందో లేదో అనేది ఇప్పుడే చెప్పలేము.

కాపు సామాజిక వర్గం ప్రస్తుతం ఒకవైపు సమీకరించ బడలేదు. మొన్నటి ఎన్నికల్లో జగన్, పవన్ కళ్యాణ్ మధ్య చీలిపోయింది. ప్రజారాజ్య మప్పుడే ఆ సమీకరణ జరిగింది. ఆ తర్వాత జరగలేదు. అదేసమయంలో రాజకీయ సంప్రదింపులు కూడా మొదలయ్యాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని స్వయంగా ఇంటికెళ్ళి సోము వీర్రాజు కలవటం , ఇద్దరూ కలిసి వీడియో లో మాట్లాడటం జరిగింది. అందులో సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితుల్ని అధ్యయనం చేసి పవన్ కళ్యాణ్ నాయకత్వం లో 2024 కి తయారవుతామని చెప్పటం విశేషం. అంటే ఈ మూడో ప్రత్యామ్నాయానికి పవన్ కళ్యాణ్ నాయకుడని స్పష్టం చేసినట్లే. ఇది కూడా బిజెపి వ్యూహం లో భాగామేననుకోవాలి. ప్రస్తుతం బిజెపి ఆంధ్రాలో జీరో గానే వుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి యూత్ లో క్రేజ్ వుంది. మూడో ప్రత్యామ్నాయానికి ఒక ఊపు రావాలంటే ప్రజాదరణ అవసరం. అది పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమవుతుందని బిజెపి భావించినట్లు తెలుస్తుంది. ఇది ఒకవిధంగా సస్పెన్సు కి తెరపడినట్లే. ఇది కూడా కాపు సామాజిక వర్గం ఈ కూటమి వైపు మొగ్గటానికి దారితీస్తుందని భావించవచ్చు. అంటే కాపు సామాజిక వర్గాన్ని కోర్ బేస్ గా చేసుకోవటానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు సోము వీర్రాజు చేస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వాన బిజెపి-జనసేన ఆంధ్రాలో వై ఎస్ ఆర్ సి పి కి గట్టి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్.. చల్లని బీరు.. చేదుగా మారిందిలా?

Beer Sales in Telangana

Beer Sales in Telangana

కరోనా పుణ్యానా.. మనిషి తన తోటిమనిషి చూసి దడుసుకునే రోజులొచ్చాయి.. దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. ప్రధాని మోదీ లాక్డౌన్ విధించి.. చప్పళ్లు కొట్టిస్తే ఇక కరోనా ఖతమని అందరూ భావించారు.. అయితే జిత్తుల మారి కరోనా ఎప్పుడు అవకాశం దొరుకుందా? అని వెయిట్ చేసి.. లాక్డౌన్ ఎత్తివేయగానే తనపని తాను చేసుకుంటూ పోతుంది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కరోనా కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు కరోనాతో సహజీవనం ఉంటూ మీనమేషాలు లెక్కిస్తుండటంతో దేశంలో మరణాలు రేటు కూడా పెరిగిపోతుంది.

Also Read: కారులో రగులుతున్న ‘కార్చిచ్చు’

కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇది.. అది అనే తేడా లేకుండా అన్నిరంగాలకు దెబ్బతీస్తుంది. ఎవరు ఔను అన్నా.. కాదన్న ఎవరిగ్రీన్ గా లాభాలతో నడిచే బిజినెస్ ఏదైనా ఉందంటే అది మద్యం షాపులే అని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఆ రంగం కూడా కరోనా దాటికి కుదేలవుతున్నారు. రోజురోజుకు మద్యం అమ్మకాలు తగ్గిపోతుండటంతో మద్యం షాపుల యాజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా బీర్ల అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది.

తెలంగాణలో మద్యంప్రియులు ఎక్కువగా బీర్లను సేవిస్తుంటారు. అయితే కరోనా కారణంగా చాలామంది వాటికి జోలికి పోకపోవడంతో వాటి సేల్స్ భారీగా పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో సీజన్ తో సంబంధం లేకుండా బీర్ల అమ్మకాలు విపరీతంగా జరిగేవి. సగటు ఒక్కొక్కరు మూడు నుంచి ఆరు బీరు బాటిళ్లు కొనుగోలు చేసేవారట. అయితే ప్రస్తుతం మద్యంప్రియులు చల్లని బీర్ల జోలికి వెళ్లడం లేదట. బీర్లు తాగటం వల్ల జలుబు వచ్చే అవకాశం ఉండటంతో వాటిని సేవించేందుకు కూడా భయపడుతున్నారట. కరోనా కారణంగా మద్యంప్రియులు వాటికి జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయినట్లు మద్యం షాపు ఓనర్లు వాపోతున్నారు.

గత ఏడాదితో పొలిస్తే బీర్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయినా లిక్కర్ సేల్స్ మాత్రం ఒకేరకంగా ఉన్నట్లు అబ్కారీ అధికారులు చెబుతున్నారు. గతేడాది జులైలో 31.48లక్షల కేసుల లిక్కర్‌, 41.7లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరుగగా ప్రస్తుతం జులైలో 31.34 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు, బీరు అమ్మకాలు 22.99లక్షల కేసులు జరిగాయి. లిక్కర్ అమ్మకాల్లో తేడా లేకున్నప్పటికీ బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయినా మద్యం అమ్మకాల విలువ మాత్రం గత ఏడాది జులైలోని అమ్మకాలతో పోలిస్తే రూ.600కోట్లు పెరిగినట్లు అధికారులు చెబుతుండటం గమనార్హం.

Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?

అయితే కరోనా కారణంగా అందరూ ఇంటికే పరిమితం కావడం.. జన్మదిన వేడుకలు, విందులు, వినోదాల జోలికి ప్రజలు వెళ్లకపోవడం.. నలుగురు కలిసి పార్టీలు చేసుకునే వీలులేకపోవడం వల్లనే మద్యం సేల్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పని చేస్తుండటం కూడా ఇందుకు కారణమని అబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ ఇలానే కొనసాగితే అన్నిరంగాలతోపాటు బీర్ల కంపెనీలు కూడా నష్టాలబాట పట్టాల్సి రావచ్చు. ఏదిఏమైనా కరోనా కారణంగా చల్లటి బీరు చేదేక్కడం బీర్ల కంపెనీలకు నిజంగా చేదువార్తే అనే చెప్పాలి..!