
రాష్ట్రంలో టీడీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు అమరావతి ఉద్యమం ఆయనకు కొందరు నేతలను దూరం చేస్తుంది. ఇప్పటికే కరోనా విపత్తు సమయంలో ప్రతిపక్ష నేత పక్క రాష్ట్రంలో మకాం పెట్టడం అనేక విమర్శలకు దారితీస్తుంది. సామాన్యులు సైతం ఈ విషయంలో బాబును మరియు లోకేష్ ని ఎండగడుతున్నారు. అమరావతి కోసం ఆయన జూమ్ యాప్ లో చేస్తున్న ఉద్యమాలు, సవాళ్లు ఆయన పట్ల గౌరవం పెంచకపోగా ఇంకా చులక చేస్తున్నాయి. బాబు జూమ్ పోరాటాలు, లోకేష్ ట్విట్టర్ వ్యాఖ్యలు ప్రజలపై పనిచేయడం లేదు. దీనికి తోడు వైసీపీ నేతలు బాబును జూమ్ బాబా అని, లోకేష్ ని ట్విట్టర్ పిట్ట అని ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి కోసం బాబు చేస్తున్న సోషల్ మీడియా ఉద్యమం ఆయనకు మేలు చేసే సూచనలు కనిపించడం లేదు.
Also Read: ఆంధ్రలో బిజెపి-జనసేన కూటమికి పవన్ కళ్యాణ్ నాయకత్వం?
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొందరు నేతలు టీడీపీకి దూరం కానున్నారు. వైజాగ్ లో నాలుగు నియోజకవర్గాలను శాశించగల గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడడం పెద్ద దెబ్బే అని చెప్పాలి. త్వరలో ఆయన వైసీపీలో చేరిక ఖాయమే. రాయలసీమలో వైసీపీ ఎలాగూ బలంగా ఉంది. టీడీపీ కంచు కోటైన ఉత్తరాంధ్రలో పసుపు జెండాను కనుమరుగు చేయడం ద్వారా రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించాలని వైసీపీ భావిస్తుంది. సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా కమల దళంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. రాను రాను టీడీపీ పరిస్థితి మరింత దిగజారుతుంటే బాబుకు మాత్రం అమరావతి ఉద్యమం మినహా ఏమీ కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో జగన్ పాలనలో లోపాలు ఎత్తిచూపుతూ ప్రజాపోరాటం చేస్తే కొంచెమైనా నష్టనివారణ జరిగే అవకాశం ఉంటుంది.
Also Read: జిల్లాల పునర్యవస్ధీకరణకు తొలి అడుగు..!
బాబు రాజకీయం అమరావతే అజెండా సాగుతుండగా, రాష్ట్రంపై ఆధిపత్యం కోల్పోతున్నారు. ఇక ఆయన చేసిన రాజీనామాల సవాల్ కూడా నవ్వులపాలైంది. అమరావతిని రాజధానిగా కోరుకుంటున్న వాళ్ళు కూడా బాబు తన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించొచ్చు కదా అనుకుంటున్నారు. ఆయన సవాల్ తరువాత ఎదో జరుగుతుందని బావించివారు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రాయలసీమ నేత బిటెక్ రవి చేత మండలి సభ్యత్వానికి రాజీనామా చేయించిన బాబు, రాయలసీమ ప్రజలు కూడా అమరావతికి అనుకూలం అని భ్రమింపచేసే ఆలోచన చేశారు. దాని వలన జరిగిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. బిటెక్ రవి చేత రాజీనామా చేయించిన బాబు, కొడుకు లోకేష్ చేత కూడా చేయించొచ్చు కదా అని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. పదవులకు లోకేష్, త్యాగాలకు ఇతర నేతలా అని వాపోతున్నారు. మొత్తంగా రాజధాని ఉద్యమంలో టీడీపీ సర్వం కోపోతుంటే బాబు హైదరాబాద్ లో ఉంది చోద్యం చూస్తున్నాడు.































అలా లేకుంటే నన్నెవరూ ఆదరించరు: శ్రీదేవి కూతురు
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తన కెరీర్ను మలుపు తిప్పే విజయం కోసం ఆశిస్తోంది. తాను పైలట్గా నటించిన ‘గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ మూవీపై ఆమె గంపెడాశలు పెట్టుకుంది. కార్గిల్ వార్లో యుద్ధ విమానాలు నడిపిన మహిళా పైలట్ గుంజాన్ సక్సేనా జీవిత చరిత్రా ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఈ నెలలోనే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ కాబోతోంది. కాగా, ఈ మూవీపై సోషల్ మీడియాలో రకరకాల చర్చ నడుస్తోంది. అయితే, దీన్ని తాను పట్టించుకోవడం లేదని జాన్వీ అంటోంది. శ్రీదేవి, బోణీ కపూర్ కూతురుగా అందరికీ సుపరిచితం అయినప్పటికీ తాను ఎక్స్టార్డినరీగా ఉంటే తప్ప ప్రజలు తనను ఆదరించబోరని అంటోందామె. అందువల్ల తొందరగా సంతృప్తి పడనని, ఎక్కువ కష్టపడి మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తానని చెబుతోంది.
Also Read: తెలియని దానిలో వేలు పెడుతున్నావన్నారు: అనుపమా
ఇక, సుశాంత్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై చర్చ నడుస్తోంది. స్టార్కిడ్ కావడంతో జాన్వీపై కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీనిపై స్పందించిన జాన్వీ ప్రజల సెంటిమెంట్లను గౌరవించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఒక నటిగా తన వృత్తిని సమర్థంగా నిర్వర్తిస్తానని, తద్వారా తన తల్లిదండ్రులపై ప్రేమానురాగాలు చూపించిన ప్రజలకు తాను అదే ప్రేమను పంచాలని అనుకుంటున్నానని తెలిపింది. ‘నాకు ఈ అవకాశం తేలికగా లభించిందన్నది నిజం. కాబట్టి నన్ను నిరూపించుకోవడానికి నేను అదనంగా ఏదైనా చేయవలసి వస్తే, దానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజల ప్రేమను సంపాదించడం నాకు ఎంతో విలువైనది. ఎందుకంటే ప్రజలు నా తల్లిదండ్రులపై చూపిన ప్రేమ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా. అందువల్ల నేను వాళ్లకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. దాన్ని నేను ఇష్టపడే వృత్తి ద్వారా ఇవ్వడమే ఉత్తమమైన మార్గం’ అంటూ 23 ఏళ్ల జాన్వీ తన వయసుకు మించిన పరిణతితో చెప్పింది. ఎంతైనా శ్రీదేవి కూతురు కదా. ఆమెలో ఈ క్లారిటీలో ఉంటే కచ్చితంగా తల్లి పేరు నిలబెట్టగలదు.