Home Blog Page 8347

ఆన్ లైన్ విద్య.. అందరికీ ‘పరీక్ష’గా మారనుందా?


ప్రతియేటా జూన్ తొలివారంలోనే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. కరోనా కారణంగా రాష్ట్రంలో కొన్నినెలలుగా పాఠశాలలు మూసివేయాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1న నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించనుంది. ఈమేరకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.

Also Read: తెలంగాణలో అవినీతి కథ.. మారుతోందా?

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లో ఆన్ లైన్ విద్యావిధానం సరైనదే అయినప్పటికీ చాలా సమస్యలు ఎదురుకానున్నాయి. ప్రభుత్వం దూరదర్శన్, టీ-శాట్ ఛానళ్లు, రేడియో ద్వారా విద్యాబోధన చేయాలని భావిస్తోంది. అయితే వీటికోసం పాఠశాలకు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ తదితర ఫర్నీచర్ ఉండాల్సిందే. ఇక విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఆన్ లైన్లో పాఠాలు వినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏమేరకు కంప్యూటర్ వంటి సదుపాయాలు ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రుల్లో 40శాతం వరకు స్మార్ట్ ఫోన్స్ లేవని ఉపాధ్యాయుల సర్వేలో తేలిందట. టీవీలు లేదా స్మార్ట్ ఫోన్ సదుపాయంలేని విద్యార్థులు ఇతరుల వద్దకు వెళ్లి పాఠాలు వినాలని సూచిస్తుంది. దీనినే ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కరోనా పరిస్థితుల్లో విద్యార్థులను ఇతరుల ఇంటికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చే స్థోమతలేని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు కేవలం మధ్యాహ్నం భోజనం కోసమే పిల్లలకు స్కూలుకు పంపించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వారికి స్మార్ట్ ఫోన్లు, టీవీలు కొనాలంటే ఏమేరకు సాధ్యం అవుతుందో సర్కారే ఆలోచించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా ఉండదని స్థానికులు చెబుతున్నారు. కేబుల్ నెట్‌వర్క్‌ల్లో, డీటీహెచ్‌లలో దూరదర్శన్, లేదా టీ-శాట్ వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.

రాష్ట్రంలో చాలా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికీ అరకొర సదుపాయాల మధ్యే పాఠశాలలు నడుస్తున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు మాములు మొబైల్స్ నే ఎక్కువగా వాడుతున్నారు. కరోనా కారణంగా ప్రజా రవాణాతో ఇబ్బందులు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సొంత వెహికల్స్ పై వెళ్లాల్సి రావడంతోపాటు ఎక్కడా కరోనా అంటుకుంటుందనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు సైతం ఆన్ లైన్ విద్య పట్ల వ్యతిరేకత చూపుతున్నారు.

Also Read: కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?

ఒకవేళ ప్రభుత్వం ఆన్ లైన్ విద్యావిధానానికే మొగ్గుచూపితే లక్షలాది మంది విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి. ప్రస్తుత ఆన్ లైన్ విద్యావిధానం అటూ సర్కారుకు.. ఇటు ఉపాధ్యాయులు.. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులందరికీ పెద్ద పరీక్షగా మారడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ విధానం ప్రారంభించి ఘోరంగా విఫలమయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వమే ఆన్ లైన్ విద్యావిధానానికి మొగ్గుచూపాల్సి వచ్చింది. ప్రభుత్వం సైతం ఆన్ లైన్ విద్యావిధానంలో ఫెయిల్ అయితే ప్రభుత్వం ప్రజల్లో అబాసుపాలు కావడం ఖాయంగా కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో వేచి చూడాల్సిందే..!

టీడీపీపై బీజేపీ ఎందుకు కోపంగా ఉంది?


బీజేపీపై టీడీపీ అదృశ్య దాడి చేసింది. ఇప్పటికే దూకుడు మీద ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా బీజేపీ నేతలకు ఇది బలంగా తాకింది. దీంతో టీడీపీ దాడిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం చేసిన పని అని బీజేపీ గట్టిగా అనుమానిస్తోంది. దీనికి ప్రతి చర్య దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య పరిణామాలు వేడి పుట్టిపుట్టిస్తున్నాయి.

Also Read: తెలంగాణలో అవినీతి కథ.. మారుతోందా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వెళ్తున్నారు. ఇన్నాళ్లు టీడీపీకి ఫేవర్ గా రాజకీయం వెలగబెట్టిన వారిని ఏరివేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ బ్యాచ్ కు సోము వీర్రాజు కంటగింపుగా మారారు.

సోషల్ మీడియాలో ఏపీ బీజేపీపై వ్యూహాత్మకంగా దాడి జరుగుతోంది. ఈ దాడి ప్రధానంగా అమరావతి వంటి సమస్యలపైనే చేస్తున్నారు. దాడి చేసిన వారు ముఖ్యంగా సోముకరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా? వీర్రాజును, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావును లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీలోని పలు విషయాల్లో జీవీఎల్ తాజాగా చంద్రబాబును, టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Also Read: కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?

సహజంగానే బలమైన టీడీపీ సోషల్ మీడియా యోధులు జీవీఎల్ పై దాడి చేస్తున్నట్టు ఏపీ బీజేపీ శాఖ గుర్తించింది. ఇప్పటికే ఈ ఇష్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తనపేరు మీద బహిరంగ లేఖ రాశారు. సీనియర్ నాయకులపై ఇలాంటి దాడులను పార్టీ సహించదని.. తమ వనరులన్నింటిని ఉపయోగించుకొని నేరస్థులను బుక్ చేస్తామని హెచ్చరించారు. అయినా టీడీపీ సోషల్ మీడియా టీం ఆగడం లేదట.. విషప్రచారాన్ని హోరెత్తిస్తోందట..

టీడీపీ తనను, ఏపీ బీజేపీని టార్గెట్ చేసిందని గ్రహించిన సోము వీర్రాజు.. టీడీపీ సోషల్ మీడియా యోధులకు గట్టి షాకిచ్చేందుకు రెడీ అయ్యారని తెలిసింది. లేకపోతే బీజేపీపై ఏపీలో మరిన్ని దాడులు జరుగుతాయని..దీన్ని మొగ్గులోనే తుంచివేయాలని సోము వీర్రాజు పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయబోతున్నట్టు తెలిసింది.

-ఎన్నం

వరుడి ఎదుటే వధువుకు మరో వ్యక్తి ముద్దు… పెటాకులైన పెళ్లి…?

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెటాకులు కావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఒక యువతి ఒక వ్యక్తిని ప్రేమించింది. కానీ ఆ వ్యక్తితో పెళ్లి చేయడానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చూపించిన వ్యక్తినే సదరు యువతి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ అదే పెళ్లికి యువతి ప్రేమించిన వ్యక్తి రావడంతో కథ అడ్డం తిరిగింది. పెళ్లైన కొన్ని గంటల్లోనే వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది.

Also Read : విజయనగరంలో దారుణం… కరోనా మృతదేహాలనూ వదలని నీచులు…?

పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌ ప్రాంతానికి చెందిన దివ్య అనే యువతి వంశీ అనే యువకుడిని ప్రేమించింది. అయితే కొన్ని కారణాల వల్ల యువతి మరో యువకుడితో వివాహానికి అంగికరించాల్సి వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తితో దివ్యకు వివాహం జరిగింది. పెళ్లి విషయం తెలిసిన వంశీ ఊరేగింపు కారును అడ్డుకుని దివ్యకు ముద్దు పెట్టాడు.

ఊహించని ఈ ఘటనతో షాక్ అవ్వడం పెళ్లికొడుకు, పెళ్లికొడుకు కుటుంబ సభ్యుల వంతయింది. వరుడు ప్రవీణ్ వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దివ్య తనకు ప్రియుడే కావాలని ప్రియుడితోనే కలిసి జీవనం సాగిస్తానని ఫిర్యాదు చేసింది. ఏం చేయలో పాలుపోని పోలీసులు వధూవరులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. వరుడు అక్కడినుంచి సొంతూరుకు వెళ్లిపోగా వధువును స్వధార్ హోంకు పంపించిన పోలీసులు ప్రియుడు వంశీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : క్లాసులు వింటూ 25 కోట్లు సంపాదించిన విద్యార్థిని..?

ఎక్స్ క్లూజివ్ : మెగాస్టార్ – వినాయక్ సినిమా డిటైల్స్ !


మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు వినాయక్ కి సినిమా లేక మెగాస్టార్ చుట్టూ తిరుగుతున్నాడని.. అందుకే మెగాస్టార్ తానూ యంగ్ స్టార్ డైరెక్టర్ సుజీత్ తో చేస్తోన్న ‘లూసిఫర్’ సినిమాను వినాయక్ చేతిలో పెట్టారని.. ప్రస్తుతం వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని, ఇలా అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు.

Also Read: పెంపుడు కుక్కతో ప్రేమలో పడ్డ హీరోయిన్ !

కాగా ఈ వార్త గురించి ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, వినాయక్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చాడని.. కాకపోతే ఆ సినిమాకి లూసిఫర్ సినిమాకి ఎలాంటి సబందం లేదని.. రచయిత ఆకుల శివ రాసిన స్క్రిప్ట్ మెగాస్టార్ కి బాగా నచ్చిందని.. దాదాపు సంవత్సరం నుండి వినాయక్, ఆకుల శివ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడని.. వినాయక్ – మెగాస్టార్ కలయికలో వచ్చే సినిమా ఇదేనని, వినాయక్ డైరెక్షన్ టీమ్ లోని ఓ సభ్యుడు చెబితున్న మాట. నిజానికి వినాయక్ ఖైదీ సినిమా చేస్తోన్న టైంలోనే మెగాస్టార్ కి ఆకుల శివ చేత స్టోరీ లైన్ ను చెప్పించాడట.

అయితే మెగాస్టార్ వెంటనే మళ్లీ వినాయక్ తో చేస్తే బాగోదు అని.. తన మేనల్లుడు సాయి తేజ్ తో ఒక సినిమా చేసి పెట్టమని వినాయక్ కోరడం.. వినాయక్ కూడా మెగాస్టార్ మాటను కాదనలేక.. సాయితేజ్ తో సినిమా చేసి ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర వేయించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ ప్లాప్ దెబ్బకు వినాయక్ మళ్లీ మెగాస్టార్ దగ్గరకు వెళ్లలేదు. ఆ తరువాత బాలయ్య బాబుతో ఓ సినిమా ప్లాన్ చేసాడు, అది ఎందుకో సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ తరువాత రవితేజతో కూడా మరో సినిమా అనుకున్నాడు. ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.

Also Read: ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ?

ఈ లోపే తానే హీరోగా ఒక సినిమా రావడం.. దాంతో యాక్టింగ్ వైపు ఆసక్తి చూపడం..అంతలో డైరెక్టర్ గా వినాయక్ కి చాలా గ్యాప్ వచ్చింది. దాంతో ఏ స్టార్ హీరో పిలిచి వినాయక్ కి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పైగా వినాయక్ మార్కెట్ కూడా పూర్తిగా పడిపోవడం ఆయనను స్టార్ హీరోలకు దూరం చేసింది. అయితే మెగాస్టార్ ఉండగా, ఇక డైరెక్టర్ కి స్టార్ డమ్ ఎందుకు.. అందుకే మెగాస్టార్, వినాయక్ ని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాకి ఆకుల శివ కథ మాటలు అందిస్తున్నాడు.

ఆ ఫ్లాప్‌ మూవీ సీక్వెల్‌ను నమ్ముకున్న షారూక్‌ ఖాన్‌


బాలీవుడ్‌ బాద్‌షా. కింగ్‌ ఖాన్‌. భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. హిందీ అగ్ర నటుడు షారూక్‌ ఖాన్‌ గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. అసలు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి బాలీవుడ్‌ను ఏలిన నటుడు అతను. బాలీవుడ్‌ ఖాన్‌ త్రయం (సల్మాన్‌, ఆమిర్)లో చాన్నాళ్లు అతనే ముందున్నాడు. కానీ, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్ ఖాన్‌ వరుస హిట్లతో దూసుకుపోతోంటే షారూక్‌ మాత్రం వెనుకబడ్డాడు. అతను సరైన విజయం రూచి చూసి ఆరేళ్లు అవుతోంది. 2014లో వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత అతనికన్నీ ఫాపులే ఎదురయ్యాయి. దిల్‌వాలే, ఫ్యాన్‌, డియర్ జిందగీ, రయూస్‌, జీరో అన్ని బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక, ఏడాదికో సినిమా విడుదల చేస్తూ దూసుకెళ్లే షారూక్‌ వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతోంది.

Also Read: ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ?

చివరగా 2018లో జీరో సినిమా చేశాడు షారూక్‌. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం కూడా ఫెయిలవడంతో తీవ్ర నిరాశ చెందిన కింగ్‌ ఖాన్‌ కొంత విరామం తీసుకున్నాడు. తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ఇంకా మొదలుపెట్టలేదు. అయితే, ఎలాగైనా హిట్‌ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్న షారూక్‌… తాజాగా తన పాత చిత్రం సీక్వెల్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అలాగని అదేదే హిట్‌ సినిమా కాదు. ఓ ఫ్లాప్‌ మూవీ. 2017లో రిలీజై ఫెయిలైన ‘రయీస్‌’ కు సీక్వెల్‌ తీయాలని షారూక్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. 1980ల నాటి గుజరాత్‌ లిక్కర్ దందా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన రయీస్‌లో కథ, హీరో క్యారెక్టరైజేషన్‌ చాలా బాగుంది. కానీ, కథను దర్శకుడు అర్థవంతంగా చెప్పలేకపోపోవడంతో సినిమా ఫ్లాప్‌ అయింది. అయినా కొన్ని వర్గాల వారిని ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. అయితే, తనకు ఎంతగానో నచ్చిన ‘రయీస్‌’కు సీక్వెల్‌ తీయాలని షారూక్‌ కోరుకుంటున్నాడు. తమిళ్‌లో వరుస హిట్లు తీసిన అట్లీ కుమార్ తో షారూక్‌ ఓసినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చేది రయూస్‌ సీక్వెలే అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ హీరోగా తేరి, మెర్సల్‌, బిగిల్‌ వంటి హిట్‌ చిత్రాలతో మంచి ఫామ్‌లో ఉన్న అట్లీకి మాస్‌ చిత్రాలు కొట్టిన పిండి. కాబట్టి రయూస్‌ సీక్వెల్‌ బాధ్యత అతనికి అప్పజెప్పాలని షారూక్‌ భావించాడని, దీనిపై తొందర్లోనే ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా ఫ్లాప్ సినిమా సీక్వెల్‌తో అయినా షారూక్‌ ఫేట్‌ మారుతుందేమో చూడాలి.

గ్రేటర్‌లో టీఆర్ఎస్ నేతల హడావుడి షూరు..!


త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో ముందస్తుగానే టీఆర్ఎస్ నేతలు అలర్ట్ అవుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా కాలనీలు, బస్తీల మొఖం చూడని నేతలు సైతం ఇప్పుడు కార్పొరేషన్లలో హడావుడి చేస్తున్నారు. బస్తీల్లో పర్యటలను చేస్తూ ప్రజలు అడిగిందే తడవుగా సాయం అందిస్తుండటం వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

Also Read: తెలంగాణలో అవినీతి కథ.. మారుతోందా?

నాలుగేళ్లుగా హామీలు నెరవేర్చని నేతలు ఇప్పటిఇప్పుడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. ఎన్నికల సమయాని కల్లా గతంలో ఇచ్చిన హామీలను పూర్తి చేసేలా నేతలు కసరత్తులు చేస్తున్నారు. అయితే కొన్ని కార్పొరేషన్లలో టీఆర్ఎస్ నేతలను రానివ్వడం లేదని తెలుస్తోంది. నాలుగేళ్లుగా బస్తీల ముఖంచూడని నేతలు ఎన్నికలు వస్తున్నాయని పర్యటనలు చేస్తుండటంపై స్థానికులు మండిపడుతోన్నారు. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఇటీవల కురిసిన వానలకు నగరం అస్తవ్యస్తంగా మారి తాము ఇబ్బందులు పడ్డామని.. అప్పుడురాని నేతలు ఇప్పుడు వస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత టీఆర్ఎస్ కార్పొరేటర్లు బస్తీల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి త్వరలోనే రూ.200 కోట్లు విడుదల చేయనుందని సమాచారం. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ప్రాంతాల్లో ఈ నిధులను తక్షణమే వినియోగించేలా టీఆర్ఎస్ సర్కార్ వ్యూహాలను రచిస్తోంది. ఒక్కో కార్పొరేటర్ కు రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు మంజూరు చేస్తారని తెలుస్తోంది. గతంలోనే మాదిరిగానే ఈసారి గ్రేటర్ ఎన్నికలను మంత్రి కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షిస్తుండటంతో నేతలు అలర్ట్ అవుతున్నారు. కేటీఆర్ సైతం ఎప్పటికప్పుడు కార్పొరేటర్ల పనితీరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుత కార్పొరేటర్లపై ప్రజల్లో ఏవైనా వ్యతిరేకత ఉన్నాయా? అంటూ ఆరా తీస్తున్నారు. నేతల పనితీరు ఆధారంగానే ఈసారి టిక్కెట్ కేటాయించేందుకు కేటీఆర్ రెడీ అవుతున్నారు.

Also Read: కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?

దీంతో నిన్నటి వరకు కరోనా సాకుతో ఇంటికే పరిమితమైన టీఆర్ఎస్ నేతలు బస్తీల్లో హడావుడి చేస్తున్నారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు.. పర్యటనలతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇంకా గ్రేటర్లో ప్రచారం మొదలెట్టేలా కన్పించడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి దూసుకెళ్లాల్సినా ప్రతిపక్షాలు గ్రూపు రాజకీయాలతో మిన్నకుండిపోతున్నాయి. నగరంలో కరోనా ఎఫెక్ట్.. వరదల కారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. దీనిని ఏమేరకు కాంగ్రెస్, బీజేపీలు తమకు అనుకూలంగా మల్చుకుంటాయనేది వేచి చూడాల్సిందే..!

గుడ్‌న్యూస్‌ చెప్పిన కోహ్లీ.. తల్లి కాబోతున్న అనుష్క


భారత్ క్రికెట్‌ జట్టు విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్ అనుష్క శర్మ దంపతులు శుభవార్త చెప్పారు. తొందర్లోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిపారు. గర్భంతో ఉన్న అనుష్కతో దిగిన ఫొటోను ట్వీట్టర్లో పోస్ట్‌ చేసిన విరాట్‌ ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నాడు. తాము ముగ్గురం అయ్యామని, 2021 జనవరిలో అనుష్క తమ బిడ్డకు జన్మనివ్వబోతున్నదని చెప్పాడు. ఈ లెక్కన అనుష్క నాలుగు నెలల గర్భంతో ఉంది. మే నెలలోనే ఆమె గర్భం దాల్చినా ఆ విషయాన్ని ఇద్దరూ రహస్యంగా ఉంచారు.

Also Read: షోలో ఆ తల్లీకూతుళ్లు ఉండాల్సిందేనట !

అనుష్కతో దాదాపు నాలుగేళ్లు డేటింగ్‌ చేసిన విరాట్‌ 2017 డిసెంబర్11న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌తో ఒక్కటైన ఈ జంట.. అనంతరం ఇండియాలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఇచ్చింది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ, సీని, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అప్పటి నుంచి కోహ్లీ, అనుష్క జంట పవర్ఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకుంది. గతంలో చాలా మంది క్రికెటర్లు.. బాలీవుడ్‌ తరాలను పెళ్లి చేసుకున్నా.. ఈ జోడీకి ఉన్న క్రేజ్‌ మరెవరికీ లేదు. ప్రేయసిగా ఉన్నప్పుడే కోహ్లీ ఆటను చూసేందుకు స్టేడియాలకు వచ్చిన అనుష్క… పెళ్లయ్యాక విదేశీ పర్యటనలకు అతనితో కలిసి వెళ్తోంది.

Also Read: ప్రభాస్ పెళ్లి.. అందుకే చేసుకోవట్లేదట !

ఐపీఎల్‌ 2020 సీజన్‌ కోసం విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు. అనుష్క కూడా అతనితో కలిసి దుబాయ్‌ వెళ్లిందని అంటున్నారు. వచ్చే నెల 19న మొదలయ్యే ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టును కోహ్లీ నడిపించనున్నాడు. నవంబర్ 10 తేదీన ఈ టోర్నీ ముగియనుంది. ఆ తర్వాతే విరాట్‌ ఇండియాకు తిరిగి రానున్నాడు. మరోవైపు కొంతకాలంగా కొత్త సినిమాలు అంగీకరించని అనుష్క శర్మ తన ప్రొడక్షన్‌ హౌజ్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టింది. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. అనుష్క ప్రొడ్యూసర్గా ఈ మధ్యే వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌ సిరీస్‌ పాతాల్‌లోక్‌కు మంచి పేరొచ్చింది. కాగా, తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన కోహ్లీ, అనుష్కలకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

https://twitter.com/imVkohli/status/1298856026544906240

ఆ ఘనత ఒక్క ‘అర్జున్‌ రెడ్డి’ డైరెక్టర్ కే దక్కింది !


అర్జున్‌ రెడ్డి.. ఒక చిన్న సినిమా.. కానీ ఈ చిత్రం టాలీవుడ్ లోనే ఓ ట్రెండ్ ను సెట్ చేసింది. బోల్డ్ జోనర్ లోనే మరో రేంజ్ సినిమాగా ఈ సినిమా నిలిచింది. విజయ్ దేవరకొండ అనే అడ్రెస్ లేని ఒక చిన్న హీరోను సెన్సేషనల్ స్టార్ ను చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఈ దశాబ్ధ కాలంలో అర్జున్ రెడ్డి అనేది ఒక బోల్డ్ క్లాసిక్ పీస్. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. లేకపోతే ఈ సినిమాని చూసి బాలీవుడ్ జనాలు కూడా ఎందుకు అంతగా తపన పడతారు. కబీర్ సింగ్ అనే పేరు ఇప్పుడు బాలీవుడ్ లో ఒక ఇంట్రస్టింగ్ ట్రేండింగ్ నేమ్. అర్జున్ రెడ్డి బాలీవుడ్ సినిమాల్లో బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన సినిమాగా కూడా క్రెడిట్ కొట్టేసిందంటే.. ఈ సినిమా స్క్రిప్ట్ వాళ్లకు ఎంతలా నచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Also Read: షోలో ఆ తల్లీకూతుళ్లు ఉండాల్సిందేనట !

ఇలాంటి సినిమాని తెర‌కెక్కించాడు కాబట్టే… సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది. ఏమైనా తొలి సినిమాతోనే క్రేజీ డైరెక్ట‌ర్‌ గా మారడం, పైగా బాలీవుడ్ లో ఇదే సినిమాని క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్క‌డ సూపర్ హిట్ కొట్టి.. పదిహేను కోట్లు డైరెక్టర్ గా చలామణి అవ్వడం అంటే మాటలా. నిజానికి ఒక తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాడం దాసరి నారాయణరావు లాంటి లెజండరీ డైరెక్టర్ కే సాధ్యం కాలేదు. అలాగే రాఘవేంద్రరావు కూడా బాలీవుడ్ సినిమాలు చేసినా.. ఎన్నడూ సందీప్ రెడ్డి రేంజ్ లో పాపులారిటీని సంపాదించలేదు. అయితే ఒక్క అర్జీవీ మాత్రం బాలీవుడ్ లో తెలుగు జెండా ఎగరేశాడు.

Also Read: ప్రభాస్ పెళ్లి.. అందుకే చేసుకోవట్లేదట !

కానీ ప్రస్తుతం అర్జీవీ తెలుగులోనే డిజాస్టర్ డైరెక్టర్ గా పూర్తిగా పతనం అవుతున్న పరిస్థితి. రాజమౌళికి హిందీలో భారీ డిమాండ్ ఉంది గాని, ఆయన డైరెక్ట్ హిందీ సినిమా చేసే ఆలోచనలో లేడు. ఈ లెక్కన సౌత్ ఇండస్ట్రీ నుండి వెళ్లిన డైరెక్టర్స్ లో బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ డమ్ సాధించి.. అక్కడే భారీ హిందీ సినిమాలు చేస్తోన్న డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగాకి ఆ ఘనత దక్కుతుంది. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ లో మరో చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. రణ్ బీర్ సింగ్ హీరోగా మరో భారీ ప్రాజెక్ట్‌ కి సంబంధించి స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేసుకుని త్వరలోనే ప్ర‌క‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు.

విజయనగరంలో దారుణం… కరోనా మృతదేహాలనూ వదలని నీచులు…?

కొందరు దుర్మార్గులు, నీచులు కరోనా శవాలను కూడా వదలడం లేదు. కరోనాతో చనిపోయిన వాళ్ల శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను, నగదును మాయం చేస్తున్నారు. గతంలో తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోగా తాజాగా విజయనగరంలో చోటు చేసింది. విజయనగరంలోని రాజపురంకు చెందిన సరస్వతి అనే మహిళకు కొన్ని రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. సదరు మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృత్యువాత పడింది.

ఆస్పత్రి సిబ్బంది చనిపోయిన సరస్వతిని మార్చురీకి తరలించి మృతదేహం గురించి మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆస్పత్రిలో ఆమె కుటుంబ సభ్యులు మృతదేహం చూడాలని ప్రయత్నించగా ఆస్పత్రి సిబ్బంది అందుకు అంగీకరించలేదు. దీంతో మృతదేహాన్ని తీసుకుని సరస్వతి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. స్మశానానికి వెళ్లి మృతదేహాన్ని చూసిన సరస్వతి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.

సరస్వతి శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ఉంగరాలు మాయమయ్యాయని గుర్తించారు. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యానికి మహిళ బంగారం గురించి ఫిర్యాదు చేశారు. విషయం బయటకు తెలిస్తే ఆస్పత్రి పరువు పోతుందని భావించిన యాజమాన్యం విచారణ జరిపించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మార్చురీ సిబ్బంది సరస్వతి బంగారం, ఆభరణాలు మాయం చేసినట్లు గుర్తించి వాటిని వెనక్కు ఇప్పించారు.

టీడీపీ ఆయువుపట్టుపై కొడుతున్న వైసీపీ


అధికారం మారితే.. అంతా మారిపోతుంటుంది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. టీడీపీ హయాంలో ప్రకృతి వనరులైన మైనింగ్ వ్యాపారంలో కోట్లు కొల్లగొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనూ అలా చేద్దామంటే కుదురుతుందా? అస్సలు కుదరదు.. అధికారంతోపాటే హక్కులు వైసీపీకే చెందుతాయి. అందుకే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు అయితే వైసీపీలో చేరి ఆస్తులు కాపాడుకోవాలి.. లేదంటే చేరకుండా ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్డునపడాలి.. ఇప్పుడు ఇదే ఆప్షన్ ను వైసీపీ.. టీడీపీ ఎమ్మెల్యేలు.. నేతలకు ఇస్తోంది.. ‘వైసీపీలో చేరుతారా? చస్తారా’ అంటూ కుండబద్దలు కొడుతోంది.

Also Read: ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్… ఎందుకోసమంటే..?

నిజానికి వైసీపీలోకి చేరడానికి ఇష్టం లేక బీజేపీలో చేరితే వైసీపీ టచ్ చేయదు అని కొందరు ఆ బాట పడుతున్నారు. కానీ బీజేపీలో చేరే టీడీపీ నేతలను వైసీపీ వదలిపెట్టకుండా వెంటాడుతుండడం కొసమెరుపు.

ఇటీవలే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు గ్రానైట్ లీజులను ప్రభుత్వం రద్దు చేసి పచ్చపార్టీ నేతలందరికీ ఓ గట్టి షాకిచ్చింది. నిజానికి ఎమ్మెల్యే గొట్టిపాటి, పోతులను వైసీపీలో చేరాలని ఆ పార్టీ ఒత్తిడి తెచ్చింది. చంద్రబాబుకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలని ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి లాగాలని చూసింది. అయితే గొట్టిపాటి సహా టీడీపీ ఎమ్మెల్యేలు ముందు వెనుకా ఆలోచించారు. దీంతో ఇక లాభం లేదనుకొని తాజాగా వైసీపీ సర్కార్ కొరఢా ఝలిపించింది.

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుల గ్రానైట్ క్వారీ లీజులను ఏపీ సర్కార్ రద్దు చేసింది. ప్రభుత్వం క్వారీయింగ్ లో లోపాలున్నాయని.. లీజులను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీతోపాటు ఆయన సన్నిహితుల ఆరు క్వారీలు.. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన ఒక క్వారీ లీజును రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా బల్లికురవ వద్ద గరికపాటి రామ్మోహన్ కు చెందిన గ్రానైట్ క్వారీకి ముందుగా రూ.200కోట్ల జరిమానా విధించింది. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కానీ రెండోసారి నోటీసులు ఇచ్చి బుధవారం సాయంత్రం పర్మిట్లు నిలిపివేస్తూ విషయాన్ని గరికపాటి క్వారీ మేనేజర్ కు సూచించింది.

Also Read: ‘మంత్రుల’పై సర్వేలో ఏం తెలిసిందంటే..!

గరికపాటి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో క్వారీ జోలికి అధికారులు వెళ్లరని అంతా భావించారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం బీజేపీలో చేరినా గరికపాటికి షాక్ ఇవ్వడం సంచలనమైంది. టీడీపీ ఎమ్మెల్యేలే కాదు.. బీజేపీలో చేరినా వదిలిపెట్టమని వైసీపీ సర్కార్ ఈ దెబ్బతో నిరూపించినట్టైంది. దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో గరికపాటి కంపెనీ ఉంది.

ఇలా వైసీపీలో చేరితేనే టీడీపీ ఎమ్మెల్యేలకు బతుకు.. లేదంటే అథోగతే అన్న హెచ్చరికను ఈ దెబ్బతో వైసీపీ సర్కార్ ఇచ్చింది. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. మరి ఆర్థికంగా దెబ్బతిని ఆస్తులు పోగొట్టుకుంటారా? లేక వైసీపీలో చేరి కాపాడుకుంటారా అన్న మీమాంస టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల్లో వ్యక్తమవుతోంది.

ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్… ఎందుకోసమంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో పోలవరం ప్రాజెక్టు కోసం అవసరమైన నిధుల గురించి మోదీ ప్రస్తావించారు. సీఎం జగన్ వచ్చే సంవత్సరం చివరినాటికి పోలవరం పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకోసం 15 వేల కోట్ల రూపాయలు అవసరమని…. నాబార్డు నుంచి 15 వేల కోట్ల రూపాయలు తీసుకోవడానికి అనుమతించాలని అన్నారు.

Also Read: కాంగ్రెస్ భవిష్యత్తు ను నాశనం చేస్తున్న గాంధీలు

కేంద్రం నుంచి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు కోసం 3805 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉందని ఆ నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలని చెప్పారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర రివాల్వింగ్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని… రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు ద్వారా నిధుల విడుదలలో నిర్వహణపరమైన జాప్యాన్ని నిరోధించడం సాధ్యమవుతుందని… తద్వారా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.

Also Read: టీడీపీలో మరో విషాదం…. కీలక నేత మృతి…?

కేంద్రం విధివిధానాల వల్ల నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని నిబంధనలను సులభతరం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పునరావాసం కొరకు 5 వేల కోట్లు, ప్రధాన డ్యాం పనులకు 5 వేల కోట్లు, కాల్వల కోసం 5 వేల కోట్లు కేటాయించాలని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలు ఇస్తే ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 12,312.088 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిందని సమాచారం.

టీడీపీలో మరో విషాదం…. కీలక నేత మృతి…?

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని విషాదాలు వెంటాడుతున్నాయి. శ్రీకాకుళానికి చెందిన కీలక నేత రాడ మోహనరావు నిన్న రాత్రి కన్నుమూశారు. న్యాయవాదిగా, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా రాడ మోహనరావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా పేరు తెచ్చుకున్న రాడ మోహనరావు 2014 సంవత్సరంలో బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నర్సన్నపేట నియోజకవర్గంలో ఆయన ముఖ్య నేతగా ఉన్నారు. స్థానికంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రాడ మోహనరావు మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆయనకు భార్య, నలుగురు సంతానం ఉన్నారు. నర్సన్నపేట మండలంలోని నడగాం గ్రామానికి ఆయన పశు వైద్యశాల కొరకు, పాఠశాల కొరకు ఆయన సొంత భవనాలను ఇచ్చారు. మండల ఉపాధ్యక్షుడిగా, డీసీసీబీ డైరెక్టరుగా, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా, వంశధార ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. ఆయన కృషి వల్ల నడగాం 1963 నుంచి 2013 వరకు ఏకగ్రీవ పంచాయతీగా కొనసాగింది.

జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్న రాడా మోహనరావు భార్య చెల్లాయమ్మ నడగాం సర్పంచ్ గా పని చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాడ మోహనరావు మృతి తీరని లోటని సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన తన సేవలను అందించి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని వారు తెలిపారు. రాడ మోహనరావు మృతితొ నడగాం గ్రామంలో, నర్సన్నపేట నియోజవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

షోలో ఆ తల్లీకూతుళ్లు ఉండాల్సిందేనట !


తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన అతి కొద్దిమందిలో సురేఖా వాణి ఒకరు. ఎదిగిన కూతురు ఉన్న, ఇంకా హాట్ లుక్స్ లో కనిపించడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది సురేఖా. ఏమైనా సురేఖా వాణి అంటే.. అదొక తెలియని ఆకర్షణ అంటున్నారు నెటిజన్లు. కూతురుని కూడా తన దారిలోనే పెంచుతూ గ్లామర్ ప్రపంచంలో తన కుటుంబానికంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది. అందుకే సురేఖా వాణి అనగానే ఇప్పుడు కుర్రకారు కూడా బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఒక గ్లామర్ హీరోయిన్ కి ఉండే క్రేజ్ ను ఈ ముదురు నటికి కట్టబెడుతున్నారు. చాలా సినిమాల్లో హీరోలకు అక్కగా, అమ్మగా నటించినా.. ఈ ఆంటీలో కుర్రకారు మాత్రం హీరోయిన్ ఫీచర్స్ నే చూస్తారు. ఒకవిధంగా ఆమెకు పాపులారిటీ రావడానికి కారణం కూడా అదే.

Also Read: హీరోయిన్ మూడో భర్తకు మళ్లీ గుండెపోటు !

ఆ పాపులారిటీని ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంది సురేఖా. కరోనా సమయంలో కూడా సినిమాల షూటింగ్ లు గట్రా ఏవీ లేకపోయినా సరే.. సురేఖా మాత్రం సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కుర్రాళ్ళను రెచ్చగొడుతుంది. తనతో పాటు తన కూతురు సుప్రితతో కలిసి చిందులు వేస్తూ.. కూతుర్ని గ్లామర్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. సురేఖా ఆమె కూతురు డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ రకంగా వాళ్లకంటూ ఓ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఆ ఫ్యాన్స్ ఆనందం కోసం తల్లీకూతుళ్లు కూడా సోషల్ మీడియాలో బాగానే వీడియోలు పెడుతూ వస్తున్నారు. ఈ తతంగం అంతా గమనించిన బిగ్ బాస్ యాజమాన్యం ఈ తల్లీకూతుళ్లు ఇద్దరినీ బిగ్ బాస్ 4 లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: పెంపుడు కుక్కతో ప్రేమలో పడ్డ హీరోయిన్ !

ఇలా వాళ్ళు ప్లాన్ చేశారో లేదో.. అప్పుడే తల్లీకూతుళ్లును బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారంటూ వార్తలు కూడా పుట్టుకొచ్చేసాయి. సురేఖా వాణి కుటుంబ సమేతంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తోందా? ఎంట్రీ ఇస్తే మాత్రం.. షోలో మసాలా డోస్ కాస్త రెట్టింపు అయినట్టే. ఇక ఈ విషయం పై సురేఖ వాణి కూతురు సుప్రితను లైవ్ లో కొంతమంది నెటిజన్లు అడిగారు. మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అని. కానీ తెలివిగా సమాధానాన్ని దాటవేసింది సుప్రిత. ఎంతైనా తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది. మరోవైపు సురేఖా వాణిని ఆమె కూతురు సుప్రితను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని… వాళ్ళు వస్తే.. ఫన్ అన్ లిమిటెడ్ అని సోషల్ మీడియాలో మొత్తానికి నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

తెలంగాణలో అవినీతి కథ.. మారుతోందా?


తెలంగాణలో అవినీతి కథను మార్చేందుకు కేసీఆర్ నడుం బిగించారు.నిజానికి ఈ పని రెండోసారి అధికారంలోకి రాగానే చేపట్టారు. అప్పుడు ఉద్యోగులంతా ఏకమై సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో హోల్డ్ లో పెట్టారు. ఆ తర్వాత గత జనవరిలో మళ్లీ షురూ చేయగా.. కరోనా దాడి మొదలైంది. కాగా ఇప్పుడు మళ్లీ దుమ్ము దులిపి రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు.

Also Read: కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?

తెలంగాణలో దాదాపు 10వేల రెవెన్యూ గ్రామాలున్నాయి. గ్రామానికి ఒక వీఆర్వో ఉండాలి. కానీ ఉన్నది 5900మంది వీఆర్వోలు.. ఇక వీరికింద 22వేల మంది వీఆర్ఏలున్నారు. గడిచిన 8 నెలల కాలంలో ఏకంగా 25 మందికి పైగా వీఆర్వోలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇంత విచ్చలవిడి వీఆర్వోల అవినీతి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది. లంచావతారులుగా మారి కోట్లు కొల్లగొడుతున్న వీఆర్వోల వ్యవస్థనే తీసివేయాలని కేసీఆర్ పట్టుదలతో ముందుకెళ్తున్నారు. కానీ కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లేలా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తుండడంతో ఈ చట్టం రూపుదాల్చడం లేదు.

కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న కేసీఆర్.. వీఆర్వోలను సమూలంగా తొలగించాలని నిర్ణయించారు. వారిని వేరే శాఖల్లో సర్దుబాటు చేయాలని యోచిస్తున్నారు. వీఆర్వోలు అవసరమా అన్న కేసీఆర్ ప్రశ్నకు 90శాతం మంది కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు అవసరమేనని కుండబద్దలు కొట్టడం విశేషం. గ్రామస్థాయిలో రెవెన్యూ, ఇతర ధ్రువీకరణకు వీఆర్వోలే కీలకమని.. వారు లేకపోతే పనులు జరగడం కష్టమని.. తమకు వారే కీలకమని అధికారులు చెప్పారట.. అవినీతి గురించి పట్టని రెవెన్యూ అధికారులు తమ పనులు చక్కబెట్టుకునే ఉద్యోగిగానే వీఆర్వోలను చూడడం గమనార్హం.

కానీ కేసీఆర్ మాత్రం వీఆర్వోలలోని లంచావతారులను ఏరివేయడానికి రెడీ అయ్యాయి. అయితే రెవెన్యూ శాఖ మాత్రం వాళ్లు ఉండాల్సిందేనన్నారట.. ఒకరిద్దరు కలెక్టర్లు మాత్రమే వీఆర్వోలు వద్దంటూ కేసీఆర్ కు సపోర్టు చేశారట..

Also Read: కలిసొచ్చిన కాలం.. టీపీసీసీలో ఉత్తమ్ దే రాజ్యం

తెలంగాణ సహా ఏ రాష్ట్రంలోనైనా రెవెన్యూశాఖ అవినీతితో భ్రష్టుపట్టిపోయింది. తహసీల్దార్లే కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ దొరుకుతున్న దుస్థితి నెలకొంది. అందుకే కేసీఆర్ పట్టుదలతో కొత్త రెవెన్యూ చట్టానికి తుది మెరుగులు దిద్దడానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ చట్టం మాదిరిగానే అవినీతికి ఆస్కారం లేకుండా రూపొందించిన కొత్త రెవిన్యూ చట్టానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా లోపాలు ఉన్నాయని.. ఇక మీద అటువంటి వాటికి ఆస్కారం ఉండని విధంగా సీఎం కేసీఆర్ కొత్త చట్టాన్ని పకడ్బందీగా రూపకల్పన చేసినట్లు సమాచారం.

రెవెన్యూశాఖలో మ్యూటేషన్ దగ్గర నుంచి భూముల క్రయవిక్రయాలు.. రెవెన్యూ వ్యవస్థలోని పనులు అంతా ఆన్ లైన్ లోనే చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తద్వారా అవినీతిని తెలంగాణలో లేకుండా చేయాలని యోచిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అధికారులు ఎంతవరకు సహకరిస్తారన్నది వేచిచూడాలి.

-ఎన్నం

పెంపుడు కుక్కతో ప్రేమలో పడ్డ హీరోయిన్ !


తెలుగు హీరోయిన్ అంజలికి తెలుగులో కంటే.. తమిళంలోనే ఎక్కువ మార్కెట్ ఉంది. ఎక్కువ గుర్తింపు ఉంది. మనోళ్ళకు తెలుగు హీరోయిన్స్ అంటే కాస్త చిన్న చూపు అనేది నిజమే కాబోలు. లేకపోతే అంజలి లాంటి బ్యూటీని కూడా మన దర్శకులు వాడుకోవట్లేదు అంటే.. ఏమనుకోవాలి. సరే.. ఇక అంజలి ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతుంది. సహజంగా సెలెబ్రిటీల్లో చాలా మంది పెట్స్ లవర్స్ అయి ఉంటారనేది తెలిసిందే, ముఖ్యంగా హీరోయిన్స్. పెట్స్ ను కొంతమంది హీరోయిన్స్ సొంత బిడ్డల్లా చూసుకుంటే ఇంకొందరు తోబుట్టువులా చూసుకుంటూ.. వాటితోనే టైం పాస్ చేస్తూ ఉంటారు. ఇక మరికొందరు తన బెస్ట్ ఫ్రెండ్‌లా పెట్స్‌ను ట్రీట్ చేస్తూ.. వాటికి కబుర్లు కూడా చెబుతూ.. వాటితోనే గేమ్స్ కూడా అడకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.

Also Read: ప్రభాస్ పెళ్లి.. అందుకే చేసుకోవట్లేదట !

అయితే అంజలి మాత్రం తన జీవితంలోనే తన పెంపుడు కుక్కకు ప్రముఖ స్థానాన్ని ఇచ్చిందట. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ తెలుగు బ్యూటీ తాజాగా కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేస్తూ.. తన ప్రేమను ఆ రకంగా వ్యక్తపరిచింది. ఇంటర్నేషనల్ డాగ్స్ డే సందర్భంగా అంజలి తన పెట్స్‌ పై తనకున్న తీవ్రమైన ప్రేమను చాలా బలంగానే చాటుకుంది. ఎప్పటినుండో పోలో అనే పెట్‌ను అంజలి చాలా ప్రేమగా పెంచుకుంటుంది. ఈ పోలోని అంజలి తన బాయ్ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తోందట. తన బాయ్ ఫ్రెండ్ గురించి అంజలి చెబుతూ.. నా జీవితంలోకి నువ్ వచ్చి ఇంత ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నందుకు థ్యాంక్స్ పోలో అని అంజలి తెగ సిగ్గు పడిపోతుంది.

Also Read: ‘పుష్ప’ కోసం సుకుమార్ కాపీల గోల !

ఆ మధ్య అంజలి హీరో జైతో ప్రేమాయణం సాగించిన బాగోతం తెలిసిందే. వీరి ప్రేమ వ్యవహారాన్ని ఓ తమిళ నిర్మాత బయటకు చెప్పి.. వీరి గుట్టును రట్టు చేశాడు. మరి ఆ తరువాత ఏమైందో ఏమో గాని, మళ్లీ అంజలి జై ప్రేమ కహానీలు ఎక్కువగా వార్తల్లో రాలేదు. బహుశా జై స్థానాన్ని పోలో కొట్టేసినట్లు ఉన్నాడు. ఇక అంజలి మాత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు నిశ్శబ్దం, వకీల్ సాబ్‌తో రెడీ అవుతోంది. నిజానికి జర్నీ, షాపింగ్ మాల్, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ సినిమాల తరువాత కూడా అంజలి కెరీర్ స్పీడ్ అందుకోకపోవడం అంజలికి లోటే.

హీరోయిన్ మూడో భర్తకు మళ్లీ గుండెపోటు !

మాజీ హీరోయిన్ ‘వ‌నితా విజ‌య‌కుమార్‌’కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇటీవలె ఇండస్ట్రీకే చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నప్పటి నుండి వనితపై బాగా ట్రోలింగ్ జరిగింది. చాలామంది నెటిజన్లు ఆమెను కావాలని టార్గెట్ చేశారు. అయినా కూడా ఆమె అందరికీ తనదైన శైలిలో సమాధానం చెబుతూ తన మూడో పెళ్లిని ఎంజాయ్ చేస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఆమె మూడో భర్త పీటర్ పాల్ ఆరోగ్యం బాగాలేదు. ఆయనకు చాతిలో విపరీతంగా నొప్పి రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని.. ఈ మధ్య ఆయన పెళ్లి అయ్యాక కాస్త వేరే రకం మందులు వాడాడని.. దాంతో ఆయనకు ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది. రెండు వారాల క్రితమే ఆయనకు ఇలాంటి సమస్యనే వచ్చింది. అప్పుడు తగ్గిపోయి.. మళ్లీ ఇలా సడెన్ గా గుండె పోటు రావడం.. వనిత కుటుంబాన్ని కలవర పెడుతొంది. ఇక తన మూడో భర్త పెళ్లి అయినా నెలకే హాస్పిటల్ లో చేరడం పై స్పందించిన వనిత… సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తపరుస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Also Read: ప్రభాస్ పెళ్లి.. అందుకే చేసుకోవట్లేదట !

ఏమైనా వనితకి మొదటి రెండు పెళ్లిళ్లు న‌చ్చ‌క విడాకుల బాట పట్టాక.. ఆ తరువాత ఒంటరిగా ఆమె చాలా నలిగిపోయిందట. మానసికంగా ఎంతో నిరుత్సాహానికి గురి అయిందట. ఆ సమయంలోనే ఆమెకు పీటర్ పరిచయం అయ్యాడు. అతను వనిత కోసం భార్య పిల్లలను వదిలిపెట్టి.. వ‌నితా ఒంటరితనాన్ని అలాగే ఆమె మానసిక బాధను అతను తీర్చాడు. దాంతో చాల నెలలు పీటర్ తో సహజీవినం చేసింది. అతనికి అవకాశాల పరంగా కూడా వనిత చొరవ తీసుకుంది. ఇక అంతా హ్యాపీనే అనుకుని ఆనందంగా పెళ్లి చేసుకుని.. సుఖంగా కాపురం చేసుకుందామని ఎన్నో ప్లాన్స్ చేసుకుంటే.. ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఆమె మూడో భర్త హాస్పిటల్ పాలవ్వడంతో వనిత కంగారు పడుతుంది.

Also Read: ‘పుష్ప’ కోసం సుకుమార్ కాపీల గోల !

పాపం వనిత మొదటి పెళ్లి నుండి నానా ఇబ్బందులు పడుతూనే ఉంది. తనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసే భర్త కోసం, ఆమె నిరంతరం బయటకు కనబడని యుద్ధం తనలో తానే చేస్తూనే వస్తోంది. ఇంత చేసి.. పెళ్లి చేసుకుంటే దేవుడు కూడా ఆమెకి సహకరించడం లేదు. దీనికి తోడు వనిత మీద చేస్తోన్న కామెంట్స్ కూడా ఆమెను తెగ బాధ పెడుతున్నాయి. నాకు టీనేజ్ లో ఉన్న పిల్లలు ఉన్న మాట నిజమే. అంతమాత్రన ఒంటరిగా ఉండిపోవలా.. నేను వయసులో ఉన్నాను, నాకు ఓ తోడు కావాలని ఉంటుంది. అందుకే మూడో పెళ్లి చేసుకున్నాను. నాకే కాదు, ఎవరినైనా ఒంటరితనం బాధ పెడితే.. తోడు కోసం ఆశ పడటంలో ఎలాంటి తప్పు లేదు అని సోషల్ మీడియాలో తన పై కామెంట్స్ చేస్తోన్న వారికి బదులుగా వనిత చెప్పుకొస్తుంది.