Home Blog Page 8343

గల్వాన్ లో చైనా సైనికులు చనిపోయారు.. ఇదిగో సాక్ష్యం..


చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 21మంది భారత సైనికులు అమరులయ్యారు. మన నల్గొండకు చెందిన కల్నల్ కూడా వీరోచితంగా పోరాడి మరణించారు. ఈ క్రమంలోనే ఆ ఘర్షణ తాలూకూ స్ఫూర్తి ప్రజల్లో వెల్లివిరిసింది.

Also Read: ట్రంప్ తిరిగి పీఠం దక్కించు కుంటాడా?

అయితే ఆ రాత్రంతా ఏం జరిగిందనే విషయంలో ఇప్పటికీ బయటపడలేదు. ప్రధాని మోడీని కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇదే విషయంపై గుచ్చి గుచ్చి అడిగాడు. ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై ఐటీబీపీ దళం అధికారికంగా వెల్లడించింది. గల్వాన్ లోయలో ఇటీవల చైనాతో జరిగిన ఘర్షణలో భారత సైన్యం రాత్రంతా పోరాడి ధీటుగా బదులిచ్చిందని.. చైనా సైనికుల ప్రాణాలు కూడా మనకంటే ఎక్కువే పోయాయని ఐటీబీపీ దళం తెలిపింది. కానీ చైనా మాత్రం ఇప్పటివరకు ఘర్షణల్లో ఎంతమంది చనిపోయారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

అయితే దాచేస్తే నిజం దాగదు కదా..చైనా ప్రభుత్వం ఎంత నిజాలను తొక్కిపెట్టాలని చూసినా అది తాజాగా బయటపడింది. తూర్పు లఢక్ లోని గల్వాన్ లోయలో జూన్ 15న భారత సైన్యంతో జరిగిన ఘర్షణల్లో చైనా సైనికులు పెద్ద ఎత్తున మరణించారు. దాదాపు 45-50మంది వరకు మరణించారని వివిధ వార్తా సంస్థలు తెలిపాయి. చైనా మాత్రం వివరించలేదు.

Also Read: మూడు సెకండ్ల వీడియో.. అమెరికాలో హల్చల్

అయితే చైనా దేశ సైనికులు చనిపోయారని తాజాగా చైనా సోషల్ మీడియా వేదిక అయిన ‘వెయ్ బో’లో హల్ చల్ చేస్తున్న ఫొటో తొలి సాక్ష్యంగా నిలిచింది. చైనాకు చెందిన యువ సైనికుడు చెన్ షియాంగ్రాంగ్ (19) సమాధి అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతడి సమాధిపై ‘2020 జూన్ లో భారత సరిహద్దుల్లో భారత బలగాలతో జరిగిన ఘర్షణలో చెన్ షియాంగ్రాంగ్ ప్రాణత్యాగం చేశాడు. కేంద్ర సైనిక కమిషన్ అతడిని స్మరించుకుంటోంది’ అని రాసి ఉంది. ఆగస్టు 5న ఈ సమాధిపై శిలను ఏర్పాటు చేశారు. దీంతో భారత సైనికుల దాడిలో చైనా సైనికులు భారీగానే చనిపోయారన్న విషయం తాజాగా తేటతెల్లమైంది.

కరోనా దెబ్బకు అప్పులపాలు అయిపోతారు : వైద్య శాఖ మంత్రి ఈటెల

ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్టుల సంఖ్యను పెంచారు. దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తి పెరిగిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణలో ఒకేరోజు 60 వేలకు పైగా టెస్టులు నిర్వహించడం గమనార్హం. దానితో రోజుకి 1000-1500 వస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య కాస్తా ఒకే రోజుకు మూడు వేలకు చేరింది. ఇక ఎవరేజ్ గా రోజుకి రెండు వేల కేసులు నమోదు అవుతున్నాయి. కేసీఆర్ సర్కార్ మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంలో ఘోరంగా విఫలం అవుతోండి అన్న విమర్శలు మాత్రం ఆగట్లేదు.

Also Read : కరోనా వేళ ‘క్యాష్’ చేసుకోవడం ఇలా.!

ఇకపోతే ప్రభుత్వం వారు అందిస్తున్న వైద్య సేవల పై నమ్మకం లేక ఎంతోమంది ప్రైవేట్ ఆస్పత్రుల బారినపడి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దందాపై ఎన్ని కమిటీలు వేసినా… హైకోర్టు వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా…. ఏకంగా గవర్నర్ వార్నింగ్ లు ఇచ్చినా… ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక టెస్టులే సరిగ్గా చేయలేని ప్రభుత్వం మాకు వైద్యం ఏరకంగా అందిస్తుంది అన్న భావన వారిలో బలంగా పడిపోయింది అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రజలకు కీలక సూచనలు ఇచ్చారు.

కరోనా సోకిన వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని ఆయన సూచించారు. అక్కడికి వెళ్లారు అంటే కచ్చితంగా మీరు అప్పులపాలు అయిపోతారు అన్నట్టు మాట్లాడిన ఆయన… ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు బాగున్నాయని… అక్కడే వైద్య సేవలు పొందాలని చెప్పారు. గతంలో కూడా తనకు కనుక కరోనా వైరస్ సోకితే… కచ్చితంగా తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే…. అదీ కాకుండా ఎన్నో విమర్శలు వస్తున్న గాంధీ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటానని ఈటెల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ప్రైవేట్ ఆస్పత్రుల విషయానికి వస్తే… రోజుకి లక్షలు ఖర్చయ్యే దగ్గర దాదాపు 30 లక్షల వరకు వసూలు చేస్తున్నారని.. అది మంచి పద్ధతి కాదని ఈటెల రాజేందర్ హితవు పలికారు. ఇకపోతే ఇప్పటికే ఇలా అధిక బిల్లులు చార్జి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా వైద్యం అందించేందుకు అవసరమైన గుర్తింపును రద్దు చేశారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రక్షాళన ఇంకా చాలా ఉందని మంత్రి మాటలను బట్టి తెలుస్తోంది.

Also Read : పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

ట్రంప్ తిరిగి పీఠం దక్కించు కుంటాడా?

గత సోమవారం నుంచి నాలుగు రోజులు రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ జరిగింది. అంతకుముందు వారం డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్ జరిగిన తీరుతెన్నులు వివరించాము. అలాగే ఈ కన్వెన్షన్ తీరుతెన్నులను కూడా మీ ముందుంచుతాము. డెమోక్రటిక్ కన్వెన్షన్ దాదాపుగా దృశ్య మాధ్యమం ద్వారానే జరిగింది. కానీ రిపబ్లికన్ కన్వెన్షన్ ఎక్కువభాగం స్వయంగా కన్వెన్షన్ నుంచే మాట్లాడటం జరిగింది. మిగతా కొద్దిమంది మాత్రమే దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చివరిరోజు వైట్ హౌస్ బయట పచ్చికల్లో కొన్ని వేలమంది మద్దతుదారుల ఈలలు, చప్పట్ల మధ్య తన నామినేషన్ అంగీకార సందర్భ సమావేశం లో మాట్లాడాడు. అలాగే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చారిత్రాత్మక బాల్టిమోర్ కోట నుంచి ప్రసంగించాడు. ఇంకో ముఖ్య ప్రభుత్వ అధికారి పాంపియో ( విదేశాంగమంత్రి ) ఇజ్రాయిల్ రాజధాని జరూసలెం నుంచి ప్రసంగించాడు. ఈ మూడు ఉపన్యాసాలు అధికార దుర్వినియోగం కిందకు వస్తాయని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైట్ హౌస్ ని ఎన్నికల వేదికగా ఉపయోగించటం దుస్సంప్రదాయమని , చట్ట వ్యతిరేకమని దీనిపై తగు చర్యలు తీసుకుంటామని డెమోక్రాట్లు చెబుతున్నారు. ( ప్రతినిధుల సభ లో డెమోక్రాట్లు పూర్తి మెజారిటీ లో వున్నారు). ఇకపోతే కన్వెన్షన్ వివరాల లోకి వెళ్దాం.

Also Read : అందుకే ఆ మూడు దేశాలలో అన్ని కేసులు?

ఇది ట్రంప్ పూర్తి ఆధిపత్యంలో జరిగిన సమావేశం 

2016 లో ఒహాయో లో జరిగిన సమావేశానికి ఇది పూర్తి భిన్నం. ఆ సమావేశం రసాభాసగా జరగటం, ట్రంప్ అతికొద్ది తేడాతో నామినేట్ కావటం అందరికీ తెలిసిందే. దానితో పోలిస్తే ఈ సమావేశం పూర్తిగా ట్రంప్ నాయకత్వం లో జరిగింది. ఒకవిధంగా చెప్పాలంటే పూర్తి ఇక్యతతో ఈ సమావేశం జరిగిందని చెప్పొచ్చు. సమావేశం లో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ట్రంప్ నాయకత్వాన్ని పొగుడుతూ ఈ నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ సమావేశం లో ఇంకో విశేషమేమంటే పాత రిపబ్లికన్ నాయకులు అధ్యక్షుడు బుష్ గానీ, ఉపాధ్యక్షులు , ఉపాధ్యక్ష అభ్యర్దులెవ్వరూ పాల్గొనక పోవటం. కాకపోతే అదో పెద్ద అంశంగా ఎవరూ పరిగణించక పొవటం. అంతా ట్రంప్ మయమే. ఒకవిధంగా చెప్పాలంటే రీగన్ తర్వాత వ్యక్తి ఆరాధన తో జరిగిన సమావేశం ఇది. ట్రంప్ క్యారక్టర్, ప్రవర్తన, ప్రవృత్తి పై ఎన్నో వివాదాలున్నా రిపబ్లికన్ పార్టీ లో ట్రంప్ నాయకత్వం పై మంచి ఉత్సాహం తోనే వున్నారని చెప్పొచ్చు. ఇంకో గుణాత్మకమైన మార్పు, పోయిన ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన పారిశ్రామిక కార్మిక వర్గ మొగ్గు మరింత ట్రంప్ వైపు ఉన్నట్లే కనబడుతుంది. వీరందరూ కాలేజీలో చదువుకోని తెల్ల జాతీయులే. ట్రంప్ విధానాలే మమ్మల్ని కాపాడతాయని బలంగా నమ్ముతున్నారు. సమావేశం లో ఇంకో కొట్టొచ్చిన మార్పు మైనారిటీలు ట్రంప్ ప్రభుత్వం లో ఏ విధంగా ప్రయోజనం పొందారో ఏకరువు పెడుతూ వీళ్ళ చేత మాట్లాడించటం. నల్ల జాతీయులు , ఇస్పానిక్కులు ( స్పానిష్ భాష మాట్లాడే మధ్య , దక్షిణ లాటిన్ అమెరికా ప్రజలు), క్యూబన్లు , ఆసియా మూలాల ప్రజలు, యూదులు, అమెరికన్ ఇండియన్లు ఈ సమావేశాల్లో మాట్లాడటం జరిగింది. ఒకవైపు నల్ల జాతీయులు ‘నల్లవాళ్ళ జీవితాలు కూడా జీవితాలే’ అనే నినాదం తో దేశవ్యాప్తంగా హోరెత్తిస్తుంటే ఈ సమావేశం లో మైనారిటీల చేత మాట్లాడించి మా ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకం కాదనే భావన తీసుకురావటం కోసం ప్రయత్నం జరిగింది. అయినా పోయిన ఎన్నికల్లో కేవలం 8 శాతం మంది నల్ల జాతీయులు, 25 శాతానికి అటూ ఇటుగా ఇస్పానిక్కులు, ఆసియా మూలాల ప్రజలు మాత్రమే రిపబ్లికన్లకు ఓటు వేశారు. ఇస్పానిక్కుల్ని, నల్ల జాతీయుల్నిఆకర్షించే పనిలో భాగంగా ‘ ఇష్టమొచ్చిన పాటశాలను ఎన్నుకొనే స్వేచ్చ’ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం చేసిందని ప్రచారం చేసారు. ముఖ్యంగా ఇస్పానిక్కుల్లో ఈ నినాదం బాగా ఆకర్షిస్తుందని ట్రంప్ అనుయాయులు నమ్ముతున్నారు. అలాగే క్రిమినల్ న్యాయ వ్యవస్థ లో మార్పులకు స్వీకారం చుట్టామని కూడా చెప్పుకొచ్చారు. అసలు నల్ల జాతీయులకు ఈ ప్రభుత్వం లో జరిగినంత మేలు ఏ ప్రభుత్వం లో జరగలేదని కూడా చెప్పారు. కరోనా మహమ్మారి రాకముందు నల్ల జాతీయుల్లో చరిత్రలోనే అతి తక్కువ నిరుద్యోగ సమస్య వుందని ఇది తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద మైనారిటీలకు మా ప్రభుత్వం లో జరిగినంత ప్రయోజనం ఇంతకుముందు ఏ ప్రభుత్వం లో జరగలేదని వక్తలందరూ చెప్పారు. అయినా ఇప్పటికీ శ్వేత జాతీయేతరుల్లో అత్యధికులు డెమొక్రాట్ల వైపే వున్నారు. కారణం తెల్లవాళ్ళు ఎక్కువగా రిపబ్లికన్ల వైపు సమీకరించబడటం, నల్లవాళ్ళ పై దాడులు జరగటం లాంటి సామాజిక ఉద్రిక్తతల వలన ఈ సమీకరణ జరగటం సహజమే. ఇకపోతే భారతీయ అమెరికన్లలో కూడా ఎక్కువమంది డెమొక్రాట్ల వైపే వున్నారు. అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో కొంత మార్పు కనబడుతుంది. మోడీ -ట్రంప్ హ్యుస్టన్ సభ , డెమోక్రాట్లు కాశ్మీర్ సమస్యపై భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడటం, ట్రంప్ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం లాంటి అంశాలతో భారతీయ అమెరికన్లలో చీలిక బాగానే ఉండొచ్చని అనుకుంటున్నారు. నిక్కీ హేలి సమావేశం లో మాట్లాడిన దానిపై కొంతమంది చేసిన ట్వీట్లు వివాద మయ్యాయి. అదికూడా భారతీయ అమెరికన్ల లో డెమొక్రాట్ల పై కోపం తెప్పించింది.

Also Read : గెలుపు కోసం మోదీ నే నమ్ముకున్న ట్రంప్

సమావేశ ఫోకస్ ఎలావుంది?

ప్రధానంగా సమావేశం అమెరికా మూల విలువలు, స్వేచ్చ, స్వాతంత్రాల పై ఎక్కువగా కేంద్రీకరించారు. డెమోక్రాట్లు ఏ విధంగా అమెరికా విలువలను తూట్లు పొడుస్తున్నారో చెప్పటానికి ప్రయత్నించారు. అలాగే రాడికల్ లెఫ్ట్ ( తీవ్రవాద వామపక్షం) మెల్లి మెల్లిగా డెమోక్రటిక్ పార్టీ పై ఆధిపత్యం ఏర్పరుచుకొని తమ ఎజండా ని అమలుచేస్తారని ప్రచారం చేసారు. సోషలిస్టు సమాజాన్ని తీసుకురావాలని జరిగే ప్రయత్నానికి పరోక్షంగా జో బైడెన్ మద్దతిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసారు. ట్రంప్ దాదాపు 70 నిముషాలు ముగింపు ఉపన్యాసం వైట్ హౌస్ నుంచి ఇచ్చాడు. నేను ‘అమెరికా ఫస్టు’ కోసం ప్రయత్నిస్తుంటే డెమోక్రాట్లు ‘రాజకీయ నాయకులు ఫస్టు’ గా పనిచేస్తున్నారని చెప్పాడు. నేను ‘మేడ్ ఇన్ అమెరికా’ కోసం ప్రయత్నిస్తుంటే జో బైడెన్ ‘మేడ్ ఇన్ చైనా’ కోసం ప్రయత్నిస్తున్నాడని విమర్శించాడు. చైనాకు వ్యతిరేకంగా నేను గట్టిగా నిలబడితే జో బైడెన్ చైనాకు దాసోహ మయ్యాడని మన లక్షలాది ఉద్యోగాలు చైనా కు తరలిపోవటానికి దోహదపడ్డాడని ఆరోపించాడు. వ్యాపార ఒప్పందాలు నా హయాం లో అమెరికాకి ప్రయోజనం కలిగించే విధంగా మారాయని ఇది ఈ నాలుగు సంవత్సరాల్లో మేము సాధించిన ఘనతగా చెప్పుకొచ్చాడు. ఒక్క నాటో కూటమి తోనే అదనంగా 130 కోట్ల బిలియన్ డాలర్లు చెల్లించే ఒప్పందం చేసుకున్నానని ఇది ముందు ముందు 400 బిలియన్లు గా మారుతుందని చెప్పాడు.

వలస విధానం పై మాట్లాడుతూ  నా హయాం లో ఇప్పటికే 300 మైళ్ళ సరిహద్దుగోడ నిర్మించానని అదే డెమోక్రాట్లు అధికారం లోకి వస్తే సరిహద్దులు బార్లా తెరుస్తారని ఆరోపించాడు. అక్రమ వలసల పై ఖటిన వైఖరిని అవలంబించానని చెప్పాడు. అమెరికా మిలిటరీ ని మరింత శక్తివంతం గా తీర్చిదిద్దానని కొత్తగా అంతరిక్ష రక్షణ దళాన్ని ఏర్పాటు చేసానని, సిరియా లో ఇసిస్ ని తుదముట్టించానని దాని నేత అబూ బెకర్ ని మట్టుబెట్టానని కూడా చెప్పాడు. కరుడుగట్టిన ఉగ్రవాది ఇరాన్ మిలిటరీ నేత ఖస్సిం సులేమాని ని అంతమొందించానని ప్రకటించాడు.   అదే బైడెన్ హయాం లో ఏమీ చేయలేకపోయారని కూడా చెప్పాడు. తిరిగి అధికారం లోకి వస్తే ఇష్టమొచ్చిన స్కూల్ ని ఎంచుకునే విధానాన్ని అందరికీ విస్తరిస్తానని కూడా చెప్పాడు. మరింత పన్ను తగ్గింపు లుంటాయని ప్రకటించాడు. ఇటీవలి కాలంలో జరుగుతున్న హింసపై మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లో మాబ్ రూల్ ని ఒప్పుకోమని మరింత ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెప్పాడు. వచ్చే నాలుగేళ్లలో అమెరికా ని ప్రపంచ తయారీ హబ్ గా తయారు చేస్తానని , మెడికల్ డివైజెస్ తయారీ హబ్ గా కూడా తయారు చేస్తానని చెప్పాడు. మొత్తం మీద ఈలలు, చప్పట్ల మధ్య క్యాడర్ ని ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించాడు.

Also Read : మూడు సెకండ్ల వీడియో.. అమెరికాలో హల్చల్

ఎన్నికల వేడి రాజుకుంది 

రెండు పార్టీల నాలుగురోజుల సమావేశాలతో అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంది. తర్వాత సెప్టెంబర్ చివరలో మొదలై మూడు డిబేట్లు జరుగుతాయి. దీనిలో ఇరువురి అధ్యక్ష అభ్యర్ధులు చెప్పే సమాధానాలు అమెరికా ప్రజలు జాగ్రత్తగా గమనిస్తారు. ఈ చర్చలు అమెరికా ఓటింగ్ పై ప్రభావం చూపుతాయి. ఇప్పటికున్న అంచనా ప్రకారం బైడెన్ ట్రంప్ పై 9 పాయింట్ల ఆధిక్యతలో వున్నాడు. అయినా పాపులర్ వోటు సూచిక మాత్రమే. అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్రాలనుంచి ఎన్నికైన డెలిగేట్లు. అందులో ఎవరి తరఫున ఎక్కువమంది ఎన్నికైతే వాళ్ళే అధ్యక్షులవుతారు. దీనిపై వివరంగా వచ్చే వారాల్లో చర్చించుకుందాము. అమెరికా ఎన్నికల పై మేమిచ్చే లోతైన విశ్లేషణ ఆసక్తిగల భారతీయ చదువరులకు కనువిందు కలిగిస్తుందని హామీ ఇస్తున్నాము. సెలవు మరి.

అట్టడుగు స్థానంలో ఏపీ..! ఇలా ఉంటే కష్టమే జగన్

జగన్ మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అయిన తర్వాత ఎంతోమంది ఎన్నో రివ్యూలు, విశ్లేషణలు ఇచ్చేశారు. అందరూ చెబుతున్నది ఏమిటంటే…. ఆయన సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన అభివృద్ధి కార్యకలాపాలపై అసలు అతనికి ఈ ఆలోచన కాదు కదా కనీస అవగాహన కూడా లేదని విమర్శలు చేశారు. గడచిన ఏడాది కాలంగా విపక్షాలు కూడా ఇదే విషయాన్ని పదేపదే మొత్తుకుంటున్నాయి.

Also Read : ‘రక్తపాత దినోత్సవం ఎఫెక్ట్’ : సాయి రెడ్డికి రక్త కన్నీరు తెప్పించింది

అంతెందుకు నిజానికి వైఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద పెట్టిన దృష్టి ఓవరాల్ అభివృద్ధి మీద అసలు పెట్టలేదని వైసిపి వర్గాలే ఆఫ్ ది రికార్డ్ గా ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ విషయం ఎందుకు తెరమీదకు వచ్చింది అంటే… తాజాగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్…. తదితర కేటగిరీలలో రాష్ట్రం పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయింది అని నీతి అయోగ్ చెప్పింది. ఇక సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ కి ఆరో ర్యాంకు వస్తే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కి మాత్రం 20వ ర్యాంక్ వరించింది.

అసలు తీరప్రాంతం ఎక్కువగా కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగైన ఎక్స్పోర్ట్ పాలసీలను కలిగి ఉండాలి .తెలంగాణ కంటే ఎంతో ముందంజలో ఉండాలి. కానీ ఈ విషయంలో జగన్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవని…. ఇక ఇదే పరిస్థితి చాలా కాలంగా ఉంటే ఎలా అని నీతి అయోగ్ కడిగిపారేసినట్టు మీడియాలో కథనాలు దర్శనమిచ్చాయి. సాధారణంగా కేంద్రం నుంచి వచ్చే వివిధ ర్యాంకుల విషయమై ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయి ఏమిటో ప్రజలకు చూపించడానికి ఆసక్తి కనబరుస్తాయి. అయితే ఈ సారి మాత్రం ఏపీ అధికార పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేదు.

“మెరుగైన పాలసీలు రూపొందిస్తాం…. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం” అన్న మాటలు కేవలం ప్రచారానికే పరిమితం అయిపోయాయి. ఎక్స్పోర్ట్ పాలసీల సంగతి పక్కన పెడితే…. ఇండస్ట్రీలు, కంపెనీలు, ఐటీ సెక్టార్ ఎదుగుదల ఉద్యోగాల కల్పన లాంటివి ఏమీ లేవు. కేవలం నవరత్నాలు, సంక్షేమ పథకాలు, జగనన్న పథకం, వైయస్సార్ పథకం…. ఈ పథకం…. ఆ పథకం. అంతే…! పబ్లిసిటీ మీద పెట్టిన చిత్తశుద్ధి అభివృద్ధి మీద పెడితే ఫలితాలు బాగుంటాయి అని సర్వత్రా మొదలైపోయింది. ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్, ఇన్ఫ్రా స్ట్రక్చర్, యాక్సెస్ టు ఫైనాన్స్ తదితర విభాగాల్లో రాష్ట్రం పనితీరు అత్యంత అధ్వానంగా ఉందని నీతి అయోగ్ పేర్కొంది. మరి వీటి పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read : సీఎం జగన్, వైసీపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే?

‘రక్తపాత దినోత్సవం ఎఫెక్ట్’ : సాయి రెడ్డికి రక్త కన్నీరు తెప్పించింది

ఈ మధ్యకాలంలో వైసిపి పార్టీ ముఖ్య నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వేస్తున్న ట్వీట్లు అంతా ‘రివర్స్ అటాక్’ కు ప్రత్యర్థులకు ఆస్కారం ఇస్తూ ఉన్నాయి. తను ఏమి మాట్లాడాలనుకున్నా… ముందు ట్వీట్ల రూపంలో చెప్పి ఆ తర్వాత మైకు ముందుకు వచ్చే సాయి రెడ్డి ఇలా ట్వీట్ల ద్వారా పొందే ఆనందం ఏమిటో అతనికే తెలియాలి కానీ మొత్తానికి ఈ మధ్య కాలంలో ఆయన ట్వీట్లు జగన్ మోహన్ రెడ్డిని బాగా ఇబ్బంది పెడుతూ వచ్చాయి.

Also Read : పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఇంత వైలెంటా?

వివరాల్లోకి వెళితే.. తాజాగా ఆయన వేసిన ట్వీట్ లో చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ‘బషీర్ బాగ్ కాల్పుల’ ఘటనను ప్రస్తావిస్తూ దీన్ని ‘చంద్రన్న రక్తపాత దినోత్సవం’ గా గుర్తించాలని విజయసాయిరెడ్డి ట్వీట్ వేశాడు. ఆగస్టు 25వ తేదీన విశ్వాసఘాతకుడు గా 25 ఏళ్ళు పూర్తి చేసుకుని ‘వెన్నుపోటు దినోత్సవం’ జరుపుకున్న బాబు ఆగస్టు 28న ‘రక్తపాత దినోత్సవం’ జరుపుకుంటున్నారు అని విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్ బాగానే పేలింది…. కానీ అందుకు వచ్చిన రెస్పాన్స్ లు రిప్లై లు చూస్తేనే సాయిరెడ్డికి అతను చేసిన తప్పు తెలిసి వస్తుంది.

వాళ్ల తెలుగు తమ్ముళ్ళో లేదా ఇతర పార్టీ వారో తెలియదు కానీ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ‘ముదిగొండ కాల్పుల’ ఘటనను ప్రస్తావిస్తూ దానిని ‘వైఎస్ఆర్ రక్తపాత దినోత్సవం’ గా జరుపుకోవాలా అని చాలామంది ప్రశ్నించారు. ఇదంతా ఎందుకు…. తాజాగా అమరావతిలో గడిచిన గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని అణిచివేసేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపుతోంది.

తుపాకీ అయితే ఇంకా పేలలేదు గానీ లాఠీలు మాత్రం రోజూ విరుగుతున్నాయని…. మహిళలని కూడా చూడకుండా పోలీసులు చేసిన ఓవరాక్షన్ పై కోర్తు వారు వేసిన మొట్టికాయలను గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో హైకోర్టు దెబ్బకు వైసీపీ పరిస్థితి ఏమంత బాగాలేదు. ఇలాంటి సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్న అతను ‘రక్తపాత దినోత్సవం’ లాంటి మాటలు మాట్లాడితే ఎలా? తిరిగి అవి రివర్స్ లో మనకే తగులుతాయి అని ఆ మాత్రం తెలియదా అని సొంత పార్టీ వర్గాలే గొణుక్కుంటున్నాయట. మరి విజయసాయిరెడ్డి జాగ్రత్తపడతారా లేదా ఎప్పటిలాగే ఏదైనా నా ట్వీట్లు మాత్రం ఆపేది లేదని మొండికేసి కూర్చుంటారా…? చూద్దాం…!

Also Read : పేకాట శిబిరం వెనుక మంత్రి?

సీఎం జగన్, వైసీపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే?

ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టు రాజధాని తరలింపుపై స్టేటస్ కో (యథాతథ స్థితి)ని వచ్చే నెల 21వ తేదీ వరకు పొడిగించింది. రాజధాని ప్రాంతాలలో నిర్మాణాల విషయంలో స్టేటస్ కో వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. పిటిషన్లలో ప్రతివాదులుగా ఉన్న సీఎం జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, వైసీపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీల అధ్యక్షులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Also Read : పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఇంత వైలెంటా?

నోటీసులు అందుకున్న వారు పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే 21 రోజుల్లో వేయాలని తెలిపింది. స్టేటస్ కో ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలో విశాఖలోని గ్రేహౌండ్స్ కొండపై అతిథిగృహ నిర్మాణం చేపట్టడంపై హైకోర్టు సీరియస్ అయింది. అతిథి గృహ నిర్మాణం గురించి చీఫ్ సెక్రటరీ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అతిథి గృహం నిర్మాణానికి స్టేటస్ కో అమలులో ఉన్న సమయంలో ఎందుకు చర్యలు చేపట్టారో రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఆర్డీఏను కోర్టు ఆదేశించింది.

ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసిన తరువాత పిటిషనర్లు వారం రోజుల్లో వాటికి సమాధానం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. అనంతరం విచారణను సెప్టెంబర్ 21 వరకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. పిటిషన్ల విచారణను భౌతికంగా నిర్వహించాలా లేక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించాలా….? అనే విషయాన్ని విచారణకు వారం రోజుల ముందు నిర్ణయిస్తామని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జేవీ శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిన్న ఈ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : జగన్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇది ! ఇంకో మాట లేదు

సోనియా.. చంద్రబాబుల పరిస్థితి ఒకటేనా?


ఒకప్పుడు ఆ రెండు పార్టీలు జాతీయ, స్థానిక రాజకీయాల్లో చక్రం తిప్పాయి. కానీ ప్రస్తుతం ఆ రెండు పార్టీలు దీనస్థితికి చేరుకున్నాయి. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న ఆ రెండు పార్టీలు ఇప్పుడు దీనస్థితిలోకి చేరడానికి కారణం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు చేయకపోవడం ఒక కారణమైతే.. ఇక వారసత్వంపై మమకారం ఆ రెండు పార్టీలను దెబ్బతీశాయనే టాక్ విన్పిస్తున్నాయి. ఇంతకీ ఆ రెండు పార్టీలెంటో ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది.

Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?

కేంద్రంలో ఏళ్లతరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వంలో యూపీఎ కూటమి రెండుసార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. పదేళ్లపాటు అధికారంలో ఉండటం.. పలు స్కాములో యూపీఏ ఇరుక్కోవడంతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. ఈ సమయంలో బీజేపీ పుంజుకోవడంతో మోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోదీ అయ్యాక పలు సంచలన నిర్ణయాలతో రెండోసారి అధికారం చేపట్టిన సంగతి తెల్సిందే.

దశాబ్దకాలంగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండటంతో నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతుండటంతో కాంగ్రెస్ క్రమంగా బలహీనం అవుతోంది. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వయస్సు పైబడటం.. అనారోగ్య కారణాలతో ఇంతకుముందులా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. ఇక ఆమె తనయుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవీ చేపట్టేందుకు నిరాకరిస్తున్నారు. అదే అదనుగా పార్టీలోని సీనియర్లు రాహుల్ గాంధీకి పదవీ దక్కకుండా పావులు కుదుపుతున్నారు. దీనిని ముందుగానే గ్రహించిన సోనియాగా ప్రస్తుతానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవీని తన దగ్గరే పెట్టుకున్నారు. అయితే ఇలా ఎంతకాలం నెట్టుకొస్తారనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

Also Read: సొంత గూటికే డీకే అరుణ?

మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతన ఏపీలోనూ ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ కూడా అలాగే మారింది. కిందటి ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సృష్టించిన ప్రభంజనానికి టీడీపీకి ఇంకా కోలుకోవడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీని టార్గెట్ చేయడంతో ఆ పార్టీ నేతలంతా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడికి కూడా వయస్సు పైబడటంతో మునుపటిలా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. ఆయన తనయుడికి రాజకీయంగా నెట్టుకొచ్చే నాయకత్వం లేదనే టాక్ విన్పిస్తుంది.

టీడీపీ ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఒక్క ఓటమితోనే టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. లోకేష్ నాయతక్వంపై టీడీపీ నేతలకు పెద్దగా నమ్మకం లేకపోవడంతో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. తనయుడిలో చేతిలో టీడీపీ భవిష్యత్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు చూస్తుంటడటంతో ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. దీంతో సోనియాగాంధీ, చంద్రబాబుల పరిస్థితి ఒకేలా మారిందనే కామెంట్లు విన్పిస్తున్నాయి. వీరిద్దరికి కూడా వారి పుత్రరత్నాలే మైనస్ అనే టాక్ విన్పిస్తుంది. ‘పండితపుత్ర.. పరమ సుంఠ’ అనే నానుడిని ఇందుకు పలువురు ఉదహరించడం కొసమెరుపు.

ఏపీలో మద్యం తాగితే మూడేళ్లలో చనిపోయే ప్రమాదం: రఘురామ

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఏపీలోని మద్యం గురించి తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని చిత్రవిచిత్రమైన బ్రాండ్లు ఉన్నాయని…. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యం తాగితే రెండు, మూడేళ్లలో చనిపోయే అవకాశం ఉందని అన్నారు. మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యం బ్రాండ్లు అన్నీ ఒకే కంపెనీలో తయారవుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో తయారవుతున్న మద్యం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన వైసీపీ దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మడం సరి కాదని వ్యాఖ్యానించారు. ప్రజలు రాష్ట్రంలో దొరికే ఊరూ పేరు లేని బ్రాండ్లను తాగకపోవడమే మంచిదని ఎంపీ సూచించారు. నాసిరకం బ్రాండ్ల మద్యం తాగితే కాలేయ సంబంధిత సమస్యలు ఏర్పడటంతో పాటు ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని చెప్పారు.

రాష్ట్రంలో విచిత్రమైన పేర్లతో మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయని… ఈ మద్యం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో…. వీటి ధరలను ఎవరు నిర్ణయిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ మాయదారి మద్యం బ్రాండ్ల గురించి సీఎం జగన్ కు తెలియదని తాను అనుకుంటున్నానని రఘురామ అన్నారు. ప్రభుత్వం బ్రాండ్ల విషయంలో విచారణ జరిపి ప్రజల ఆరోగ్యం కాపాడాలని సూచనలు చేశారు.

పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ తన పార్టీ వ్యక్తి కాకపోయినా.. ప్రత్యర్థి పార్టీ నుంచి ప్రధాని అయినా.. తెలంగాణ యోధుడు పీవీ నరసింహారావుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎంతలా అంటే.. కాంగ్రెస్ కూడా ఈయనను గౌరవించనంత.. కేసీఆర్ కాంగ్రెస్ నేతలను మించి పీవీ నామస్మరణ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Also Read: సొంత గూటికే డీకే అరుణ?

పీవీ నరసింహారావు.. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన గొప్ప కాంగ్రెస్ ప్రధాని. కానీ సోనియా గాంధీ మాటను లెక్కచేయకపోవడంతో కాంగ్రెస్ లో అవమానాలు ఎదుర్కొన్నాడు. కనీసం ఆయన సమాధికి కూడా ఢిల్లీ స్థలం లేకుండా సోనియా అడ్డుకుందనే అపవాదు ఉంది.

అందుకే ఇప్పుడు పీవీ అంటే నచ్చని సోనియాగాంధీని ఎదిరించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పీవీని గట్టిగా స్మరించుకోలేని దుస్థితి. అలాంటి సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డుకు ‘పీవీ జ్ఞాన్ మార్గ్’గా పేరు పెడుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ‘పీవీ’కి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించడం విశేషం. అలాగే హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మాణం చేపడుతామని.. పీవీ నరసింహరావు గొప్ప సంస్కర్త అని ప్రపంచం గుర్తించిన తెలంగాణ బిడ్డ అని కేసీఆర్ ప్రశంసించారు.

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి పీవీ పేరు.. పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డు.. పీవీ విగ్రహాలను ఢిల్లీ తెలంగాణ భవన్ లో పెట్టడం.. ఇలా పీవీని నెత్తిన పెట్టుకున్నాడు కేసీఆర్.

Also Read: ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గెలుపు కష్టమేనా?

కాంగ్రెస్ మరిచినా.. స్మరించుకోని పీవీని కేసీఆర్ ప్రతీసారి స్మరించుకుంటూ కొనియాడుతున్నారు. కొందరేమో.. ఆయన కేసీఆర్ సామాజికవర్గం కాబట్టి ఇలా చేస్తున్నాడని అంటే.. మరికొందరేమో ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఇరుకునపెట్టాలని చేస్తున్నాడని అంటారు. మొత్తానికి పీవీతో కేసీఆర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాడు.

-ఎన్నం

కరోనా వేళ ‘క్యాష్’ చేసుకోవడం ఇలా.!

0


కరోనా వేళ అందరి దుకాణాలు మూతపడ్డాయి. అందరూ రోడ్డున పడ్డారు. ఉద్యోగ ఉపాధి కోల్పోయి దిక్కులు చూస్తున్నారు. కానీ ఈ కరోనా కల్లోలంలోనూ ఉపాధిని వెతుక్కోవచ్చని మీకు తెలుసా? కాస్త సృజనాత్మకథ ఉంటే చాలు.. ఆదాయం అదే వస్తుందని నిరూపించాడు తెలంగాణలోని మారుమూల బాన్సువాడ గిరిజన జనాలుండే చోట ఓ హోటల్ నిర్వాహకుడు. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతూ సంపాదనను పెంచుకుంటున్నాడు.

Also Read: ‘గాల్లో’ ఎగరాలంటే మాస్కు ఉండాల్సిందే..!

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా.. ఇప్పుడు మన గ్రామాలకు కూడా పాకింది. ఫిబ్రవరిలో మొదలైన భయం ఇంకా ప్రజల్లో కనిపిస్తూనే ఉంది. కంటికి కనిపించని వైరస్‌ అందరినీ హైరానా పెడుతోంది. బయటకివెళ్తే ఎవరి నుంచి ఎలా వస్తుందో తెలియకుండా ఉంది. అందుకే ప్రజలు మరీ ముఖ్యమైన పని పడితే కానీ ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు. దీంతో రెస్టారెంట్లు, హోటల్స్‌, ఫాస్ట్ ఫుడ్‌ సెంటర్స్‌ అన్నీ మూతపడ్డాయి. దీనికితోడు ఇమ్యునిటీ పవర్‌‌ పెంచుకుంటే కరోనా దక్కరకు రాదంటూ డాక్టర్లు చెబుతుండడంతో జనాలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఏం తింటే ఇమ్యునిటీ పవర్‌‌ పెరుగుతుందో ప్రస్తుతం వాటినే తింటున్నారు. దీన్ని పలువురు వ్యాపారులు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే మార్కెట్లోకి కరోనా టీ అంటూ ఆయుర్వేద మూలికాలతో తయారు చేసే టీకి గిరాకీ పెరిగింది. ఇప్పుడీ టీస్టాల్‌ నిర్వాహకుల తెలంగాణలో జోరుగా వ్యాపారం చేస్తున్నారు… తాజాగా ఆయుర్వేదిక్‌ చికెన్‌ ధమ్‌ బిర్యానీ అంటూ ఓ హోటల్‌ నిర్వాహకులు వెరైటీ ఆలోచన చేశారు. ఈ బిర్యానీ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. మొన్నటి దాకా హోటల్‌ బిజినెస్‌ కుదేలు కావడంతో వీరు కొత్త ట్రెండ్‌ సెట్‌ చేశారు. ఈ బిజినెస్‌ ప్రస్తుతం మార్కెట్లో హల్‌చల్‌గా నడుస్తోంది. ఆలోచన ఉంటే ఎందులోనైనా సక్సెస్‌ కావచ్చని నిరూపిస్తున్నారు.

Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన ఐస్‌ లాండ్‌ హోటల్‌ నిర్వాహకులు థింక్‌ డిఫరెంట్‌లా ఆలోచించాడు. బిర్యానీలో దాల్చిన చెక్క, సొంఠి, మిరియాలు, లవంగాలు, ఉసిరి, తులసి పౌడర్‌‌తో పాటు వివిధ రకాల మూలికలు వేస్తూ తయారుచేస్తున్నారు. ఈ బిర్యానీని భోజన ప్రియులు కూడా లొట్టలేసుకుంటూ తింటున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి మరీ పార్శిల్‌ తీసుకెళ్తున్నారు. నోరూరించే ఈ ధమ్‌ బిర్యానీ ధర కూడా కేవలం రూ.140 మాత్రమేనని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇలా అందరి హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డ వేళ ఈయన హోటల్ ముందు మాత్రం జనాలు క్యూలు కట్టి మరీ ఆయుర్వేద బిర్యానీ తీసుకెళుతుండడం విశేషంగా మారింది. అందుకే అంటారు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనీ..

పవన్‌ బర్త్‌డే స్పెషల్‌… ఓ సర్ప్రైజ్‌, ఓ సస్పెన్స్‌


ఈ వారంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పండగలా జరుపుకున్న అభిమానులు ఇప్పుడు మరో ఫెస్టివల్‌కు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవర్‌‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ 49వ పుట్టినరోజును అదిరిపోయే రేంజ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్‌ బర్త్‌డే కోసం నెల రోజుల నుంచే ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్నారు. పవర్ స్టార్ బర్త్‌ డే కామన్‌ డిస్‌ప్లే పిక్చర్ రీట్వీట్లతో వరల్డ్‌ రికార్డు సృష్టించారు. సెప్టెంబర్ రెండో తేదీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు వారి కోసం పవన్‌ కళ్యాణ్‌ నుంచి కూడా బహుమతి సిద్ధమవుతోంది. ఒక సర్ప్రైజ్‌తో పాటు ఓ సస్పెన్స్‌ తో కూడిన ట్రీట్‌ ఇవ్వనున్నాడు పవన్‌.

Also Read: ‘ఎన్టీఆర్’కి రాజకీయాలే వ్యాపారం అట !

అజ్ఞాతవాసి తర్వాత కొంతకాల ఇండస్ట్రీకి దూరమైన పవన్.. ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్‌. ఇందులో పవర్ స్టార్ లాయర్ పాత్రలో కనువిందు చేయనున్నాడు. నివేదా థామస్, అంజలి, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దిల్‌రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోర్టు హాల్‌లో పవన్‌ అదిరిపోయే పెర్ఫామెన్స్‌ అభిమానులను మెస్మరైజ్‌ చేసేలా తీర్చిదిద్దుతున్నాడు వేణు. కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయినప్పటికీ పవన్‌ పుట్టిన రోజున ‘వకీల్‌ సాబ్‌’ నుంచి సర్ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని చిత్ర బృందం ప్లాన్‌ చేసిందని సమాచారం. సెప్టెంబర్ రెండో తేదీన ఈ మూవీ మోషన్‌ పోస్టర్తో పాటు కుదిరితే టీజర్ కూడా రిలీజ్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. చివరి నిమిషం వరకూ దీన్ని సస్పెన్స్‌గా ఉంచాలని చూస్తోందట.

Also Read: సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కి సినిమా లేదు !

మరోవైపు పవన్‌ తదుపరి సినిమాకు దర్శకత్వం వహించే క్రిష్‌ కూడా ఓ బహుమతి రెడీ చేస్తున్నాడట. సెప్టెంబర్రెండో తేదీన తమ సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేసి సర్ప్రైజ్‌ ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ లెక్కన పవన్‌ అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ గ్యారంటీ.

ధోనీ టీమ్‌లో 13 మందికి కరోనా.. ఐపీఎల్‌పై నీలినీడలు!


భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఎన్నో వ్యయప్రయాసలు పడి ఎడాది దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) లో ప్లాన్‌ చేసిన ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. సెప్టెంబర్ 19వ తేదీన మొదలవ్వాల్సిన ఈ మెగా టోర్నమెంట్‌ సాఫీగా సాగడం అనుమానంగా మారింది. లీగ్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఎంఎస్‌ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే) టీమ్‌పై కరోనా పంజా విసిరింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఆ జట్టులో ఏకంగా 13 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒకరు టీమ్‌ పేసర్ కాగా.. మరో 12 మంది సహాయ సిబ్బంది. అత్యంత సురక్షిత వాతావారణంలో దుబాయ్‌లో ఉన్న ఈ జట్టులో ఒకే సారి ఇంతమందికి కరోనా సోకడం కలకలం సృష్టించింది.

Also Read: ‘గాల్లో’ ఎగరాలంటే మాస్కు ఉండాల్సిందే..!

చెన్నై జట్టు ఈ నెల 21వ తేదీన ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకుంది. యూఏఈ ప్రభుత్వం, బీసీసీఐ నిబంధనల ప్రకారం అప్పటి నుంచి వారం రోజుల పాటు కచ్చితమైన క్వారంటైన్‌లో ఉంది. ఆటగాళ్లు, సిబ్బంది టీమ్‌ హోటల్లో తమకు కేటాయించిన గదులకే పరిమితం అయ్యారు. కనీసం పక్క గదుల్లోకి కూడా ఎవ్వరూ రాలేదు. వారం రోజుల క్వారంటైన్‌ గురువారమే పూర్తి కావడంతో ప్రాక్టీస్‌కు రెడీ అయ్యారు. కానీ, ప్లేయర్లకు నిర్వహించిన మూడో టెస్టులో 13 మందికి పాజిటివ్‌ అని తేలడంతో అందరూ షాకయ్యారు. అయితే, కరోనా సోకిన వారి వివరాలను బోర్డు బహిర్గతం చేయలేదు. కానీ, ఇటీవలే టీమిండియాకు ఆడిన ఓ మీడియం పేసర్కు పాజిటివ్‌ వచ్చిందని తెలిసింది. సదరు ప్లేయర్ దీపక్‌ చహల్‌, శార్దుల్‌ ఠాకూర్లో ఒకరు అని అర్థమవుతోంది.

Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?

ఇంతమందికి కరోనా సోకడం చెన్నై సూపర్ కింగ్స్‌ సన్నాహాలపైనే కాకుండా ఐపీఎల్‌ షెడ్యూల్‌ను కూడా ప్రభావితం చేసేలా ఉంది. ఎందుకంటే బీసీసీఐ రూపొందించిన గైడ్‌లైన్స్‌ ప్రకారం కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్‌ వస్తేనే.. బయో బబుల్‌ లో ఇతర ప్లేయర్లను కలిసేందుకు అనుమతిస్తారు. మరో నాలుగు వారాల్లో టోర్నీ మొదలవుతున్న నేపథ్యంలో సీఎస్కేకు చెందిన 13 మంది రెండు వారాల పాటు హోటల్‌ గదులకే పరిమితం కానున్నారు. 12 మంది సపోర్ట్‌ స్టాఫ్‌ లేకపోతే చెన్నై టీమ్‌ సాధనపై ప్రభావం పడనుంది. బీసీసీఐ ఇప్పటికీ షెడ్యూల్‌ ఖరారు చేయలేదు. తాజా పరిణామంతో షెడ్యూల్‌ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. దాంతో, టోర్నీ అనుకున్న టైమ్‌లోనే మొదలవుతుందా? అంటే అనుమానమే!

‘ఎన్టీఆర్’కి రాజకీయాలే వ్యాపారం అట !


‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేస్తోన్న మూవీ కథ ఇదేనంటూ తాజాగా ఈ సినిమా కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో త్రివిక్రమ్ ఈ సినిమా కథ రాసుకున్నారని.. కాకపోతే కథా నేపథ్యంలో తెలుగుతనం తేవడానికి పలనాడు ప్రాంతం నేపథ్యాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎంటర్ టైనర్ అని.. సినిమాలో ఎన్టీఆర్ కమర్షియల్ బిజినెస్ మెన్ లా నటిస్తున్నాడని.. ఈ క్రమంలోనే పలనాడులోని ఒక పురాతన పాడు బడిన కోటలోని గుప్త నిధుల కోసం తారక్ ఇండియాకి వస్తాడని.. అయితే పక్కా బిజినెస్ మైండెడ్ అయిన హీరోకి ఇండియాలోని పాలిటిక్స్ కి మించిన బిజినెస్ లేదనిపిస్తోందట.

Also Read: పవన్‌ బర్త్‌డే స్పెషల్‌… ఓ సర్ప్రైజ్‌, ఓ సస్పెన్స్‌

దాంతో రాజకీయాలనే తన వ్యాపారంగా మలుచుకున్న హీరో కథే ఈ సినిమా కథ అని.. చివర్లో హీరో చేసిన ప్రతి చెడు పనికి ఒక మంచి ఉంటుందని.. అది ట్విస్ట్ గా రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఇక సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి సెంటిమెంట్ లేని ఒక ఎన్నారైగా కనిపించబోతున్నాడు. పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని తారక్, మొదటిసారి తన పూర్వీకులు కట్టించిన కోటలోని నిధి కోసం ఇండియాకి వస్తాడు. అలా తనకు ఏ మాత్రం అవగాహన లేని రాజకీయ నేపథ్యంలోకి డబ్బులు కోసం అడుగు పెట్టి.. నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయనే కోణాన్ని వ్యంగ్యంగా మలుచుకుని హీరో సినిమాని నడిపిస్తాడట.

Also Read: సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కి సినిమా లేదు !

మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాగానే వేరియేషన్స్ ఉండేలా కనిపిస్తున్నాయి. అన్నట్టు తారక్ పాత్రతో పాటు త్రివిక్రమ్ మరో కీలక పాత్రను కూడా రాస్తున్నాడని.. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, లేదా మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ నటిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని.. అందులో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోవాలని చిత్రబృందం ఫిక్స్ అయిందని సమాచారం. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తోన్నారు.

దిల్‌ రాజు బొనాంజ.. ప్రభాస్‌, బన్నీతో మల్టీస్టారర్?


మల్టీస్టారర్స్ కాన్సెప్ట్‌ ఇప్పటిది కాదు. బాలీవుడ్‌లో ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఇప్పుడది సక్సెస్ ఫార్ములాగా మారింది. దక్షిణాదిలోనూ తరచూ మల్టీస్టారర్స్‌ వస్తున్నాయి. తమిళ్‌, కన్నడ, మలయాళంలో వాటి పరిధి పెరిగింది. కానీ, తెలుగులో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ మూవీ వస్తున్నాయి. కానీ, ఏడాదికి ఒకటో రెండో వస్తున్నాయి. అవీ యువ హీరోలవే. వెంకటేశ్‌ మినహా పెద్ద స్టార్లు ఎవ్వరూ ఇతర స్టార్లతో తెర పంచుకునేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. తమ ఇగో, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, వాళ్లను మెప్పించే కథలు లేకపోవడం దానికి కారణం. అయితే, 1970, 80 దశకాల్లో చివరకు 90ల వరకూ తెలుగులో మల్టీస్టారర్ల హవా నడించింది. అప్పట్లో అగ్ర నటులుగా వెలుగొందిన ఎన్టీఆర్, ఏఎన్నార్కలిసి ఎన్నో పౌరాణిక, కమర్షియల్‌ చిత్రాల్లో నటించారు. అవన్నీ మంచి విజయాలు కూడా సాధించాయి. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి… జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్చిత్రం తీస్తున్నాడు. ఇప్పుడు దిల్‌ రాజు కూడా ఇలాంటి ఓ భారీ చిత్రం తీయాలని ప్లాన్‌ చేస్తున్నాడు. ఇందులో హీరోలుగా ప్రభాస్‌, అల్లు అర్జున్‌ను తీసుకోవాలని చూస్తున్నాడట.

Also Read: బన్నీ- కొరటాల.. భరత్‌ అనే నేను ఫార్ములా

డార్లింగ్‌, బన్నీతో ఆర్ఆర్ఆర్ ను మించిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్‌ రాజు భావిస్తున్నట్టు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రభాస్‌ ఇదివరకే దిల్‌ రాజుకు డేట్స్‌ ఇచ్చాడు. కానీ, వివిధ కారణాల వల్ల వీరిద్దరి సినిమా వర్కౌట్‌ కాలేదు. అలాగే, డీజే తర్వాత బన్నీ కూడా దిల్‌ రాజుతో మరో సినిమా చేయాల్సి ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో ఐకాన్‌ అనే సినిమాను కూడా ప్రకటించారు. కానీ, దీన్ని పక్కనపెట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ మల్టీస్టారర్ కోసం ప్రభాస్‌, బన్నీని ఒక్కటి చేయాలని ఈ బడా నిర్మాత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్నాడు. దీని తర్వాత నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమా, ఓం రౌత్‌ డైరెక్షన్‌లో ఆదిపురుష్‌ కూడా చేయాల్సి ఉంటుంది. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ‘పుష్ప’లో నటిస్తున్నాడు. అలాగే, కొరటాల శివతో తన కొత్త ప్రాజెక్టును కూడా అనౌన్స్‌ చేశాడు.

Also Read: సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కి సినిమా లేదు !

ప్రభాస్‌, బన్నీ ప్రస్తుత కమిట్మెంట్స్‌ పూర్తయ్యే సరికి కనీసం రెండేళ్లు పట్టేలా ఉంది. ఆ తర్వాతే ఈ ఇద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ను పట్టాలెక్కించాలని దిల్‌ రాజు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నాడు. ప్రభాస్‌ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్ గా మారిపోగా… సౌతిండియాలో ఇప్పటికే మంచి ఫాలోయింగ్‌ ఉన్న అల్లు అర్జున్‌ ‘పుష్ప’తో పాటు కొరటాలతో సినిమాను హిందీలో రిలీజ్‌ చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ ప్రభాస్‌, బన్నీ మల్టీస్టారర్ ఓకే అయితే మాత్రం ఇద్దరి ఫ్యాన్స్‌కు పండగే. అలాగే, ఇండియా లెవెల్లో ఇదో భారీ చిత్రం కానుంది.

సొంత గూటికే డీకే అరుణ?


దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెసులో డీకే అరుణ చక్రం తిప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా చేసి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన మరణం.. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో డీకే అరుణకు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలకు విసుగుచెంది ఆమె కిందటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీలోకి వెళ్లారు. మహబూబ్ నగర్ ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read: ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గెలుపు కష్టమేనా?

మహబూబ్ నగర్ జిల్లా రాజకీయానికొస్తే డీకే అరుణ పేరు విన్పిస్తుంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో 2004లో ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర డీకే అరుణకు ఉంది. కాంగ్రెసులో ఉన్నప్పుడు మహిళా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కంచుకంఠంతో సమస్యలపై తన గళాన్ని బలం విన్పించడంతో డీకే అరుణ ముందుంటారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రి చేసిన అనుభవం డీకే అరుణకు ఉంది. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి డీకే అరుణ గట్టి పోటీ ఇచ్చారు. టీఆర్ఎస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ గ్రూపు తగదాలతో కొంతకాలం డీకే అరుణ ఇబ్బందులు పడ్డారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఓటమి పాలయ్యాక సైలంటయ్యారు. లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ హవా వీస్తుందని ఆ పార్టీలోకి చేరారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నా ఆమెకు సరైన గుర్తింపు లభించడం లేదు. కాంగ్రెస్ లో చక్రం తిప్పినట్లు బీజేపీలో రాజకీయాలు చేయలేకపోతున్నారు. అంతేకాకుండా ఆమెకు బీజేపీ అధిష్టానం మద్దతు పెద్దగా లభించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిస్తోంది.

Also Read: జై కేటీఆర్‌‌.. ఆయనే మా సీఎం

ప్రస్తుతం కాంగ్రెసులో సత్తాచాటుతున్న రేవంత్ రెడ్డి ద్వారానే కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట. ఒకే జిల్లాకు చెందిన వీరిద్దరి మధ్య ఒకప్పుడు రాజకీయంగా బేధాభిప్రాయాలు నెలకొన్నాయి. రాజకీయం శత్రువులుగా మారినా వీరిద్దరు ఒకే సామాజిక వర్గం కావడంతో ప్రస్తుతం టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారివారి అవసరాల రీత్య కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెసులోకి రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తన ప్రాభవాన్ని చాటాలని డీకే అరుణ భావిస్తున్నారట. కొద్దిరోజులుగా డీకే అరుణ సొంతగూటికి వెళుతారనే ప్రచారం జిల్లాల్లో జోరుగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.