Home Blog Page 81

రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా..

Revanth Reddy political style

Revanth Reddy political style : రేవంత్ రెడ్డి .. యంగెస్ట్ సీఎం.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యువ సీఎం. ఆయనకు పార్టీలు ముఖ్యం కాదు.. పార్టీలను ఒక సాధనంగా వాడుకొని పైకి వచ్చిన వ్యక్తి. రేవంత్ రాజకీయ ప్రయాణం అలానే కనిపిస్తోంది. మాటల గారెడీతో ఆకట్టుకోగలదు. అవతల వారిని హర్ట్ చేసినా చింతించడు. అది ఎంత పెద్ద నాయకుడు అయినా.. మోడీ స్థాయి ఏంటి.. మోడీపై కూడా అలాంటి డైలాగులు మాట్లాడుతాడు. అలాంటి మోడీతోనే సన్నిహితంగా మెలగలరు. కేవలం ట్రాన్సాక్షన్ నాయకుడు. ఈ వ్యవహారశైలి బాగానే ఉంటుంది. హైడ్రా వంటి మంచి ప్రయత్నం హైదరాబాద్ లో కొనసాగుతోంది.కొన్ని ఆరోపణలున్నా మంచి పనులే చేస్తున్నారు.

హైడ్రా, మూసీ పనులు మంచి పనులు. మెట్రో ఎయిర్ పోర్టు విస్తరణ తుగ్గక్ పని.. హైడ్రా ఇన్స్పిరేషన్ హిట్లర్ అని.. రెడ్లు సహజ పాలకులు అంటాడు. చాలా స్లిప్ట్ పర్సనాలిటీని ఎక్కడా చూడలేం.

మెట్రో విస్తరణ విషయంలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శించాడు. కేంద్రమంత్రుల వద్ద రేవంత్ రెడ్డి పరపతి సరిపోవడం లేదు. పబ్లిక్ లో తిట్టేసి ఒత్తిడి తీసుకొచ్చాడు. అదే కిషన్ రెడ్డిని పట్టుకొని వెళ్లి అశ్వినీ వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గరకు తీసుకెళ్లి మెట్రో విస్తరణపై పని చేసుకొని పెట్టాడు కిషన్ రెడ్డి. పబ్లిక్ గా బ్లాక్ మెయిల్ తీసుకొచ్చి కిషన్ రెడ్డి పనిచేయించుకున్నాడు రేవంత్ రెడ్డి..

రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడొచ్చు. 

కాక్రోచ్ జనతా పార్టీ.. కార్పొరేట్ టూల్ కిట్.. వందల కోట్లు.. నడిపిస్తున్నది ఎవరు..

Cockroach Janata Party Controversy
Cockroach Janata Party Controversy

Cockroach Janata Party Controversy: పగలేమో నిరసనలు చేస్తున్నారు. రాత్రి ఏమో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి ప్రాంతంలోనూ నిరసన చేపట్టే ముందు హంగామా చేస్తున్నారు. ఇండిపెండెంట్ ఉద్యమాలు అని చెబుతూనే.. లగ్జరీ లెవెల్ లో నిరసనలు చేపడుతున్నారు. వాస్తవానికి ఇదంతా ఎలా జరుగుతోంది.. ఈ ఖర్చు మొత్తం ఎవరి భరిస్తున్నారు.. అభిజిత్ ఒక పిలుపు ఇవ్వగానే ఒక వర్గానికి సంబంధించిన మేధావులు ఎందుకు వస్తున్నారు.. వారంతా ఏం చేస్తున్నారు.. దీనిని ఎవరు నడిపిస్తున్నారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు కొంతమంది పాత్రికేయులకు కలిగాయి. వారు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తే దారుణమైన నిజాలు వెలుగు చూశాయి.

అప్పట్లో రైతు చట్టాలను కేంద్రం తీసుకొచ్చినప్పుడు టూల్ కిట్ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి మనదేశంలో చాలామంది సపోర్ట్ చేశారు. అందులో కమ్యూనిస్టు పార్టీలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఆకస్మాత్తుగా ఖలిస్తాన్ నినాదం పుట్టింది. ఆ తర్వాత ఢిల్లీలో ఎర్రకోట మీద జాతీయ జెండాకు బదులుగా వేర్పాటు వాదులు తమ జెండాను ఎగరవేశారు. దీంతో వారి ఎజెండా క్లియర్గా కనిపించింది.

ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కూడా కొంతమంది పాత్రికేయులు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇదంతా కూడా కార్పొరేట్ టూల్ కిట్ మాదిరిగానే ఉంది.. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్.. ఇతర సోషల్ మీడియా ఖాతాలు పనిచేయడం లేదు. ఆయనప్పటికీ వాటి సంబంధించిన డిజిటల్ వ్యవహారాలలో ఫుట్ ప్రింట్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేసి కనిపిస్తున్నాయి.. పైగా నిరసనలు చేపడుతున్నప్పుడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు దరఖాస్తు చేసిన వారందరికీ సందేశాలు వెళుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న నిరసనలో పాల్గొనాలని పిలుపులు వెళ్తున్నాయి. లక్షల మంది విద్యార్థులకు అలా సందేశాలు వెళ్లడం వెనక ఎగ్జామ్ జీట్ ఆప్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. డేటా హార్వెస్టింగ్ కూడా చేపడుతున్నట్టు సమాచారం. ఇదంతా అంతా సులువైన వ్యవహారం కాదు. దీని వెనక పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు.. పేరుపొందిన హ్యాకర్లు పనిచేస్తూ ఉంటారు. బొద్దింకల ఉద్యమానికి వీరంతా ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు.. ఎన్ని కోట్ల ఖర్చు ఎందుకు పెడుతున్నట్టు.. అదే ఆందోళన కలిగిస్తోంది.

పైగా కాక్రోచ్ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న కొన్ని వెబ్సైట్లో సోలానా బిట్ కాయిన్ గేట్ వే లు కనిపిస్తున్నాయి. ఇవి మనీలాండరింగ్ వ్యవహారాలలో కీలకంగా ఉంటాయి. ఎందుకంటే వీటి ద్వారా సులభంగా నల్లధనాన్ని తెల్లగా మార్చవచ్చు. మనదేశంలో ప్రభుత్వ బ్యాంకుల సర్వర్లు ఒప్పుకోనప్పటికీ.. ఎప్పటికప్పుడు హ్యాకర్లు డొమైన్ లు మార్చుతున్నారు. ఇలా వందల కోట్ల డబ్బు ఖర్చు పెట్టడం.. తెర వెనుక కార్పొరేట్ వ్యక్తులు ఉండడం.. ఈ ఉద్యమంలో కొంతమందిని భాగస్వాములు చేయడం చూస్తుంటే దేశాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నినట్టు తెలుస్తోంది..

నీట్ పరీక్ష నిర్వహణ దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టకూడదు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, నీట్ లో లోపాలను సాకుగా చూపించి కొంతమంది కృత్రిమ ఉద్యమాలు సృష్టించి.. దేశంలో అస్థిరత సృష్టించే పనులు చేపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఎందుకంటే ఈ దేశం అందరిది. ఈ దేశంలో ఏవైనా దారుణాలు జరిగితే బాధపడేది కూడా అందరే.

'ఓజీ 2' నిర్మాత మార్పు పై మూవీ టీం సంచలన ప్రకటన.. ఫ్యాన్స్ కి పండుగ లాంటి వార్త..

OG 2 Producer Change
OG 2 Producer Change

OG 2 Producer Change: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి ఘోరమైన ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ అసలు సినిమాలు చేస్తాడా?, లేదంటే కేవలం పాలనపైన మాత్రమే ఫోకస్ పెడుతాడా అనే అనుమానాలకు చెక్ పడిన సంగతి తెలిసిందే. ఆయన తదుపరి చిత్రం తన కెరీర్ లో మైల్ స్టోన్ లాగా నిల్చిపోయిన ‘ఓజీ’ సీక్వెల్ ‘ఓజీ 2’ చేయబోతున్నాడని స్పష్టమైన క్లారిటీ అభిమానులకు ఇచ్చాడు. రీసెంట్ గానే ఈ చిత్ర డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ సినిమా షూటింగ్ ప్రణాళిక పై చర్చలు జరిపాడు. అందుకు సంబంధించిన ఫోటో ని విడుదల చేయగా , అది సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టించింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ , లక్షల కొద్దీ లైక్స్ ఈ ఫోటో కి వచ్చాయి. దీనికే ఈ రేంజ్ క్రేజ్ ఉంటే , ఇక ఫస్ట్ లుక్ రోజు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని అంటున్నారు నెటిజెన్స్.

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా , ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని విడుదల చేస్తారని , అదే నెలలో ముహూర్తపు కార్యక్రమాలు జరిపి , నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెడతారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నుండి నిర్మాత DVV దానయ్య తప్పుకున్నాడని , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిమరించడానికి ముందుకొచ్చిందని , పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా నిర్మాణం లో భాగం కాబోతుందని , ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీడియాకు పవన్ కళ్యాణ్ టీం కీలక సమాచారం అందించింది. ఈ సినిమా నిర్మాత గురించి సోషల్ మీడియా లో రకరకాల చర్చలు జరగడం మేము గమనిస్తూనే ఉన్నాము.

అవన్నీ నమ్మకండి , సరైన సమయం వచ్చినప్పుడు , అన్ని వివరాలను తెలియజేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో DVV ఇప్పటికీ ఉన్నాడా?, ఉంటే చాలా బాగుంటుంది అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే DVV సంస్థ ఆన్లైన్ లో ఈ సినిమా విడుదల సమయం లో ఇచ్చిన అప్డేట్స్ కి అభిమానులు మెంటలెక్కిపోయేవారు , అంతే కాకుండా ఆ హ్యాండిల్ కి విపరీతమైన రీచ్ కూడా ఉంది. అందుకే DVV కూడా భాగం అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరి వాళ్ళు అవుతారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా మొదలు అవ్వలేదు. త్వరలోనే క్యాస్టింగ్ ని కూడా నిర్ణయిస్తారట.

గ్రీన్‌కార్డు హోల్డర్లకు ట్రంప్‌ షాక్‌.. అమెరికా పౌరసత్వ మరింత ఖరీదు

Trump Green Card Holders Shock
Trump Green Card Holders Shock

Trump Green Card Holders Shock: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం తీసుకున్నారు. ఏ పని చేసినా అమెరికా ఫస్ట్‌ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే దేశంలోకి వచ్చే విదేశీయులకు ఇచ్చే హెచ్‌–1బీ వీసా నిబంధనలు కఠినం చేశారు. తాజాగా స్టూడెంట్‌ వీసా పరిమితిని నాలుగేళ్లకు తగ్గించారు. తాజాగా అమెరికా పౌరసత్వాన్ని మరింత ఖరీదు చేశారు. యునైటెడ్‌ స్టేట్స్‌ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న విదేశీయులకు పెద్ద ఆందోళన కలిగించే నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ దరఖాస్తు రుసుములను ఏకంగా 75 శాతం వరకు పెంచాలని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. ఈ మార్పులు చట్టబద్ధమైన పౌరసత్వ ప్రక్రియను మరింత కష్టతరం చేసేందుకు ఉద్దేశించినవని అధికారులు చెబుతున్నారు.

ఫీజు పెంపు వివరాలు…
యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ విడుదల చేసిన ముసాయిదా ప్రకారం, సాధారణ పేపర్‌ దరఖాస్తు (ఫామ్‌ ఎన్‌–400) రుసుము ప్రస్తుతం 760 డాలర్ల నుంచి 1,330 డాలర్లకు పెరగనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు రుసుము కూడా 710 డాలర్ల నుంచి 1,280 డాలర్లకు పెరుగుతుంది. అప్పీల్‌ కోసం సమర్పించే ఫామ్‌ ఎన్‌–336 రుసుము 830 డాలర్ల నుంచి 1,475 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పుల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, దరఖాస్తులను పరిశీలించడం, ధృవీకరించడం వంటి మొత్తం ఖర్చును దరఖాస్తుదారుల నుంచే వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఫీజు మినహాయింపులు పూర్తిగా రద్దు
ఇప్పటివరకు తక్కువ ఆదాయం ఉన్నవారికి, ప్రభుత్వ సాయం పొందుతున్నవారికి అందుబాటులో ఉన్న ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని కొత్త నిబంధనలు పూర్తిగా తొలగించనున్నాయి. అదేవిధంగా, ఫెడరల్‌ పేదరిక ప్రమాణాలకు లోబడి ఉన్నవారికి ఇచ్చే 380 డాలర్ల తగ్గింపు రుసుము కూడా ఇకపై లభించదు. ఉచితంగా లేదా తక్కువ రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటం వల్ల అనర్హులు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వాదిస్తోంది. అయితే, అమెరికా సాయుధ దళాల్లో పనిచేస్తున్న సైనికులకు మాత్రం ఈ రుసుము మినహాయింపు కొనసాగుతుంది.

ఎప్పటి నుంచి అమలు?
ఈ ప్రతిపాదిత మార్పులు వెంటనే అమల్లోకి రావు. ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేయడానికి 60 రోజుల సమయం ఇచ్చారు. ఆ తర్వాతే తుది నిర్ణయం వెల్లడవుతుంది. ఇటీవల గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తుదారులు తమ స్వదేశాల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని జారీ చేసిన మెమో ఇప్పటికే వలసదారులను ఆందోళనలోకి నెట్టిన నేపథ్యంలో, ఈ ఫీజు పెంపు ప్రతిపాదన మరింత ఆందోళన కలిగిస్తోంది.

అమెరికా చాలా కాలంగా వలసలను ప్రోత్సహించే దేశంగా ఉండేది. ప్రస్తుతం అదే దేశం చట్టబద్ధమైన వలస ప్రక్రియను కఠినతరం చేస్తూ, ఆర్థిక భారాన్ని పెంచుతూ ఉండటం నిపుణులు విమర్శిస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులపై ఈ మార్పులు అత్యధిక ప్రభావం చూపనున్నాయి.

రామ్ చరణ్ - సుకుమార్ మూవీ షూటింగ్ ప్రారంభం తేదీ ఫిక్స్.. ఫ్యాన్స్ కి ఇక పండగే..

Ram Charan
Ram Charan

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ , ఇండస్ట్రీ హిట్స్ ఉండొచ్చు. రాబోయే రోజుల్లో కూడా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమాలు రావొచ్చు. కానీ ఆయన కెరీర్ లో అభిమానులకు ‘రంగస్థలం’ లాంటి థియేట్రికల్ అనుభూతిని అందించడం చాలా కష్టం. కేవలం సుకుమార్ మాత్రమే ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయగలడు. అందుకే చరణ్ అభిమానులు సుకుమార్ తో సినిమా కోసం ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘పుష్ప’ మూవీ రన్నింగ్ లో ఉన్న సమయం లోనే వీళ్లిద్దరి కాంబినేషన్ మరో సినిమా రాబోతుందని అధికారిక ప్రకటన చేశారు. కానీ అంతకంటే ముందు ‘గేమ్ చేంజర్ ‘, ‘పెద్ది’ చిత్రాలను పూర్తి చేయాల్సి వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గేమ్ చేంజర్ ‘ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిలబడగా , ‘పెద్ది’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

‘పెద్ది’ ఇచ్చిన సక్సెస్ ఊపు నుండి రామ్ చరణ్ ఇంకా బయటకు రాలేదు. నేడు కూడా హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో నేడు ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ సభ జరగబోతుంది. ఈ సభకు మెగాస్టార్ చిరంజీవి , సుకుమార్ లు కూడా హాజరు కాబోతున్నారు. సుకుమార్ తన ప్రసంగం లో రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ చెప్తాడా లేదా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అందుతున్న విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , ఈ సినిమాని ఈ ఏడాది దసరా కానుకగా మొదలు పెట్టే ఆలోచన లో ఉన్నట్టు తెలుస్తోంది. గతం లో రామ్ చరణ్ తో ‘రంగ స్థలం’ లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేసిన సుకుమార్, ఈసారి మాత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ముందుగా రెండు మూడు స్టోరీ లైన్స్ అనుకున్నారని , కానీ చివరికి యాక్షన్ ఎంటర్టైనర్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతున్నారట. నేడు ‘పెద్ది’ విజయోత్సవ సభలో ఈ ప్రకటన చేస్తే చాలా బాగుంటుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి సుకుమార్ చెప్తాడో లేదో చూడాలి. ఒకవేళ చెప్తే మాత్రం సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ క్రేజ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ , మరి సుకుమార్ అంత తొందరగా ఈ సినిమాని పూర్తి చేస్తాడో లేదో చూడాలి.

బొద్దింకల అసలు కుట్ర ఇలా బయటపడింది..

NEET Protest Controversy
NEET Protest Controversy

NEET Protest Controversy: పేరుకేమో నీట్ ఉద్యమం. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా మేధావులను పిలిపిస్తున్నారు. విద్యార్థులను పోగు చేస్తున్నారు. ఆ తర్వాత నినాదాలు మొదలు పెడుతున్నారు. కొన్ని సందర్భాలలో ఆందోళన కట్టు తప్పిపోతున్నది. చేస్తున్న నిరసన హద్దు దాటిపోతున్నది. నినాదం వేరే వైపు వెళ్లిపోతున్నది. నీట్ అనే విషయాన్ని పక్కనపెట్టి.. కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేశారు.. పెద్ద నోట్లు ఎందుకు రద్దు చేశారు.. ఇలా రకరకాల డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

కొంతమంది కుహనా మేధావులు ఈ ఆందోళనను గొప్పగా చెబుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు సంఘీభావంగా నిలుస్తున్నారు. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు అయితే బొద్దింకలు వచ్చే ఎన్నికల్లో విఫలవానికి నాంది పలుకుతాయని అంటున్నారు. వాస్తవానికి దేశ రాజకీయాలను మార్చే శక్తి యువతకు ఉంది. కానీ మనదేశంలో యువత విధ్వంసం సృష్టించే విధంగా పొలిటికల్ స్పేస్ లేదు. కేంద్రంలో ఒకప్పటి మాదిరిగా అక్రమాలు జరగడం లేదు. అన్యాయాలు జరగడం లేదు. నరేంద్ర మోడీ చాలా విషయాలలో కఠినంగానే ఉంటున్నారు. కానీ, కొంతకాలంగా అధికారానికి దూరంగా ఉంటున్న పార్టీలో కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నాయి. ఆ ఉద్యమాలకు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.

ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఏం చేస్తున్నావ్ ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ అక్కడే ఉన్నారు. ఉదయం నిరసనలో పాల్గొనడం.. రాత్రి ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసేవారు. అంతేకాదు విలాసవంతమైన సౌకర్యాలను ఆస్వాదించేవారు. ఆయనకు ఇవన్నీ కల్పించింది జునైద్. ఇతడు మరెవరో కాదు.. కొంతకాలంగా ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తి. పైగా ఇతడు బంగ్లాదేశ్ దేశస్థులకు బెంగాల్ రాష్ట్రంలో ఓటు హక్కును తొలగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ ప్రజలను బెంగాల్ నుంచి బయటికి వెళ్లగొట్టడాన్ని తీవ్రంగా నిరసించాడు. అటువంటి జునైద్ అభిజిత్ కు సహాయం చేయడం.. ఆందోళనలో పాల్గొన్న వారికి ఆహార పొట్లాలు.. నీళ్ల ప్యాకెట్లు.. డబ్బులు మొత్తం ఇతడే సమకూర్చాడు.

జునైద్ వ్యవహార శైలి పట్ల ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అతని మీద ప్రముఖంగా దృష్టి సారించాయి. అతడి లావాదేవీలు.. ఇతర వ్యవహారాల మీద ఒక కన్నేసి ఉంచాయి. ఈ ప్రకారం చూసుకుంటే అతడి అసలు బాగోతాన్ని అతి త్వరలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు బయట పెట్టబోతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ అసలు రంగును సభ్య సమాజం ముందు ఉంచబోతున్నాయి.

లక్నో బాధలను వదిలించుకున్న రిషబ్‌ పంత్‌.. పాపం కులదీప్‌ యాదవ్‌

Rishabh Pant IPL
Rishabh Pant IPL

Rishabh Pant IPL: ఐపీఎల్‌.. భారత్‌ క్రికెట్‌లో అత్యంత క్రేజీ టోర్నీగా మారింది. ఏటా వేసవిలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్‌తో అభిమానులు రెండు నెలలు పండుగా చేసుకుంటున్నారు. మరోవైపు క్రికెటర్లకు, స్పాన్సర్లకు, టెలికాస్ట్‌ సంస్థలకు కోట్లలో ఆదాయం వస్తోంది. ఇటీవలే ఐపీఎల్‌ 2026 ముగిసింది. ఇందులో ముంబై, చెన్నై, ఢిల్లీ జట్లు పేలవ ప్రదర్శనతో జాబితాలో చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. తాజాగా ఐపీఎల్‌లో అతిపెద్ద స్వాప్‌ డీల్‌లలో ఒకటిగా రిషభ్‌ పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చాడు. బదులుగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు కులదీప్‌ యాదవ్‌ చేరారు. ఢిల్లీ, లఖ్‌నవూ ఫ్రాంచైజీలు ఈ మార్పిడిని పూర్తి చేశాయి. ఈ డీల్‌ రెండు జట్ల స్క్వాడ్‌ బ్యాలెన్స్‌ను మార్చే అవకాశం ఉంది.

స్వాప్‌ డీల్‌ వివరాలు..
రిషభ్‌ పంత్‌ లఖ్‌నవూ నుంచి ఢిల్లీకి వెళ్లగా, కులదీప్‌ యాదవ్‌ ఢిల్లీ నుంచి లఖ్‌నవూకు చేరారు. ఈ మార్పిడి ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం జరిగింది. పంత్‌ గతంలో లఖ్‌నవూలో రికార్డు సంబళంతో చేరినప్పటికీ, ఇప్పుడు తన మాతృ జట్టు ఢిల్లీకి తిరిగి వస్తున్నాడు. ఈ డీల్‌తో రెండు ఫ్రాంచైజీలు తమ అవసరాలను తీర్చుకున్నాయి.

ఢిల్లీకి రిషభ్‌..
రిషభ్‌ పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌లో చాలా సీజన్లు ఆడి, కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతని దూకుడు బ్యాటింగ్, వికెట్‌ కీపింగ్, నాయకత్వం ఢిల్లీ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇప్పుడు అతను తిరిగి రావడంతో జట్టు బ్యాటింగ్‌ లైనప్‌కు బలం చేకూరుతుంది. ముఖ్యంగా మిడిల్‌ ఓవర్లలో అతని దాడి శైలి జట్టుకు కీలకం కావచ్చు.

లఖ్‌నవూకు కులదీప్‌..
లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు కులదీప్‌ యాదవ్‌ చేరడం పెద్ద బలం. అతను ప్రపంచస్థాయి ఎడమచేతి రిస్ట్‌ స్పిన్నర్‌. లఖ్‌నవూ మైదానాలు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో అతని వికెట్లు ఎక్కువగా దక్కే అవకాశం ఉంది. ఈ మార్పిడితో లఖ్‌నవూ స్క్వాడ్‌లో స్పిన్‌ డెప్త్‌ పెరిగింది. అదనంగా ఫ్రాంచైజీకి పర్స్‌ స్పేస్‌ కూడా లభించింది.

ఏ జట్టుకు ఎక్కువ లాభం?
ఈ స్వాప్‌ డీల్‌ రెండు జట్లకు వేర్వేరు లాభాలు చేకూరుస్తుంది. ఢిల్లీకి రిషభ్‌ పంత్‌ తిరిగి రావడం పెద్ద ఊరట. అతని అనుభవం, ఫ్యాన్‌ బేస్, నాయకత్వ లక్షణాలు జట్టు సంస్కృతిని బలపరుస్తాయి. ముఖ్యంగా ఢిల్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మిడిల్‌ ఓవర్ల బలహీనతను అతను పూరించగలడు. లఖ్‌నవూకు కులదీప్‌ యాదవ్‌ వచ్చినప్పుడు స్పిన్‌ అటాక్‌ బలపడుతుంది. లఖ్‌నవూ మైదానాల్లో స్పిన్నర్లు ఎక్కువగా వికెట్లు తీసే అవకాశం ఉంది. అదనంగా ఈ డీల్‌ వల్ల లఖ్‌నవూకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించింది.

మొత్తంమీద రెండు జట్లు తమ బలహీనతలను బలపరచుకున్నాయని చెప్పవచ్చు. ఢిల్లీకి బ్యాటింగ్‌ డెప్త్, లఖ్‌నవూకు బౌలింగ్‌ వైవిధ్యం లభించింది. ఐపీఎల్‌ 2027 సీజన్‌లో ఈ మార్పులు ఎలా పని చేస్తాయో చూడాలి.

'మా ఇంటి బంగారం' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. సోమవారం రోజున ఇంత గ్రాస్ ఊహించలేదు..

Maa Inti Bangaram
Maa Inti Bangaram

Maa Inti Bangaram 4 days Collections: సమంత ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా దుమ్ము లేపేసిన ఈ చిత్రం, సోమవారం రోజున కూడా మంచి వసూళ్లను రాబట్టి స్ట్రాంగ్ హోల్డ్ ని కనబర్చింది. మొదటి రోజు తో పోలిస్తే , చాలా తక్కువ డ్రాప్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 4 వ రోజున , అనగా సోమవారం రోజున 1 కోటి 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా నాలుగు రోజుల్లో 6 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి 5 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 11 కోట్ల 45 లక్షల రూపాయిలు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 22 కోట్ల రూపాయిల వరకు ఉంది. అదే విధంగా తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 1 కోటి 5 లక్షల రూపాయిలు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 70 లక్షలు , ఓవర్సీస్ నుండి 7 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 22 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 45 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

విడుదలకు ముందు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రీకల్ బిజినెస్ కేవలం 12 కోట్ల రూపాయిలు మాత్రమే. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 10 కోట్ల 30 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. అంటే డబుల్ బ్లాక్ బస్టర్ అన్నమాట. వసూళ్లు ఇదే రేంజ్ ఊపులో వెళ్తే మాత్రం ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. నిర్మాతగా సమంత కి ఈ చిత్రం ఒక లంకె బిందె లాంటిది. రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఇంకా ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి.

'ఓజీ' విడుదల తేదీ పై కన్నేసిన నేచురల్ స్టార్ 'ది ప్యారడైజ్'.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

The Paradise movie release date
The Paradise movie release date

The Paradise movie release date: గత ఏడాది సెప్టెంబర్ 25 ని పవన్ కళ్యాణ్ అభిమానులు అంత తేలికగా ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ రోజే ‘ఓజీ’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని నెలకొల్పింది. ఇప్పుడు అదే తేదీపై నేచురల్ స్టార్ నాని కన్నేశాడు. ఆయన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ ఏడాది మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఇంకా పర్ఫెక్షన్ కోసం మరో 60 రోజుల పాటు షూటింగ్ ని ప్లాన్ చేశాడట డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.

అందుకే ఆ తేదీ నుండి ఈ చిత్రం వాయిదా పడినట్టు తెలుస్తోంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే రోజున ఓజీ విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ షూటింగ్ ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ కోసమే అని అంటున్నారు. తీసిన సన్నివేశాలను మళ్లీ మళ్లీ తీసే సందర్భాలు చాలానే ఉన్నాయట. బడ్జెట్ కూడా హద్దులు దాటడం తో కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ సంస్థ తో విడుదల తేదీ పై చర్చ జరపడం , వాళ్ళు సెప్టెంబర్ లో ఎట్టి పరిస్థితిలోనూ రావాలని , ఆ నెల దాటితే డబ్బులు కట్ చేస్తామని చెప్పడంతో , సెప్టెంబర్ నెలలోపు పోస్ట్ ప్రొడక్షన్ తో సహా సినిమా పూర్తి అవ్వాలని నాని డెడ్ లైన్ పెట్టాడట.

కనీసం ఈ చిత్రం సెప్టెంబర్ 25 న అయినా వస్తుందా లేదో చూద్దాం. ఇకపోతే ఈ చిత్రం లో మోహన్ బాబు విలన్ గా నటిస్తుండగా , కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి , అదే విధంగా ‘ఆయా షేర్’ పాటకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా ఈ చిత్రం లో మరో ముఖ్యమైన విలన్ క్యారెక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు, దీనికి కూడా బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ వచ్చిన వైరల్ అయిపోతుంది , ఆడియన్స్ కి తెగ నచ్చేస్తోంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

ఎట్టకేలకు మెట్రోపై రేవంత్‌ సాధించాడు.. ఢిల్లీని ఒప్పించాడు

Revanth Reddy Metro project approval
Revanth Reddy Metro project approval

Revanth Reddy Metro project approval: హైదరాబాద్‌లో మెట్రో సెకండ్‌ ఫేజ్‌–2 సాధించేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా కేంద్రంలో మంతనాలు సాగించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయంతో ఎట్టకేలకు కేంద్రాన్ని ఒప్పించారు. కేంద్ర మంత్రులతో జరిపి చర్చలు ఫలప్రదం అయ్యాయి. హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం, రెండవ దశ విస్తరణపై జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తోపాటు ఇతర మంత్రులతో రెండు రోజులు జరిపిన చర్చల్లో మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన అడుగుగా మారాయి.

మెట్రో ఫేజ్‌–1 స్వాధీనం కోసం రుణం..
మెట్రో రైలు మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం అవసరమైన ఆర్థిక అంశాలపై స్పష్టత వచ్చింది. లార్సెన్‌ అండ్‌ టూబ్రో నుంచి ఆపరేషన్లను రాష్ట్రం చేపట్టేందుకు సుమారు రూ.13,600 కోట్ల రుణం రుణం విడుదలకు సంబంధించిన అడ్డంకులు తొలగించే దిశగా చర్చలు జరిగాయి. ఆస్తుల వాల్యుయేషన్‌ కోసం BICAP వంటి సంస్థను నియమించే అంశంపై కూడా అంగీకారం ఏర్పడింది. ఇది సుమారు రూ.18 వేల కోట్ల విలువైన ఆస్తుల అంచనాకు సహాయపడుతుంది. ఫేజ్‌–1లో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్, 57 స్టేషన్లు ఉన్నాయి. రోజువారీ సగటున ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు ఈ సేవలను వినియోగిస్తున్నారు.

ఫేజ్‌–2 విస్తరణలో వేగం..
మెట్రో రెండో దశ విస్తరణపై కూడా సానుకూల నిర్ణయాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను కేంద్రానికి సమర్పించింది. ఏడు కారిడార్లతో కూడిన 122.9 కిలోమీటర్ల విస్తరణకు సుమారు రూ.38,595 కోట్ల అంచనా ఖర్చు ఉంది. కేంద్రం ఈ ప్రాజెక్టులో జాయింట్‌ వెంచర్‌గా భాగస్వామ్యం వహించాలని రాష్ట్రం కోరుతోంది. ఈ చర్చలు విస్తరణ పనులను వేగవంతం చేయడంలో సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చర్యలు..
రాష్ట్ర కేబినెట్‌ ఫేజ్‌–1ను ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌ నుంచి స్వాధీనం చేసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక, సాంకేతిక అంశాలను పరిశీలించేందుకు అధికారుల కమిటీని కూడా నియమించారు. ఈ చర్యలు ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించడం, ప్రజా రవాణాను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయి. కేంద్రం సహకారంతో ఈ ప్రక్రియ మరింత సులభం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చర్చల విజయం హైదరాబాద్‌ నగరవాసులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు దోహదపడుతుంది. మెట్రో నెట్‌వర్క్‌ విస్తరణతో ట్రాఫిక్‌ రద్దీ తగ్గి, ప్రయాణ సమయం తగ్గుతుంది. రాష్ట్రం ఫేజ్‌–1ను స్వంతం చేసుకోవడం వల్ల భవిష్యత్తు విస్తరణ పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది. కేంద్ర–రాష్ట్ర సమన్వయం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాధాన్యతగా మార్చేందుకు సహాయపడుతుంది.

రైలు రావడం ఆలస్యమవుతుందా.. విశ్రాంతి కోసం స్టేషన్‌లోనే తక్కువ ధరతో ఏసీ గది.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

Railway Retiring Rooms
Railway Retiring Rooms

Railway Retiring Rooms: రైలు ఆలస్యమవడం, కనెక్టింగ్ ట్రైన్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం వంటి పరిస్థితులు ప్రయాణికులకు తరచూ ఎదురవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో విశ్రాంతి కోసం సమీపంలోని హోటళ్లకు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇందుకోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లలోనే ‘రిటైరింగ్ రూమ్స్’ , ‘డార్మిటరీ’ సదుపాయాలను అందిస్తున్నాయి. తక్కువ ధరలో, సురక్షితమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. మరి వీటిని ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం..

రిటైరింగ్ రూమ్స్ అంటే ఏమిటి?
రిటైరింగ్ రూమ్స్ అనేవి రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతి గదులు. ప్రయాణికులు తమ రైలు కోసం ఎదురుచూస్తున్న సమయంలో లేదా ప్రయాణానికి ముందు, తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు. కొన్ని స్టేషన్లలో సింగిల్, డబుల్ బెడ్ రూమ్స్ అందుబాటులో ఉండగా, మరికొన్ని చోట్ల ఏసీ, నాన్ ఏసీ ఎంపికలు కూడా ఉంటాయి. తక్కువ ఖర్చుతో హోటల్ తరహా సౌకర్యాలు అందించడం వీటి ప్రత్యేకత.

ఎవరు బుక్ చేసుకోవచ్చు?
చెల్లుబాటు అయ్యే రైలు టికెట్ లేదా పీఎన్‌ఆర్ నంబర్ ఉన్న ప్రయాణికులు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందగలరు. కన్ఫర్మ్డ్, ఆర్‌ఏసీ లేదా కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులు కూడా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే సంబంధిత స్టేషన్‌లో గదులు ఖాళీగా ఉండాలి.

ఎంత ఛార్జీ ఉంటుంది?
రిటైరింగ్ రూమ్ ఛార్జీలు స్టేషన్, గది రకం, బస చేసే సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా డార్మిటరీ బెడ్‌లు రూ.100 నుంచి ప్రారంభమవుతాయి. ఏసీ డబుల్ రూమ్స్‌కు రూ.300 నుంచి రూ.500 లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ ఖర్చవుతుంది. ప్రధాన నగరాల స్టేషన్లలో ఛార్జీలు కొంత అధికంగా ఉండవచ్చు. అయినప్పటికీ సమీప హోటళ్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ ఖర్చుతో లభిస్తాయి.

IRCTC యాప్ ద్వారా బుకింగ్ ఎలా చేయాలి?
రిటైరింగ్ రూమ్ బుకింగ్‌ను ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ముందుగా IRCTC యాప్‌లో లాగిన్ అవ్వాలి. అనంతరం ‘Retiring Room’ ఆప్షన్‌ను ఎంచుకుని, ప్రయాణానికి సంబంధించిన పీఎన్‌ఆర్ నంబర్ నమోదు చేయాలి. సిస్టమ్ ఆ పీఎన్‌ఆర్ ఆధారంగా అర్హతను ధృవీకరిస్తుంది. ఆ తర్వాత అందుబాటులో ఉన్న స్టేషన్లు, గది రకాలు, ఛార్జీల వివరాలు కనిపిస్తాయి.

అందుబాటులో ఉండే సౌకర్యాలు
చాలా రిటైరింగ్ రూమ్స్‌లో పడకలు, బెడ్ షీట్లు, ఫ్యాన్ లేదా ఎయిర్ కండిషనింగ్, తాగునీటి సదుపాయం, శుభ్రమైన బాత్‌రూమ్స్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉంటాయి. కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వై-ఫై, గీజర్, లాకర్ వంటి అదనపు సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. భద్రత పరంగా కూడా రైల్వే అధికారులు పర్యవేక్షణ నిర్వహిస్తుంటారు.

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు పట్టిన రోగాన్ని పసిగట్టాడు పవన్ కళ్యాణ్

Pawan Kalyan Kakinada speech

Pawan Kalyan Kakinada speech : పవన్ కళ్యాణ్ కాకినాడ మాటామంతీలో ఆ మాటలు మాట్లాడడానికి ధైర్యం కావాలి. రాజకీయ నాయకులు ఎప్పుడూ పూర్తిగా నిజాలు మాట్లాడరు. అటువంటి పచ్చి నిజాలు మాట్లాడారు. ఇది సగటు రాజకీయ నాయకుడికి భిన్నంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కనిపిస్తోంది. నేరస్థుడికి కులం ఏంటి? మతం ఏంటి? అని పవన్ నిలదీశారు. తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు ప్రమాదకరం అని పవన్ హెచ్చరించారు. ఎక్కువ కేసులు దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. కులం కుంపట్లు ఏపీలో పోయినప్పుడే ఏపీ బాగుపడుతుందని పవన్ కుండబద్దలు కొట్టారు.

కులం కొట్లాటలలో నన్ను ఇరికించవద్దని.. పోలీసులకు మనం ఫోన్లు చేసి వాళ్ల పని వాళ్లను చేయించుకోవాలని పవన్ కుండబద్దలు కొట్టారు. ఆంధ్రాకు కులం జబ్బు, తెలంగాణ ప్రాంతీయవాదం జబ్బు హద్దు మీరకూడదని చెప్పారు. వీటిని రోగాలుగా వర్ణించాడు. ఈ రెండూ కరెక్ట్ గా రెండు రాష్ట్రాలకు అతికినట్టు చెప్పాడు.

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు పట్టిన రోగాన్ని పసిగట్టాడు పవన్ కళ్యాణ్. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వెళ్లిందా..?

Srikanth Odela Chiranjeevi Movie
Srikanth Odela Chiranjeevi Movie

Srikanth Odela Chiranjeevi Movie: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా విషయంలో పలు రకాల ఆసక్తికరమైన విషయాలైతే వెలువడుతున్నాయి. శ్రీకాంత్ ఓదుల ఇంతకుముందు చేసిన దసర సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా అంతే వైవిధ్యంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. దసర తర్వాత ఆయన ప్యారడైజ్ సినిమాని ఎంచుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇది చాలా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కబోతుంది. హీరో సైతం ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. నాని ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే టాప్ హీరోగా మారిపోతాడు. టైర్ వన్ హీరోల లిస్టులో కూడా చేరిపోతాడు.

ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తనకు ఎలాంటి క్రేజ్ ను తీసుకువస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. నాని లాంటి హీరో ఈ మధ్యకాలంలో వరుసగా మాస్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. శ్రీకాంత్ సైతం నాని సినిమాను పూర్తి చేసిన తర్వాత చిరంజీవితో ఒక భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించే అవకాశాలైతే ఉన్నాయి.

ఇప్పటివరకు శ్రీకాంత్ చేసిన ఈ రెండు సినిమాలకు భిన్నంగా చిరంజీవి సినిమా ఉండబోతుందట. ఇప్పటివరకు ఎవరు చూపించని రేంజ్ లో చిరంజీవిని చూపించడానికి తను సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవిని ఆయన ఏ రేంజ్ లో చూపిస్తాడు. తద్వారా సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక రీసెంట్ గా చిరంజీవి సైతం శ్రీకాంత్ ఓదెలను కలిసి తన నెక్స్ట్ సినిమా నీతోనే చేస్తున్నానని క్లారిటి ఇచ్చారట.

దానికి తగ్గట్టుగానే ఈ సినిమా స్క్రిప్ట్ కి సంభందించిన పనులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది… ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని చాలా వైల్డ్ గా చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక చిరంజీవి సైతం శ్రీకాంత్ ఓదెల అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగితే మాత్రం ఇది ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా మిగులుతుందని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

మహేష్ బాబు ఆ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu career: ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి మూవీ చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమాతో మహేష్ బాబు టాప్ హీరోగా మారుతాడు అనేది చాలా క్లారిటిగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు మహేష్ బాబు వారణాసి సినిమా కోసం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నాడు. తనకు ఇష్టమైనప్పుడు ట్రిప్పులకు వెళ్తున్నాడు. తనకు అనుకూలమైన సమయంలోనే షూటింగ్లో పాల్గొంటున్నారనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం రాజమౌళి వరుసగా కొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. దాంతో మహేష్ బాబు లాక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం మహేష్ బాబు కాంప్రమైజ్ అవ్వక తప్పడం లేదు అంటూ అతని అభిమానులు సైతం భావిస్తున్నారు. ఎందుకంటే రిలీజ్ డేట్ ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలి.

మధ్యలో టూర్స్, ట్రిప్పులు అనుకుంటూ తిరిగితే రోజులు సరిపోవు అనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు ట్రిప్పులకు వెళ్లే ప్రసక్తి లేదు అన్నట్టుగా వరుసగా మూడు షెడ్యూల్స్ అయితే ప్లాన్ చేశారట. మరి వాటన్నింటిని ఉన్నాడు కాబట్టి వాటిని పూర్తి చేసిన తర్వాతే ఆయన సినిమా నుంచి రిలాక్స్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు.

అలాంటి నటుడు ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరించడానికి సిద్ధమవుతుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అలాగే మహేష్ బాబు కెరియర్ లోనే భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరి మార్కెట్ కలిసినా ఆ స్టార్ హీరో రేంజ్ ను అందుకోలేకపోతున్నారా..?

NTR Ram Charan
NTR Ram Charan

NTR Ram Charan: పాన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టైర్ వన్ హీరోలైతే పెను సంచలనాలను క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి నటులు ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో కలిసి నటించి పెను సంచలనాన్ని క్రియేట్ చేశారు. ఈ సినిమాతో 1300 కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టారు. అయితే వీళ్ళిద్దరు కలిసిన కూడా ‘బాహుబలి 2’ సినిమా రికార్డు బ్రేక్ కాలేదు.

దాంతో వీళ్ళ ఇద్దరి మార్కెట్ కలిపి కూడా ప్రభాస్ అంత లేదు అంటూ గతంలో కొన్ని కామెంట్లు వ్యక్తం అయ్యాయి. ఇక దానికి తోడుగా ఇప్పుడు వీళ్ళు ఇండివిడ్యూయల్ గా సినిమాలు చేసినా కూడా వీళ్ళిద్దరూ 1000 కోట్ల కలెక్షన్స్ అయితే కొల్లగొట్టలేకపోతున్నారు. మార్కెట్ ను చూసిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో 600 కోట్ల మార్క్ ను మాత్రమే అందుకున్నాడు.

రామ్ చరణ్ గేమ్ చేంజర్, పెద్ది రెండు సినిమాలకు కలిపి 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాడు. ఒక రకంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు అల్లు అర్జున్ అంత మార్కెట్ లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ప్రభాస్ తో పోల్చిన అభిమానులు ఇప్పుడు అల్లు అర్జున్ తో పోల్చి మరి వాళ్లను తక్కువ చేసి మాట్లాడుతున్నారు.

ఇక రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను క్రియేట్ చేసి రెండు వేల కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టగలిగితేనే వీళ్ళ మార్కెట్ పదిలంగా ఉంటుంది. లేకపోతే మాత్రం మరింత డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. అలాగైతే మాత్రం నెంబర్ వన్ రేస్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటీపడే ప్రసక్తి కూడా లేకుండా పోతుంది…

ఇన్ స్టాగ్రామ్ లో సీఎం విజయ్ ని 'Unfollow' కొట్టిన త్రిష.. అసలు ఏమి జరుగుతోంది..

Trisha
Trisha

Trisha unfollows CM Vijay: గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిన జంట విజయ్ – త్రిష. తమిళనాడు రాజకీయాల్లో ఈ జంట సృష్టించిన ప్రభంజనం సాధారణమైనది కాదు. త్రిష బలవంతం వల్లే విజయ్ పార్టీ పెట్టాడని , అతని సీఎం అవ్వడానికి త్రిష లక్ కూడా బాగా కలిసొచ్చిందని , త్వరలోనే అధికారికంగా వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అంతే కాదు , ఈ జంట ‘అవును.. నిజమే.. మేమిద్దరం ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నాము’ అని పలు సందర్భాల్లో బహిరంగంగా చెప్పకనే చెప్పారు. అయితే గత వారం రోజుల నుండి విజయ్ తన భార్య సంగీత తో కలిసిపోతున్నాడని , కుటుంబ సభ్యులు వీళ్ళ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించారని , ఇలా రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి.

వీటిని అభిమానులు ముందు నమ్మలేదు కానీ, నిన్న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష నుండి శుభాకాంక్షలు ట్వీట్ రాకపోవడంతో , వీళ్లిద్దరి మధ్య నిజంగానే గ్యాప్ ఏర్పడిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి తోడు విజయ్ ని త్రిష ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ‘Unfollow’ అయ్యిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలుసుకునేందుకు ఇన్ స్టాగ్రామ్ లో త్రిష ప్రొఫైల్ లోకి వెళ్లి ‘ఫాలోయింగ్’ లిస్ట్ చూస్తే అందులో విజయ్ పేరు లేదు. అంటే నిజంగానే త్రిష ‘Unfollow’ అయ్యిందా?, లేదా మొదటి నుండే విజయ్ ని ఆమె ఫాలో అవ్వడం లేదా?, దీని పై స్పష్టమైన క్లారిటీ లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరిని మొదటి నుండి అనుసరిస్తున్న వాళ్ళు చెప్పేది ఏమిటంటే , అసలు విజయ్ ని త్రిష మొదటి నుండే ఫాలో అవ్వడం లేదు , ఆమె ‘Unfollow’ అయ్యిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు.

ఏది ఏమైనా మరోసారి విజయ్ – త్రిష కలిసి ఏదైనా పబ్లిక్ ఈవెంట్ లో కనిపించేంత వరకు వీళ్లిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు. ఇకపోతే త్రిష కెరీర్ ప్రస్తుతం పీక్ రేంజ్ లో కొనసాగుతోంది. రీసెంట్ గానే హీరోయిన్ గా నటించిన ‘కరుప్పు’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ హిట్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న సూర్య ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన చిత్రమిది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన లాంగ్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ చిత్రం విడుదల సిద్ధం అవ్వబోతుంది.

సమంత ప్రెగ్నన్సీ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్.. లీక్ చేసేశాడుగా!

Chiranjeevi tweet on Samantha
Chiranjeevi tweet on Samantha

Chiranjeevi tweet on Samantha: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో సమంత పెగ్నన్సీ విషయం పై ఎలాంటి ప్రచారం జరుగుతూ వస్తుందో చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదల సందర్భంగా , ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు నెటిజెన్స్ బేబీ బంప్ ని గమనించారు. దీనిపై అటు సమంత , ఇటు రాజ్ , ఇద్దరూ కూడా మౌనం గా ఉండడం తో , సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త నిజమే అని అనుకున్నారు నెటిజెన్స్. అయితే కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి వేసిన ట్వీట్ తో సమంత గర్భం దాల్చింది అనే విషయం నిర్ధారణ అయ్యింది. ‘చిరు లీక్స్’ అనేది ఇండస్ట్రీ లో ఎంత వైరల్ అయ్యిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ, ఇలాంటి లీక్స్ గతం లో చిరంజీవి చాలానే ఇచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే చిరంజీవి ‘మా ఇంటి బంగారం’ మూవీ చూసారు. ఆయనకు సినిమా చాలా బాగా నచ్చింది , వెంటనే మూవీ టీం ని తన ఇంటికి రప్పించుకొని , కాసేపు వాళ్ళతో ముచ్చట్లు జరిపి , సన్మానం చేసి పంపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నేడు ఈ చిత్రం గురించి చిరంజీవి ట్వీట్ వేస్తూ ‘ఇటీవలే మా ఇంటి బంగారం చిత్రాన్ని చూశాను . ఉమ్మడి కుటుంబ నేపథ్యం లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ, వినోదాత్మకంగా తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకురాలు నందిని రెడ్డి. సమంత నటన , ముఖ్యంగా చీరకట్టులో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఇలాంటి వైవిద్యభరితమైన మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలు మన సినీ పరిశ్రమకు అత్యంత అవసరం. ఈ సందర్భంగా మూవీ టీం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ చెప్పుకొచ్చాడు.

అదే విధంగా చివర్లో ‘వ్యక్తిగత జీవితం లో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత – రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు. కొత్త అధ్యాయం అంటే , కచ్చితంగా ఆయన సమంత ప్రెగ్నన్సీ గురించే పరోక్షంగా ప్రస్తావించాడని అంటున్నారు విశ్లేషకులు. ప్రాణాంతక వ్యాధితో పోరాడి , కనీసం నిలబడలేని స్థాయి నుండి , నేడు ఒక జీవానికి ఊపిరి పోసేంతలా ఎదిగిన సమంత ని చూసి ప్రతీ ఒక్కరు గర్వపడాలి , ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. ఇకపోతే ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ మార్కుకి చాలా దగ్గరగా ఉంది. సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం గమనార్హం.