Home Blog Page 307

Posani Krishna Murali: అది రియలైజేషన్ అంటే.. పోసాని లో ఎంత మార్పు

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి లో చాలా మార్పు కనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ సినిమాల బాటపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలు రచయితగా అడుగుపెట్టారు పోసాని. తరువాత దర్శకుడుగా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి విభిన్న పాత్రలతో మెప్పించారు. అయితే మధ్యలో రాజకీయాల్లో ప్రవేశించి.. లేనిపోని వివాదాలు తెచ్చుకున్నారు. ఇటీవల జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు మరోసారి సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకుని ఆ ప్రయత్నం మొదలుపెట్టారు.

* మళ్లీ సినిమాలు.
తాజాగా తన సినిమాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అందులో రాజకీయ ప్రస్తావన వచ్చింది. మీడియా ప్రతినిధులకు దండం పెడుతూ.. నన్ను బతకనీయండి అంటూ విజ్ఞప్తి చేశారు. తానేదో సినిమాలు చేసుకుంటున్నానని చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరలేదని.. మంచి చేసిన పార్టీకి మాత్రమే అనుకూలంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో సేవా మాత్రమే కాదు చిక్కులు ఉంటాయని పరోక్షంగా తన జైలు జీవితం గురించి మాట్లాడారు. తాను పదవి చేపట్టినా.. రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఇకనుంచి తన సినీ ప్రయాణం కొనసాగుతుందని తేల్చి చెప్పారు .

* ప్రజారాజ్యంతో ఎంట్రీ..
ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పోసాని కృష్ణ మురళి. 2009 ఎన్నికల్లో పోటీ కూడా చేసి ఓడిపోయారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో బాహాటంగా మద్దతు తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అయితే నిత్యం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. చంద్రబాబు విషయంలో కూడా చాలా చులకనగా మాట్లాడేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళికి కష్టాలు మొదలయ్యాయి. కేసుల మీద కేసులు నమోదయ్యాయి. సుదీర్ఘకాలం జైలులో ఉండి పోవాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురైన పోసాని కృష్ణ మురళి ఒకానొక దశలో కన్నీరు మున్నీరు అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు మళ్లీ సినిమా అవకాశాలపై దృష్టి పెట్టారు.

Mamata Banerjee: మమతక్క.. గిట్ల తయారైనవేంది.. ఇంకా ఎందుకు ఇజ్జత్‌ తీసుకుంటవ్‌..!

Mamata Banerjee: అంతర్జాతీయ సంబంధాలలో కొన్ని నాయకులు, దేశాలు ఓటమిని అంగీకరించకుండా, దాన్ని విజయంగా ప్రచారం చేసే వ్యూహాన్ని అనుసరిస్తుంటారు. ఇటీవలి ఘటనలు ఈ మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టాయి. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాజయం పాలైన మమతా బెనర్జీ ప్రతిస్పందన, 2025 మేలో భారత–పాకిస్తాన్‌ సంఘర్షణ తర్వాత పాకిస్తాన్‌ వైఖరి మధ్య ఆసక్తికరమైన సారూప్యత కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ బలహీనత కాదు, వాస్తవాలను తిరస్కరించే మనస్తత్వం.

ఓటమి అంగీకరించలేక..
2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఘోర పరాజయం చెందింది. బీజేపీకి 207 సీట్లు సాధించగా, టీఎంసీ80కి పరిమితమైంది. మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో సువెందు అధికారికి సుమారు 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇంత భారీ ఓటమి ఉన్నా, ఆమె ‘నేను ఓడిపోలేదు‘ అంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో మానిప్యులేషన్‌ జరిగిందని, ఓట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు.

ఎమ్మెల్యేలతో సమావేశం..
తాజాగా మమతాబెనర్జీ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. న్యాయ నిపుణులతో కూడా భేటీ అయి, పదవిలో ఎలా కొనసాగాలనే అంశంపై చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీలో అసంతృప్తి, సాధ్యమైన ఫ్లోర్‌ క్రాసింగ్‌లకు సంకేతాలు ఇస్తోంది. ఇది పార్టీలో ముసలం పుట్టినట్లు సూచిస్తోంది. ఈ వైఖరి రాజకీయ జీవనం ఒక ముఖ్యమైన అంశాన్ని బయటపెడుతుంది. అధికారం కోసం వాస్తవాలను తిరస్కరించడం. ఓటర్ల తీర్పును అంగీకరించకుండా, బాహ్య కారణాలు చెప్పి తనను తాను న్యాయవంతురాలిని చేసుకోవడం సాధారణం కావచ్చు, కానీ ప్రజాస్వామ్యానికి ఇది హానికరం.

ఆపరేషన్‌ సిందూర్‌లో..
2025 మే 7న భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. లష్కర్‌–ఎ–తోయిబా, జైష్‌–ఎ–మహమ్మద్‌ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి, వందలాది ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్‌ ప్రతిదాడి చేయగా, భారత్‌ దాన్ని తిప్పికొట్టి, కొద్ది రోజుల్లోనే డీస్‌ఎల్‌ఎంఓ స్థాయి చర్చలతో సంఘర్షణ ముగిసింది. అయినప్పటికీ, పాకిస్తాన్‌ తన దేశంలో విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ‘మార్కా–ఎ–హక్‌‘ అని పేరు పెట్టి, ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసమైన సంస్థలే సంబురాలు చేస్తున్నాయి. ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసి ఈ ‘విజయం‘ను జరుపుకుంటోంది. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ కూడా ఇందులో పాల్గొంటోంది.ఇది కొత్త కాదు. 1965 యుద్ధం తర్వాత కూడా పాకిస్తాన్‌ ఓటమిని విజయంగా చిత్రీకరించి, డిఫెన్స్‌ డే జరుపుకుంటుంది. వాస్తవాలు ఏమైనా, దేశీయ ప్రచారం ద్వారా ప్రజలను మభ్యపెట్టడం ఇక్కడి వ్యూహం.

రెండు సందర్భాల్లోనూ ఓడినా..
యుద్ధంలో స్పష్టమైన ఓటమి ఉన్నా, ‘మేము గెలిచాము‘ అనే నినాదం. మమతా ఎన్నికల మానిప్యులేషన్‌ ఆరోపణలు, పాకిస్తాన్‌ మీడియా మరియు ప్రభుత్వం ద్వారా విజయ గాథలు. మమతా వద్ద ఎమ్మెల్యేల అసంతృప్తి, పాకిస్తాన్‌లో ఆర్థిక–సామాజిక సమస్యలను కప్పిపుచ్చడం.

ఈ వైఖరి స్వల్పకాలిక రాజకీయ లాభాలు ఇచ్చినా, ప్రజాస్వామికంగా నమ్మకం కోల్పోతుంది. ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పును అంగీకరించడం, యుద్ధాల్లో వాస్తవాలను అంగీకరించి సంస్కరణలు చేపట్టడం మంచి పాలనకు మూలం.ఈ సారూప్యతలు రాజకీయ నాయకులు దేశాలు ఎంతవరకు వాస్తవాల నుంచి దూరమవుతారో చూపిస్తాయి. నిజమైన విజయం ఓటములను గుర్తించి, నుంచి నేర్చుకోవడంలోనే ఉంటుంది.

Mumbai Indians Captaincy: ముంబై పగ్గాలు మళ్ళీ రోహిత్ చేతికి.. హార్దిక్ పాండ్యా కథ సమాప్తమేనా

Mumbai Indians Captaincy: కోరి తెచ్చుకున్న మొగుడు.. సిగ తరిగాడట.. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి కూడా అలానే ఉంది. ఐదుసార్లు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి.. హార్దిక్ పాండ్యాను 2024లో ముంబై మేనేజ్మెంట్ సారధిగా తెచ్చుకుంది. అంతకు ముందు గుజరాత్ జట్టుకు ఒకసారి ట్రోఫీని.. మరోసారి రన్నర్ అప్ గా నిలిపిన హార్దిక్ పాండ్యా.. ముంబై జట్టుకు కూడా ట్రోఫీని అందిస్తాడని మేనేజ్మెంట్ నమ్మింది. కానీ మేనేజ్మెంట్ నమ్మకాన్ని అతడు వమ్ము చేసుకుంటూ వస్తున్నాడు.

2024 సీజన్లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 2025లో టాప్ ఫోర్ లో నిలిచింది. ఈ సీజన్లో మాత్రం దారుణమైన ఆట తీరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాలో మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. ఇటీవల జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ తో ఆదుకున్నాడు. తద్వారా ముంబై జట్టు విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్ కు కూడా హార్దిక్ పాండ్యా దూరమవుతున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల సూర్యకుమార్ యాదవ్ కూడా దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో జట్టుపగ్గాలు రోహిత్ శర్మ చేతిలోకి వెళ్తాయని చర్చ జరుగుతుంది.

జాతీయ మీడియాలో మాత్రం మేనేజ్మెంట్ అప్రోచ్ అయినప్పటికీ రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడానికి సుముఖంగా లేడని తెలిసింది. దీంతో సారధి కోసం మేనేజ్మెంట్ అన్వేషణ మొదలుపెట్టిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో కెప్టెన్సీ ని రోహిత్ శర్మ తీసుకుంటే బాగుంటుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అతని నాయకత్వంలో ముంబై జట్టు విజయాల బాట పడుతుందని.. ఐపీఎల్ లో సత్తా చూపిస్తుందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గాయం వల్ల రోహిత్ శర్మ ఆమధ్య కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. వైద్యుల సిఫారసు మేరకు చికిత్స పొందాడు. అనంతరం పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించిన తర్వాత మైదానంలోకి వచ్చాడు. తొలి మ్యాచ్ లోనే మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇప్పుడు అదే ఫామ్ కనుక రోహిత్ కంటిన్యూ చేస్తే ముంబై జట్టుకు తిరుగులేని స్థాయి లభిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ముంబై జట్టు భారీ విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలు ఉంటాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

Judge Anger Incident: జడ్జికి కోపం వచ్చింది.. లాయర్ జైలుకు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Judge Anger Incident: కొన్నిసార్లు తెలియక చేసిన ఘటనలు తప్పులుగా మారుతాయి. అవి ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తాయి. వాటి వెనుక ఏం జరిగిందో కూడా వారు ఆలోచించరు. ముక్కు మీద కోపంతో అరుస్తుంటారు. ఆ తర్వాత కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి పర్యవసనాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. అటువంటిదే ఇది కూడా..

అది హైకోర్టు.. ఓ కేసు విచారణ సాగుతోంది. ఓ యువ న్యాయవాది కేసును వాదిస్తుండగా.. ఆయన మో చేతికి నొప్పి కావడంతో.. ఫైల్స్ బరువు మోయలేక.. వాటిని టేబుల్ మీద విసిరేశాడు. అది జడ్జికి కోపం తెప్పిస్తుంది. నా ముందే నువ్వు కేసు ఫైల్స్ విసిరేస్తావా అంటూ ఆ జడ్జి ఆ లాయర్ మీద కోపం ప్రదర్శించారు. జడ్జి అంటే కనీసం గౌరవం లేని ఈయనకు ఒకరోజు పాటు జైలు శిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేశారు. లాయర్ జరిగిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆ జడ్జి వినిపించుకోలేదు.

సాధారణంగా మనదేశంలో న్యాయమూర్తులకు ముక్కు మీద కోపం ఉంటుంది అంటారు. ఆ అసహనాన్ని వారు అనేక సందర్భాల్లో వ్యక్తం చేస్తుంటారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సదరు జడ్జి కూడా అలానే వ్యవహరించారని.. లాయర్ విషయంలో కనీసం వినిపించుకునే ప్రయత్నం కూడా చేయలేదని తోటి న్యాయవాదులు వాపోతున్నారు. ఆ న్యాయమూర్తి ఒకరోజు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో.. లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తికి ఏ స్థాయిలో అయితే అధికారాలు ఉంటాయో.. బెంచ్ కు కూడా అదే స్థాయిలో అధికారాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని లాయర్లు సూచిస్తున్నారు. హైకోర్టులో జరిగిన ఆ వ్యవహారాన్ని ఓ లాయర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సమయంలోనే ఒక స్వీయ వీడియో తీసుకొని.. హైకోర్టులో జరిగిన పరిణామాలను వివరించారు. ఇలాంటి విధానాలు సరికావని.. న్యాయమూర్తి.. బెంచ్ జోడెడ్ల లాగా పనిచేయాలని.. ఎవరికివారు వాదించుకుంటే అప్పుడు పరిస్థితి వేరే విధంగా మారుతుందని ఆ యువ న్యాయవాది పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తోంది.

Royal Enfield Tirupati Plant: పెదబాబు.. చినబాబు బండెక్కితే మామూలుగా ఉండదు మరీ.. వైరల్ వీడియో

Royal Enfield Tirupati Plant: ఏపీకి ( Andhra Pradesh) పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇప్పటివరకు ఐటీ పరిశ్రమలు రాగా.. ఇప్పుడు తయారీ రంగ పరిశ్రమలు ముందుకు రావడం విశేషం.. విశాఖకు ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టేందుకు రిలయన్స్ సైతం సన్నాహాలు మొదలుపెట్టింది. మరోవైపు తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. 2700 వందల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ ముందుకు వచ్చింది. మరోవైపు రాయలసీమలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వాటికి సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.

* ప్రత్యేక స్థానం..
మోటారు వాహన రంగంలో రాయల్ ఎన్ఫీల్డ్ ది( Royal Enfield) ప్రత్యేక స్థానం. 80వ దశకం లోనే ఈ బుల్లెట్ బండి ఒక ఊపు ఊపేసింది. అయితే లేటెస్ట్ వెర్షన్ తో ఇప్పుడు మార్కెట్లో బుల్లెట్ బండ్లు వస్తున్నాయి. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఇప్పుడు ప్రత్యేకం. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఈ బుల్లెట్ వాహనం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. అందుకే ఆ కంపెనీ విస్తరణ దిశగా ఆలోచనలు చేస్తోంది. డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి అందించేందుకు కొత్త ప్లాంట్ల తయారీపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తిరుపతిలో కొత్త ప్లాంట్ పెట్టేందుకు నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ల సదస్సులో స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఆదాయం పెరుగుతుందని.. పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వస్తే రాష్ట్ర ఆదాయం పెరగడమే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.

* రాయలసీమలో తయారీ రంగం పరిశ్రమలు..
అయితే ఏపీలో ఒక ప్రత్యేక పరిస్థితి కొనసాగుతోంది. ఐటీ పరంగా విశాఖ( Visakhapatnam) హబ్ గా మారుతోంది. రాయలసీమలో మాత్రం తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలోని శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో అనుబంధ పరిశ్రమలు కూడా తరలివస్తున్నాయి. రిలయన్స్ సంస్థ లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం శుభ పరిణామం. గతంలో టిడిపి అధికారంలోకి వచ్చిన సమయంలో అనంతపురంలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అయింది. ఇప్పుడు బుల్లెట్ బండ్లకు సంబంధించి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రానుండడంతో సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. బుల్లెట్ బండిపై చంద్రబాబు ఉన్న ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

Lucknow Vs RCB: ఏకంగా కోహ్లీనే బోల్తా కొట్టించావు.. వికెట్ తీశావు.. నువ్వు మగాడ్రా బుజ్జి

Lucknow Vs RCB: అడవిలో జింకలను, లేడి పిల్లలను వేటాడే వాడి కంటే.. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన వాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే రేంజ్ లక్నో బౌలర్ ప్రిన్స్ అనుభవిస్తున్నాడు. మామూలుగా అయితే మైదానంలో ఏ బౌలర్ అయిన సరే తనదైన రోజు వికెట్లు పడగొడతాడు. కానీ ప్రిన్స్ లక్నో జట్టు గెలుపును డిసైడ్ చేసే వికెట్ పడగొట్టాడు. ఆ వికెట్ కాస్త మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఆరు ఓటమి తర్వాత లక్నో జట్టుకు గెలుపును అందించింది.

ఇప్పటికే ఐపీఎల్ లో పాయింట్లు పట్టికలో లక్నో జట్టు దిగువ స్థానంలో ఉంది. పోరాడితే పోయేదేముంది అన్నట్టుగానే ఆ జట్టు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరు తో మ్యాచ్ ఆడింది ఆ జట్టు. సహజంగానే ఈ మ్యాచ్లో బెంగళూరు గెలుస్తుందని అందరూ ఒక అంచనాకొచ్చారు. కానీ లక్నో జట్టు ఆధ్వర్యంలో తలకిందులు చేసింది.. ముందుగా బ్యాటింగ్ చేసి మెరుపు వేగంతో పరుగులు చేసింది. మార్ష్ సెంచరీ తో చెలరేగాడు. ఆ తర్వాత బంతితో లక్నో బౌలర్లు అదరగొట్టారు. ఫలితంగా లక్నో జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

వర్షం వల్ల ఈ మ్యాచ్ 19 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో ముందుగా లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయి, 209 పరుగులు చేసింది.. డక్వర్త్ లూయిస్ విధానంలో బెంగళూరు లక్ష్యాన్ని 213 పరుగులకు సవరించారు. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆర్ సీ బీ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆరు వికెట్లు నష్టపోయింది. 203 రన్స్ మాత్రమే చేయగలిగింది. పాటిదర్ 61, డేవిడ్ 40 రన్స్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్ సీ బీ ఓటమిని శాసించాడు. ముఖ్యంగా కోహ్లీ వికెట్ ప్రిన్స్ యాదవ్ పడగొట్టిన తీరు ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్.. ఇన్ స్వింగర్ బంతిని అంచనా వేయలేక విరాట్ కోహ్లీ బ్యాట్ ముందుగా కదిలించాడు. బంతి మాత్రం వికెట్లను పడగొట్టి.. విరాట్ కోహ్లీని వెనక్కి పంపించింది.

ఈ వికెట్ తీయడంతో ప్రిన్స్ యాదవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పైగా చిన్న పరుగులకు విరాట్ అవుట్ అయ్యాడు. చేజింగ్ సమయంలో విరాట్ సరిగ్గా చాలా సంవత్సరాల క్రితం ఇలానే అవుట్ అయ్యాడు. నాటి మ్యాచ్లో బెంగళూరు ఐపిఎల్ కెరియర్ లోనే అతి తక్కువ స్కోరు చేసింది. విరాట్ అవుట్ అవ్వడం బెంగళూరు జట్టు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. మరో ఓపెనర్ బెతల్ (4) కూడా అవుట్ కావడంతో బెంగళూరు జట్టు తీవ్రమైన కష్టాల్లో పడింది. పాటిధార్, డేవిడ్ గట్టిగా నిలబడినప్పటికీ.. వారి స్థాయి బెంగళూరుకు విజయాన్ని అందించలేకపోయింది.. ప్రిన్స్ ఒకే ఓవర్ లో పడికల్, జితేష్ శర్మను అవుట్ చేయడంతో బెంగళూరు విజయానికి దూరంగా ఉండిపోయింది..

Pithapuram Varma: పిఠాపురం వర్మకు లోకేష్ స్ట్రాంగ్ హామీ

Pithapuram Varma: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం హాట్ టాపిక్. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ హై కమాండ్ ఆదేశాలతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఆయనను తప్పిస్తూ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని టిడిపి హై కమాండ్ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన వర్మ కన్నీటి పర్యాంతం అయ్యారు. అయితే ముగ్గురు నేతలతో కమిటీ నియమించమని తానే లోకేష్ కు చెప్పినట్లు వర్మ చెబుతున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కూటమిలో తలెత్తుతున్న విభేదాల దృష్టిలో పెట్టుకొని టిడిపి హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. మొన్ననే ఒక ఘర్షణ వాతావరణం జరిగింది కూటమి పార్టీల మధ్య. దీంతో లోకేష్ వర్మను పిలిపించుకుని మాట్లాడారు. అన్ని విషయాలను సేకరించి.. ముగ్గురు నేతలతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.

* నిబద్ధత కలిగిన నేత..
వర్మ తెలుగుదేశం పార్టీ పట్ల కమిట్మెంట్ తో పనిచేసే నాయకుడు. సహజంగానే నియోజకవర్గంలో పట్టున్న నేత కావడంతో.. కూటమి పార్టీల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి పిఠాపురం నియోజకవర్గంలో అన్యాయం జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం హై కమాండ్ కు తెలుసు. కానీ రాష్ట్రస్థాయిలో పొత్తు కొనసాగాలంటే పవన్ కళ్యాణ్ కీలకం. ఆయనకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అందుకే లోకేష్ ఈ విషయంలో ప్రత్యేకంగా కలుగ చేసుకున్నారు. పార్టీ పరిస్థితి తో పాటు కూటమి దుస్థితిని వివరించే ప్రయత్నం చేశారు వర్మకు. అందుకే వర్మ స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్రకటించారు. ముగ్గురు నేతలతో టిడిపి కమిటీ వేయాలని సూచించారు. దానికి బద్ధుడు నై పని చేస్తానని లోకేష్ కు హామీ ఇచ్చారు. అందుకే వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది టిడిపి హై కమాండ్.

* తగ్గనున్న యాక్టివ్..
పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది అంతే. కానీ యాక్టివ్ గా ఉండదు. లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిస్థితి ఉండదు. వాస్తవానికి పిఠాపురంలో జనసేనకు సైతం ఐదుగురు నేతలతో కూడిన కమిటీ ఉంది. ఇప్పుడు టిడిపి మరో ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేస్తుండడంతో.. ఈ మొత్తం ఎనిమిది మంది నేతలు కూటమి సమన్వయం చూస్తారు. జనసేనతో పాటు టిడిపి శ్రేణులకు ప్రాధాన్యమిస్తూ.. ఏకతాటి పైకి సాగేందుకు దోహదపడతారు. అయితే పిఠాపురం అంటేనే వర్మ ముందుగా గుర్తుకొస్తారు. అందులోనూ టిడిపి భావజాలం ఎక్కువ ఆయనలో. ఈ క్రమంలో టిడిపి ఇన్చార్జి పదవి నుంచి తొలగించేసరికి కొంచెం మనస్తాపానికి గురయ్యారు. అయితే ఆ విషయం తనకు ముందుగానే నాయకత్వం చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే లోకేష్ ఏదో బలమైన హామీ వర్మకు ఇచ్చారన్న ప్రచారం ఉంది. పిఠాపురం వదులుకుంటే రాజకీయంగా ఉన్నత పదవి ఇస్తామన్నదే ఆ హామీ సారాంశంగా తెలుస్తోంది. కానీ రాజకీయంగా వర్మ స్థిరంగా ఉంటేనే అది కూడా.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ చేసింది కరెక్టే.. గతంలో ఏం జరిగిందంటే..

Tamil Nadu Governor: ఎక్కువ సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా తమిళనాడు గవర్నర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. టీవీకే నేతలు కూడా అదే స్వరాన్ని వినిపిస్తున్నారు. కమలహాసన్, ప్రకాష్ రాజు, విశాల్ కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. వాస్తవానికి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విషయంలో టీవీకే నేతలకు ఆగ్రహం ఉండడం సర్వ సాధారణం. కానీ తమిళనాడు గవర్నర్ ఇప్పటి పరిస్థితిని కాకుండా
.. గతంలో దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు పరిశీలించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కుప్ప కూలిపోయాయి

1996లో పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 161 సీట్లను సాధించింది. అతిపెద్ద పార్టీగా అవితరించింది. కానీ మెజారిటీ నిరూపించుకోలేకపోయింది. నాడు ఎంపీల లెక్కల పరిశీలించకుండానే రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేవలం 13 రోజుల పాటే ఆ ప్రభుత్వం కొనసాగింది. పార్లమెంట్లో బలం నిరూపించుకోలేకపోయింది. నాడు రాష్ట్రపతి సంఖ్యాబలాన్ని లెక్కలకు తీసుకోకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారు. నాడు శంకర్ దయాల్ శర్మ ఈ వ్యవహారంపై అనేక రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని 1998లో పార్లమెంటు ఎన్నికల్లో హాంగ్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో.. బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. నాటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ ఈసారి కొత్త విధానాన్ని పాటించారు. అన్నా డీఎంకే నుంచి మొదలు పెడితే మొదటి ఇస్తున్న ఇతర పార్టీల నుంచి లేఖలు తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి ఆహ్వానించారు. నాడు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో 13 నెలలు మాత్రమే కొనసాగింది.

2018లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం. 80 సీట్లు వచ్చిన కాంగ్రెస్.. 37 సీట్లు వచ్చిన జిడిఎస్ కలిసి.. మొత్తం 117 ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. కానీ నాటి గవర్నర్ వాజుభాయ్ అతిపెద్ద పార్టీ గా నిలిచిన బిజెపిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ బల నిరూపణ సాధ్యం కాకపోవడంతో.. మూడు రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది.

2019లో మహారాష్ట్రలో బిజెపి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు. పైగా శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ అలయన్స్ గా ఏర్పడ్డాయి. నాటి గవర్నర్ భగత్ సింగ్ బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. దేవేంద్ర ఫడ్నవిస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ బల నిరూపణ సాధ్యం కాకపోవడంతో ఆ ప్రభుత్వం కేవలం నాలుగు రోజుల్లోనే కుప్పకూలిపోయింది.

Prabhas Spirit Leaked Look: ‘స్పిరిట్’ లో గుండు లుక్ లో ప్రభాస్.. సంచలనం రేపుతున్న లీకెడ్ ఫోటో..

Prabhas Spirit Leaked Look: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటిస్తున్న ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఉన్నటువంటి అంచనాలు సాధారణమైనవి కాదు, ఈ చిత్రం నుండి ఏ చిన్న అప్డేట్ లీక్ అయినా సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయిపోతుంది. ఈ రేంజ్ క్రేజ్ ఏ పాన్ ఇండియన్ సినిమాకు కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ వంటి యాక్షన్ హీరో కటౌట్ కి , సందీప్ వంగ లాంటి కల్ట్ మాస్ డైరెక్టర్ తోడైతే , ఎలాంటి సినిమా వస్తుందో ఊహలకు కూడా అందదు అనే అంచనాలతో అందరూ ఉండడం వల్లే, ఈ చిత్రం పై ఇంత క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ సమయం లో ప్రభాస్ తో సందీప్ వంగ మాట్లాడుతున్న సందర్భంలో తీసిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది.

ఈ ఫోటో లో ప్రభాస్ గుండు లుక్ లో కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. జైలు బట్టల్లో ఉన్న ప్రభాస్, గుండు లుక్ తో, చాలా రఫ్ గా కనిపించాడు. ఇప్పటికే న్యూ ఇయర్ రోజున పొడవాటి జుట్టులో ప్రభాస్ స్టైల్ గా వెనక్కి తిరిగి సిగెరెట్ కాలుస్తున్న లుక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతలోపే అదే సినిమా నుండి లీకైన ఈ గుండు లుక్ ని చూసి , సినిమాలో ప్రభాస్ ని సందీప్ వంగ ఇష్టమొచ్చినట్టు వాడేసినట్టుగా అనిపిస్తోంది , యూత్ మరియు మాస్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ పక్కా అని అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

మరి అంతటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ , ఎందుకు ఇలా జైలు జీవితం గడుపుతున్నాడు అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడక తప్పదు. ఇప్పటి వరకు ప్రభాస్ కేవలం నాలుగు రోజుల షూటింగ్ లో మాత్రమే పాల్గొన్నాడు. రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేయగా , మొదటి షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొన్నాడు . రెండవ షెడ్యూల్ లో విలన్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ పై పలు యాక్షన్ షాట్స్ ని తెరకెక్కించారు. అయితే షూటింగ్ కి బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడం తో , ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 7 నుండి డిసెంబర్ నెలకు వాయిదా వేసినట్టు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి ఏమి జరగబోతుందో చూడాలి.

Mad For Each Other show: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షోలో బూతులతో రెచ్చిపోయిన నటరాజ్ మాస్టర్..వీడియో వైరల్..

Mad For Each Other show: రీసెంట్ గా స్టార్ మా ఛానల్ లో మొదలైన లవ్ రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. నిన్న గాక మొన్న మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ క్రేజీ రియాలిటీ షోలో గొడవలు బిగ్ బాస్ ని మించే ఉన్నాయి. ఒక జంట మరొక జంట పై నెగెటివ్ కామెంట్స్ చేయడమే కాకుండా, కొట్టుకునే స్థాయి వరకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన తన ప్రవర్తన తో ప్రతీ వారం జడ్జీలతో తిట్టించుకుంటూనే ఉంటాడు. కానీ అతని తీరులో ఎలాంటి మార్పు ఉండదు. గేమ్ లో గెలిస్తే ఒకలా ప్రవర్తిస్తాడు , గెలవకపోతే మరోలా ప్రవర్తిస్తాడు. భారీ సినిమా డైలాగ్స్ కొడుతూ, నా కోపాన్ని తట్టుకోలేరు అంటూ గొంతు చించుకొని అరుస్తూ ఉంటాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఆయన ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో మీరంతా చూసే ఉంటారు.

యాంకర్ శ్రీముఖి మీరు గేమ్ నుండి అవుట్ అని చెప్పగానే , తన చేతిలో ఉన్న బక్కెట్లను కిందకు విసిరి , కాళ్లతో కొట్టి , వాళ్లకు ఒక రూల్ , మాకు ఒక రూల్ అని అరుచుకుంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అనంతరం ఆయన తన సూట్ కేసు లను కళ్ళతో కొడుతూ, నేను వెళ్ళిపోతా ఈ షో నుండి అని రచ్చ చేయడం, ఆయన సతీమణి నీతూ కంట్రోల్ చేయడం , ఇవన్నీ మీరంతా చూసే ఉంటారు. నటరాజ్ మాస్టర్ లో ఎలాంటి మార్పు లేదు , బిగ్ బాస్ రెండు సీజన్స్ లో వచ్చాడు, బీబీ జోడి లో కూడా పాల్గొన్నాడు. అప్పుడు ఎలా అయితే నోరు చించుకొని అరిచే వాడో , ఇప్పటికీ అలాగే ప్రవరిస్తున్నాడు , జడ్జీలు పదే పదే వారిస్తున్నా కూడా ఆయన కంట్రోల్ అవ్వడం లేదు.

నిన్న ఆయన భాను , జాను జోడిలతో గొడవ పడుతూ కొన్ని బూతులు కూడా మాట్లాడాడని టాక్. అది టెలికాస్ట్ లో చూపిస్తారో లేదో తెలియదు కానీ, చూపిస్తే మాత్రం నటరాజ్ మాస్టర్ పై తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మ్యాన్షన్ లో టికెట్ టు ఫినాలే గేమ్స్ జరుగుతున్నాయి. ఈ గేమ్స్ లో టాప్ 2 గా నిల్చిన కంటెస్టెంట్స్ మహేష్ సాంద్ర మరియు భాను – జాను జంట. నిన్న ఎలా అయితే నటరాజ్ మాస్టర్ ని ఓడించడానికి జాను – భాను స్కెచ్ వేసారో , నేడు వాళ్ళని ఓడించడానికి నటరాజ్ మాస్టర్ – నీతూ జంట స్కెచ్ వేశారు. దీంతో ఈ రెండు జంటల మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Tamil Nadu Governor Vs TVK Vijay: తమిళనాడు గవర్నర్ వర్సెస్ టీవీకే విజయ్.. సుప్రీం మార్గదర్శకాలు, కమిషన్ల సిఫారసులు ఎలా ఉన్నాయంటే..

Tamil Nadu Governor Vs TVK Vijay: తమిళనాడు ఎన్నికల ఫలితాలలో టీవీకే అత్యధిక స్థానాలు సాధించింది. కానీ, గవర్నర్ విజయ్ ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు.. మెజారిటీ కి సరిపడా ఎమ్మెల్యేల మొదట తీసుకొని రావాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సూచించారు. దీనిపై అనేక రకాలుగా విమర్శలు వస్తున్నాయి.. గవర్నర్ తీసుకున్న నిర్ణయం పట్ల కొంతమంది విశ్లేషకులు మరో విధంగా చెబుతున్నారు. గవర్నర్ ముందు జాగ్రత్త తీసుకున్నారని అంటున్నారు.

మనదేశంలో గతంలో అనేక రాష్ట్రాలలో గవర్నర్ల సూచన మేరకు కొన్ని ప్రభుత్వాలు హడావిడిగా ఏర్పాటయ్యాయి. విశ్వాస పరీక్ష ఎదుర్కోవడంలో విఫలమయ్యాయి. 1996లో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం 13 రోజులు మాత్రమే ఉంది. అలాంటి ఘటనలు దేశానికి మంచివి కావని భావించి.. ప్రభుత్వాల ఏర్పాట్లు గవర్నర్లు సరైన విధానంలో వ్యవహరించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. “ఎస్ఆర్ బొమ్మై” కేసులో మనదేశ సర్వోన్నత న్యాయస్థానం అనేక మార్గదర్శకాలు జారీ చేసింది.. అప్పట్లో సర్కారియా, పూంచి కమిషన్లు అనేక సూచనలు చేశారు. నాడు సుప్రీంకోర్టు వాటిని సమర్థించింది కూడా.

కచ్చితంగా పాటించాల్సిందే

సుప్రీంకోర్టు సమర్ధించిన సర్కారియా, పూంచి కమిషన్లు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో గవర్నర్లు ప్రాధాన్యతను పాటించాల్సి ఉంటుంది. ఎక్కువ స్థానాలకు వచ్చిన కూటమికి ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలవాలి.. ఒకవేళ ముందుగా ఏర్పడిన కూటమికి మెజారిటీ రాకపోతే.. ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. ఒకవేళ అనేక పార్టీలు కూటమిగా ఏర్పడి.. మెజార్టీ ఉందని చూపిస్తే.. వాళ్లను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవవచ్చు.

ఒకవేళ ప్రభుత్వంలో భాగంగాక పోయినప్పటికీ.. బయటనుంచి మద్దతు పలికే పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటే దానిని పరిశీలించవచ్చు.

ఒకవేళ ఏ పార్టీ కూడా మెజారిటీ అందుకోలేని పక్షంలో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేనప్పుడు.. గవర్నర్ రాజ్యాంగం 356 ప్రకారం రాష్ట్రపతి పరిపాలనకు సిఫారసు చేసేందుకు అవకాశం ఉంటుంది.

సపోర్ట్ చేస్తున్న పార్టీల నుంచి ఎమ్మెల్యేల సంతకాలు చేసిన లేఖలను గవర్నర్ తీసుకోవాలని.. ఆయన స్వయంగా ధ్రువీకరించుకోవాలని పూంచి కమిషన్ స్పష్టంగా చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఎక్కువ సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు.. అప్పటికే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన మెజారిటీ.. ఈ అంశాల మీద ఎట్టి పరిస్థితుల్లో రాజ్ భవన్ లో నిర్ణయాలు సాధ్యం కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. కేవలం అసెంబ్లీలో మాత్రమే పార్టీలు బల నిరూపణ చేసుకోవాలని సూచించింది. గవర్నర్ ఒక నిర్ణయానికి రావడానికి అంటే ముందు ఎమ్మెల్యే సంతకాలు పరిగణలోకి తీసుకోవద్దని.. అసెంబ్లీలో ఓటింగ్ ను మాత్రమే చూడాలని సూచించింది. కర్ణాటకలో బొమ్మై ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ వెంకటసుబ్బయ్య.. మెజారిటీ లేదని రద్దు చేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు పై అంశాలను పేర్కొంది.

Today 8 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వద్దన్నా డబ్బు..

Today 8 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తర ఆషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి చల్లని చూపు ఉండడంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు కోరాల్సి ఉంటుంది. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. అయితే వారితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తలు వహించాలి

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయాలు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు గతంలో మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఇంటికి అతిధులు రావడంతో సందడిగా ఉంటుంది. శుభకార్యం కోసం బిజీగా మారిపోతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అన్ని పనులను ఈరోజు పూర్తి చేస్తారు

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందుతుంది ఇప్పటికే ఉద్యోగాలు చేసే వారికి అదనపు ఆదాయం చేకూరుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. ఇంట్లో శుభకార్యం జరగవచ్చు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థుల కెరీర్ విషయంలో తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఓ సమస్య కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతుంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థుల చదువుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంతో కలిసి ఉత్సాహంగా ప్రయాణాలు చేస్తారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. బంధువుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు ఆదరణ పెరుగుతుంది. వ్యాపారంలో రాణించే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలకని నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు ఇంట్లో అనుకోకుండా శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు తమ నైపుణ్య ప్రదర్శన ద్వారా పదోన్నతి పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాజు వారు ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. శక్తి సామర్థ్యాల మేరకే ఖర్చులు పెట్టాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాల్సి ఉంటుంది. ఉన్నట్లుండి ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక అవసరాల కోసం దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే కొన్ని రోజులు వెయిట్ చేయడమే మంచిది.

Trisha Deputy CM Rumors: త్రిష కి కోలుకోలేని షాక్ ఇచ్చిన టీవీకే అధినేత విజయ్.. ఇది నిజంగా ఊహించలేదు..

Trisha Deputy CM Rumors: తమిళ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒంటరిగా ఎన్నికల బరిలో దిగి, 5 దశాబ్దాల నుండి తమిళనాడు రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ పార్టీల కంచుకోటలు బద్దలు కొట్టి ముఖ్యమంత్రి కాబోతుండడం అనేది సాధారణమైన విషయం కాదు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకి విజయ్ కు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అవసరం ఉండగా , ఆయనకు కేవలం 114 స్థానాలు మాత్రమే దక్కాయి. అందుకే టీవీకే కి 107 స్థానాలు రాగా, కాంగ్రెస్ పార్టీ కి 5 స్థానాలు, మరియు ఇతర చిన్న పార్టీల నుండి 2 స్థానాలు తోడయ్యాయి. గవర్నర్ 118 సీట్లు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతిని ఇస్తానని గట్టిగా చెప్పడంతో విజయ్ ప్రమాణస్వీకారోత్సవం వాయిదా పడింది.

ఇదంతా పక్కన పెడితే విజయ్ రాజకీయ పార్టీ ని స్థాపించడానికి ముఖ్య కారణమైన వ్యక్తి త్రిష. గత కొంతకాలంగా త్రిష తో ఆయన సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ విజయ్ ఎన్నికల ముందే అధికారికంగా చెప్పకనే చెప్పాడు. అయితే త్రిష కోరిక మీదనే పార్టీ పెట్టాడు అని తమిళ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతున్న వేళ, ఆయన పార్టీ ఎన్నికల్లో గెలవగానే , కచ్చితంగా త్రిష కి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. విజయ్ త్రిచి ఈస్ట్, మరియు పెరంబూరు స్థానాల నుండి పోటీ చేసి గెలవగా , త్రిచి స్థానానికి ఆయన రాజీనామా చేస్తాడని, ఆ తర్వాత ఆ స్థానం నుండి త్రిష పోటీ చేస్తుందని , పోటీ చేసి గెలిచిన తర్వాత ఆమెకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాడని , ఇలా ఎన్నో రకాలుగా ప్రచారాలు సాగింది.

ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, త్రిష ని తన క్యాబినెట్ లోకి తీసుకునే ఉద్దేశ్యం లో లేదట విజయ్. ఆమెని కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుందని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమెకు లేనిపోని నెగెటివిటీ ని తీసుకొని రావడం విజయ్ కి ఇష్టం లేదని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కానీ త్రిష కి మాత్రం రాజకీయాల్లోకి రావాలని, మంత్రి పదవి చేపట్టాలని కోరిక ఉంది. కానీ విజయ్ అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తో ఆమె కాస్త నిరాశకు గురైనట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

TVK Vijay: కాంగ్రెస్సే కాదు.. కమల్ హాసన్.. విశాల్.. ప్రకాష్ రాజ్.. విజయ్ ని ఏం చేద్దామనుకుంటున్నారు..

TVK Vijay: పత్రికలు రకరకాలుగా రాస్తున్నాయి. చానల్స్ అనేక రకాలుగా వార్తలను ప్రచారం చేస్తున్నాయి.. ఇదే అదునగా కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ద్రావిడ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. వాస్తవానికి జరుగుతున్న సన్నివేశం వేరు.. సాగిస్తున్న వ్యవహారం వేరు. కాకపోతే సందట్లో సడే మియా మాదిరిగా.. ఒక్కొకరు ఒక లెవల్లో పెర్ఫార్మన్స్ చేస్తున్నారు.

తమిళనాడులో టీవీకే పార్టీకి మాత్రమే అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇస్తానని ఇప్పటికే గవర్నర్ రెండు పర్యాయాలు చెప్పేశారు. మీ సంఖ్య బలాన్ని లోక్భవన్లో చూపించుకోవాలని.. మీకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించిన ఎమ్మెల్యేల సంతకాలు తనకు కావాలని ఆయన స్పష్టంగానే చెప్పేశారు. కానీ సంఖ్యాబలాన్ని పెంపొందించుకోవడంలో విజయ్ ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ఆయనకు ఈ రాజకీయాలు తెలియదు. ఎలాంటి వ్యవహారాలు సాగిస్తే అధికారం దక్కుతుందో కూడా ఆయనకు తెలియదు. ఏదో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెబుతున్నప్పటికీ.. ఆ బలం విజయ్ పార్టీకి సరిపోదు. పైగా కమ్యూనిస్టులు కూడా రకరకాల షరతులు విధిస్తున్నారు. ఇలాంటప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అవుతారా.. గవర్నర్ ను మెప్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇలా సాగిపోతుంటే.. అర్జెంటుగా ఈ వ్యవహారానికి యాంటీ మోడీ పేరు పెట్టారు కొంతమంది సీనియర్ నటులు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాలలో ఓడిపోయిన ఫ్రస్టేషన్ కాంగ్రెస్ లో ఉండడంతో.. ఆ పార్టీ కూడా పల్లవి కలిపింది. ఇంకేముంది రాగం అందుకుంది. గవర్నర్ వ్యవస్థను తప్పు పట్టే విధంగా మాట్లాడింది. అంతేకాదు గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసే విధంగా మారిపోయిందని మండిపడింది. ఆ కాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లు ప్రజల పక్షంగా ఉన్నట్టు.. సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాంలాల్ అనే గవర్నర్ తో ఏం చేయించిందో ఇప్పటి కాంగ్రెస్ పెద్దలకు తెలియకపోవచ్చు. కానీ ఒక్కసారి పాత పత్రికలను తిరిగేస్తే ఈ విషయం మొత్తం తెలుస్తుంది. గవర్నర్ వ్యవస్థను బ్రష్టు పట్టించిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కానీ ఆ పార్టీ ఇవాళ నీతులు చెబుతోంది. కనీసం ఎన్నికల్లో నిలబడలేని కమలహాసన్.. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని ప్రకాష్ రాజ్ కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ఇక్కడ గవర్నర్ ఏం చెప్పాడు.. విజయ్ ఏం చేస్తున్నాడు అనే విషయాలను పక్కనపెట్టి.. కేవలం కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించాలి అనే ధోరణితోనే ఈ వ్యక్తులు మాట్లాడుతున్నారు. చివరికి విశాల్ లాంటి నటుడు కూడా వీరితో స్వరం కలపడం విశేషం.

అన్నట్టు ద్రవిడ వాదాన్ని ఈసారి తమిళ ప్రజలు పట్టించుకోలేదు. ఎంతసేపటికి ఆ సోదిని తట్టుకోలేక ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారు. కాకపోతే విజయ్ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. అలాంటప్పుడు ద్రావిడ వాదం మరుగున పడిపోతుందని కమల్ హాసన్ లాంటి నాయకులు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం. ఈ తరహా వారికి ప్రకాష్ రాజ్ ఇలాంటి స్థిరత్వం లేని వ్యక్తులు కూడా స్వరం కలపడం మరింత హాస్యాస్పదం. ఈ నటులంతా విజయ్ పోటీలో ఉన్నప్పుడు కనీసం సంఘీభావం చెప్పలేదు. సపోర్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు మాత్రం ఇల్లు కాలుతుంటే చుట్ట పీక వెలిగించుకోవడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్న వీరంతా విజయ్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారో..

ED Raid Punjab: ఈడి అధికారులు అక్కడే ఉన్నారు.. నోట్ల కట్టలు విసిరేసి.. దర్జాగా ఎత్తుకెళ్లిపోయారు..

ED Raid Punjab: మనదేశంలో వ్యవస్థలు గొప్పగా ఉన్నాయని చెప్పుకుంటాం. అవి సమర్థవంతంగా పనిచేస్తుంటాయని గొంతులు చించుకుంటాం. మన దేశం చాలా గొప్పదని.. మన వ్యవస్థను నిర్మించిన వ్యక్తులు అద్భుతమైన వారిని పదేపదే అంటుంటాం. కానీ వ్యవస్థలో లోపాలు మనకు శాపాలని.. ఎదుగుదలకు అవే లోపాలని మనం గుర్తించం.

ఆ మధ్య ఒడిశా రాష్ట్రంలో ఓ మహిళ చనిపోయింది. ఆమె తీవ్ర అనారోగ్యం వల్ల చనిపోయింది. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. ఆమెకు అనారోగ్యం సోకినప్పుడు అతడే చూసుకున్నాడు. చివరికి విషమించి ఆమె చనిపోయింది. ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను తీసుకోవడానికి ఆమె తమ్ముడు బ్యాంకుకు వెళ్ళాడు. అనేక పర్యాయాలు బ్యాంకుకు వెళ్లినప్పటికీ అక్కడ సిబ్బంది రకరకాల షరతులు విధించారు. దీంతో అతడు ఈసారి ఏకంగా తన అక్క మృతదేహాన్ని పాతిపెట్టిన చోటు నుంచి వెలికి తీసి బ్యాంకుకు తీసుకెళ్లాడు. దీంతో బ్యాంకు అధికారులు కంగారుపడ్డారు. ఆ తర్వాత డబ్బును వడ్డీతో సహా ఇచ్చేశారు.

మనదేశంలో సామాన్యుల విషయంలో అనేక రకాల నిబంధనలు.. అనేక రకాల షరతులు విధించే వ్యవస్థలు.. పెద్దలు.. ప్రజలను మోసం చేసేవారి విషయంలో మాత్రం సలాం కొడుతుంటాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా. పైగా మనదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుగానే నోట్ల కట్టలతో దర్జాగా పారిపోయారంటే దానిని ఏమని చెప్పాలో.. దానిని ఎలా వివరించాలో కూడా అర్థం కావడం లేదు.

పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహిస్తుండగా.. 500 నోట్ల కట్టలతో నిండిన రెండు బ్యాగులను కొంతమంది వ్యక్తులు కిందికి వ్యతిరేశారు. ఆ తర్వాత ఒక వాహనంలో అక్కడికి వచ్చిన డ్రైవర్.. ఆ బ్యాగ్రౌండ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఎయిర్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదురుగానే వారు ఈ పని చేయడం విశేషం.

గ్రేటర్ మొహాలి ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భూ వినియోగ అనుమతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వినిపించాయి.. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నితిన్ గోహల్ అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు పంజాబ్ ముఖ్యమంత్రి ఓ ఎస్ డి కి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్, చండీగఢ్ ప్రాంతాలలోని పలువురు బిల్డర్లు.. స్థిరాస్తి వ్యాపారులకు సంబంధించిన కంపెనీలలో గురువారం అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే మొహాలలోని ఖరార్ అనే ప్రాంతంలో అపార్ట్మెంట్లోకి అధికారులు చేరుకున్నారు. ఆ అపార్ట్మెంట్ 9 వ అంతస్తు నుంచి 500 నోట్ల కట్టలతో నిండిన రెండు సంచులను గుర్తు తెలియని వ్యక్తులు కింద పడేశారు. అదే సమయంలో ఒక వాహనం అక్కడికి వచ్చింది. అధికారులు చూస్తుండగానే డ్రైవర్ ఆ బ్యాగులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే దీనిపై అధికారికంగా ఇంతవరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించలేదు.

Yuzvendra Chahal Vaping Controversy: పరాగ్ కే బుద్ధి లేదనుకుంటే.. చాహల్ మరింత బరితెగించాడు.. దుకాణం తెరిచాడు..

Yuzvendra Chahal Vaping Controversy: క్రికెట్.. మనదేశంలో విశేషమైన ప్రాచుర్యం పొందిన క్రీడ. ఈ క్రీడ ఆధారంగానే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారం అంతకంతకు పెరుగుతోంది. ఐపీఎల్ లాంటి టోర్నీలలో పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్లేయర్లను కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసి.. ఆటకు సరికొత్త వ్యాపారాన్ని జత చేస్తున్నాయి.

ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఆడుతున్న ప్లేయర్లు భారీగా వెనకేసుకుంటున్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని కూడా విపరీతంగా సంపాదిస్తున్నారు. అటువంటి ఐపిఎల్ లో కొంతమంది ప్లేయర్లు తమ ఆటతీరు ద్వారా మంచి పేరు సంపాదించుకుంటున్నారు. డబ్బుకు డబ్బుతో పాటు.. గౌరవానికి గౌరవాన్ని పెంపొందించుకుంటున్నారు. అయితే కొంతమంది ప్లేయర్లు మాత్రం ఆట తీరు బాగున్నప్పటికీ.. దారుణమైన వ్యవహార శైలితో విమర్శలు మూట కట్టుకుంటున్నారు. భారత క్రికెట్ నియత్రణ మండలి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అపరాధ రుసుము విధిస్తున్నప్పటికీ ప్లేయర్ల వ్యవహార శైలి ఏమాత్రం మారడం లేదు.

ఇటీవల రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరా డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ కాల్చాడు. దీనిపై బీసీసీఐ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు మరొకసారి ఈ తప్పు చేయకుండా ఉండేందుకు కఠిన శిక్ష విధించింది. అయినప్పటికీ పరాగ్ ఏ మాత్రం మారలేదు. పైగా తాను చేసిన పనిని గొప్పగా సమర్ధించుకున్నాడు. పరాగ్ చేసిన పని అత్యంత చెత్తది అనుకుంటుంటే.. ఇప్పుడు ఆ జాబితాలో చాహల్ కూడా చేరిపోయాడు. ఇటీవల అతడు కార్ డ్రైవింగ్ లో ఉండి సిగరెట్ తాగాడు. ఆ సిగరెట్ పీకను నడిరోడ్డు మీద వదిలేశాడు. ఇప్పుడు హైదరాబాద్ గట్టుతో మ్యాచ్ కోసం విమానంలో అదరు వస్తుండగా వేపింగ్ (ఈ సిగరెట్ తాగడం) కు పాల్పడ్డాడు. అతడు చేసిన పని కెమెరాలలో రికార్డు అయింది..

మనదేశంలో ఈ సిగరెట్లపై నిషేధం ఉంది. అయినప్పటికీ బాధ్యతాయుతమైన ప్లేయర్లు ఇలాంటి పనిచేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సమాజహితమైన పనులు చేసి.. పౌరులకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలాంటి పనిచేయడం అత్యంత బాధాకరమని అభిమానులు వాపోతున్నారు. సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ సిగరెట్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు చెబుతుంటారు. అందువల్లే కేంద్రం వేపింగ్ పై నిషేధం విధించింది. అయినప్పటికీ క్రికెటర్లు ఈ సిగరెట్లు తాగుతూ ఉండడం విశేషం.