Home Blog Page 234

ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్!

AP DWCRA Women Latest Benefits
AP DWCRA Women Latest Benefits

AP DWCRA Women Latest Benefits: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఎలాంటి పూచి కత్తు లేకుండా 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం అందించనుంది. డ్వాక్రా మహిళలు ఎం ఎస్ ఎం ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద ఈ రుణాన్ని అందించనున్నారు. ఈ రుణం తీసుకునేందుకు డ్వాక్రా మహిళలకు ఎలాంటి పూచికత్తు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఐఈఎల్ఏ విధానాన్ని తీసుకొచ్చింది. ఏపీలో డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు..
ప్రభుత్వం ఎం ఎస్ ఎం ఈ యూనిట్లు కోసం రుణాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి మునగ, తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి, నర్సరీలు, సోలార్ డ్రైయర్లు, రక్షిత సాగు, చేపలు వంటి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కింద ఈ యూనిట్ లను అందించనుంది. సెర్ఫ్ శాఖలోని వెలుగు విభాగం అధికారులు ఈ యూనిట్లకు సంబంధించిన డీపీఆర్ తయారీ, దరఖాస్తుల్లో సహకారం అందిస్తారు.

చిన్న తరహా పరిశ్రమలకు..
రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఐపీఓ లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటికే దీనిపై టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇటీవల ఎంఎస్ఎమ్ఈలకు సంస్థాగత రుణాలు కూడా తిరిగాయి. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు వీలుగా.. వారికి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అనేక పథకాలను ప్రవేశపెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తోడు కావడంతో.. మహిళలకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి.

ప్రొఫెసర్ నాగేశ్వర్ వదిలేలా లేరు!

Professor Nageshwar Latest News
Professor Nageshwar Latest News

Professor Nageshwar Latest News: ఏపీ రాజకీయాల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసాయి. పోలీస్ కేసుల వరకు నమోదయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు బహిరంగంగానే చెప్పుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈ తరుణంలో ఆయనకు మద్దతు లభిస్తోంది. ప్రకాష్ రాజు లాంటి వారు మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భంలో జరిగిన పరిణామాలు ఇవి అంటూ బయటపెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వర్. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు అని.. జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు అని.. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళొద్దని క్లాస్ పీకినట్లు చెప్పారు నాగేశ్వర్. ఇది పెద్ద దుమారానికి దారితీసింది. జనసైనికులు ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టారు. దీంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు నాగేశ్వర్.

తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు..
మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా మద్దతు లభిస్తుండగా.. కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. నాగేశ్వర్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించడం విశేషం. 10టీవీ షేర్ల బదిలీ లో భారీగా అవినీతి జరిగిందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అదే విషయాన్ని ఒకరోజు ముందుగానే చెప్పారు తీన్మార్ మల్లన్న. అయితే తీన్మార్ మల్లన్న పై పరువు నష్టం దావా వేస్తానంటూ వేరే వ్యక్తుల ద్వారా సమాచారం ఇచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. దానిపై తీన్మార్ మల్లన్న సవాల్ చేశారు. దమ్ముంటే తనపై పరువు నష్టం దావా వేయాలంటూ సూచించారు. అంతకుమించి ఏమీ జరగదని.. తనపై ఒక కేసు మాత్రమే పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఒకవైపు అయితే.. మరోవైపు తీన్మార్ మల్లన్న ఆరోపణలు సంచలనంగా మారాయి.

పేదవారి సొమ్ము దోపిడి..
10టీవీ పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ పేదవాళ్ల సొమ్ము తిన్నారని మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ దీనిపై విచారణ జరిగితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను తాను అందిస్తారని పేర్కొన్నారు. దమ్ముంటే నాగేశ్వర్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఒకవైపు ఏపీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ రాజకీయ ప్రకంపనలు రేపుతుండగా.. తెలంగాణలో అదే నాగేశ్వర్ ను టార్గెట్ చేసుకుని తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ సెగలు పుట్టిస్తున్నాయి. ఇంకోవైపు నటుడు ప్రకాష్ రాజ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా నిలిచారు. ఇంకోవైపు సిపిఐ నారాయణ అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ను సీఎం క్యాండిడేట్ గా అభివర్ణించారు. మొత్తానికైతే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. రాజకీయ విశ్లేషకుడు కాస్త.. రాజకీయ వివాదాస్పద ముద్ర వేసుకున్నారు. అయితే యుద్ధం వారు ప్రారంభించారు. ముగింపు తాను ఇస్తానని టిడిపి తో పాటు జనసేన పై వ్యాఖ్యానించారు ప్రొఫెసర్ నాగేశ్వర్.

భారత్‌ వ్యూహాత్మక దృక్పథం.. టర్కీ హెచ్చరిక నుంచి వెనెజువెలా చమురు వరకు కీలక అడుగులు

India Strategic Approach
India Strategic Approach

India Strategic Approach: ఆసియా ప్రయాణంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ భారత్‌ను మాత్రం దాటవేయడం, పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్‌ వెనెజువెలా నుంచి చమురు దిగుమతులు పెంచడం, టర్కీ ఐసీబీఎం సామర్థ్యాల జాబితాలో చేరడం.. అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. ఇవి కేవలం యాదృచ్ఛికాలు కావు. ఇవి భారత్‌కు కొత్త భద్రతా సవాళ్లను, అవకాశాలను ఏకకాలంలో సృష్టిస్తున్నాయి.

టర్కీ బెదిరింపు..
అమెరికా థింక్‌ ట్యాంక్‌ నివేదికలో టర్కీ ఐసీబీఎం జాబితాలో చేరడం భారత్‌కు ముఖ్యమైన సంకేతం. టర్కీ నాటో సభ్యుడు కావడం, పాకిస్తాన్‌తో దీర్ఘకాలిక సంబంధాలు ఉండటం, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌కు సహాయం చేయడం, ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌ అంశాన్ని పదే పదే లేవనెత్తడం – ఈ అన్నీ ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. పాకిస్తాన్‌ ఎప్పటినుంచో భారత్‌పై దాడి ఆసక్తి చూపుతోంది. టర్కీ ఇప్పుడు దీర్ఘ పరిధి క్షిపణుల సామర్థ్యం సంపాదించడం ద్వారా ఆ మద్దతు మరింత బలపడే అవకాశం ఉంది. అజర్‌బైజాన్‌ కూడా పాక్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ సైప్రస్‌తో డిఫెన్స్‌ డీల్‌ చేసుకోవడం వ్యూహాత్మక ప్రతిస్పందన.

సైప్రస్‌తో డీల్‌..
టర్కీ నాటో దేశం కావడం వల్ల భారత్‌ సైప్రస్‌తో డిఫెన్స్‌ సహకారం పెంచడం బహుముఖ సందేశం ఇస్తోంది. సైప్రస్‌కు గ్రీస్‌ బలమైన మద్దతు ఉంది. ఇజ్రాయెల్‌–టర్కీ మధ్య ఉన్న విభేదాలు, అమెరికా–నాటో లోపలి ఉద్రిక్తతలు (ట్రంప్‌ నాటోను ‘‘కాగితపు పులులు’’ అని విమర్శించడం) ఈ సమయంలో భారత్‌కు అనుకూలంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్‌ పర్యటన, సైప్రస్‌ అధ్యక్షుడి భారత్‌ సందర్శన – ఈ ద్విపక్ష సంబంధాలు కేవలం ఆర్థికం కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారుతున్నాయి. ఇది టర్కీకి స్పష్టమైన హెచ్చరిక.

వెనెజువెలా చమురు..
పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ వెనెజువెలా నుంచి చమురు దిగుమతులు పెంచడం మరో ముఖ్యమైన అంశం. ఇది అమెరికా ఆంక్షల నుంచి కొంతవరకు స్వతంత్రంగా ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడుతోంది. అయితే వెనెజువెలా చమురు నాణ్యత తక్కువ కావడం వల్ల రిలయన్స్‌ వంటి సంస్థల ప్రాసెసింగ్‌ సామర్థ్యం కీలకమవుతోంది.అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్‌ సందర్శన ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టడం అమెరికాకు మరింత ఆందోళన కలిగిస్తోంది. భారత్‌ ఇక్కడ సమతుల్య విధానం అనుసరిస్తోంది – ఇంధన భద్రతను కాపాడుకుంటూనే అమెరికాతో సంబంధాలను కాపాడుకోవడం.

అమెరికా–భారత్‌ సంబంధాల్లో కొత్త అధ్యాయం?
ట్రంప్‌ ఆసియా పర్యటనలో భారత్‌ను విస్మరించడం గమనార్హం. అయితే ఇది ద్విపక్ష సంబంధాలలో పెద్ద విచ్ఛేదానికి సంకేతం కాదు. రూబియో సందర్శన, ఇజ్రాయెల్‌ వంటి అమెరికా సన్నిహిత దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలు, నాటో లోపలి విభేదాలు – ఇవన్నీ కలిసి భారత్‌కు వ్యూహాత్మక స్థలం ఇస్తున్నాయి.

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు భారత్‌కు సవాళ్లను ఇస్తున్నాయి, అదే సమయంలో కొత్త అవకాశాలను కూడా తెరుస్తున్నాయి. టర్కీ–పాక్‌ అక్షానికి సైప్రస్‌ ద్వారా ప్రతిస్పందన, వెనెజువెలా ద్వారా ఇంధన వైవిధ్యీకరణ, అమెరికా–నాటో ఉద్రిక్తతలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం – ఇవి భారత్‌ యొక్క స్వతంత్ర విదేశీ నీతి యొక్క ఆధునిక ఉదాహరణలు. ఈ సంక్లిష్టమైన ఆటలో భారత్‌ సమతుల్యం, దీర్ఘకాలిక భద్రతా ఆలోచనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ట్రంప్‌ భారత్‌ సందర్శన జరిగినా, జరగకపోయినా – భారత్‌ వ్యూహాత్మక స్వాతంత్య్రం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీ రాజకీయాలపై ఇతర రాష్ట్రాల నేతల అమితాసక్తి

Other State Leaders On AP Politics
Other State Leaders On AP Politics

Other State Leaders On AP Politics: ఏ రాష్ట్రంలోనైనా రాజకీయం ప్రతిపక్షం చేస్తుంది. అధికారపక్షం తీరును ఎండగడుతుంది. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి విభిన్నం. 39 శాతం ఓటు బ్యాంకు ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కోసం గట్టిగానే పోరాటం చేస్తోంది. హోదా వస్తే కానీ సభకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించలేనని చెప్పి తప్పుకుంది. ప్రెస్ మీట్ లు, సోషల్ మీడియాలో పోస్టులకు పరిమితం అవుతుంది. అయితే ఇక్కడ రాజకీయ శూన్యతను భర్తీ చేస్తున్నారు ఇతర ప్రాంతాల వారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఘోర తప్పిదాలు జరిగితే ప్రశ్నించని వీరు.. ఇప్పుడు మాత్రం అదే పనిగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలపై విశ్లేషణలు, విమర్శలు మాత్రం పురుగు రాష్ట్రాల నేతలు, ఇతర ప్రాంతాలకు చెందిన మేధావుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అంతా పక్క రాష్ట్రం వారే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే పోరాటం చేయనని మారం చేస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్, నటుడు ప్రకాష్ రాజ్, తెలంగాణ నేత కేటీఆర్, ఘంటా చక్రపాణి, తెలకపల్లి రవి వంటి వారు ఏపీ రాజకీయాల కోసం విపరీతమైన విశ్లేషణ చేస్తున్నారు. అది కూడా వన్ సైడ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బూతులు మాట్లాడినప్పుడు, ఘోరాతి ఘోరమైన రాజకీయాలు చేసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు తెరవలేదు. పైగా లోకమంతా భయపడి ఆందోళన చెందిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులు అడ్డగోలుగా సమర్ధించారు. ఏపీలో రాజకీయ అస్తిత్వాన్ని సృష్టించేందుకు సరికొత్త విశ్లేషణలు చేస్తున్నారు. ఆధారాలు లేని వాటిని లీకులుగా బయటపెడుతున్నారు. వాటిపై కేసులు పెడుతుంటే ఊహానా మేధావుల రూపంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల నుంచి ఏపీ రాజకీయాలపై విశ్లేషణలు చేస్తున్నారు.

ప్రజల సమస్యలపై కాకుండా..
ప్రస్తుతం మేధావుల ముసుగులో జరుగుతున్న చర్చలు అర్థవంతంగా లేవు. పోనీ ప్రజలు ఎదుర్కొంటున్న పెన్షన్లు, రోడ్లు, ఉద్యోగ ఉపాధి సమస్యల గురించి మీరు ప్రస్తావించడం లేదు. అమరావతి పై విషం కక్కుతుంటే ఈ మేధావులకు కనిపించడం లేదు. ఏపీలో ప్రతిపక్షం ఉందా లేదా అన్నట్టు ఉంది. హైదరాబాదులో కూర్చున్న నేతలు, మేధావులు ఏపీ రాజకీయాలపై రియాక్ట్ అవుతున్నారు. దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నది బహిరంగ రహస్యం. తప్పకుండా తన బాధ్యతను మరిచి వేరొకరికి అప్పగించినట్టు ఉంది వైసీపీ పరిస్థితి. ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలుంటే సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతిపక్ష వైసిపిది. కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకొని వేరే రాష్ట్రాల నేతలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పగించినట్లు ఉంది. ఇది ప్రజల్లోకి బలంగా వెళితే మాత్రం నష్టం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే..

అక్కడ శవపేటికలు గాల్లో వేలాడుతూ ఉంటాయి.. చూసేవాళ్ళ గుండెలు గులాబ్ జాములే..

Hanging Coffins Tradition
Hanging Coffins Tradition

Hanging Coffins Tradition: ఏ మనిషికైనా సరే చావు అనేది కచ్చితంగా వస్తూ ఉంటుంది.. పుట్టుక గురించి తెలుస్తుంది గానీ.. చావు గురించి తెలియదు. చనిపోయిన తర్వాత మృతదేహాలను వారి వారి ఆచారాల ఆధారంగా ఖననం లేదా దహనం చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే భద్రపరుస్తూ ఉంటారు. ఈజిప్ట్ లాంటి ఏరియాలలో పిరమిడ్ల మాదిరిగా రూపొందిస్తుంటారు. చనిపోయిన వ్యక్తి తాలుకు జ్ఞాపకాలను భద్రపరచుకోవడంలో ఒక్కో దేశంలో ఒక్కో తీరైన ఆచారం కొనసాగుతూ ఉంటుంది.

మనదేశంలో చనిపోయిన వారి పార్థివదేహాలను దహనం లేదా ఖననం చేస్తూ ఉంటారు. కొన్ని మతాల సాంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారి అస్థికలను నదులలో కలుపుతుంటారు. పితృ కర్మలు నిర్వహిస్తూ ఉంటారు.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఖననం చేస్తుంటారు. ప్రత్యేకంగా తయారుచేసిన శవపేటికలలో మృతదేహాలను భద్రపరిచి.. ఆ తర్వాత భూమిలో గొయ్యి తీసి.. మట్టి కప్పి పెడతారు. ఆ తర్వాత దానిమీద సమాధులు నిర్మిస్తారు. ప్రతి ఏడాది వారి జయంతి రోజున.. వర్ధంతి రోజున స్మృత్యర్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

పిలిపిన్స్, ఇండోనేషియా, చైనా ప్రాంతాలలో మాత్రం ఇందుకు విరుద్ధమైన సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ శవపేటికలను గాలిలో వేలాడదీస్తారు. ఈ ఆచారం అక్కడ చాలా సంవత్సరాలుగా ఉంది. అక్కడ చనిపోయిన వారి మృతదేహాలను భూమిలో పాతిపెట్టారు. కొండ అంచుల దాకా లేదా గుహల గోడలకు వేలాడదీస్తూ ఉంటారు. శవపేటికలు ఎంత ఎత్తులో ఉంటే.. ఆత్మలు అంత త్వరగా స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతుంటారు. ఈ పద్ధతిని మృతదేహాలను యానిమల్స్ నుంచి రక్షించుకోవడానికి సహాయపడుతుందని అక్కడివారు నమ్ముతుంటారు.. పైగా శవపేటికలను వేలాడదీస్తున్నప్పుడు అక్కడివారు ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటారు. బంధువులు తప్ప మిగతావాళ్లు అక్కడికి రారు.

శవపేటికలను గాలిలో వేలాడదీసిన తర్వాత.. ఈ విషయాన్ని చాలా రోజుల తర్వాత బయటకు చెబుతారు. వర్ధంతి లేదా జయంతి రోజు అక్కడ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తుంటారు.. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేస్తారు. శవపేటికలు అక్కడ గాలిలో వేలాడుతూ ఉండడం కొంతమందికి భయం కలిగిస్తు ఉంటుంది. రాత్రిపూట అక్కడికి వెళ్లాలంటేనే చాలామంది భయపడుతుంటారు. కొన్ని సందర్భాలలో ఆత్మలు అక్కడ సంచరిస్తాయని.. రాత్రిపూట అక్కడి వాతావరణం చాలా విచిత్రంగా మారుతుందని స్థానికులు చెబుతుంటారు. ఆ టైంలో అక్కడికి గనుక వెళ్తే గుండెలు గులాబ్ జాములు అయిపోతాయని భయపడుతుంటారు.

ఏపీలో సిద్ధమవుతున్న మహిళా వారసులు!

AP Women Leaders Future Politics
AP Women Leaders Future Politics

AP Women Leaders Future Politics: పార్లమెంట్ ముంగిటకు మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్ననే పార్లమెంట్ ముంగిటకు ఆ బిల్లు రాగా.. మూడింట రెండో వంతు మెజారిటీ లేక ఆ బిల్లు పాస్ కాలేదు. దీంతో వెంటనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే మరోసారి ఆ రెండు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆ బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తమిళనాడులో డీఎంకే లాంటి లోక్సభ ఎంపీలు ఉన్న పార్టీ సైతం ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే తప్పకుండా రెండు బిల్లులు పార్లమెంట్లో పాస్ అయ్యే అవకాశం ఉంది. ఆమోదం లభించిన మరుక్షణం మహిళా రిజర్వేషన్ తో పాటు డీ లిమిటేషన్ సైతం జరగనుంది.

వచ్చే ఎన్నికల నాటికి..
మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే తప్పకుండా పెద్ద ఎత్తున నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి. 2029 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయానికి మహిళా బిల్లు కచ్చితంగా అమల్లోకి వస్తుందని తెలుగుదేశం పార్టీకి సమాచారం ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. మహిళా వారసులు ఉంటే అధికారిక కార్యక్రమాలకు సైతం పరిచయం చేస్తున్నారు. పాలనలోను వారిని భాగస్వామ్యం చేస్తున్నారు. అటు హై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిత్యం ప్రజలతో మమేకం అయ్యేలా తమ ఆడబిడ్డలను ప్రోత్సహిస్తున్నారు. అయితే కుమార్తెలు అందుబాటులో లేని చోట కోడళ్లను సైతం రంగంలోకి దించాలని చూస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.

కుమార్తెలు కాకుంటే కోడళ్ళు..
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే అన్ని జిల్లాల్లో నేతలు తమ కుమార్తెలను రంగంలోకి దించినట్టు స్పష్టమవుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆమె మీడియా సమావేశం నిర్వహించి అనర్గళంగా మాట్లాడారు. ఒకవేళ రూరల్ నియోజకవర్గం మహిళలకు కేటాయిస్తే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఆమె విదేశాల్లో చదువుకొని వచ్చారు. మంచి చరిష్మ ఉంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్య సైతం నేరుగా రంగంలోకి దిగారు. పార్టీతో పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలా నేతల కుమార్తెలు సిద్ధంగా ఉండడం హాట్ టాపిక్. కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం లభిస్తుందన్న సమాచారంతోనే టిడిపి నేతలు తమ కుమార్తెలను సిద్ధంగా ఉంచారన్నది బహిరంగ రహస్యమే.

ప్రభాస్ వర్షం మూవీ ని ముందుగా ఆ డైరెక్టర్ తో చేయాలనుకున్నాడా..?

Prabhas
Prabhas

Prabhas Varsham Movie Facts: ప్రభాస్ హీరోగా ఎమ్మెస్ రాజు ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన వర్షం సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకి శోభన్ దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఇక వర్షం సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రభాస్ కి ఒక సక్సెస్ కూడా లేదు. రెండు సినిమాలు చేసిన కూడా అవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రభాస్ ఎలాంటి సినిమాలు చేయాలి అనుకున్న సందర్భంలో ఎమ్మెస్ రాజు వర్షం సినిమా కథ చెప్పి అతనిని ఒప్పించాడు. కథ బాగుంది కానీ ఈ మూవీకి దర్శకుడిగా ఎవర్ని తీసుకుందాం అని ప్రభాస్ ఎమ్మెస్ రోజు చర్చించుకున్నారట. మొత్తానికైతే ఎమ్మెస్ రాజు శోభన్ ని తీసుకుందామని చెప్పాడట. అయితే అంతకుముందు శోభన్ మహేష్ బాబుతో బాబీ అనే సినిమా చేసి భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు.

కాబట్టి అప్పుడు ప్రభాస్ శోభన్ ఎందుకు వేరే సక్సెస్ఫుల్ దర్శకుడితో సినిమా చేసుకుందామని చెప్పారట… వి వి వినాయక్ తో ఈ సినిమా చేద్దామా అని ప్రభాస్ ఎమ్మెస్ రాజును కూడా అడిగారట. కానీ ఎమ్మెస్ రాజు మాత్రం లేదు శోభన్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన బాగా తీస్తాడు అని చెప్పి ప్రభాస్ ను ఒప్పించాడట.

మొత్తానికైతే శోభన్ వర్షం సినిమాని నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలపడమే కాకుండా తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఆయన చనిపోవడం ఇండస్ట్రీ కి చాలా పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు తన కొడుకులు అయిన సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ లు సైతం ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ వినాయక్ ను తీసుకుందామా అని ఎందుకు అడిగాడు అంటే ప్రభాస్ కి వినాయక్ కి అంతకు ముందు నుంచి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ చనువుతోనే వినాయక్ ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేస్తాడనే ఉద్దేశ్యంతో అడిగారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ కి వర్షం సినిమా లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…

రామ్ చరణ్ లో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లో మిస్ అవుతున్నాయా..?

Ram Charan Vs NTR Vs Allu Arjun
Ram Charan Vs NTR Vs Allu Arjun

Ram Charan Vs NTR Vs Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికి టైర్ వన్ హీరోలుగా పేరు సంపాదించుకున్న వాళ్ళు మాత్రం వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నటులు ఇప్పటికే పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నారు. రామ్ చరణ్ సైతం ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన తన స్టార్ డమ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి పెద్ది సినిమాతో సిద్ధమయ్యాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ లో ఉన్న ఆ ఒక క్వాలిటీ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లో లేవని కొంతమంది చెబుతున్నారు… రామ్ చరణ్ ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా పోషిస్తున్నాడు. అటు క్లాస్ ఇటు మాస్ ఏదైనా కూడా తన వల్ల అవుతుంది అనేది రోజురోజుకి ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం వైవిధ్యమైన పాత్రలను పోషించడానికి సిద్ధంగా ఉంటాడు. అల్లు అర్జున్ కూడా అలాంటి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రామ్ చరణ్ లో ఆ పర్ఫెక్షన్ బాగుంటుంది.

అలాగే ఆయన కటౌట్ ప్రతి పాత్రకి సెట్ అవుతుంది. ఇక ఆ విషయాల్లో ఎన్టీఆర్ అల్లు అర్జున్ కొంతవరకు మైనస్ అవుతున్నారు అనే చెప్పాలి.. ఇక డ్యాన్స్ విషయంలో కూడా రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ముగ్గురు మంచి డ్యాన్సర్స్ అయిన కూడా రామ్ చరణ్ చాలా గ్రేస్ తో స్టెప్స్ వేస్తాడు.

వాళ్ళిద్దరిలొ కొంతరకు అది తగ్గుతుంది. ఇక రామ్ చరణ్ కెరియర్ స్టార్టింగ్ లోనే ఇద్దరు హీరోలను దాటేసి టాప్ హీరోగా మారాడు. కానీ ఈ మధ్యకాలంలో గేమ్ చేంజర్ మూవీ ఫెయిల్యూర్ తో ఆయన కొంతవరకు వెనకబడ్డాడు. ఇక ఇప్పటినుంచి వరుస సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది..

ఈ మధ్యకాలంలో ఆయన చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తే వీళ్లిద్దరిని బీట్ చేసినవాడవుతాడు. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాడు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్ లను మించి కలెక్షన్స్ ని సాధించిన హీరోగా పేరు సంపాదించుకున్నాడు. రామ్ చరణ్ సైతం అదే బాటలో నడిచి ఆయనను బీట్ చేసి ముందుకు దూసుకెళ్తే ఆయనను ఢీకొట్టే వారు ఎవరు ఉండరు అనేది వాస్తవం..

ఎన్టీఆర్ డ్రాగన్ లో విషయం ఉంది కానీ అదొక్కటే మైనస్ అవ్వనుందా..?

NTR Dragon Movie Updates
NTR Dragon Movie Updates

NTR Dragon Movie Updates: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే అతనికి భారీ దెబ్బ తగిలింది నిన్ను చూడాలని సినిమా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ ఒకసారిగా డీలా పడిపోయాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఆయన ‘ఆది’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు… వెంటనే సింహాద్రి సినిమాతో మరో మాస్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు చాలా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్ని సక్సెస్ లను సాధించిన కూడా ఇప్పటివరకు అతనికి ఒక ఇండస్ట్రీ హిట్ కూడా లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎందుకు ఒక్క ఇండస్ట్రీ హిట్ ను కూడా సాధించలేకపోయాడు అనేది ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతున్న ప్రశ్న… ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాల్సిన అవసరమైతే ఉంది.

ఎందుకంటే తన తోటి హీరోలు అందరు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక్క సినిమాతో కూడా 1000 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమాతో ఆయన ఆ ఫీట్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ వదిలారు. గ్లింప్స్ అద్భుతంగా ఉన్నప్పటికి ఎన్టీఆర్ అందులో కొంత వరకు మైనస్ అయ్యాడంటూ మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కటౌట్ ఆ ఎంటైర్ సినిమా వరల్డ్ లో ఇమడలేకపోయిందనేది వాస్తవం.

ఇక అతని ప్లేసులో ప్రభాస్ గాని, యశ్ గాని ఉంది ఉంటే దానికి ఇంకాస్త ఇంపాక్ట్ వచ్చి ఉండేది. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ ప్లస్ అయ్యాడా మైన అయ్యాడా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం ముగ్గురు దర్శకులు పోటీ పడుతున్నారా..?

Mahesh Babu next movie Director
Mahesh Babu next movie Director

Mahesh Babu next movie Director: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాయి. రాజకుమారుడు సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం రాజమౌళితో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ వచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు ఇంతకు ముందు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు వారణాసి సినిమాతో మరో మెట్టు పైకెక్కలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి గల కారణమేంటంటే ఈ సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుండటం విశేషం…ఈ సినిమాతోనే కాకుండా ఆయన తన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తను నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలనే విషయంలో ముగ్గురు దర్శకులను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.

అందులో ఒకరు సందీప్ రెడ్డివంగా కాగా, మరొకరు ప్రశాంత్ నీల్ ఇంకొకరు రిషబ్ శెట్టి కావడం విశేషం… వీళ్ళ ముగ్గురితో అతను ట్రావెల్ అవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఈ ముగ్గురు కూడా తనకి కథలను వినిపించారట. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఈ ముగ్గురిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు. తన తదుపరి సినిమా సక్సెస్ ని సాధిస్తేనే ఆయనకి భారీ గుర్తింపైతే ఉంటుంది.

ఇక వారణాసి సినిమా కనుక 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడితే మాత్రం మహేష్ బాబు సినిమాకి హాలీవుడ్ లో కూడా విపరీతమైన గిరాకీ పెరుగుతుంది. కాబట్టి తనతో నెక్స్ట్ సినిమా చేసే దర్శకుడు చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన మార్కెట్ విపరీతంగా పెరగడమే కాకుండా ముందు సినిమాతో తర్వాత సినిమాను పోల్చి చూస్తారు.

కాబట్టి వారణాసి సినిమాను మించిన కథతో మూవీ రావాలి అలా వచ్చినప్పుడే మహేష్ బాబు సూపర్ సక్సెస్ ని సాధిస్తాడు. లేకపోతే మాత్రం మరోసారి డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. అందుకే ఆయన ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఏ దర్శకుడిని ఎంచుకోవాలి అనే విషయంలో ఇంకా క్లారిటి రాకపోవడంతో ఈ ముగ్గురిని హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది…

ఆ ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఫైనల్ వార్నింగ్!

Pawan Kalyan And YCP
Pawan Kalyan And YCP

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీపై పూర్తి దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు జరుపుతున్నారు. పనితీరు బాగా లేని వారిని పిలిపించి మరీ మాట్లాడుతున్నారు. పద్ధతి సరి చేసుకోండి.. లేకుంటే తప్పిస్తానని కూడా హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ ఇద్దరి ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు పవన్. అందులో ఒకరిని పదవికి రాజీనామా చేయాలని కూడా ఆదేశించారు. అధినేత ఆదేశాలకు కట్టుబడి ఆయన రాజీనామా కూడా చేశారు. మరో ఎమ్మెల్యే కు నాలుగు వారాల గడువు ఇచ్చారు. ఈ గడువులోగా తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను సరి చేసుకోవాలని సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ ఇస్తారని.. మారకపోతే మాత్రం వదులుకునేందుకు సిద్ధమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

* విప్ పదవిని వదులుకోమన్న పవన్
కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ఆయన ఇటీవల జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆయనపై ఓ ప్రభుత్వ మహిళ ఉద్యోగి తీవ్ర లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీధర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో పాటు వీడియోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ఆ నివేదిక వచ్చిన తరుణంలో ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. అయితే సదరు మహిళతో తనకు సంబంధం ఉన్న మాట వాస్తవమేనని.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ అందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను పవన్ కళ్యాణ్ కు అరవ శ్రీధర్ సమర్పించారు. అయితే ఇక నుంచి అటువంటి ఆరోపణలు విమర్శలు రాకుండా చూసుకోవాలని పవన్ సూచించినట్లు తెలుస్తోంది. జరిగిన డ్యామేజ్ కు విప్ పదవికి రాజీనామా చేయాలని పవన్ ఆదేశించడంతో అరవ శ్రీధర్ ఆ పని చేశారు.

* నాలుగు వారాల డెడ్ లైన్..
మరోవైపు ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై కుటుంబ పరంగా, పార్టీ పరంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తనను విడిచిపెట్టి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారంటూ స్వయంగా బాలరాజు భార్య పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీలో సీనియర్లు ఓ ఇద్దరూ బాలరాజును ప్రోత్సహించి.. జనసేన తరఫున గెలిపిస్తే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. సదరు జనసేన నేతలు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని పవన్ కళ్యాణ్ కు తేల్చి చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజును పిలిపించుకుని మాట్లాడారు పవన్ కళ్యాణ్. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. నాలుగు వారాల్లోగా అన్ని సమస్యలు పరిష్కరించుకొని రావాలని ఆదేశించారు. మొత్తానికి చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో నేత్రం తెరిచినట్టు కనిపిస్తున్నారు.

కనిపించని వైసిపి ప్లీనరీ!

YSRCP plenary

YSRCP plenary : తెలుగుదేశం పార్టీ మహానాడు ను పరమ పవిత్రంగా భావిస్తుంది. పార్టీకి ఒక ఆయుధంలా మార్చుకుంటూ ఏటా క్రమం తప్పకుండా మహానాడు నిర్వహణ ఉంటుంది. ఎన్నికలు, విపత్తులు వస్తే తప్ప తెలుగుదేశం పార్టీ పండుగ నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే తెలుగుదేశం మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సంప్రదాయాన్ని పెట్టుకుంది. ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించుకుంది. కానీ ఏటా దానిని నిర్వహించలేక చేతులెత్తేస్తోంది. ఈ ఏడాది కూడా ప్లీనరీ అనేది కానరావడం లేదు. అటువంటి సన్నాహాలేవీ ప్రారంభం కాలేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన తప్పడం లేదు. పార్టీ క్యాడర్ను కలిసేందుకు ఇదో అరుదైన అవకాశం అని జగన్ భావించడం లేదు.

* అధికారానికి దూరమై రెండేళ్లు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి రెండేళ్లు అవుతోంది. కానీ ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కలుసుకునే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. జిల్లాల పర్యటన అని గత ఏడాది సంక్రాంతికి ముందు ప్రకటించారు. రెండు సంక్రాంతులు దాటి వెళ్లిపోయాయే తప్ప.. ఇంతవరకు జగన్ పార్టీ శ్రేణులను పలకరించిన పాపాన పోలేదు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారం రోజులపాటు పర్యటన చేసి.. ప్రతి నియోజకవర్గంలోని పార్టీ క్రియాశీలక కార్యకర్తను పలకరిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు ఏళ్లు గడుస్తున్న కార్యరూపం ఇవ్వలేదు. పోనీ ప్లీనరీ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రప్పించి.. వారికి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉన్నా.. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడం లేదు.

* మూడేళ్ల కిందట..
అప్పుడెప్పుడో 2023లో ప్లీనరీ నిర్వహించారు. 2024 లో ఎన్నికల ఫలితాలు వచ్చాయని తప్పించుకున్నారు. 2025లో అటువంటి ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు 2026లో దాటవేసే ధోరణితో ఉన్నారు. 2027లో నిర్వహిస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే పాదయాత్ర మొదలు కాబోతోంది ఆ సంవత్సరంలోనే. అయితే ప్లీనరీ నిర్వహణతో పాటు జిల్లాల పర్యటన విషయంలో జరుగుతున్న జాప్యంతో.. పాదయాత్ర పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా కారణాలు చెప్పి పాదయాత్ర వాయిదా వేసిన ఆశ్చర్య పోనవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది.

వైసిపి మాజీమంత్రికి సహకరించని కేడర్!

Gudivada Amarnath Latest Comments
Gudivada Amarnath Latest Comments

YSRCP politics : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతల పరిస్థితి ఏమంత బాగాలేదు. వారి భవిష్యత్తుపై పెద్దగా అంచనాలు లేకుండా పోతున్నాయి. వారికి భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా కాపు నేతల పరిస్థితి వింతగా ఉంది. కానీ వారితోనే రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమి వచ్చిన తర్వాత వారిని ఒక రక్షణ వలయంగా మార్చుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వారికి నియోజకవర్గాల కేటాయింపు, స్థానికంగా రాజకీయ ప్రాధాన్యం లేదు. అటువంటి వారిలో గుడివాడ అమర్నాథ్ ఒకరు ఉన్నారు. జగన్ పై విమర్శలు వస్తే ఇట్టే మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పై ఈగ వాలనివ్వరు. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయనకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. పేరుకే చోడవరం ఇంచార్జ్ కానీ.. అక్కడ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అనుచరులు అస్సలు సహకరించడం లేదు. అందుకే చోడవరంలో సొంత ఇంటి నిర్మాణం పై దృష్టిపెట్టారు గుడివాడ అమర్నాథ్.

* సుదీర్ఘ నేపథ్యం..
కాపు సామాజిక వర్గ ప్రముఖుల్లో గుడివాడ కుటుంబం ఒకటి. అమర్నాథ్ తాత గుడివాడ అప్పన్న, ఆయన తండ్రి గురునాధరావు రాజకీయాల్లో రాణించారు. వారి వారసుడిగా వచ్చిన అమర్నాథ్ తెలుగుదేశం పార్టీలో చాలా ఏళ్ల పాటు ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అమర్నాథ్ ఓడిపోయారు. 2019లో మాత్రం అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు అనకాపల్లి టికెట్ ఇచ్చేందుకు విముఖత చూపారు. చివరి నిమిషంలో గాజువాక నుంచి పోటీ చేయించారు. టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు గుడివాడ. అలాగని ఎన్నికల ఫలితాల తర్వాత గుడివాడకు గాజువాక నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి.

* భీమిలి ఇస్తారనుకుంటే..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా ఉన్న అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు తనకు ఇవ్వాలని గుడివాడ అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ జగన్ అందుకు అంగీకరించలేదు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును భీమిలి బాధ్యతలు ఇచ్చారు జగన్. గుడివాడ అమర్నాథ్ ను తీసుకొచ్చి గ్రామీణ నియోజకవర్గమైన చోడవరం ను అప్పగించారు. అక్కడ ఇన్చార్జిగా ఉన్న కరణం ధర్మశ్రీని ఎలమంచిలికి పంపించారు. అయితే ధర్మ శ్రీ సైతం కాపు సామాజిక వర్గం నేత. గుడివాడ అమర్నాథ్ నియామకాన్ని ఆయన వ్యతిరేకించారు. కానీ జగన్ పై ఉన్న గౌరవంతో మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ గుడివాడ అమర్నాథ్ కు క్యాడర్ సహకరించడం లేదు. గతంలో చోడవరం నుంచి ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహించడంతో ఆయన వస్తారని క్యాడర్ నమ్మకం పెట్టుకుంది. దీంతో ఉన్న ఒక్కగానొక్క నియోజకవర్గ కూడా గుడివాడ అమర్నాథ్ కు ఇబ్బందికరంగా మారింది.

రాజ్యసభ సందడి.. నాగబాబు సడన్ ఎంట్రీ!

Nagababu
Nagababu

Nagababu Rajya Sabha : ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. నలుగురు సభ్యుల పదవీ విరమణ తో వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎన్నికలు జరగనున్నాయి. అయితే కూటమికి ఏకపక్షంగా బలం ఉండడంతో నాలుగు రాజ్యసభ పదవులు చేజిక్కనున్నాయి. అయితే ఈసారి నాలుగు రాజ్యసభ పదవులు ఎలా పంచుకుంటారో తెలియడం లేదు. బిజెపికి ఈసారి ఛాన్స్ లేదన్న ప్రచారం జరుగుతోంది. మూడు తెలుగుదేశం, ఒకటి జనసేన తీసుకుంటుంది అన్న టాక్ ఉంది. అయితే జనసేన తరఫున తొలిసారిగా రాజ్యసభకు ఎవరు వెళ్తారు అనేది ఇప్పుడు చర్చ. చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా పారిశ్రామికవేత్తలతో పాటు సినీ నిర్మాతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు పేరు తెరపైకి రావడం విశేషం.

* ఏడాది కిందట ఎమ్మెల్సీగా..
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు మెగా బ్రదర్ నాగబాబు. మంత్రివర్గంలోకి తీసుకునే వీలుగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. గతంలో రెండు సార్లు రాజ్యసభకు సంబంధించిన ఖాళీలు వచ్చాయి. ఆ సమయంలో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ వివిధ సమీకరణలో ఛాన్స్ దక్కలేదు. అయితే వెంటనే చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే గత ఏడాది మార్చిలో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఆయనకు ఛాన్స్ దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు రాజ్యసభ పదవి ఆశిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కేంద్ర రాజకీయాలపై ఆసక్తి..
ఎంపీగా కేంద్ర రాజకీయాల్లో ఉండాలన్న బలమైన కోరిక నాగబాబుది. 2019లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు నాగబాబు. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో 2024లో పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అందుకుగాను ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించడంతో సీఎం రమేష్ పోటీ చేశారు. దీంతో నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తరువాత రాజ్యసభ ద్వారా ఎంపీ కావచ్చు అని భావించారు. అది కుదరకపోవడంతో మంత్రివర్గంలోకి తీసుకుంటానన్న చంద్రబాబు ప్రకటనతో ఉపశమనం లభించింది. అయితే రాష్ట్ర మంత్రిగా కాకుండా కేంద్రమంత్రి కావాలన్నది నాగబాబు ఆలోచన. ఇప్పటివరకు జనసేన కేంద్ర మంత్రివర్గంలో ఎటువంటి పదవులు తీసుకోలేదు. రాజ్యసభకు ఎంపిక కావడం ద్వారా కేంద్రమంత్రివర్గంలోకి వెళ్లాలన్నది నాగబాబు ఆలోచన. జనసేన జాతీయ రాజకీయాల బాధ్యత తీసుకోవాలన్నది ప్రణాళిక. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు నాగబాబు వెళ్తారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

పెంచుకుంటూ పోతున్నారు.. ఎన్నాళ్ళు ఈ పెట్రోమంట

Petrol Price Hike In India
Petrol Price Hike In India

petrol price hike : పెంచుడు కార్యక్రమం దర్జాగా సాగిపోతోంది. జనాలకు కూడా అలవాటైపోతుంది. మొదట్లో మూడు రూపాయలు పెంచారు. ఆ తర్వాత 90 పైసలు వడ్డించారు. ఇప్పుడు ఏకంగా 2.84 రూపాయలు పెంచేశారు. ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల సామాన్య జనం బతికే పరిస్థితి లేకుండా పోతోంది. ధరల స్థాయి నిరంతర పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లో ప్రతి వస్తువు ధర కూడా ఆకాశంలో విహరిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదలను సాకుగా చూపించి వ్యాపారులు ఇతర వస్తువుల ధరలు కూడా పెంచుతున్నారు. దీనివల్ల సగటు మనిషి బతకలేక పోతున్నాడు.

సోమవారం ఉదయం నుంచి మన దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు మరింత పెరిగాయి. పెట్రోల్ పై 2.84.. డీజిల్ పై 2.86 రూపాయల ధర పెరిగింది. నష్టాలు వస్తున్నాయని సాకుగా చూపించిన దేశీయ చమురు రంగ సంస్థలు ధరలను విపరీతంగా పెంచాయి. ఈ ధరలు సోమారం ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే మూడు విడతలుగా డీజిల్, పెట్రోల్ ధరలను చమురు రంగ సంస్థలు పెంచేశాయి.. ఇప్పుడు పెరిగిన దర ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.12, లీటర్ డీజిల్ ధర 95.20కి విక్రయిస్తున్నారు.. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 111.12, చెన్నైలో 107.77, విజయవాడలో 117.19, డీజిల్ 104.88, గుంటూరులో పెట్రోల్ 117.59, డీజిల్ 105.28, హైదరాబాదులో పెట్రోల్ 115.58, డీజిల్ 103.74 ధరలో లభ్యమవుతూ ఉంటుంది.

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం తగ్గినప్పటికీ.. ఉద్రిక్తతలు ఒకప్పటి మాదిరిగా లేకపోయినప్పటికీ.. చమురు సరఫరాలో ఊహించిన వేగం లేదు. పైగా అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలు యుద్ధం వల్ల ఏర్పడిన లాస్ ను పూడ్చుకోవడానికి క్రూడ్ ఆయిల్ ధరలను పెంచేస్తున్నాయి. దీనివల్ల అన్ని దేశాలలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాలైతే చమురు వినియోగంలో అనేక షరతులు విధిస్తున్నాయి. ప్రజలను ఇష్టానుసారంగా వాడకూడదని సూచిస్తున్నాయి. దీంతో అన్ని రకాల సేవలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు చమురు ఆధారంగా సాగుతూ ఉంటాయి. చమురు ధరలు పెరిగితే చాలు ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతుంటాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో సగటు జీవి బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. అందువల్లే యుద్ధం శాశ్వతంగా ముగిసి.. చమురు ధరలు సాధారణ స్థితికి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. అయితే శాంతి చర్చల నేపథ్యంలో అటు ఇరాన్.. ఇటు అమెరికా పట్టు విడుపులకు పోతున్న నేపథ్యంలో పరిస్థితి ఎప్పుడు మునుపటి స్థితికి వస్తుందో అర్థం కావడం లేదు.

బాలిక పై అఘాయిత్యం.. జోకులేసిన ముగ్గురు ఐపీఎస్ లను తీసేసిన విజయ్.. సంచలనం

IPS officers suspended, Coimbatore girl case

IPS officers suspended : తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కోయంబత్తూర్ జిల్లాలో ఓ పదేళ్ల బాలికపై ఘోరం జరిగింది. ఆమెను కొంతమంది వ్యక్తులు అపహరించి.. అత్యంత క్రూరానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. అంతేకాదు జరిగిన ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంబంధిత ఎమ్మెల్యే పరామర్శించారు.

ఈ కేసులో పోలీసులు వేగంగా వ్యవహరించారు. నేరుగా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో విచారణను వేగవంతం చేశారు. ఫలితంగా ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసు కు సంబంధించిన విషయాలను చెప్పడానికి నిన్న ఒక మహిళ ఐజీ అధికారి.. ఇద్దరు ఐపీఎస్ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దానికంటే ముందు వారు ముగ్గురు నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా మహిళ ఐజీ అధికారి అయితే తోటి ఐపీఎస్ అధికారులతో సరదాగా నవ్వుతూ ముచ్చటించారు. గోర్లు గిల్లుతూ.. ఈ సంఘటనపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఆ మహిళ ఐజీ అధికారి వ్యవహరించిన తీర్పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఒక బాలిక చనిపోతే కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నువ్వు కూడా ఒక మహిళవే కదా.. నీక్కూడా పెళ్లయి ఉంటుంది కదా.. నీకు పిల్లలు ఉండి ఉంటారు కదా.. ఒకవేళ జరిగిన ఘటనలో చనిపోయింది నీ కూతురైతే నువ్వు ఇలానే వ్యవహరిస్తావా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇది కాస్త ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లిపోయాయి.

విజయ్ వెంటనే స్పందించారు. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక కేసు వ్యవహారంలో పోలీసులు నిజాలు చెప్పేటప్పుడు ఇలా వ్యవహరించకూడదని సూచించారు. ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలని.. శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు. దారుణంగా వ్యవహరించే అధికారుల మీద ఏమాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదని విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జరిగిన ఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని.. పోలీసులు ఇకపై ఇలా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. అందువల్లే ఆ ముగ్గురు అధికారులపై సస్పెండ్ వేటు వేస్తున్నట్టు వెల్లడించారు.

విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. విజయ్ ని చూసి మిగతా ముఖ్యమంత్రులు నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు..”విజయ్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించలేదు. ఆ ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయించాడు. దీనిని బట్టి పోలీసులు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో తెలుసుకుంటారని” నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాల్లో రామ్ చరణ్ కి నచ్చిన మూవీ అదేనా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. 2008 వ సంవత్సరంలో ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఇమడలేక ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. అయితే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత చేసిన సినిమాలు అతనికి కొంతవరకు చేదు అనుభవాన్ని మిగిల్చాయనే చెప్పాలి. ఇక వాల్తేరు వీరయ్య, మన శంకర్ వరప్రసాద్ లాంటి సినిమాలు మాత్రమే అతనికి ఊరటను ఇచ్చాయి.

సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి చేసిన సినిమాల్లో రామ్ చరణ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటి అంటే ‘సైరా’ సినిమా అని చెబుతున్నాడు. చిరంజీవి చాలా అగ్రెసివ్ గా కనిపించడమే కాకుండా క్యారెక్టర్ కోసం చాలా వరకు కష్టపడ్డాడు. కాబట్టి సైరా మూవీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్తుంటాడు.

ఒక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ సినిమా అండర్ రేటెడ్ మూవీ అని అనుకున్న విజయాన్ని సాధించకపోయిన కూడా చిరంజీవిలోని పూర్తి స్థాయి నటుణ్ని మరోసారి బయటికి తీసింది అంటు పలు సందర్భాల్లో కొందరు కామెంట్స్ కూడా చేశారు….మొత్తానికైతే రామ్ చరణ్ కి తన తండ్రి చేసిన సినిమాల్లో సైరా అంటే ఇష్టం ఉండటమే కాకుండా ఆ సినిమా ని ప్రొడ్యూస్ చేసింది కూడా రామ్ చరణ్ నే కావడం విశేషం…

ఆ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే దర్శకుడు దానిని చాలా బాగా తీర్చిదిద్దినప్పటికి క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులకు అంత బాగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. దాంతో ఆ సినిమాని వాళ్ళు పక్కన పెట్టేసారు. మొత్తానికైతే సినిమా విజువల్ గా గాని చిరంజీవి నటన పరంగా గాని ప్రేక్షకులకు ఒక హై ఫీల్ ఇచ్చింది. ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించాలని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…