Delhi Bed And Breakfast Policy: సాధారణంగా పర్యటక రంగం అనేది ఆ దేశ పరిస్థితులు ఆధారంగా ఉంటుంది. అక్కడి ప్రభుత్వాలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటే.. పర్యాటక రంగానికి అనుకూలంగా విధానాలను మార్చుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రపంచంలో పర్యాటక స్వర్గధామాలుగా పేరుపొందిన ప్రాంతాలు.. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. మన దేశానికి కూడా పర్యాటక రంగంలో మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వాలు రకరకాల విధానాలను అమలు చేస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది లక్షలాదిమంది ఢిల్లీ నగరానికి వస్తుంటారు. ఇక్కడి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే అందరూ పర్యటకులు లగ్జరీ సౌకర్యాల కోసం ఖర్చుపెట్టరు. కొందరు పరిమిత బడ్జెట్లోనే తమ టూర్ మొత్తం పూర్తి కావాలని భావిస్తుంటారు. అదే అటువంటి వారికోసం గతంలో బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. బెడ్, బ్రేక్ ఫాస్ట్ అనగానే చాలామంది హోటల్ అనుకుంటారు.. కానీ అది కాదు.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి.. దానిని మరింత బలోపేతం చేయడానికి.. స్థానికులకు అదనపు ఆదాయాన్ని కల్పించడానికి ఢిల్లీలో ఈ వసతి విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఢిల్లీలో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదానికి ఈ పాలసీనే కారణమని.. దానిని రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.
అగ్ని ప్రమాదం వల్ల చాలామంది చనిపోయారు. అదే స్థాయిలో గాయపడ్డారు. అగ్ని ప్రమాదం వల్ల ఏర్పడిన మంటలు ఢిల్లీలో చాలా నష్టాన్ని కలుగజేసాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని పక్కన పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ప్రకారం ఇంటి ఓనర్లు తమ ఇంట్లో ఉన్న కొంత భాగాన్ని పర్యాటకులకు కల్పిస్తారు. వారికి వసతి.. ఆహారం.. ఇతర సదుపాయాలు కల్పిస్తారు. దీనివల్ల కొంతమేర ఆదాయాన్ని వారు సంపాదిస్తారు. బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంలో గరిష్టంగా ఆరుగదులకు అనుమతి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానం కారణమని నిపుణులు అంటున్నారు. సరైన విధానాలు పాటించకపోవడం.. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పక్కన పెట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. అసలే ఎండాకాలం.. దానికి మంటలు కూడా తోడు కావడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉంది. అందువల్లే ప్రాణం నష్టం చోటుచేసుకుంది. ఇంతటి ప్రమాదానికి ఆ విధానం కారణమని భావించిన ఢిల్లీ ప్రభుత్వం.. ఇకపై దానిని పక్కన పెడతామని.. భవిష్యత్తులో కూడా అమలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామందికి ఉపాధి దూరమైనప్పటికీ.. ప్రజల ప్రాణాల దృష్ట్యా తీసుకోవడం తప్పడం లేదని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది.
















వైసీపీ సచివాలయ ఉద్యోగాలపై ఉపాధ్యాయురాలి ఓపెన్ ఛాలెంజ్.. వైరల్!
YSRCP DSC 2025 Allegations: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై బురద జల్లుతోంది. వ్యతిరేక ప్రచారం చేస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని అయితే పేకాట ఆడే వారిని ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు అని.. స్పోర్ట్స్ కోటాలో పేకాటను చూపారంటూ.. బ్రిడ్జ్ అనే ఆటను ఎత్తిచూపారు. ఇక తక్కువ ర్యాంకు లు వచ్చేవారిని పక్కన పెట్టారని.. ఎక్కువ ర్యాంకులు వచ్చే వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని.. పేపర్ లీకేజీ కి గురైందని.. వెబ్సైట్లో వివరాలు డిలీట్ చేశారని ఇలా ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. అయితే అదంతా ఉత్త ప్రచారం అని తేల్చింది ప్రభుత్వం. విద్యాశాఖ కార్యదర్శి తో పాటు ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా సరే వైసిపి వ్యతిరేక ప్రచారం ఆపడం లేదు. అందుకే ఇప్పుడు నేరుగా ఎవరైతే ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారో వారే రంగంలోకి దిగుతున్నారు. సచివాలయం ఉద్యోగ ఎంపికపై కొత్త అంశాన్ని బయటపెడుతున్నారు.
* జిల్లా కమిటీల ఆధ్వర్యంలో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2019 అక్టోబరు రెండున గాంధీ జయంతి నాడు ఈ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశారు. అప్పట్లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. ఎక్కడ కూడా ర్యాంకులు ప్రకటించలేదు. చాలా పోస్టులకు అర్హత సాధించిన వారిని సైతం ఎంపిక చేశారు. ఎందుకంటే అప్పట్లో పోస్టులు మిగిలిపోయాయి. కట్ ఆఫ్ మార్కులు కంటే తక్కువ వచ్చిన వారిని సైతం పిలిచి మరి ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ ర్యాంకుల ప్రస్తావన లేదు. ఇప్పుడు అదే అంశాన్ని గుర్తు చేస్తున్నారు డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు. తప్పు మీరు చేసి.. ఇప్పుడు డీఎస్సీ 2025 పై బురద జల్లడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.
* అడ్డగోలుగా పేర్ని నాని వాగుడు..
ప్రధానంగా మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ ప్రజల్లోకి తప్పుగా వెళుతున్నాయి. ఒక రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించిన ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ అనే స్పెల్లింగ్ తెలియకుండా కూడా మాట్లాడుతున్నారు. చెస్ అనే మేధో సంపత్తితో కూడిన క్రీడతో బ్రిడ్జి సమానం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆ బ్రిడ్జి అనే అంశాన్ని చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కోటాలో ఒక్క ఉద్యోగం కూడా నియమించలేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ మాత్రం అదే పనిగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా పేర్ని నాని కామెంట్స్ ను చదువుకున్నవారు అసహ్యించుకుంటున్నారు. వైసిపి ఆయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు తీయకపోగా.. ఇలా అడ్డగోలు వాదనతో కుట్రలను తెరతీయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* వైసీపీకి సవాల్..
తాజాగా ఎంపికైన ఉపాధ్యాయుల్లో చాలామంది సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. అప్పట్లో సచివాలయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అటువంటి వారు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఓపెన్ చాలెంజ్ ఇస్తున్నారు. డీఎస్సీ 2025 పై ప్రభుత్వం అన్ని వివరాలు సమర్పించిందని.. సచివాలయ ఉద్యోగుల ఎంపికలో మార్గదర్శకాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టగలరా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అసలు ర్యాంకులు, విధి విధానాలంటూ లేకుండా అప్పట్లో సచివాలయ ఉద్యోగ నియామకాలు జరిగాయి అనేది బహిరంగ రహస్యం. కానీ దానిపై టిడిపి అనవసర జోక్యం చేసుకోలేదు. నిరుద్యోగ యువతతో ఆడుకోలేదు. కానీ ఇప్పుడు పారదర్శకంగా జరిగిన డీఎస్సీ 2025 పై కుట్ర చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.