Home Blog Page 119

పెద్ది' 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. సీడెడ్ , నెల్లూరు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అసాధ్యమే..

Peddi 12 Days Collections
Peddi 12 Days Collections

Peddi 12 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ జోరు, 12 రోజులు దాటినప్పటికీ కూడా ఏ మాత్రం తగ్గలేదు. వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి వస్తున్నంత లాంగ్ రన్ , ఈమధ్య కలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 2వ సోమవారం, అనగా 12 వ రోజున దాదాపుగా 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిందని అంటున్నారు. ఇది సాధారమైన విషయం కాదు. ఈ రేంజ్ రన్ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రానికి రాయలసీమ , నెల్లూరు జిల్లాల్లో నష్టాలు తప్పేలా లేవని లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట.

రాయలసీమ ప్రాంతం లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 24 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 12 రోజుల్లో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 4 కోట్లు రావాలి , ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో అయితే మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ కష్టమే. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే విడుదలకు ముందు ఈ చిత్రానికి 6 కోట్ల 30 లక్షల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 80 లక్షల షేర్ రావాలి , ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే మరో 50 లక్షలు మాత్రమే వచ్చేలా కనిపిస్తోంది.

ఇక మిగిలిన జిల్లాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది. నైజాం ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 51 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21 కోట్ల 53 లక్షలు రాగా , ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 18 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 8 కోట్ల 63 లక్షలు , గుంటూరు నుండి 12 కోట్ల 12 లక్షలు , కృష్ణ నుండి 9 కోట్ల 72 లక్షలు , నెల్లూరు నుండి 5 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 141 కోట్ల 59 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 213 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 322 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 192 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఎట్టకేలకు నాగార్జున తో సినిమా ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి.. స్టోరీ మామూలుగా లేదుగా..

Anil Ravipudi And Nagarjun
Anil Ravipudi And Nagarjun

Anil Ravipudi And Nagarjuna: ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ తో కొనసాగుతున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే, అది అనిల్ రావిపూడి మాత్రమే. కమర్షియల్ సినిమాలు ఇతర డైరెక్టర్స్ తీస్తే చూసే మూడ్ లో ఆడియన్స్ లేరు , కానీ అనిల్ రావిపూడి తీస్తే మాత్రం బ్రహ్మరథం పట్టడానికి రెడీ గా ఉంటారు. ఎందుకంటే ఆయన మాత్రమే ప్రస్తుతం కమర్షియల్ జానర్ లో అన్నీ పర్ఫెక్ట్ మీటర్ లో సినిమాలు తీస్తున్నది. థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ నిరాశ చెంది మాత్రం బయటకు వెళ్ళడు , మినిమం గ్యారంటీ ఎంటెర్టైమెంట్ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంటుంది కాబట్టే , అనిల్ రావిపూడి సినిమాలకు ఇంత క్రేజ్ ఉంటుంది. అయితే సీనియర్ హీరోలలో ఒక్క నాగార్జున తో మినహా, మిగిలిన ముగ్గురుతో సినిమాలు తీసి అనిల్ రావిపూడి వాళ్లకి మెమరబుల్ సూపర్ హిట్స్ ని అందించాడు.

వెంకటేష్ తో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీయగా , మెగాస్టార్ చిరంజీవి తో మన శంకర వరప్రసాద్ గారు వంటి ఇండస్ట్రీ హిట్ , బాలయ్య బాబు తో ‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తీసాడు. ప్రస్తుతం వెంకటేష్ తో నాల్గవ సినిమా చేస్తున్నాడు. అయితే సీనియర్ హీరోలందరితో సినిమాలు చేశావ్ , అక్కినేని నాగార్జున తో సినిమా ఎప్పుడు అని అనిల్ రావిపూడి ని ప్రతీ ఇంటర్వ్యూ లో , ఈవెంట్స్ లో అడుగుతూనే ఉన్నారు . కచ్చితంగా నాగార్జున గారితో సినిమా చేస్తాను అని క్లారిటీ ఇస్తూ వచ్చిన అనిల్ రావిపూడి , ఎట్టకేలకు ఇప్పుడు కార్యరూపం దాల్చింది. రీసెంట్ గానే వీళ్లిద్దరి కాంబినేషన్ ఒక సినిమాని ఫైనల్ చేశాడట ఒక టాప్ నిర్మాత. అది కచ్చితంగా దిల్ రాజు అయ్యుంటాడని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది కానీ , పూర్తి వివరాలు బయటకు రాలేదు.

వెంకటేష్ , కళ్యాణ్ రామ్ మల్టీ స్టార్రర్ చిత్రం పూర్తి అవ్వగానే, అక్కినేని నాగార్జున తో సినిమాని సెట్స్ మీదకు తీసుకొస్తాడట అనిల్. నాగార్జున కెరీర్ లో ‘హలో బ్రదర్’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది అందరికీ తెలిసిందే. కేవలం ఆయన కెరీర్ లోనే కాదు , కమర్షియల్ సినిమా ఫార్మాట్లో కొత్త ఒరవడి ని సృష్టించింది ఆ చిత్రం. నాగార్జున తో ఇప్పుడు అదే తరహా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. పర్ఫెక్ట్ గా తీస్తే , ఈ సినిమాతో నాగార్జున కం బ్యాక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అవలీలగా ఈయన కూడా 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోక్ చేరిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరోసారి రీ రిలీజ్ కి సిద్దమైన 'గబ్బర్ సింగ్'..ఈసారి సరికొత్త సన్నివేశాలతో..

Gabbar Singh Re Release
Gabbar Singh Re Release

Gabbar Singh Re Release: ఇప్పటి జనరేషన్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ’ అనే పేరు ఎత్తితే ఎలా పూనకాలు వస్తాయో, సీనియర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ‘గబ్బర్ సింగ్’ పేరు ఎత్తితే అలాంటి పూనకాలు వస్తాయి. పులి , తీన్ మార్ , పంజా వంటి వరుస హ్యాట్రిక్ డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత పవన్ కళ్యాణ్ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. అభిమానులు తమ అభిమాన హీరో మళ్లీ కం బ్యాక్ ఇస్తాడనే ఆశలు కోల్పోయారు. సరిగ్గా అలాంటి సమయం లో విడుదలైన ‘గబ్బర్ సింగ్’ చిత్రం వాళ్లకు ఒక అద్బుతమమైన జ్ఞాపకాలను ఇచ్చింది. మొదటి రోజు నుండి క్లోజింగ్ వరకు టాలీవుడ్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా వసూళ్లను బాహుబలి వచ్చేంత వరకు , ఒక్క స్టార్ హీరో కూడా ముట్టుకోలేకపోయారు.

దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు అనేక సందర్భాల్లో స్పెషల్ షోస్ గా వేసుకొని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు. 2024 లో , ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత , ఈ చిత్రాన్ని మరోసారి పవన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ చేశారు. మొదటి రిలీజ్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో , రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం అలాంటి సెన్సేషన్ సృష్టించింది. మొదటి రోజే ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం. ఇప్పటి వరకు ఈ రికార్డు ని మన టాలీవుడ్ లో ఒక్క హీరో కూడా ముట్టుకోలేకపోయారంటే , పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ చిత్రాన్ని ఈ నెల 26 న మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్టు , ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ కాసేపటి క్రితమే ట్విట్టర్ లో అధికారిక ప్రకటన చేసాడు. విడుదల సమయం లో ఎడిటింగ్ లో తొలగించబడ్డ కొన్ని సన్నివేశాలను జత చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారట. మరి ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అయితే ఈ సినిమాకు న్యూట్రల్ ఆడియన్స్ లో క్రేజ్ తక్కువే, 2024 లో కూడా కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ వల్ల ఆ రేంజ్ హిట్ అయ్యింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం పంజా రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు , ఇలాంటి సమయం లో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ని ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

ఈ అందగత్తె తేల్చేసింది.. భూ కాలుష్యానికి.. ఇన్ని దారుణాలకు మగాళ్లే కారణమట..

Dia Mirza
Dia Mirza

Dia Mirza: భూమి మీద కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు విస్తారంగా ఉన్న చెట్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఫలితంగా మనుషులు నిండు నూరేళ్లు బతకలేకపోతున్నారు. నిండా రోగాలతో నరకం చూస్తున్నారు. చిన్న వయసులోనే ప్రాణాంతక రోగాలతో ప్రాణాలు విడుస్తున్నారు. ఇన్ని అనర్ధాలకు కారణం కాలుష్యం.

పరిశ్రమలు.. చెట్లను కొట్టివేయడం.. అడవులను ఆక్రమించడం.. నదులను మట్టితో పూడ్చివేయడం.. ఇంకా అనేక రకాల కారణాలు కాలుష్యానికి దోహదం చేస్తున్నాయి. ఇప్పటివరకు కాలుష్యం పెరడానికి కారణాలను పై వాటినే విశ్లేషించేవారు. కానీ భూమ్మీద కాలుష్యం పెరగడానికి.. ఈ స్థాయిలో అనర్ధాలు జరగడానికి కారణం కేవలం మగవాళ్లేనట. అదేంటి కేవలం మగవాళ్ళు మాత్రమే కారణమైతే.. ఆడవాళ్లు ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్న మీలో వ్యక్తం అయింది కదూ..

ఈ భూమి మీద కాలుష్యం ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం మగవాళ్ళు అని చెప్పింది ఏదో ప్రసిద్ధమైన యూనివర్సిటీ కాదు. ప్రపంచ స్థాయి వ్యక్తులు చేసిన పరిశీలన కాదు. పేరుపొందిన వ్యక్తులు రూపొందించిన నివేదిక అంతకంటే కాదు. ఈ మాట అన్నది అందగత్తె దియా మీర్జా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. ఫెమినిజం గురించి సరికొత్తగా వ్యాఖ్యానించింది. “ఈ ప్రపంచంలో ఇప్పటివరకు తయారుచేసిన వస్తువులు.. ఉత్పత్తుల వెనుక మగవాళ్ళు ఉన్నారు. వాళ్లు మాతృ స్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడారు. పితృ స్వామ్య వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. ఆడవాళ్లను తొక్కేస్తున్నారు. వాళ్లకు అనుకూలంగా ఉత్పత్తులు తయారుచేసి.. ఈ భూమిని మొత్తం కాలుష్య కాసారంలాగా మార్చేసారని” దియామీర్జా వ్యాఖ్యానించింది.

కానీ ఇక్కడ ఫెమినిజం అంటే.. మగవాళ్ళను తిట్టడం కాదు.. ఆడవాళ్ళు ఎదగడం.. ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడం.. అన్నింటికీ మించి సమాజంలో ఉన్నతంగా జీవించడం.. మగవాళ్లను కూడా అదే స్థాయిలో గౌరవించడం.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా ఇలా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అన్నట్టు ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడిన మైక్.. ఉపయోగించిన లైట్లు.. ముఖానికి వేసుకున్న మేకప్.. జుట్టుకు వేసుకున్న డై.. ధరించిన దుస్తులు.. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సంబంధమైనవే. వీటితో పోల్చి చూస్తే మగవాళ్ళు చేసే కాలుష్యం ఎంత.. ఆడవాళ్లు మేకప్ కోసం ఉపయోగించే వస్తువులు ఎకో ఫ్రెండ్లీ కాదు కదా.. పాపం దియా మీర్జా.. మెదడులో చిప్ దొబ్బినట్టు ఉంది.. అందుకే ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తోంది..

టీమిండియాలోకి ధోని.. 2027 వరల్డ్ కప్ కోసం భారీ స్కెచ్

Dhoni Comeback
Dhoni Comeback

Dhoni Comeback: 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది.. అప్పట్లో కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా విశ్వ సమరంలో విజేతగా నిలిచింది. మళ్లీ ఆ ఘనత అందుకోవడానికి 2011 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. 2011 తర్వాత మళ్లీ టీం ఇండియా విశ్వవిజేత కాలేక పోయింది.

2023లో టీమిండియా తుది అంచె వరకు వెళ్లినప్పటికీ.. ట్రోఫీ అందుకోలేకపోయింది. స్వదేశంలో ఈ టోర్నీ జరిగినప్పటికీ టీమిండియా కంగారుల చేతిలో తలవంచాల్సి వచ్చింది. ఆ బాధ ఇప్పటికీ సగటు భారత క్రికెట్ అభిమానిలో ఉంది. అయితే 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఎలాగైనా విజేతగా నిలవాలని బీసీసీఐ బలమైన నిర్ణయంతో ఉంది. అందువల్లే మేనేజ్మెంట్ ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

2011లో టీమిండియాను విజేతగా నిలిపిన ధోని కి మళ్లీ ద్వారాలు తెరిచింది. అయితే ఈసారి అతడు ఆటగాడిగా కాకుండా.. మెంటార్ గా రాబోతున్నాడు. దానికి ధోని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాకపోతే వచ్చేముందు ఒక కండిషన్ పెట్టినట్టు సమాచారం. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో రిషబ్ పంత్ కు చోటు కల్పించాలని ధోని కోరినట్టు తెలుస్తోంది. పంత్ అద్భుతమైన ఫినిషర్ అని.. అతడి సేవలు 2027 వన్డే వరల్డ్ కప్ లో జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయని ధోని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీనికి మేనేజ్మెంట్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.

జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ కు భారత జట్టుకు ప్రధాన శిక్షకుడిగా గౌతమ్ గంభీర్.. అసిస్టెంట్ కోచ్ గా దస్కటే, పర్యవేక్షకుడిగా ధోని.. ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్, బౌలింగ్ కోచ్ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కొనసాగుతారు.. ధోని ఆధ్వర్యంలో టీమిండియా 2011లో విశ్వ సమరంలో గెలిచినప్పుడు.. నాడు జట్టులో గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక మీద అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు 2011 నాటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేయాలంటే ధోని అవసరమని మేనేజ్మెంట్ భావించడం.. దానికి అతడు ఓకే చెప్పడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.

అల్లు అర్జున్ క్రేజ్ చూసి షాక్ అయిన స్టార్ హీరోలు

Allu Arjun Shah Rukh Khan collaboration
Allu Arjun Shah Rukh Khan collaboration

Allu Arjun craze : గంగోత్రి సినిమాతో తన కెరియర్ ని మొదలుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత చేసిన ఆర్య సినిమాతో యూత్ ఐకాన్ గా మమారిపోయాడు. అలాంటి నటుడు మరొకరు ఉండరనేంతలా మార్కును చూపించిన నటుడు కూడా తనే కావడం విశేషం…ఎక్కడ మొదలైన ఆయన ప్రస్థానం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది అల్లు అర్జున్ కి చాలా బాగా అవుతుంది. తెలుగులో అతను హీరోగానే పనికిరాడు. ఆ లుక్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేవని విమర్శించిన వాళ్ళు సైతం ఇప్పుడు అతన్ని ఐకానిక్ స్టార్ అంటూ అభివర్ణిస్తుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడైతే విమర్శించబడ్డాడో అక్కడే తన స్టార్ డమ్ ను విస్తరించకున్నాడు.

టాప్ లెవల్ కి వెళ్ళాడు. ఇక ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు. అట్లీ డైరెక్షన్లో చేస్తున్న ‘రాకా’ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు… ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇక బాలీవుడ్ హీరోలు సైతం అతని క్రేజ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు.

రీసెంట్ గా అల్లు అర్జున్ రాకా సినిమా షూటింగ్ కోసం ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ అతన్ని చూడడానికి అభిమానులంతా ఎగబడ్డారు. మొత్తానికైతే ఆయన క్రేజ్ ప్రస్తుతం తారా స్థాయిలో ఉందనే చెప్పాలి. ఆయన క్రేజ్ చూసి బాలీవుడ్ హీరోలు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ ఏంటి ఆయన స్టైల్ ఏంటి అంటూ చాలా మంది బాలీవుడ్ హీరోలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ స్టార్ డామ్ చూసిన సినిమా మేధావులు సైతం ఆయన మరో రెండు సక్సెస్ లను సాధిస్తే మాత్రం ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు…చూడాలి మరి అల్లు అర్జున్ ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాడు. మరోసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేయగలుగుతాడా లేదా అనేది…

పని కోసం వచ్చిన అమ్మాయిపై.. ఆ పని మొదలుపెట్టాడు.. మూడు నెలల గర్భవతిని చేశాడు..

Kosgi Gold Trader Case
Kosgi Gold Trader Case

Kosgi Gold Trader Case: ఆయన పేరుపొందిన గోల్డ్ వ్యాపారి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోస్గి ప్రాంతంలో ఆయనకు విశేషమైన పేరు ఉంది. అతడి ఇంట్లో ఓ 20 సంవత్సరాల యువతి పనికి కుదిరింది. ఉన్నట్టుంది ఒకరోజు వాంతులు చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యుడు ఆమె మూడు నెలల గర్భవతి అని తేల్చి చెప్పాడు.

ఆరా తీయగా..

కోస్గి ప్రాంతంలో గోల్డ్ వ్యాపారి ఇంట్లో ఆ యువతి పనిచేస్తోంది. ఆ వ్యాపారి కుమారుడి పేరు సాయి కృష్ణ. ఇతడు ఆ 20 సంవత్సరాల యువతీతో ప్రేమ వ్యవహారం మొదలుపెట్టాడు. అంతేకాదు తరచు ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు. ఆమె వద్దని చెప్పినప్పటికీ బలవంత పెట్టాడు. ఇప్పుడు ఆదిమతి మూడు నెలల గర్భవతి. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు బంగారం వ్యాపారి కుటుంబ సభ్యులను నిలదీశారు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో మంతనాలు మొదలుపెట్టారు. ఆ యువతి శీలానికి వెల కట్టడానికి ప్రయత్నించారు. అయితే ఆ యువతి ఏమాత్రం ఒప్పుకోలేదు.. సాయి కృష్ణ ప్రేమిస్తున్నానని చెప్పాడని.. శారీరకంగా నన్ను లొంగదీసుకున్నాడని.. ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని ఆ యువతి పెద్దమనుషుల ముందు చెప్పేసింది.

అక్కడితోనే ఆ యువతి ఆగలేదు.. వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లిపోయింది. అక్కడ సాయి కృష్ణ మీద ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతో దూషించాడని యువతి పోలీసులకు చెప్పింది. దీంతో సాయి కృష్ణ తండ్రి.. కొంతమంది పెద్ద మనుషులతో పోలీస్ స్టేషన్ వెళ్లారు. అక్కడ తాము మాట్లాడుకుంటామని చెప్పడంతో పోలీసులు కూడా వదిలిపెట్టారు.. మరోవైపు ఆ యువతి పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడంతో సాయి కృష్ణ మీద అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఆ యువతి మూడు నెలల గర్భవతి అని తెలిసిన నేపథ్యంలో.. పోలీసులు ఆమెను నారాయణపేట జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె మూడు నెలల గర్భవతి అని వైద్యులు స్పష్టం చేశారు. మరోవైపు అట్రాసిటీ కేసు నమోదు అనే పద్యంలో సోమవారం డిఎస్పి లింగయ్య విచారణ మొదలుపెట్టారు.. గోల్డ్ వ్యాపారి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను కూడా విచారించారు. కీలకమైన వివరాలు సేకరించారు. సాయి కృష్ణ వ్యవహార శైలిపై చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నివేదికను ఎస్పీకి అందజేస్తామని డిఎస్పీ వెల్లడించారు.

భారత ప్రధాని.. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్.. ఎంత తేడా?

Narendra Modi vs Asim Munir Comparison
Narendra Modi vs Asim Munir Comparison

Narendra Modi vs Asim Munir Comparison: భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్‌ అసలైన పాలకుడు, సైన్యా«ధిపతి ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ను పోల్చే ట్రెండ్‌ ఇటీవలి రాజకీయ సంభాషణల్లో ఎక్కువగా వస్తోంది. ఇద్దరు నాయకులు అధిక ప్రతిష్ట కలిగిన వ్యక్తులుగా కనిపించినా, వారి అధికారాలు, ప్రజాప్రతినిధ్యత్వం, పాలనా విధానాలు, సామాజిక, రాజకీయ పరిణామాలు, ఉద్యమాల నిర్వహణలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

ప్రజాస్వామ్యం వర్సెస్‌ సైనికబలం
ప్రజలు ఎన్నకున్న నాయకుడ మోదీ. ఎన్నికల ద్వారా వచ్చిన లెజిటిమసీ, బీజేపీ పార్టీ వ్యవస్థలో సంక్షేమ పాలసీ, ప్రజాస్వామ్య సంస్కృతికి అనుసంధానంతో అధికారంలో ఉన్నారు. ఆసిమ్‌ మునీర్‌ పాకిస్తాన్‌లో సేన ప్రధాన పాత్రధారి. ప్రజలు ఎన్నుకోలేదు.

మోదీ ప్రజా దృష్టిలో విజ్ఞానంతో కూడిన, ఎన్నికల ప్రచార శక్తివంతమైన నాయకుడు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రదర్శించిన పరిపాలనా శైలి తర్వాత కేంద్రంలో పెద్ద స్థాయిలో ప్రజాస్వామ్య పరిధిలో పనిచేస్తున్నారు. మునీర్‌ సైనిక శైలిలో నిర్ణయాలు, ఆపరేషన్లు, అత్యధికగా భద్రతా నిర్భంధాల రూపకర్తగా కనిపిస్తారు.

భారత్‌లో ప్రజల ఆందోళనలకు ఒక పరిమిత వేదిక ఉంది. శాంతి ప్రదర్శనలు, రాజకీయ పార్టీలు, న్యాయవ్యవస్థ, మీడియా పనిచేస్తుంది. రైతు ఉద్యమం వంటి పెద్ద ఉద్యమాలు నెలలపాటు సాగాయి, ప్రభుత్వం వల్ల హింస తక్కువగా ఉపయోగించి చివరికి తీర్మానం లేదా సమాధానంతో సమస్యలు తగ్గించాయి. పాకిస్తాన్‌ సైనిక పాలన ప్రధాన ప్రతిస్పందకం అయినప్పుడు ప్రజాస్వామ్య మాధ్యమాలు అదనంగా పనికి రేవు. అజాత్‌‑కాశ్మీర్‌ వంటి ప్రాంతాల్లో నిరసనలు వచ్చినప్పుడు సైన్యం తీవ్ర చర్యలు తీసుకోవడం, జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ నిషేధం వంటి నిర్ణయాలు ప్రజా మాటను నొక్కేస్తున్నాయి.

మానవ హక్కుల పరిరక్షణ..
భారత్‌లో అధికార, విపక్షాల మధ్య విభేదాలు ఉన్నా ప్రజల హక్కుల రక్షణ విషయంలో ఐక్యంగా ఉంటాయి. దేశం కోసం కలిసి పనిచేస్తాయి. ప్రభుత్వం ఆందోళనకు ఫలితాల కోసం విచారణలు, చర్చలకు కూడా స్థలం ఇచ్చింది. పాకిస్తాన్‌ నిరసనలను అణచివేతకు బుల్లెట్లు, నాయకుల అరెస్టులు, నిర్బంధాల ద్వారా స్పందించడం, బలూచిస్తాన్‌/ఖైబర్‌ ప్రాంతాల్లో ఆందోళనలపై దడల దాడులు అనే ఆరోపణలు హ్యూమన్‌ రైట్స్‌ అలార్ముల్ని సూచిస్తున్నాయి.

నాయకత్వ శక్తి ప్రతిపాదనే ఎక్కడి నుంచి వచ్చారు, రాజకీయ పరిణామాలు, హక్కుల రక్షణ, నిరసనలపై ప్రభుత్వ స్పందనా తీరును నిర్ణయిస్తాయి. రీజియనల్‌ స్థాయిలో శాంతి, ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రోత్సహించడం, చర్చల మార్గాన్ని నిలబెట్టడం అత్యవసరం. అంతరిక్షాలపైనే కాకుండా సాధారణ ప్రజల హక్కుల పరిరక్షణకు అంతరదేశాలాష్టక కౌన్సెలింగ్‌ అవసరం.

నీట్ రీ టెస్ట్.. టెలిగ్రామ్ ను పక్కన పెట్టారు సరే.. వాట్సాప్ సంగతేంటి..

NEET Re Test 2026
NEET Re Test 2026

NEET Re Test 2026: లక్షలాదిమంది విద్యార్థులు పరీక్ష రాశారు. కొందరైతే మెరుగైన మార్కులు సాధించడంతో ఈసారి ఎలాగైనా సరే డాక్టర్ కలను నెరవేర్చుకుంటున్నామని భావించారు. కౌన్సిలింగ్ కోసం సిద్ధమవుతున్నారు. అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో.. ఒకసారి గా పేపర్ లీక్ అయిందని వార్తలు వచ్చాయి. అది అబద్ధమైతే బాగుండు అని విద్యార్థులు అనుకున్నారు. కానీ అది పచ్చి నిజం కావడంతో విద్యార్థుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డయింది. అప్పటినుంచి నిద్ర, ఆకలి మానేసి విద్యార్థులు ఆవేదనలో కూరుకు పోయారు.

అనేక రకాల ఒత్తిళ్ల తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ను మళ్లీ నిర్వహించింది. అయితే ఈసారి పేపర్ లీకేజీ కాకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిఫారసు ఆదరణ కేంద్రం టెలిగ్రామ్ మీద ఆంక్షలు విధించింది. ఏకంగా బ్లాక్ చేసి పడేసింది. ఎందుకంటే గతంలో టెలిగ్రామ్ ద్వారానే పేపర్ లీకేజ్ జరిగింది. వందలకొద్ది గ్రూపులు ఏర్పాటు చేసి అక్రమార్కులు టెలిగ్రామ్ ద్వారా భారీగా దండుకున్నారు. అయితే టెలిగ్రామ్ గ్రూపులను రద్దు చేసినప్పటికీ.. సమస్య మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ యాప్ ను బ్లాక్ జాబితాలో పెట్టాలని కేంద్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఈనెల 21న రీ టెస్ట్ జరుగుతున్న క్రమంలో.. 22 వరకు టెలిగ్రామ్ మీద కేంద్రం ఆంక్షలు విధించింది.

టెలిగ్రామ్ అనేది మోసపూరితమైన వ్యక్తులకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎటువంటి వివరాలు బయటపడకుండా ఈ గ్రూపులను కొంతమంది అక్రమార్కులు నిర్వహిస్తూ ఉంటారు. ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత.. యూసర్లు దానిని చూడకుండా హైడ్ చేయవచ్చు. అంతేకాదు యూజర్ పేర్లతోనే యాప్ వాడుకోవచ్చు. ఒక్కసారి ప్రొఫైల్ క్రియేట్ అయితే కనుక.. ఎటువంటి గుర్తింపు బయటపడకుండా లక్షల మందితో ఛానల్ నిర్వహించుకోవచ్చు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారో అనే విషయాన్ని గుర్తించడం చాలా కష్టం.

ఇటీవల వాట్సప్ కూడా ఫోన్ నెంబర్ హైడ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చే పనిలో పడింది. వాట్సాప్ లో అయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ డిఫాల్ట్ గా ఉంటుంది. టెలిగ్రామ్ లో మనకు మనమే మ్యానువల్ గా ఎంచుకోవాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ లో ఎటువంటి కంప్రెషన్ నిబంధన లేకుండానే 2gb ఫైల్ షేర్ చేసుకోవచ్చు. అందువల్లే అక్రమార్కులు టెలిగ్రామ్ వేదికగా కొత్త కొత్త సినిమాలను.. టీవీ షోలను లీక్ చేస్తూ ఉంటారు.. టెలిగ్రామ్ లో ఉన్న ఆ ఫీచర్ ను అనుకూలంగా మార్చుకున్న అక్రమార్కులు పరీక్ష పత్రాలను లీక్ చేస్తున్నారు.. అంతేకాదు కొన్ని సందర్భాలలో ఎడిట్ ఫీచర్ ఉపయోగించి ఫైళ్లను కూడా పూర్తిగా మార్చేస్తున్నారు. అందువల్లే ఇటీవల కేంద్రం ఈ ఫీచర్ ను డిజేబుల్ చేసేసింది.

టెలిగ్రామ్ ను ఈ స్థాయిలో మనదేశంలో వాడుతున్నప్పటికీ.. ఇక్కడ కనీసం కార్యాలయం కూడా లేదు. ఉదాహరణకు వాట్సప్.. ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలు యూజర్ల బిహేవియర్ ను అంచనా వేస్తుంటాయి.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా టూల్స్ ఉపయోగించి యూజర్ల యూసేజ్ ప్యాటర్న్ ను నిత్యం గమనిస్తూ ఉంటాయి. అయితే ఈ ఫీచర్ టెలిగ్రామ్ లో లేకపోవడం విశేషం.

భారత్ లో పొరుగు దేశాల్లాగా తిరుగుబాట్లు ఎందుకు జరగవు?

India political stability

India political stability : చాలా మంది దేశంలో జెన్ జెడ్ తిరుగుబాటు జరగాలని కోరుకుంటున్నారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లో జరిగినట్టు భారత్ లో జరగాలని కోరుకుంటున్నారు. మోడీని వ్యతిరేకించే రాజకీయ నాయకులు, వామపక్ష అతివాదులు.. ఫెయిల్ అయిపోయిన వారు.. ఇస్లామిక్ అతివాదులు.. ఊదరావాదులు, మేధావులు.. దేశంలో తిరుగుబాటు రావాలని ఎగదోస్తున్నారు.

వీటన్నింటికి కారణం.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో మోడీని ఓడించలేమన్న పరిస్థితికి వీరందరూ గ్రహించారు. అందుకోసమే తిరుగుబాటు రావాలని కోరుకుంటున్నారు. ఎవరో జెన్ జెడ్ లాంటి వారు వస్తారని ఎదురుచూస్తున్నారు.

ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం రావాలని కొంతమంది నాయకులు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి నాయకులు, ప్రాంతీయ పార్టీ నాయకులు ఎన్నికల్లో గెలవకలేక.. ప్రజల్లో నమ్మకం కోల్పోయిన వారు మోడీ దిగిపోవాలని ఇలాంటి కోరిక కోరుకుంటున్నారు. తమ అధికారం కోసం ఇలా కుట్రలు సాగుతున్నాయి.

భారత్ లో పొరుగు దేశాల్లాగా తిరుగుబాట్లు ఎందుకు జరగవు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

చివరికి నితిన్ బూతు సినిమాలో నటించబోతున్నాడా..? హీరోయిన్ ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Nithin
Nithin

Nithiin new movie: స్టార్ హీరో రేంజ్ కి వెళ్లగల సత్తా అన్ని విధాలుగా ఉన్నప్పటికీ, సరైన ప్లానింగ్ లేక , కనీస స్థాయి మార్కెట్ ని కూడా కోల్పోయిన హీరోలలో ఒకరు నితిన్. ఇతను మన టాలీవుడ్ లో పని చెయ్యని టాప్ డైరెక్టర్ అంటూ ఎవరు మిగల్లేదు. రాజమౌళి , వీవీ వినాయక్ , పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ , ఇలా ఒక్కరా ఇద్దరా?, దాదాపుగా అందరి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసాడు, అయినప్పటికీ స్టార్ కాలేకపోయాడు. అందుకు కారణం ఒక హిట్ సినిమా తీస్తే , వరుసగా నాలుగైదు డిజాస్టర్ సినిమాలు చేయడం వల్లే. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత ఈయన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. కరోనా వచ్చిన కొత్తల్లో విడుదలైన ‘భీష్మ’ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.

ఈ సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడే లాక్ డౌన్ ని విధించారు. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ ఆరు సినిమాలు విడుదల చేస్తే, ఈ ఆరు కూడా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ అవుతూ , ఆయనకు ఉన్నటువంటి మార్కెట్ మొత్తాన్ని నాశనం అయ్యేలా చేసింది. దీంతో ఇప్పుడు నితిన్ తో సినిమాలు చేసేవాళ్ళు లేరు. నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేం ‘ఎల్లమ్మ’ చిత్రం లో ముందుగా నితిన్ ని హీరో గా తీసుకున్నాడు. కానీ నితిన్ మార్కెట్ పూర్తిగా చెడిపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుండి నితిన్ ని తప్పించి , దేవి శ్రీ ప్రసాద్ ని హీరో గా పెట్టుకున్నాడు. అదే విధంగా రీసెంట్ గా నితిన్ విక్రమ్ కె కుమార్ తో ఒప్పుకున్న సినిమా కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ కి షిఫ్ట్ అయ్యింది. కచ్చితంగా ఇది నితిన్ కి పెద్ద అవమానమే , అందులో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యే ప్రాజెక్ట్ తో నితిన్ మన ముందుకు రాబోతున్నాడు. ‘సెక్స్ ఎడ్యుకేషన్’ కాన్సెప్ట్ మీద ఇప్పటికే ఓటీటీ లో ఒక వెబ్ సిరీస్ విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ మీద ఒక్క సినిమా కూడా రాలేదు. నితిన్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద తీయబోయే సినిమాలో హీరో గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా నటించబోతుంది మరెవరో కాదు , ‘కాంతారా 2’ ఫేమ్ రుక్మిణి వాసంత్ అట. ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు , మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు , నిర్మాతగా ఎవరు వ్యవహరించబోతున్నారు అనేదానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.

'ఓజీ 2' పై సుజిత్ మౌనం వెనుక అసలు కారణం ఏంటి..? ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడా!

Sujeeth silent on OG 2
Sujeeth silent on OG 2

Sujeeth silent on OG 2: లోకల్ మీడియా నుండి ఇంటర్నేషనల్ మీడియా వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఓజీ 2’ గురించే చర్చ. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుండి త్వరలోనే ‘ఓజీ 2’ సెట్స్ మీదకు వెళ్లనుంది , సుజిత్ ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత షూటింగ్ ఎప్పటి నుండి మొదలు అవ్వబోతుంది అనేది చెప్తాము అంటూ ఒక ట్వీట్ పడింది అంతే. ఇక సోషల్ మీడియా మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఆ ఒక్క ట్వీట్ కి దాదాపుగా 1 కోటి 20 లక్షల వ్యూస్ వచ్చాయి. వారణాసి , డ్రాగన్ వంటి పాన్ వరల్డ్ చిత్రాలకు కూడా ఈ రేంజ్ వ్యూస్ రాలేదు, అలాంటిది ‘ఓజీ 2’ కి వచ్చిందంటే , ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతోంది. ఓజీ బ్రాండ్ కి మార్కెట్ లో ఉన్న క్రేజ్ ఏంటో కూడా మరోసారి అందరికీ తెలిసొచ్చింది.

అయితే ఈ ట్వీట్ వేసి దాదాపుగా నాలుగు రోజులైంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన తమన్ ఈ ట్వీట్ కి రెస్పాన్స్ ఇచ్చాడు , అదే విధంగా ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన అర్జున్ దాస్ కూడా రెస్పాన్స్ ఇచ్చాడు. కానీ డైరెక్టర్ సుజిత్ నుండి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీనిపై సోషల్ మీడియా లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ షూటింగ్ కి సిద్ధంగా ఉన్నాడని , ఈ ఏడాది నవంబర్ నుండి ఆయన ఈ చిత్రానికి కాల్ షీట్స్ ఇచ్చాడని , కానీ సుజిత్ ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడని అంటున్నారు. ఎందుకంటే సుజిత్ తన తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’ అని ఇప్పటికే ప్రకటించేశాడు. నేచురల్ స్టార్ నాని ఇందులో హీరో.

ఈ సినిమాకు నాని వచ్చే నెల నుండి డేట్స్ కేటాయించాడట. షూటింగ్ అత్యధిక శాతం లండన్ మరియు ఇతర విదేశీ లొకేషన్స్ లో జరగనుంది. హైదరాబాద్ లో కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే ఉంటుంది అట. అయితే పవన్ కళ్యాణ్ నుండి అకస్మాత్తుగా కాల్ రావడం తో సుజిత్ ఇప్పుడు ఇరకాటం లో పడ్డాడని , ముందు ఏ చిత్రాన్ని మొదలు పెట్టాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడని , ఇండియా కి తిరిగిన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపాక, ముందు ఏ సినిమా మొదలు అవుతుందో క్లారిటీ వస్తుందని, అందుకే సుజిత్ సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ నెలాఖరు వరకు ‘ఓజీ 2’ పై సుజిత్ మౌనం తప్పేలా లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

మెటా, గూగుల్ ను ఏఐతో కొట్టిన 20 ఏళ్ల యువతి.. ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా..

20-year-old girl beats Meta and Google
20-year-old girl beats Meta and Google

20-year-old girl beats Meta and Google: కొన్ని సందర్భాలలో తాడే పామై కరుస్తుంది అంటారు. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి విశ్వాసంతో మూర్ఖంగా ప్రవర్తిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన మెటా, గూగుల్ ఎదుర్కొంటున్నాయి.

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కొంతకాలంగా గూగుల్, మెటా కంపెనీలు క్రుత్రిమ మేథ సాంకేతికతను విపరీతంగా వాడుకుంటున్నాయి. తాము అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రతి సౌలభ్యాన్ని వీటి ఆధారంగానే తయారు చేస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగులు భారీగా తమ అవకాశాలను కోల్పోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పనితీరు సాగించే అవకాశం ఉన్న నేపథ్యంలో గూగుల్, మెటా కంపెనీలు మనుషులతో అవసరం లేకుండా సాంకేతికత వాడకాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయి. దీనివల్ల అవి ఎంత స్థాయిలో లాభాలు పొందుతున్నాయో తెలియదు కానీ.. ఇప్పుడైతే ఏకంగా 56 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.

అమెరికాకు చెందిన ఒక న్యాయవాది కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానంతో గూగుల్, మెటా కంపెనీలను ఓడించారు. ఒక కేసులో ఈ రెండు సంస్థలను నేల నాకించారు. ఒక 20 సంవత్సరాల అమ్మాయి కోర్టులో గూగుల్, మెటా కంపెనీలకు వ్యతిరేకంగా కేసు వేసింది. ఈ రెండు కంపెనీల వల్ల తాను సామాజిక మాధ్యమాలకు బానిస అయ్యానంటూ ఆమె వాపోయింది. ఈ కేసు మొదట్లో అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. అమెరికా మీడియా మొత్తం ఫోకస్ చేయడంతో ఏకంగా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాల్సి వచ్చింది.. ఆ అమ్మాయి కేసును టెక్సాస్ నగరానికి చెందిన లాయర్ మార్క్ లానియర్ వాదించారు. ఈ కేసు విచారణ కోసం ఆయన ఏకంగా నెల వరకు ఏఐ టూల్స్ ఉపయోగించుకున్నారు. ఈ టూల్స్ కోసం ఆయన భారీగానే ఖర్చుపెట్టారు.

ఇక ఈ కేసు విషయానికి వస్తే తనకు 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను తెరిచానని చెప్పింది. అందులో ఇన్ఫినిట్ స్క్రోలింగ్ ఉండడంవల్ల తాను వాటికి బానిసలాగా మారిపోయానని చెప్పింది. ఫలితంగా తన బాల్యం.. కౌమార దశలో ప్రశాంతతను కోల్పోయానని పేర్కొంది. ఇదే విషయాన్ని లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి ఈ ప్రమాదకరమైన తెలిసినప్పటికీ గూగుల్, మెటా కంపెనీలు యూజర్లను హెచ్చరించడం లేదని లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో లాయర్ వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం.. గూగుల్, మెటా కంపెనీలు ఆరు మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని సూచించారు. ఇందులో 70 శాతం మెటా, మిగతా మొత్తాన్ని యూట్యూబ్ చెల్లించాలని ఆయన తీర్పు చెప్పారు. మన కరెన్సీలో ఆ యువతికి 56 కోట్లు లభిస్తాయి.

సీఎం విజయ్ కి తమిళ హీరో విశాల్ అరుదైన కానుక.. ఇలాంటి గిఫ్ట్ ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వలేదు..

Vishal gift to CM Vijay
Vishal gift to CM Vijay

Vishal gift to CM Vijay: తెలుగు , తమిళం భాషల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విశాల్. ఒకప్పుడు ఈయన సినిమాలకు మన టాలీవుడ్ లో ఉండే డిమాండ్ ఎలాంటిదో కళ్లారా చూసాము. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో ఇతగాడికి మన టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. ఇప్పటికీ ఏదైనా సూపర్ హిట్ సినిమా ఈయనకు తగిలితే , మన తెలుగు రాష్ట్రాల నుండి అవలీలగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి. అంతటి సత్తా ఉంది. ఇదంతా పక్కన పెడితే హీరో విశాల్ కి సామజిక స్పృహ కూడా ఎక్కువ. ఎల్లప్పుడూ తనకు తోచినంత సహాయం చేయడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు. ఇతను చేసే సేవా కార్యక్రమాలు చూసి, భవిష్యత్తులో ఈయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నాడు , అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడు అనేవారు కొంతమంది.

కానీ అలాంటిదేమి జరగలేదు , తన సినిమాలు తాను చేసుకుంటూ మధ్యలో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. నేడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని కలిసి ఒక అరుదైన బహుమతి ఇచ్చాడు. దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఇలాంటి బహుమతి ముఖ్యమంత్రులకు ఇవ్వలేదు. ఇంతకీ ఆయన ఇచ్చిన బహుమతి మరేదో కాదు విద్యాదానం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ మంచి మార్కులు తెచ్చుకొని ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులకు తన సొంత డబ్బులతో స్కాలర్ షిప్ ఇస్తున్నట్టు విజయ్ కి ఒక లేఖ ఇచ్చాడు. ముఖ్యమంత్రి ని కలిసినప్పుడు పూల బొకేలు , శాలువాలు ఇవ్వడం కంటే విద్యాదానం చేయడం ఎంతో గొప్ప పని అని ఆయన ఈ సందర్భంగా చెప్పకనే చెప్పాడు. ఒక బొకే కొద్దీ రోజులు మాత్రమే ఉంటుంది. కానీ ఒక చిన్నారి విద్య జీవితాంతం ఉపయోగపడుతుంది అనే సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు విశాల్.

ఆయన చూపించిన ఈ చొరవకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫిదా అయ్యారు. అందరూ విశాల్ లాగా అలోచించి ముందుకు వెళ్తే, ఈ దేశం లో ప్రతిభ గల పేద విద్యార్థి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అంటూ సోషల్ మీడియా లో ఈ సందర్భంగా నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరో గా మకుటం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆయన దర్శకుడు గా కూడా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశాల్ ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచేలా ఉన్నాడని సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.

Team India A: ట్రోఫీ సంగతి దేవుడెరుగు.. కనీసం ఫైనల్ అయినా వెళ్తుందా..

Team India A
Team India A

Team India A: పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు. వారంతా ఇటీవలి ఐపిఎల్ లో అద్భుతాలు సృష్టించారు. తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేసి అదరగొట్టారు. మైదానంలో పరుగుల వరద పారించారు. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం ఇబ్బంది పెట్టారు. అటువంటి టీమిండియా ఇప్పుడు ఊహించని స్థాయిలో ఓటములు ఎదుర్కొంటున్నది. గొప్ప గొప్ప ప్లేయర్లు చేతులెత్తిస్తున్నారు. పరుగులు తీయడం కాదు కదా.. వికెట్లు కాపాడుకుంటేనే గొప్ప అన్నట్టుగా ఆడుతున్నారు.

శ్రీలంకలో జరుగుతున్న ట్రయాంగిల్ సిరీస్లో తిలక్ సేన ఏమాత్రం గొప్ప ప్రదర్శన చేయలేకపోతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన మెన్ ఇన్ బ్లూ.. కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా కనీసం ఫైనల్ దాకా అయినా వెళ్తుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

భారత జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల శ్రీలంక జట్టు జరిగిన మ్యాచ్లో కేవలం టీమిండియా నాలుగు పరుగుల తేడాతోనే విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత బ్యాటర్లు అదరగొట్టినప్పటికీ.. బౌలర్ లు విఫలమయ్యారు. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆటగాళ్లు మొత్తం విఫలం కావడంతో.. మళ్లీ ఓటమి ఎదురైంది. సూపర్ ఓవర్ దాక మ్యాచ్ సాగినప్పటికీ టీమిండియా విజయం అందుకోలేకపోయింది.

ప్రస్తుతం టీమిండియా ఫైనల్ దాకా వెళ్లాలి అంటే కచ్చితంగా బుధవారం నాటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై కచ్చితంగా గెలవాలి . ఆ విజయం కూడా భారీ అంతరంతో ఉండాలి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో గనుక టీమిండియా ఓడిపోతే కచ్చితంగా ఇంటికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చివరి మ్యాచ్లో శ్రీలంక మీద భారీ తేడాతో గెలిస్తే సమీకరణాలు ఇంకా దారుణంగా మారిపోతాయి. ఆఫ్ఘనిస్తాన్ మీద టీం ఇండియా.. శ్రీలంక మీద ఆఫ్గనిస్తాన్ విజయం సాధిస్తే అప్పుడు మూడు జట్ల ఖాతాలో నాలుగు చొప్పున పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకపాత్ర పోషిస్తుంది. మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్లు మాత్రమే ఫైనల్ దాకా వెళ్తాయి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చివరి రెండు మ్యాచ్ లలో కనుక ఓడిపోతే భారత్.. శ్రీలంక ఫైనల్ లో పోటీ పడతాయి.

బైక్ లవర్స్ ఇక కాచుకోకండి.. Royal Enfield కొత్త బైక్స్ ఇవే..

Royal Enfield new bikes
Royal Enfield new bikes

Royal Enfield new bikes: భారతీయ బైక్ లవర్స్‌కు Royal Enfield అంటే ప్రత్యేకమైన క్రేజ్. ఈ క్రేజ్‌ను మరింత పెంచుతూ ఈ కంపెనీ సరికొత్త టెక్నాలజీ , పవర్‌ఫుల్ ఇంజన్లతో సరికొత్త బైకులను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. హిమాలయన్ 750 , ఫ్లయింగ్ ఫ్లీ S6 , కాంటినెంటల్ GT 750 బైకులు రాబోతున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ రైడ్ తో పాటు వేగవంతమైన ప్రయాణం కోరుకునేవారికి ఇవి బెస్ట్ మోడల్స్ గా నిలవనున్నాయి. మరి ఈ బైక్ లు ఎలా ఉండబోతున్నాయంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 (Himalayan 750):
లాంగ్ రైడ్స్ తో పాటు ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారి కోసం ఇది అత్యంత పవర్‌ఫుల్ అడ్వెంచర్ బైక్ ఇది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హిమాలయన్ 450 కంటే ఇది చాలా పెద్దదిగా, శక్తివంతంగా ఉండబోతోంది. ఇందులో 750cc ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది సుమారు 55 bhp పవర్, 60-65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని హెడ్‌లైట్ గ్రిల్, సర్క్యులర్ TFT డిస్‌ప్లే , లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ అందించనున్నారు. 2026 నవంబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ. 4.00 లక్షల నుంచి రూ. 4.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

ఫ్లయింగ్ ఫ్లీ S6 (Flying Flea S6):
రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ సబ్ బ్రాండ్ ‘ఫ్లయింగ్ ఫ్లీ’ నుండి రాబోతున్న రెండవ మోడల్ ఈ S6. నగరాల్లో తిరగడానికే కాకుండా, కొద్దిగా గరుకు రోడ్లపై కూడా ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. ఇందులో 3.91 kWh లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 154 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌లో అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, 19 అంగుళాల ఫ్రంట్ ,18 అంగుళఆల రియర్ స్పోక్ వీల్స్ ఉంటాయి. 3.5 అంగుళాల టచ్‌స్క్రీన్ అలరిస్తుంది. స్విచబుల్ ABS వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 3.40 లక్షలు ఉండవచ్చు.

కాంటినెంటల్ GT 750 (Continental GT 750):
రాయల్ ఎన్‌ఫీల్డ్ తెస్తున్న లగ్జరీ అప్‌గ్రేడ్ ‘కాంటినెంటల్ GT 750’. ప్రస్తుత GT 650 మోడల్‌కు ఇది నెక్స్ట్ లెవెల్ వెర్షన్. ఇందులో సరికొత్త 750cc ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ను అమర్చనున్నారు. దీని ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అందించడం ఈ బైక్ యొక్క అతిపెద్ద మార్పు. అంతేకాకుండా, ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్‌ను సపోర్ట్ చేసే సరికొత్త డిజిటల్ కన్సోల్ ఉండబోతోంది. మార్కెట్ దీని ధర సుమారు రూ. 3.80 లక్షల నుండి రూ. 3.90 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

నారా లోకేష్ రెండేళ్లలోనే.. ఐదేళ్లలో జగన్ ఒక్కసారీ ఇలా చేయలేదు..

Jonty Rhodes meets Nara Lokesh
Jonty Rhodes meets Nara Lokesh

Jonty Rhodes meets Nara Lokesh: రాజకీయ నాయకులు అస్తమానం రాజకీయాలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు ప్రజలకు పనికి వచ్చే పని కూడా చేయాలి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి. అదిగో అప్పుడే ఆ నాయకులు గొప్పగా ఎదుగుతారు. ఓటు వేసిన ప్రజల ఆత్మగౌరాన్ని మరింత గొప్పగా చాటుతూ ఉంటారు.. అటువంటి నాయకులు ఎప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఇదే విధంగా అనుకుంటున్నారు. మేము ఓటు వేసింది సమర్థవంతమైన నాయకుడికి.. అతని నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని విస్తరింపజేస్తుందని అనుకుంటున్నారు.

గ్లోబల్ ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన అమెరికాలోని అత్యంత పేరుపొందున విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివారు. ఇంగ్లీష్ మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉంటుంది. తెలుగులో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ.. ఇప్పుడు పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఏపీ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. గ్లోబల్ ఏపీ అంటూ పెట్టుబడులు.. ఇంకా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

క్రీడల వైపు కూడా
నారా లోకేష్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇటీవల విశాఖపట్నంలో క్రీడా పాలసీ గురించి పేరుపొందిన మహిళ క్రికెటర్లతో ఆయన మాట్లాడారు. వారి మనసులో ఉన్న అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో క్రీడాకారులకు సరైన విధంగా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు లభించేలా చేశారు.

లెజెండరీ క్రికెటర్లతో..
లెజెండరీ క్రికెటర్లతో నారా లోకేష్ తరచూ మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల సచిన్ తో మాట్లాడి.. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఏం చేయాలో తెలుసుకున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. లెజెండ్ ఫీల్డర్ జాండి రోడ్స్ ను కలిశారు లోకేష్. ఆంధ్రప్రదేశ్లో క్రీడలు.. యువకుల కోసం అవకాశాల సృష్టి.. క్రీడారంగంలో చేపట్టాల్సిన ఆవిష్కరణల గురించి చర్చించారు. దీనికి సంబంధించిన విషయాలను లోకేష్ తన సామాజిక మాధ్యమా ఖాతాల ద్వారా పంచుకున్నారు.

“ఇది చాలా గొప్ప అవకాశం. అంతర్జాతీయంగా గొప్ప విధానాలను అవలంబించాలని భావిస్తున్నాం. రాబోయే తరానికి సంబంధించి అవకాశాలను సృష్టించడానికి చర్చించాం. ప్రపంచ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడల ముఖ ద్వారం గా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.. జాంటీ రోడ్స్ తన స్ఫూర్తివంతమైన అనుభవాన్ని మార్చ పంచుకున్నారు. ఆయనను కలుసుకోవడం చాలా గొప్ప విషయమని” లోకేష్ పేర్కొన్నారు.

ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్ ఏనాడు కూడా ఈ స్థాయిలో మాజీ క్రికెటర్లను కలవలేదని.. ఏపీ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేయలేదని టిడిపి నేతలు అంటున్నారు. చివరికి ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో దారుణంగా అవినీతికి పాల్పడ్డారని.. క్రీడల్లో ప్రతిభ చాటిన వారిని గుర్తించలేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లోకేష్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.