Peddi 12 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ జోరు, 12 రోజులు దాటినప్పటికీ కూడా ఏ మాత్రం తగ్గలేదు. వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి వస్తున్నంత లాంగ్ రన్ , ఈమధ్య కలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 2వ సోమవారం, అనగా 12 వ రోజున దాదాపుగా 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిందని అంటున్నారు. ఇది సాధారమైన విషయం కాదు. ఈ రేంజ్ రన్ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రానికి రాయలసీమ , నెల్లూరు జిల్లాల్లో నష్టాలు తప్పేలా లేవని లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట.
రాయలసీమ ప్రాంతం లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 24 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 12 రోజుల్లో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 4 కోట్లు రావాలి , ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో అయితే మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ కష్టమే. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే విడుదలకు ముందు ఈ చిత్రానికి 6 కోట్ల 30 లక్షల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 80 లక్షల షేర్ రావాలి , ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే మరో 50 లక్షలు మాత్రమే వచ్చేలా కనిపిస్తోంది.
ఇక మిగిలిన జిల్లాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది. నైజాం ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 51 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21 కోట్ల 53 లక్షలు రాగా , ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 18 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 8 కోట్ల 63 లక్షలు , గుంటూరు నుండి 12 కోట్ల 12 లక్షలు , కృష్ణ నుండి 9 కోట్ల 72 లక్షలు , నెల్లూరు నుండి 5 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 141 కోట్ల 59 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 213 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 322 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 192 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
















ఈ అందగత్తె తేల్చేసింది.. భూ కాలుష్యానికి.. ఇన్ని దారుణాలకు మగాళ్లే కారణమట..
Dia Mirza: భూమి మీద కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు విస్తారంగా ఉన్న చెట్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఫలితంగా మనుషులు నిండు నూరేళ్లు బతకలేకపోతున్నారు. నిండా రోగాలతో నరకం చూస్తున్నారు. చిన్న వయసులోనే ప్రాణాంతక రోగాలతో ప్రాణాలు విడుస్తున్నారు. ఇన్ని అనర్ధాలకు కారణం కాలుష్యం.
పరిశ్రమలు.. చెట్లను కొట్టివేయడం.. అడవులను ఆక్రమించడం.. నదులను మట్టితో పూడ్చివేయడం.. ఇంకా అనేక రకాల కారణాలు కాలుష్యానికి దోహదం చేస్తున్నాయి. ఇప్పటివరకు కాలుష్యం పెరడానికి కారణాలను పై వాటినే విశ్లేషించేవారు. కానీ భూమ్మీద కాలుష్యం పెరగడానికి.. ఈ స్థాయిలో అనర్ధాలు జరగడానికి కారణం కేవలం మగవాళ్లేనట. అదేంటి కేవలం మగవాళ్ళు మాత్రమే కారణమైతే.. ఆడవాళ్లు ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్న మీలో వ్యక్తం అయింది కదూ..
ఈ భూమి మీద కాలుష్యం ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం మగవాళ్ళు అని చెప్పింది ఏదో ప్రసిద్ధమైన యూనివర్సిటీ కాదు. ప్రపంచ స్థాయి వ్యక్తులు చేసిన పరిశీలన కాదు. పేరుపొందిన వ్యక్తులు రూపొందించిన నివేదిక అంతకంటే కాదు. ఈ మాట అన్నది అందగత్తె దియా మీర్జా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. ఫెమినిజం గురించి సరికొత్తగా వ్యాఖ్యానించింది. “ఈ ప్రపంచంలో ఇప్పటివరకు తయారుచేసిన వస్తువులు.. ఉత్పత్తుల వెనుక మగవాళ్ళు ఉన్నారు. వాళ్లు మాతృ స్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడారు. పితృ స్వామ్య వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. ఆడవాళ్లను తొక్కేస్తున్నారు. వాళ్లకు అనుకూలంగా ఉత్పత్తులు తయారుచేసి.. ఈ భూమిని మొత్తం కాలుష్య కాసారంలాగా మార్చేసారని” దియామీర్జా వ్యాఖ్యానించింది.
కానీ ఇక్కడ ఫెమినిజం అంటే.. మగవాళ్ళను తిట్టడం కాదు.. ఆడవాళ్ళు ఎదగడం.. ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడం.. అన్నింటికీ మించి సమాజంలో ఉన్నతంగా జీవించడం.. మగవాళ్లను కూడా అదే స్థాయిలో గౌరవించడం.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా ఇలా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అన్నట్టు ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడిన మైక్.. ఉపయోగించిన లైట్లు.. ముఖానికి వేసుకున్న మేకప్.. జుట్టుకు వేసుకున్న డై.. ధరించిన దుస్తులు.. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సంబంధమైనవే. వీటితో పోల్చి చూస్తే మగవాళ్ళు చేసే కాలుష్యం ఎంత.. ఆడవాళ్లు మేకప్ కోసం ఉపయోగించే వస్తువులు ఎకో ఫ్రెండ్లీ కాదు కదా.. పాపం దియా మీర్జా.. మెదడులో చిప్ దొబ్బినట్టు ఉంది.. అందుకే ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తోంది..