Anil Ravipudi with NTR: ‘ఆర్ఆర్ఆర్’లో విజృంభించడంతో ఇప్పుడు ఎన్టీఆర్ నటనా స్థాయి దేశమంతా విస్తరించింది. ఎన్టీఆర్ లోని పరిపూర్ణ నటుడిని ఈ సినిమాలో రాజమౌళి అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ప్యాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. టెంపర్ కు ముందు వరకూ ఎన్టీఆర్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడ్డారు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్ తో వరుస సినిమాలు హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ తన జీవితంలో అత్యంత విలువైన మూడున్నర సంవత్సరాలు ఆర్ఆర్ఆర్ కు కేటాయించారు.
ఇంత కష్టపడ్డా కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చిందా? అంటే లేదనే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ దే కీలక రోల్. కేవలం సెకండ్ హీరోగానే ఎన్టీఆర్ కనిపించారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కొరటాల శివ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి ప్యాన్ ఇండియా సినిమా తీయాలని భావిస్తున్నారు. దీనిపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియాభట్ ను తీసుకుంటున్నారు.
Also Read: Corona 4th Wave: కరోనా నాలుగో దశ ప్రారంభం కానుందా?
ఇక కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేశాడు. అతడు కేజీఎఫ్ తో ఇప్పటికే ప్యాన్ ఇండియా లెవల్ లో ఆరితేరాడు. ఆ రేంజ్ ను అలా కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ఇక కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మధ్యలో కామెడీ దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది.
అనిల్ రావిపూడితో ఇప్పుడు ఏ పెద్ద హీరో చేయడం లేదు. అంతా బిజీగా ఉన్నారు. మహేష్ తో మరో సినిమా అనుకున్నా ఆయన ముందుకు రాలేదని తెలిసింది. ‘ఎఫ్3’ పూర్తి చేసి బాలకృష్ణతో సినిమాకు రెడీ అయ్యారు. కామెడీ ట్రాక్ తో సినిమాలను హిట్ చేస్తున్న అనిల్ కు ఇప్పటివరకూ కెరీర్ లో మర్చిపోలేని సినిమా అయితే తీయలేదు. కొరటాల, ప్రశాంత్ నీల్ తో ఖచ్చితంగా ప్యాన్ ఇండియా ఫ్లేవర్ ఉంటుంది. అది ఎన్టీఆర్ కెరీర్ కు బూస్ట్ నిస్తుంది.
కానీ అనిల్ రావిపూడి పూర్తిగా కామెడీ టైమింగ్.. తెలుగు నేటివిటీ కామెడీతో లాగించేస్తారు. దాంతో ఎన్టీఆర్ ను ప్యాన్ ఇండియా సినిమాగా మలచడం కష్టం. ఈ సినిమా అన్ని భాషల్లో క్లిక్ కావడం కష్టమేనంటున్నారు. అనిల్ తో చేస్తే ఎన్టీఆర్ సినిమా ప్యాన్ ఇండియా వరకూ చేరడం కష్టమేనంటున్నారు. ఇప్పుడున్న ఇమేజ్ లో ఎన్టీఆర్ తో కామెడీ చేయడం కూడా రిస్క్ అంటున్నారు. అది నప్పదని సూచిస్తున్నారు. అందుకే ప్రభాస్ లో బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ లే ఎంచుకుంటే ఎన్టీఆర్ కు మేలని.. మళ్లీ తెలుగుకు పరిమితం కావదన్న డిమాండ్ ఆయన ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది.
Also Read:pawan kalyan yatra for farmers : జనంలోకి జనసేనాని: రైతు ఓదార్పు యాత్రలో పవన్ కళ్యాణ్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More