NRI`s For Congress : కాంగ్రెస్ కోసం వచ్చేసిన ఎన్నారైలు.. తిరుమల మొక్కు తీర్చుకున్నారు

సీఎం రేవంత్‌రెడ్డికి అమెరికాలో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారు. రేవంత్‌ రెడ్డి సోదరుడు అనుముల జగదీశ్వర్‌రెడ్డి, రవి పొట్లూరి మరి కొందరు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చారు.

Written By: NARESH, Updated On : December 9, 2023 12:57 pm
Follow us on

NRI`s For Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, ఇంకా ఎన్నో సంచలనాలు నమోదలయ్యాయి. అనేక విశేషాల మధ్య కాంగ్రెస్‌ పార్టీ 64 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి డిసెంబర్‌ 7న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11 మంత్రి మంత్రులు కూడా ప్రమాణం చేశారు. దీంతో ఎన్‌ఆర్‌ఐలు మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వెంకన్న సన్నిదికి చేరుకున్నారు.

-సీఎం రేవంత్ అమెరికా మిత్రులు..
సీఎం రేవంత్‌రెడ్డికి అమెరికాలో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారు. రేవంత్‌ రెడ్డి సోదరుడు అనుముల జగదీశ్వర్‌రెడ్డి, రవి పొట్లూరి మరి కొందరు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చారు. వారందరూ ఇంతటి విజయాన్ని రేవంత్‌రెడ్డికి అందించినందుకు తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలనుకున్నారు.

‘మేమందరం ఏడు కొండలు నడిచి ఎక్కుతామని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఆ మేరకు మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన శనివారం తిరుమల కొండపైకి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నట్లు’ రవి పొట్లూరి తెలిపారు. అనుముల జగదీశ్వర్‌ రెడ్డి, కాట్ల రాజు, మిడుదుల సుధీర్‌ రెడ్డి, స్రవంత్, ఆదిత్య, ముప్పా రాజశేఖర్, తిరుమల కొండ మెట్లమార్గం ద్వారా చేరుకొని రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకున్నట్లు తెలిపారు.