NRI News : ప్రశ్నించిన భారతీయుడిని కొట్టి చంపాడు.. షాకింగ్ వీడియో వైరల్

NRI News తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. హోటల్‌లోనే దాక్కున్న రిచర్డ్‌ లూయిస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 27, 2024 5:39 pm

Indian killed in American attack

Follow us on

NRI News : అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నాయి. వరుస దాడులతో ఇప్పటికే భారత సంతతి వ్యక్తులు, విద్యార్థులు అమెరికాలో జరిపిన వేర్వేరు దాడులు, కాల్పుల్లో మృత్యువాత పడ్డారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన యువకుడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన దాడిలో మరో భారత సంతతి వ్యక్తి మృతిచెందాడు.

గుజరాత్‌ వాసిగా గుర్తింపు…
గుజరాత్‌కు చెందిన హేమంత్‌ మిశ్రా ఓక్లహోమా రాష్ట్రంలోని ఓ హోట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. జూన్‌ 22 రాత్రి 10 గంటల సమయంలో హోటల్‌ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్‌ లూయిస్‌ అనే వ్యక్తిని హేమంత్‌ కోరాడు. దీంతో అతను కోపంతో మిశ్రా ముఖంపై దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ మిశ్రాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అతను మృతిచెందాడు.

నిందితుడి అరెస్ట్‌…
తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. హోటల్‌లోనే దాక్కున్న రిచర్డ్‌ లూయిస్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులు, మిశ్రాపై జరిగిన దాడికి కారణాలను ఆరా తీస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఓక్లహోమా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.