HomeNewsDhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం.. పాటించాల్సిన నియమాలివే!

Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం.. పాటించాల్సిన నియమాలివే!

Dhanurmasam: హిందూ సంప్రదాయంలో ఒక్కో నెలకి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఇంగ్లీషు నెలల కంటే తెలుగు నెలలనే హిందువులు ఎక్కువగా పాటిస్తుంటారు. శ్రావణం, కార్తీకం మాసాలు చాలా పవిత్రమైనవి. ఈ రెండు మాసాల్లో తప్పకుండా పూజలు నిర్వహిస్తారు. ఇలా ఒక్కో నెలకి ఒక్కో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అయితే నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. ఈ నెల విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో విష్ణువును భక్తితో పూజించడం వల్ల మంచి జరుగుతుందని, కోరిన కోర్కెలు అన్ని నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. లక్ష్మీ నారాయణులను ఎక్కువగా పూజిస్తారు. తులసీదళాలతో విష్ణువుని పూజించడం వల్ల సకల పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ఉంటుంది. ఈ రోజు ప్రారంభం అయ్యి జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించే ఈ నెల రోజుల సమయాన్నే ధనుర్మాసంగా పిలుస్తారు.

ధనుర్మాసంలో అందరూ కూడా ఉదయాన్నే లేచి భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఎక్కువగా వేంకటేశ్వరుడు, విష్ణువు ఆలయాలకు వెళ్తుంటారు. ఈ నెల రోజుల పాటు దీపం పెట్టడం వల్ల అంతా శుభమే జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ నెల రోజుల పాటు విష్ణువును తులసి దళాలతో పూజించాలి. అలాగే చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించాలి. బ్రహ్మ ముహూర్తంలోనే లేచి నదీ స్నానం చేసి విష్ణువును పూజించాలి. కొందరు ఈ నెలలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారు రోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మద్యం, మాంసం తీసుకోకూడదు. ఇలా నెల రోజులు పాటు భక్తితో విష్ణువుని పూజిస్తే కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలో రోజూ శ్రీ విష్ణువుకి తులసి మాలను సమర్పించడం వల్ల వివాహం కానీ వారికి తొందరగా వివాహం జరుగుతుందని పండితులు అంటున్నారు.

ధనుర్మాసంలో పూజిస్తే కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయి. అయితే ఈ నెలలో అంతగా ఎవరూ శుభకార్యాలు చేయరు. కొత్త దుస్తులు ధరించడం, కొత్త వస్తువుల ఏవీ ఉపయోగించకపోవడం వివాహం, నామకరణం, ఇంటి స్థలం కొనడం వంటివి ఏవీ చేయరు. దీనివల్ల ఈ నెలను శూన్య నెల అని కూడా అంటారు. ఈ నెల మొత్తం భక్తితో విష్ణువుని పూజించాలి. ఈ నెల మొత్తం విష్ణువు ఆలయాలు భక్తులతో కలకలలాడుతాయి. అలాగే వెంకటేశ్వర ఆలయాలు కూడా భక్తులతో నిండిపోతాయి. ముఖ్యంగా ఈ నెలలో వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రోజున విష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. ప్రతీ ఒక్కరూ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం చేస్తే కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయని పండితులు అంటున్నారు. కాబట్టి అసలు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version