భారత్ విమానాలపై జూన్ 30 వరకు యూఏఈ నిషేధం
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలపై విధించిన నిషేధాన్ని యూఏఈ జూన్ 30 వరకు పొడిగించింది. భారత్ లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఏప్రిల్ 25న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ నిషేధం విధించింది. జూన్ 14 వరకు ఆ ఆంక్షలు కొనసాగుతుాయని అప్పుడు ప్రకటించింది. అయితే ప్రస్తుతం దానిని మరో 16 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే యూఏఈ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసా కలిగినవారు, కొవిడ్ ప్రొటోకాల్ […]
Written By:
, Updated On : May 31, 2021 / 07:32 AM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలపై విధించిన నిషేధాన్ని యూఏఈ జూన్ 30 వరకు పొడిగించింది. భారత్ లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఏప్రిల్ 25న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ నిషేధం విధించింది. జూన్ 14 వరకు ఆ ఆంక్షలు కొనసాగుతుాయని అప్పుడు ప్రకటించింది. అయితే ప్రస్తుతం దానిని మరో 16 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే యూఏఈ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసా కలిగినవారు, కొవిడ్ ప్రొటోకాల్ ను పాటించే దౌత్యవేత్తల ప్రయాణానికి మినహాయింపులు ఉంటాయిని తెలిపింది.