గుజరాత్ లో గ్యాస్ పైప్ పేలి ఇద్దరు మృతి

గుజరాత్ లో భూగర్భ పైప్ లైన్ పేలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ లోని గాంధీనగర్లోని పంచవతి ప్రాంతంలోని గార్డెన్ సిటీ డ్యూప్లెక్స్ కింద ఉన్న భూగర్భ గ్యాస్ పైప్ లైన్ మంగళవారం ఉదయం 7 గంటలకు పేలింది. ఈ ప్రభావంతో రెండు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. సమీప నిర్మాణాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

Written By: Suresh, Updated On : December 22, 2020 2:17 pm
Follow us on

గుజరాత్ లో భూగర్భ పైప్ లైన్ పేలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ లోని గాంధీనగర్లోని పంచవతి ప్రాంతంలోని గార్డెన్ సిటీ డ్యూప్లెక్స్ కింద ఉన్న భూగర్భ గ్యాస్ పైప్ లైన్
మంగళవారం ఉదయం 7 గంటలకు పేలింది. ఈ ప్రభావంతో రెండు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. సమీప నిర్మాణాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.