జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు, భారత ఆర్మీల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. కుప్వారా జిల్లా లో శనివారం అర్ధరాత్రి ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన పెట్రోలింగ్ పోలీసులు ఆ ప్రాంతంలో ఆదివారం నిఘా పెంచారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు పోలీసులపు కాల్పలు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లతో పాటు ఒక బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. అయితే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా గత నెలరోజులుగా పోలీసులు, భద్రతా దళాల మధ్య కాల్పలు జరగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదుల ఏరివేతకు భారత్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.