ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ లో కెప్టెన్ రహనే శతకం సాధించాడు. దీంతో భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలిరోజు ఆస్ట్రేలియా 195 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా రెండో రోజు బ్యాటింగ్ లో పరుగువరదను కొనసాగించింది. 91 ఓవర్లలో 277పరుగులు చేసిన టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయింది. రహనె 104, జడేజా 40 నాటౌట్ గా నిలిచారు. వీరు మూడో రోజు కూడా ఆడితే భారత్ భారీ స్కోరు దిశగా ముందుకు వెళ్తోంది. శనివారం 36 పరుగులు చేసిన భారత్ ఆదివారం ఒక్కసారిగా 275 వరకు కొనసాగించింది. కాగా ఆస్ట్రేలియా ఏ మేరకు పరుగులు చేస్తుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది. 2018లో 137 పరుగుల తేడాతో ఎంసీజీలో భారత్ బాక్సింగ్ డే టెస్టును గెలుచుకుంది. ఈ సంవత్సరం మొదటి టెస్టును కోల్పోయిన భారత్ రెండో టెస్టును గెలుచుకుంటుందా అనేది చూడాలి.