
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 41,322 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 485 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,51,110గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,36,200కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,54,940 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 87,59,969 గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 93 లక్షల కేసులు దాటాయి. అయితే మరణాలు కాస్త తగ్గడంతో ఊరటనిస్తోంది. అయితే ఢిల్లీ, కేరళ లాంటి రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. అక్కడి వాతావరణంలో మార్పులతో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.