బండి సంజయ్, అక్బరుద్దీన్ లపై కేసు నమోదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ల పై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా హుస్సేన్ సాగర్ ఆక్రమణకు గురైందని, నెక్లెస్ రోడ్డులో ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చివేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ సమాధులను కూల్చివేస్తే దారుస్సాలాంను కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ అన్నారు. ఈ […]

Written By: Suresh, Updated On : November 28, 2020 10:45 am
Follow us on

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ల పై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా హుస్సేన్ సాగర్ ఆక్రమణకు గురైందని, నెక్లెస్ రోడ్డులో ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చివేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ సమాధులను కూల్చివేస్తే దారుస్సాలాంను కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగేలా ఉన్నాయని భావించిన పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి సుమోటాగా కేసు నమోదు చేశారు.