దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో వ్యూహకర్త అయిన హఫీజ్ సయీద్ కు పాకిస్థాన్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా అతని ఆస్తులను సీజ్ చేసి లక్షా 10 వేల రూపాయల జరిమానా విధించింది. ఇక హఫీజ్ సన్నిహితుడిగా ఉన్న అబ్దుల్ రెహ్మన్ మక్కికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వీరు ఉగ్ర కార్యకలాపాల కోసం నిధులు సమీకరించారనే ఆరోపణలపై పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు హఫీజ్ సయీద్ ను అప్పగిస్తే 10 మిలియన్ అమెరికా డాలర్లను బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. లష్కరే తోయిబా సంస్థ తరుపున జమా ఉద్ దవా ఉగ్రవాద సంస్థకు సయీద్ నాయకత్వం వహించాడు.