
పశ్చిమ బెంగాల్ అన్నింటా వెనకబడి ఉందని అమిత్ షా నోటి నిండా అబద్దాలు మాట్లాడారని వాస్తవానికి చాలా విషయాల్లో దేశంతో తామే ముందున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ లెక్కలు తాను చెప్తున్నవి కాదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ఆధారంగానే చెప్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమ బెంగాల్లో అమిత్ షా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ధిలో అట్టడుగున ఉందని, బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే సోనార్ బెంగాల్ (బంగారు బెంగాల్) చేస్తామని హామీ ఇచ్చారు. అమిత్ షా ర్యాలపై మమతా బెనర్జీ సోమవారం స్పందించారు.