ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు పెను ప్రమాదం తప్పింది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు కట్టెకళ్యాలణ్ పోలీస్స్టేషన్ పరిధిలోని నీలవాయి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఐదు కొలోల శక్తివంతమైన ఐఈడీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. శనివారం డోగిరిపారా మార్గంలో తెలంటెటమ్ అటవీ ప్రాంతంలో మరో 3 కిలోల ఐఈడీ బాంబులను ప్రత్యేక బలగాలు గుర్తించారు. జిల్లాలోని డోగిరి పారా మార్గంలోని తెలంటేటమ్ అటవీప్రాంతంలోని పోలీసులే లక్ష్యంగా ఈ బాంబులను అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.