రాయల్ఛాలెంజర్స్ కెప్టెన్గా కోహ్లి పనికిరాడని టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎనిమిదేళ్ల నుంచి జట్టుకు ఒక్క కప్పుకూడా తేలేదని అన్నారు. ఐపీఎల్లో విజయవంతమైన సారధులు ఎంఎస్ధోని, రోహిత్శర్మ సరసన కోహ్లిని చేర్చలేమన్నారు. గెలిచినప్పుడు ప్రశంసలు పొంది, ఓడినప్పుడు విమర్శలు కూడా స్వీకరించాలని అన్నాడు. ఆర్సీబీకి కొత్త కెప్టెన్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎనిమిదేళ్లుగా జట్టు ఓడిపోతున్నా ఇంతకాలం కెప్టెన్గా ఎవరిని ఉంచలేదన్నారు.