గ్యాస్ లీకేజీతో ఇద్దరు మృతి: 15 మంది పరిస్థితి విషమం

గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని ప్రయాగరాజ్ సమీపంలోని ఫూల్పూర్ ఇండియన్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ప్లాంటులో బుధవారం గ్యాస్ లీకయింది. దీంతో అందులో పనిచేస్తున్న ఇద్దరు మరణించగా మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. అమ్మోనియా గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం చోటు చేసుకుందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని స్థానిక కలెక్టర్ భానుచంద్ర గోస్వామి తెలిపారు. కాగా మరణించి వారిలో ఇద్దరు అధికారులు ఉన్నట్లు ఆయన […]

Written By: Suresh, Updated On : December 23, 2020 9:56 am
Follow us on

గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని ప్రయాగరాజ్ సమీపంలోని ఫూల్పూర్ ఇండియన్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ప్లాంటులో బుధవారం గ్యాస్ లీకయింది. దీంతో అందులో పనిచేస్తున్న ఇద్దరు మరణించగా మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. అమ్మోనియా గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం చోటు చేసుకుందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని స్థానిక కలెక్టర్ భానుచంద్ర గోస్వామి తెలిపారు. కాగా మరణించి వారిలో ఇద్దరు అధికారులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇఫ్కో ప్లాంటు గ్యాస్ లీకేజీపై సీఎం యోగి ఆదిత్యానాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను కోరారు.