అనుమానాస్పందగా కనిపించిన పాక్‌ డ్రోన్‌ కూల్చివేత

జమ్మూకాశ్మీర్‌లోని కేరన్‌ సెక్టార్‌లో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను భారత సైన్య కూల్చివేసింది. శనివారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌ లక్ష్యంగా చైనా కంపెనీకి చెందిన డీజేఐ మావిక్‌ 2 ప్రో మోడల్‌తో బాంబుల దాడికి పాల్పడేందుకు యత్నించింది. అయితే భారత సైన్యం కేరన్‌ సెక్టార్‌లోని ఎల్‌వోసీ వద్ద అనుమానాస్పదంగా ఎగరడం గుర్తించారు. దీంతో దాన్ని నేలమట్టం చేశారు. ఓ వైపు చైనాతో జరగుతున్న పరిణామాల నేపథ్యంలో చైనా కంపెనీకి చెందిన డ్రోన్‌ భారత్‌ భూభాగంపైకి రావడం మరోసారి కలకలం […]

Written By: Suresh, Updated On : October 24, 2020 2:59 pm
Follow us on

జమ్మూకాశ్మీర్‌లోని కేరన్‌ సెక్టార్‌లో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను భారత సైన్య కూల్చివేసింది. శనివారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌ లక్ష్యంగా చైనా కంపెనీకి చెందిన డీజేఐ మావిక్‌ 2 ప్రో మోడల్‌తో బాంబుల దాడికి పాల్పడేందుకు యత్నించింది. అయితే భారత సైన్యం కేరన్‌ సెక్టార్‌లోని ఎల్‌వోసీ వద్ద అనుమానాస్పదంగా ఎగరడం గుర్తించారు. దీంతో దాన్ని నేలమట్టం చేశారు. ఓ వైపు చైనాతో జరగుతున్న పరిణామాల నేపథ్యంలో చైనా కంపెనీకి చెందిన డ్రోన్‌ భారత్‌ భూభాగంపైకి రావడం మరోసారి కలకలం రేపింది. పాకిస్థాన్‌తో కలిసి చైనా కుట్రలు పన్నుతుందా.? అనే కోణంలో ఆర్మీ అధికారులు విచారణ చేపడుతున్నారు.