భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తరకం కరోనా భారత్లో వచ్చినప్పటికీ మొత్తంగా కేసులు 19వేలకు దిగువనే నమోదువుతున్నాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 18,732 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 279 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,87,850గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,47,622కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,78,690యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 97,61,538గా ఉంది. కాగా ఇప్పటి వరకు 16,81,02,657 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎమ్మార్ ప్రకటించింది.