
బస్సు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని అలీగడ్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ప్రైటేవ్ బస్సు అలీగఢ్ జిల్లాలోని తప్పాల్ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు గాయపడడంతో సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా ఈ బస్సులో 45 మంది ప్రయాణికులున్నారని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథి దిగ్భ్రాంతి చెందారు.