ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను ఆర్మీ క్యాంటీన్లలో వినియోగించొద్దని కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మంత్రి పిలుపు మేరకు స్వదేశీ వస్తువుల వినియోగం పెంచాలని, విదేశీ వస్తువులను బ్యాన్ చేయాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును అందుకున్నట్లు ఆర్మీ సీనియర్ అధికారి తెలిపారు. మొత్తం 4000 ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి వస్తువులను వినియోగిస్తున్నారని, ఈ క్యాంటీన్లలో వాటిని బ్యాన్ చేస్తామని, అయితే కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.