పోలీసుల అదుపులోకి అర్నాబ్ గోస్వామి..

రిపబ్లిక్ టెలివిజన్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటీరియర్ డిజైనర్ మరణానికి సంబంధించిన విషయంలో ముంబైలో ఆయనను మహారాష్ర్ట పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 2018లో 53 ఏళ్ల ఇంటిరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఓ సూసైడ్ నోట్ పెట్టి చనిపోయారు. ఆ సూసైడ్ నోట్లో అర్నాబ్ గోస్వామి, మరో ఇద్దరి పేర్లు ఉన్నాయి. అతనికి చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వనందున ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య […]

Written By: Velishala Suresh, Updated On : November 4, 2020 9:21 am
Follow us on

రిపబ్లిక్ టెలివిజన్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటీరియర్ డిజైనర్ మరణానికి సంబంధించిన విషయంలో ముంబైలో ఆయనను మహారాష్ర్ట పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 2018లో 53 ఏళ్ల ఇంటిరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఓ సూసైడ్ నోట్ పెట్టి చనిపోయారు. ఆ సూసైడ్ నోట్లో అర్నాబ్ గోస్వామి, మరో ఇద్దరి పేర్లు ఉన్నాయి. అతనికి చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వనందున ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా ఇప్పటికే టెలివిజన్ టీఆర్పీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గోస్వామికి మరో ఎదురు దెబ్బ తగలడం చర్చనీయాంశంగా మారింది.