రైతు ఇంట్లో అమిత్ షా భోజనం: వైరల్ అవుతున్న వీడియో

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. శనివారం పశ్చిమ మెడినిపూర్ జిల్లాలోని బెలిజూరి గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో ఆయన భోజనం చేశారు. అమిత్ షాతో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గియా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఉన్నారు. ఓ వైపు రైతులు కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తరుణంలో అమిత్ షా ఓ రైతు ఇంట్లో భోజనం చేయడం చర్చనీయాంశంగా […]

Written By: Suresh, Updated On : December 19, 2020 3:27 pm
Follow us on

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. శనివారం పశ్చిమ మెడినిపూర్ జిల్లాలోని బెలిజూరి గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో ఆయన భోజనం చేశారు. అమిత్ షాతో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గియా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఉన్నారు. ఓ వైపు రైతులు కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తరుణంలో అమిత్ షా ఓ రైతు ఇంట్లో భోజనం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా కొందరు త్రుణమూల్ పార్టీ నేతలు బీజేపీలో చేరనున్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారు.