ఈ రోజు భారతీయులకు చరిత్రాత్మక దినం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన అనంతరం మోదీ ప్రసంగించారు. ‘భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ సుదినం ఇది దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకుంటున్న భవనం ఇది. స్వాతంత్ర్యం వచ్చిన 75ఏళ్ల సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుంది. ప్రస్తుత పార్లమెంట్ భవనంలోనే భారత రాజ్యాంగ రచన జరిగింది’ అని మోదీ అభివర్ణించారు.