కరోనా వ్యాక్సిన్లపై నేడు కీలక ప్రకటన

దేశంలో కరోనా వ్యాక్సిన్ల వినియోగంపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కీలక ప్రకటన చేయనుంది. ఉదయం 11 గంటలకు డీసీజీఐ డైరెక్టర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు నిపుణుల బ్రుందం ఆమోదం తెలిపింది. వీటికి డీసీజీఐ ఓకే చెబితే వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ ను ‘కోవిషీల్డ్ ’ పేరుతో దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుండగా, కోవాగ్జిన్ […]

Written By: Suresh, Updated On : January 3, 2021 8:33 am
Follow us on

దేశంలో కరోనా వ్యాక్సిన్ల వినియోగంపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కీలక ప్రకటన చేయనుంది. ఉదయం 11 గంటలకు డీసీజీఐ డైరెక్టర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు నిపుణుల బ్రుందం ఆమోదం తెలిపింది. వీటికి డీసీజీఐ ఓకే చెబితే వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ ను ‘కోవిషీల్డ్ ’ పేరుతో దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుండగా, కోవాగ్జిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివ్రుద్ధి చేసింది. ఇదిలా ఉండగా అమెరికా దిగ్గజం ఫైజర్ కంపెనీ దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే అహ్మదాబాద్ కు చెందిన జైడస్ డ్యాడిల్లా వ్యాక్సిన్ మూడో విడత ట్రయల్ కు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.