46 లక్షల మాస్కులు.. 6 లక్షల పీపీఈ కిట్లు..

46 లక్షల మాస్కులు.. 6 లక్షల పీపీఈ కిట్లు వినియోగించనున్నామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ రావత్‌ తెలిపారు. బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6.7 లక్షల ఫేస్‌ షీల్డులు, 23 లక్షల హ్యాండ్‌ గ్లౌజులు వాడుతామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఉంచుతామని, ఓటర్లు, అధికారులు తప్పకుండా భౌతికదూరాన్ని పాటించాలన్నారు. ఇంటింటికి ప్రచారంలో కేవలం ఐదుగురు కార్యక్తలు మాత్రమే వెళ్లాలని, నామినేషన్లు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే […]

Written By: NARESH, Updated On : September 25, 2020 3:36 pm

elections commi

Follow us on

46 లక్షల మాస్కులు.. 6 లక్షల పీపీఈ కిట్లు వినియోగించనున్నామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ రావత్‌ తెలిపారు. బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6.7 లక్షల ఫేస్‌ షీల్డులు, 23 లక్షల హ్యాండ్‌ గ్లౌజులు వాడుతామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఉంచుతామని, ఓటర్లు, అధికారులు తప్పకుండా భౌతికదూరాన్ని పాటించాలన్నారు. ఇంటింటికి ప్రచారంలో కేవలం ఐదుగురు కార్యక్తలు మాత్రమే వెళ్లాలని, నామినేషన్లు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే నింపాలన్నారు. డిపాజిట్లను కూడా ఆన్‌లైన్‌ ద్వారా కట్టాలని ఆయన సూచించారు.

Also Read: దేశ ప్రజలకు శుభవార్త… ఆ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!