వ్యవసాయేతర భూములన్నీ ధరణి వెబ్సైట్లో నమోదు చేస్తామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లోని ప్రతి సెంట్ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నది, లేనిదీ ఈ వెబ్సైట్ ద్వారా తెలుస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్ అమలులో మున్సిపల్ ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు.