భారత్ లో కొత్తగా 26,624 కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లోనూ నిన్నటితో పోలిస్తే పెరిగాయి.  దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 26,624 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 341 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,31,223గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,45,477కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,05,344యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 95,80,402గా ఉంది. ఇక […]

Written By: Suresh, Updated On : December 20, 2020 10:51 am
Follow us on

భారత్ లో కరోనా కేసులు ఇప్పటికే కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లోనూ నిన్నటితో పోలిస్తే పెరిగాయి.  దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 26,624 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 341 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,31,223గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,45,477కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,05,344యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 95,80,402గా ఉంది. ఇక ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం 24 గంటల్లో 11,07,681 పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16,11,98,195 కోట్ల పరీక్షలు చేసినట్లు తెలిపింది.