Homeజాతీయంమహిళలకు శుభవార్త.. తక్కువ వడ్డీకే ప్రత్యేక స్కీమ్స్ తో సులభంగా రుణాలు..?

మహిళలకు శుభవార్త.. తక్కువ వడ్డీకే ప్రత్యేక స్కీమ్స్ తో సులభంగా రుణాలు..?


పంజాబ్ నేషనల్ బ్యాంక్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కొత్త స్కీమ్స్ ను అమలులోకి తెచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ స్కీమ్స్ ద్వారా స్వతహాగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వనుంది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి పెట్టుబడి అవసరమైన మహిళలు ఈ స్కీమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: రైతంటే భూమి ఉన్నోడా.. పంట పండించేటోడా?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమలు చేస్తున్న స్కీమ్ లలో పీఎన్‌బీ మహిళా శశక్తికరన్ అభియాన్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ ద్వారా స్వయం సహాయక గ్రూపులు రుణాలను పొందవచ్చు. అగ్రికల్చర్ వర్క్ కాకుండా ఇతరత్రా పనుల కోసం ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మహిళల కోసం అమలు చేస్తున్న స్కీమ్ లలో పీఎన్‌బీ మహిళా సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. వ్యాపారం చేయాలనుకునే మహిళలు ఈ స్పెషల్ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఓవర్ టైమ్ చేస్తే డబుల్ జీతం..?

ఇంటి నుంచే స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. డే కేర్ బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నవారు ఇంటి నుంచి ఇతర వ్యాపారాలు చేసి ఉపాధి పొందాలని అనుకునే వారు ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనే ఆలోచన ఉంటే ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్స్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ స్కీమ్స్ ద్వారా మహిళలు తమ కలలను నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version