వ్యాక్సిన్ కల్లోలం.. సైడ్ ఎఫెక్ట్ లతో టెన్షన్

దేశంలో నిన్ననే ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ దేశవ్యాప్తంగా జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ గా ఇది కీర్తి గడించింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అయితే తాజాగా వ్యాక్సిన్ కల్లోలం మొదలైంది. కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్న వారు అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. హెచ్ఐఎల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..! తొలి రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసినందుకు కేంద్ర ఆరోగ్య […]

Written By: NARESH, Updated On : January 17, 2021 4:44 pm
Follow us on

దేశంలో నిన్ననే ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ దేశవ్యాప్తంగా జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ గా ఇది కీర్తి గడించింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అయితే తాజాగా వ్యాక్సిన్ కల్లోలం మొదలైంది. కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్న వారు అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. హెచ్ఐఎల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

తొలి రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసినందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్దన్ అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా మొత్తంగా 1,91,181 మందికి శనివారం వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 16,755 వ్యాక్సినేటర్లు,3352 సెషన్ల ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించినట్లు పేర్కొంది.

దేశంలోనే తొలి టీకా తీసుకున్న వ్యక్తిగా ఢిల్లికి చెందిన ఎయిమ్స్ లో పనిచేసే పారిశుధ్య కార్మికుడు మనీష్ కుమార్ నిలిచారు. ఇక ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ మహేష్ శర్మ, పశ్చిమ బెంగాల్ తృణమూల్ ఎంపీ రవీంద్రనాథ్ చటర్జీలు దేశంలో తొలి కరోనా టీకా తీసుకున్న రాజకీయ నేతలుగా నిలిచారు. తాజాగా ఢిల్లీలో చరాక్ ఆస్పత్రి, సౌత్ ఢిల్లీ, తూర్పు ఢిల్లీల్లో టీకా తీసుకున్నవారి పరిస్థితి గందరగోళంగా మారింది. వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 51 మంది హెల్త్ కేర్ సిబ్బంది స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కలకలం చెలరేగింది. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు హెల్త్ కేర్ సిబ్బందికి చాతిలో పట్టేసినట్టుగా అనిపించడంతో వారిని 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. తర్వాత ఇద్దరు సాధారణ స్థితికి వచ్చారు.

Also Read: రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఆ రైళ్లు లేనట్లే..?

మరో వ్యక్తి పరిస్థితి సీరియస్ కావడంతో అతడిని ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో అతడి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స చేసినా అతడి పరిస్థితి తగ్గలేదు. ఈ కేసును సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఇక రాజస్థాన్ రాష్ట్రంలోనే ఇలాంటి తరహా కేసులు 21 నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్